tag:blogger.com,1999:blog-23378931384360646192024-03-05T15:00:09.507+05:30సుభద్ర కీర్తిఒక అందాల అద్బుతం, ఒక వసంత సమీరం,
మెరిసే మెరుపు,
అనంత ఆత్మీయత, ఒక అల్లరి, ఒక పెంకి, కొద్దిగా కోపం, ఇంకొద్దిగా అలక, అందరికన్నా చిన్నది, అన్నిటా తానే, ఒక అనంత శక్తీ రూపం, అమ్మకు బొమ్మ, అన్నయ్యకు ముద్దుల చెల్లి ,నాన్నకు "అమ్మ"........అమ్మ అంటే నిజంగా అమ్మAlapati Ramesh Babuhttp://www.blogger.com/profile/10902788241134698143noreply@blogger.comBlogger139125tag:blogger.com,1999:blog-2337893138436064619.post-15431098997995373002023-11-17T23:39:00.000+05:302023-11-17T23:39:11.091+05:30మెరుగు చెంగట యున్న మేఘంబు అర్ధ విశేషాలు <p class="ltr-element" data-indentation="1" data-pm-slice="1 1 []">మెఱుఁగు చెంగట నున్న మేఘంబు కైవడి </p><p class="ltr-element" data-indentation="1"> నువిద చెంగటనుండ నొప్పువాఁడు,</p><p class="ltr-element" data-indentation="1"> చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమునఁ జిఱునవ్వు మొలచువాఁడు, </p><p class="ltr-element" data-indentation="1">వల్లీయుతతమాల వసుమతీజముభంగి బలువిల్లు మూఁపునఁ బరఁగువాఁడు,</p><p class="ltr-element" data-indentation="1"> నీలనగాగ్ర సన్నిహితభానునిభంగి ఘనకిరీటము దలఁ గల్గువాఁడు,</p><p class="ltr-element" data-indentation="1">పుండరీకయుగముఁబోలు కన్నులవాఁడు, </p><p class="ltr-element" data-indentation="1">వెడఁదయురమువాఁడు, విపులభద్ర మూర్తివాఁడు రాజముఖ్యుఁ డొక్కరుఁ డదె కన్నుఁగవకు నెదురఁ గానఁబడియె.’</p><p class="ltr-element" data-indentation="1">++++</p><p class="ltr-element" data-indentation="1">పలికెడిది భాగవతమఁట,పలికించెడివాఁడు రామభద్రుండఁట, నేఁబలికిన భవహర మగునఁట,పలికెద వేఱొండుగాథఁ బలుకఁగనేలా!</p><p class="" data-indentation="1"></p><p class="ltr-element" data-indentation="1">ఈ రెండు పద్యాలు పోతన భాగవతం లోని....ప్రధమ స్కంధం లోనివే.</p><p class="ltr-element" data-indentation="1">పోతన భాగవతం...రచనా నేపథ్యం, రచన వ్యాసాంగ ప్రారంభంనకు గల కారణాలు తన రచనలోని పొందుపరిచారు.</p><p class="ltr-element" data-indentation="1">కారణం పోతన గారి కన్నా ముందు పోతన భాగవతం ఆంధ్రీకరించే సాహసం ఎవ్వరూ తీసుకోలేదని చరిత్ర తెలియ చేస్తున్నది....అందులోను ఆనాటి రచనా వ్యవస్థ రాజాశ్రయం లోనే వుండేవి....</p><p class="ltr-element" data-indentation="1">నన్నయ్య గారు ఆదికవి గా మన్నన పొందినను వారు కూడా రాజాశ్రీతులే నన్నయ్య గారు రాజరాజనరేంద్రుడు ఆస్థాన కవి అని జగమేరిగిన సత్యం...అంత వరకూ ఎందుకు పోతన గారి సమకాలికుడు స్వయంగా బంధువు అయిన శ్రీనాథుడు రెడ్డిరాజుల ప్రాపకం..కాని పోతన గారు తన భాగవత రచన శ్రీరాముని కే అంకితం అన్నాడు...</p><p class="ltr-element" data-indentation="1">ఇలా చాలా చాలా మధన పడినారు..</p><p class="ltr-element" data-indentation="1">ఒక ఆదివారం గోదావరి నది స్నానం చేసినారు... ఆరోజు సోమోపరాగం...మీరు ఏమిటో అని భావన చేయవద్దు చంద్రగ్రహణం ని ఆవిధంగా పిలుస్తారు...</p><p class="ltr-element" data-indentation="1">గ్రహణం విడిచిన తరువాత... స్నానానంతరం పోతన తన ఇష్ట దేవత ఆరాధన మరియి మంత్ర పఠనం, పునఃశ్చరణలో వుంటే శ్రీరామ చంద్రుడు దర్శనం ఇచ్చారు...</p><p class="ltr-element" data-indentation="1">ఆ పద్యము " మెరుగు చెంగట" అనే సీస పద్యం లో వివరించారు.</p><p class="ltr-element" data-indentation="1">సీస పద్య లక్షణం ప్రకారం మొదటి నాలుగు పాదాలు సీస ఛందస్సు లోను తదనంతరం అనుసరణ పద్యం వీరు కందపద్యం గా రచన చేశారు .</p><p class="ltr-element" data-indentation="1">పోతన గారి రచనలో ఎక్కువ భాగం ఆటవెలది, కందపద్యం కారణం ఇవి జన బాహుళ్యానికి దగ్గరగా వుంటాయి...సాధారణ ఛందస్సు లో తేలికగా వుంటాయి చాలా పద్యాలు ప్రజలు సులభంగా ముఖతా ధారణ కలిగి వుంటారు..ఇందుకు ఉదాహరణ "చేతులారంగ శివుని పూజింపడేని", "అందు కలడని, ఇందు కలడని సందేహం వలదు " లాంటివి మనం గమనించవచ్చు.</p><p class="" data-indentation="1"></p><p class="ltr-element" data-indentation="1">పోతన గారి వివరణ భలే గమ్మత్తుగా </p><p class="ltr-element" data-indentation="1">భలే ఆసక్తిగా అలా అని సత్యదూరం గా వుండదు మన అనుభవం లో వుండే విధంగా వుంటుంది... అందుకే...పాఠకుడు ముందు దృశ్యం సాక్షాత్కరిస్తుంది...దీనితో పాఠకుడు తనదైన కల్పనా శక్తి అనుకోండి భక్తి ప్రపత్తులతో అనుకోండి ఎలాగైనను ఆ ఘట్టం లో తాను అక్కడే వుండి ఆ దృశ్యం స్వయంగా చూస్తున్నారు అనే అనుభూతి కలిగిస్తుంది అనటంలో సందేహం లేదు....</p><p class="ltr-element" data-indentation="1">ఇక అర్ధం వివరించే ప్రయత్నం చేస్తాను..</p><p class="ltr-element" data-indentation="1">"మెరుపుతో కూడిన మేఘఛాయతో వుండి ఒక స్త్రీ తో కూడిన వాడు"</p><p class="ltr-element" data-indentation="1">ఇది మొదటి పాదం అర్ధం...</p><p class="ltr-element" data-indentation="1">మనకు ఆకాశంలో మేఘం కనపడటం వేరు మెరుపుతో కూడిన మేఘం ప్రకాశవంతంగా మనస్సుకు హత్తుకునేలా మరోసారి చూడాలి అనే విధంగా వుంటుంది...</p><p class="ltr-element" data-indentation="1">కాని కొద్దిగా ఈ అర్ధం మార్చి చూడండి...</p><p class="ltr-element" data-indentation="1">సీతమ్మ వారు మెరుపు వంటి మేని ఛాయ తో స్వామి వారు మేఘఛాయతో....అయ్యవారి ప్రక్కనే అమ్మవారు వుంటారు కదా...</p><p class="ltr-element" data-indentation="1">మానవులు సహజంగా మాతృస్తన్యం మాతృగర్భ వాసన వీడలేరు వీడకూడదు వీడరాదు. ఇది పోతన గారిలో కూడా అందుకే అమ్మవారితో కూడిన అయ్యవారు అనే విధంగా...</p><p class="ltr-element" data-indentation="1">తరువాత పాదం..</p><p class="ltr-element" data-indentation="1">'చంద్రమండల సుధా సారంబు '</p><p class="ltr-element" data-indentation="1">చంద్రుడు మనః కారకుడు...మానవుల చిత్త ప్రవృత్తులపై ప్రభావం చూపువాడు...అందుకే చంద్రుని వెన్నెల శీతలం గా హాయి కొలుపు విధంగా వుంటుంది...ఇవి మన స్వయానుభవాలే. అందులోను పౌర్ణమి నాడు పూర్ణ చంద్రుడు ఎంత మనోహరంగా ఎంత ఆహ్లాదంగా వుంటారో మనకు ఎరుక....సహజంగానే మనం రాముల వారిని రామచంద్రుడు అని అంటాం...అటువంటి రాముల వారు పూర్ణ చంద్రుని వెలుగు </p><p class="ltr-element" data-indentation="1">అంతటి అమృతం జాలు వారునట్టి చిరునవ్వుతో స్వామి వారు వున్నారంట....</p><p class="ltr-element" data-indentation="1">తరువాత పాదం...</p><p class="ltr-element" data-indentation="1">"వల్లీయుతతమాల వసుమతీజం భంగి"</p><p class="ltr-element" data-indentation="1">తీగలతో కూడిన తమాల వృక్షం లాగా ఎత్తుగా వున్న రాముల వారి భుజం పైన విల్లు ఆయన ఆయుధం ధరించిన విధంగా కాదు అంటూ అది అతి సహజంగా భూమి నుంచి ఉద్భవించిన లత లాగా శోభనిస్తున్నాయి అట.</p><p class="ltr-element" data-indentation="1">అంటే అతి సహజంగా విల్లు అనేది రామునిలో భాగంగా మనకు ఉదహరిస్తున్నారు...విల్లుతో కూడిన రాముడు అంటే అర్ధం...ధర్మపరిపాలన కోసం అని.... దుష్టశిక్షణ శిష్టరక్షణ తన అవతార ఉద్దేశ్యం అని మనం తెలుసుకోవాలి... కావాలంటే గమనించండి దశావతారాలు అన్నీ మనం దర్శించిన ఆయా ఆవతార ఉద్దేశ్యం మనకు స్పష్టంగా గోచరిస్తుంది.</p><p class="ltr-element" data-indentation="1">తరువాత పాదం...</p><p class="ltr-element" data-indentation="1">" నీలనగాగ్ర సన్నిహిత భానుని"</p><p class="ltr-element" data-indentation="1">శ్రీరాములు వారు ఆజానుబాహుడు...అందులోను వారు నీల మేఘ శ్యాములు వారి శిరస్సు పై కిరీటం సూర్యునిలా ప్రకాశిస్తూ వున్నది</p><p class="ltr-element" data-indentation="1">ఇంత వరకు సీస పద్యం... తదనంతరం అనుసరణ పద్యం.</p><p class="ltr-element" data-indentation="1"> "పుండరీక యుగం బోలు కన్నుల వాడు"</p><p class="ltr-element" data-indentation="1">పుండరీకం అనే పదానికి విశేష అర్ధాలు చాలా వున్ననూ ఇచ్చట తెల్ల తామర అనే అర్ధం లో ప్రయోగించారు.</p><p class="ltr-element" data-indentation="1">తెల్లని కనుదోయి ప్రకాశవంతంగా నిర్మలంగా వున్నాయి.</p><p class="ltr-element" data-indentation="1">సాధారణంగా కవులు దేవతా, స్త్రీ వర్ణనలో కన్నులను పద్మాలతో పోలిక చేస్తారు. కారణం ఇవి సున్నితంగా, లాలిత్యం తో మనోహరంగా ఆకర్షణ తో పాటు వాటి జనన ప్రదేశం ఎంత దుర్భరంగా వున్ననూ పద్మాల సహజ లక్షణమైన నిర్మలత్వం వెలువరిస్తాయి.</p><p class="ltr-element" data-indentation="1">అంతే కాదు ఇక్కడ పుండరీకం అనే పదం ఉపయోగం ఇంకొకటి వున్నది.</p><p class="ltr-element" data-indentation="1">అది భక్త సులభుడు అనే కోణంలో.</p><p class="ltr-element" data-indentation="1">మనం గోవింద నామాలలో పుండరీక వరద గోవింద అంటాం.</p><p class="ltr-element" data-indentation="1">తరువాత పాదం...</p><p class="ltr-element" data-indentation="1">"వెడద యురము వాడు, విపుల భద్ర </p><p class="ltr-element" data-indentation="1">మూర్తి వాడు..."</p><p class="ltr-element" data-indentation="1">విశాలమైన వక్ష స్ధలంతో నమ్మదగిన వాడుగా అని అర్ధం...</p><p class="ltr-element" data-indentation="1">విశాలమైన వక్షం అనేది దేహ పరిణామం తో చూడాలా కాదు...</p><p class="ltr-element" data-indentation="1">ఆపన్నులను కాపాడాటంలో ముందు నుండే వాడు, దయార్ద్ర హృదయం కలవాడు, వీరత్వం కలిగిన వాడు , మిత్రులను, కష్టాల్లో వున్నవారు,ఆత్మీయులను అనురాగం తో అక్కున చేర్చుకుని హత్తుకునే వాడు లాంటి అర్ధాలు కూడా ఇమిడి వున్నాయి....ఇన్ని కారణాలతో విపుల భద్ర మూర్తి గా వున్నాడు అంట...</p><p class="ltr-element" data-indentation="1">విపుల భద్ర మూర్తి అంటే నమ్మతగిన వాడు అనే కాదు...</p><p class="ltr-element" data-indentation="1">విపుల అంటే అమరకోశం ప్రకారం భూమి, విస్తారమైన భూమి అని అర్థం.</p><p class="ltr-element" data-indentation="1">కాని మనం ఇచ్చట....</p><p class="ltr-element" data-indentation="1">మానవుడు కర్మ బద్ధుడై జీవనం వలన సంచిత ప్రారబ్ధం లతో అనేకానేక జన్మలు కలిగి వుంటున్నాడు...</p><p class="ltr-element" data-indentation="1">మరి ఈ సంచిత ప్రారబ్ధం ను నివారించి</p><p class="ltr-element" data-indentation="1">జన్మరాహిత్యం అయిన మోక్షం కలగటానికి ఎవరిని ఆశ్రయం చేయాలి... రాముని ఆశ్రయం చేయాలి...ఆయనే భద్రం నమ్మకం... అందుకే విపుల భద్ర మూర్తి వాడు అనే ప్రయోగం.</p><p class="ltr-element" data-indentation="1">తరువాత పాదం...</p><p class="ltr-element" data-indentation="1">"రాజముఖ్యుండోకరు </p><p class="ltr-element" data-indentation="1"> డదే కనుగవకు ఎదురు కానబడియే"</p><p class="ltr-element" data-indentation="1">అంటే...రాజుల లోని ముఖ్య వ్యక్తి తన కన్నుల ముందు కనపడినారు అని తెలుపు తున్నారు...</p><p class="ltr-element" data-indentation="1">మరి అంతరార్ధం ఏమిటో....</p><p class="ltr-element" data-indentation="1">రాజు అంటే మీకు తెలిసినదే...రాజు పాలకుడు గాను పాలితులుగా ప్రజలు వుంటారు...</p><p class="ltr-element" data-indentation="1">మనకు గత కాలంలో రాజు అనే ఆయన దైవాంశ సంభూతుడు అనే నమ్మకం వున్నది.</p><p class="ltr-element" data-indentation="1">కాని ఇక్కడ వున్న రాజు అయోధ్య రాజుగారు... ఆయనే స్వయం విష్ణుః శ్రీరామ చంద్రుడు... అయోధ్య రాజ సారధ్యం లో సకల భూమండలం వున్నది...మరి పాలితులు ప్రజలు , మరియు ఆయన భక్తులు....</p><p class="ltr-element" data-indentation="1">అంటే దేవతా స్వరూపాలు లో ముఖ్యమైనది శ్రీరామ చంద్రుడు అని ఆయన ఉద్దేశ్యం...</p><p class="ltr-element" data-indentation="1">"కను గవకు ఎదురు కాని బడియే"</p><p class="ltr-element" data-indentation="1">ఇందులో విశేషం కను గవ....</p><p class="ltr-element" data-indentation="1">అంటే కన్నులు అని అర్ధం...కాని మనం మరికొంత తెలుసు కొందాం...</p><p class="ltr-element" data-indentation="1">కన్నులను "కిటికి" లతో పోలిక వున్నది.</p><p class="ltr-element" data-indentation="1">'కిట కిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు మూసినా చప్పుడు కావు'</p><p class="ltr-element" data-indentation="1">అని మనం చిన్నప్పుడు పొడుపు కధలు చదువుకున్నాం....దాని విడుపు ఏమిటో అంటే కళ్ళు అని చెప్పి సంబర పడే వారం.</p><p class="ltr-element" data-indentation="1">కిటికి కి మరో పేరు గవాక్షం....</p><p class="ltr-element" data-indentation="1">మరి దీని కర్తవ్యం ఏమిటో గమనిస్తే...</p><p class="ltr-element" data-indentation="1">ఇంటి గదిలో వుండి బాహ్య దృశ్యం దర్శించుటకు అనువుగా వుండునది.</p><p class="ltr-element" data-indentation="1">అంటే నీవు వున్న ప్రదేశం వాతావరణం వేరు గవాక్షం గుండా నీకు గోచార దృశ్యం వేరు ...ఈ రెండింటికి విభజన గవాక్షం...</p><p class="ltr-element" data-indentation="1">అలాగే గవ్వ అంటే మీకు తెలుసు...</p><p class="ltr-element" data-indentation="1">గవ్వ అనేది సముద్ర జీవి తన రక్షణ కొరకు నిర్మించుకునే ఒకానోక కవచం...</p><p class="ltr-element" data-indentation="1">మరి సముద్రం, జీవికి మధ్య వుండేది గవ్వ... ఇంత వరకూ సరిపోతుంది అని నా భావన....</p><p class="ltr-element" data-indentation="1">ఇక ఇప్పుడు కనుగవ అనే పదం...</p><p class="ltr-element" data-indentation="1">పోతన గారికి రాముల వారు ఎప్పుడూ దర్శనం ఇచ్చారు అంటే...పోతన గారు యోగ ధ్యానం లో వున్న సమయంలో ఆయన మనో నేత్రం పై సాక్షాత్కరించారు అని మనం అర్ధం చేసుకోవాలీ....</p><p class="ltr-element" data-indentation="1">రామ సాక్షాత్కారం అంటే సశరీర సాక్షాత్కారం అని మీరు ఎన్నడూ భావన చేయరాదు.</p><p class="ltr-element" data-indentation="1">అలాగైతే కను దోయి అనే పద ప్రయోగం వుండేది....</p><p class="ltr-element" data-indentation="1">పోతన గారి లాంటి వారికి ఇటువంటి వాటిపై అవగాహన వున్నది.</p><p class="ltr-element" data-indentation="1">కారణం త్రేతా యుగం నాటి రాముడు,</p><p class="ltr-element" data-indentation="1">కలి యుగం నాటి పోతన గారికి సశరీరం అంటే అభూత కల్పన అవుతుంది అని తెలుసు.</p><p class="ltr-element" data-indentation="1">అదియునూ కాక దేవతా దర్శనాలు ఎప్పుడూ స్వఫ్న సాక్షాత్కారం, యోగ, ధ్యాన సాక్షాత్కారం అని మనం గమనించాలి....</p><p class="ltr-element" data-indentation="1">ఇది ఇంత వరకూ మొదటి పద్య వివరణ....</p><p class="ltr-element" data-indentation="1">రెండోవ పద్యం... "పలికేడేది భాగవతం"</p><p class="ltr-element" data-indentation="1">తరువాయి భాగం లో...నేను క్లుప్తంగా రాయాలని భావన చేస్తాను...కాని వివరణ సమయంలో స్వామి వారు మరి కొంత స్ఫురణ కు తెచ్చి ఇంకొంత వివరం తెలుపమని ఆదేశంతో...దాని అంతరార్థం...మరి కొంత అర్ధ వివరణ చేరి విస్తారం అవుతుంది....</p><p class="ltr-element" data-indentation="1">మిత్రులు అన్యధా భావించక...మన్నించండి.</p><p class="ltr-element" data-indentation="1">అలాగే ఈ రచన పై భూషణలు అన్నీయునూ శ్రీరామ చంద్రుడు వి...మీరు చదివి శ్రీరామ రామ రామ అని ఒక్క సారి అంటే ఆయన ప్రసన్నుడై మీకు ఆయన ప్రపన్నత లభిస్తుంది...</p><p class="ltr-element" data-indentation="1">ఇక దూషణలు అన్నీయునూ నావే...</p><p class="ltr-element" data-indentation="1">మీరు నిరభ్యంతరంగా... నిర్మొహమాటంగా ఈ రచనలోని తప్పులు తెలియచేసిన సరిదిద్దుకుంటాను...</p><p class="ltr-element" data-indentation="1">ఆలపాటి రమేష్ బాబు </p><p class="ltr-element" data-indentation="1">శ్రీ సంతోషి సాయి బుక్ డిపో</p><p class="ltr-element" data-indentation="1">విజయవాడ...</p><p class="ltr-element" data-indentation="1">94401 72262.</p><p class="ltr-element" data-indentation="1">తదనంతర భాగం కోసం మెసేజ్ పెట్టండి.</p><p class="" data-indentation="1"></p><p class="" data-indentation="1"></p><p class="" data-indentation="1"></p><p class="" data-indentation="1"></p><p class="" data-indentation="1"></p><p class="" data-indentation="1"></p><p class="" data-indentation="1"></p><p class="" data-indentation="1"></p><p class="" data-indentation="1"></p><p class="" data-indentation="1"></p><p class="" data-indentation="1"></p><p class="" data-indentation="1"></p><p class="" data-indentation="1"></p><p class="" data-indentation="1"></p><p class="" data-indentation="1"></p><p class="" data-indentation="1"></p><p class="" data-indentation="1"></p><p class="" data-indentation="1"></p><p class="" data-indentation="1"></p><p class="" data-indentation="1"></p><p class="" data-indentation="1"></p><p class="" data-indentation="1"></p><p class="" data-indentation="1"></p><p class="" data-indentation="1"></p><p class="" data-indentation="1"></p>Alapati Ramesh Babuhttp://www.blogger.com/profile/10902788241134698143noreply@blogger.com1tag:blogger.com,1999:blog-2337893138436064619.post-61768022252384134952023-11-17T23:30:00.001+05:302023-11-17T23:30:28.059+05:30పలికేడిది భాగవతం అర్ధ విశేషాలు...<p class="ltr-element" data-indentation="1" data-pm-slice="1 1 []">పలికెడిది భాగవతమఁట,పలికించెడివాఁడు రామభద్రుండఁట, నేఁబలికిన భవహర మగునఁట,పలికెద వేఱొండుగాథఁ బలుకఁగనేలా!</p><p class="" data-indentation="1"></p><p class="ltr-element" data-indentation="1">ఈ పద్యం చాలా ప్రాముఖ్యత కలది...</p><p class="ltr-element" data-indentation="1">చాలా చాలా సందర్భాల్లో ఈ పద్య ప్రస్తావన చేశారు.</p><p class="ltr-element" data-indentation="1">ఎందుకంటే....ఈ పద్య రచనా చమత్కారం అటువంటిది....</p><p class="ltr-element" data-indentation="1">పోతన వంటి భక్తి విశ్వాసాలు గల వారి కలం నుంచి జాలువారిన ఆణిముత్యం.</p><p class="ltr-element" data-indentation="1">సహజంగా మానవులు.... ఏ విషయం ప్రస్తావనకు తెచ్చిననూ ప్రధమ పురుషులో చెపుతారు... అనగా నేను చేశాను నా వలన జరిగినది...అని స్వ కేంద్రం గా ప్రస్తావన చేస్తారు...</p><p class="ltr-element" data-indentation="1">కాని పోతన గారు ఉత్తమ పురుష తో చెపుతున్నారు.... అనగా వారు తెలిపారు వారు చేయించారు...వారు లేనిదే నేను లేను అనే భావం మనకు స్పష్టంగా తెలియచేస్తున్నది...</p><p class="ltr-element" data-indentation="1">మనలో చాలామంది ఈ పద్య పఠన విధానం తెలియదు...కాని సహస్రవాధాని మాడుగుల నాగఫణి శర్మ గారు ఒకానోక అవధాన ప్రక్రియ లో ఈ పద్యం ఎలా చదవాలో తెలిపితే గమనించి ఆశ్చర్యం పొందటం నా వంతు అయిపోయింది...</p><p class="ltr-element" data-indentation="1">మొదటి సాధారణంగా అందరు భావన చేసే విధానం లో...</p><p class="ltr-element" data-indentation="1">"పలికెడెది భాగవతమట"</p><p class="ltr-element" data-indentation="1">గమనించండి ఇక్కడ 'అట'...అనే శబ్ద విశేషం సహజంగా మనం ఏ ఏ సమయాల్లో ఉపయోగం అంటే...</p><p class="ltr-element" data-indentation="1">అస్పష్ట విషయ ప్రస్తావన లో ఉపయోగం అనగా.. అక్కడ మనుషులు వున్నారంట, ఆ పని అవుతుందట, ఇలా అనేకానేక అస్పష్ట క్రియా రూపక శబ్ద విశేషం గా వాడతాం..దీనితో వక్త భాధ్యత తీరుతుంది కాని శ్రోత స్థితి నమ్మక అపనమ్మకాల మధ్య త్రిశంకు స్వర్గంలా వుంటుంది...</p><p class="ltr-element" data-indentation="1">కాని ఆ విధంగా కాక ఈ టకార శబ్దవిశేషాన్ని SUFFIX గా కాక Prefix గా ప్రయోగించి చూడండి అప్పుడు ఈ విధంగా మారుతుంది అచ్చట మనుషులు వున్నారు, అటులే ఆపని అవుతుంది గా మారుతుంది...</p><p class="ltr-element" data-indentation="1">కనుక మీకు పద్య అర్ధ విశేషం తెలిపే ముందు ఈ పద్యం యొక్క పది విచ్ఛేదన, విరామ క్రమం తెలుపుతాను...</p><p class="ltr-element" data-indentation="1">పలికెడెది భాగవతం,</p><p class="ltr-element" data-indentation="1"> అట పలికించేడివాడు రామభద్రుడు,</p><p class="ltr-element" data-indentation="1">అట నే పలికిన భవహరమగును,</p><p class="ltr-element" data-indentation="1">అట పలికేద వేరోండు గాథ</p><p class="ltr-element" data-indentation="1">బలుకగనేలా...</p><p class="ltr-element" data-indentation="1">గమనించారా విరామ చిహ్నం మార్పుతో పద్య గమనం మొత్తం మారిపోయి పాఠకుడికి స్పష్టం గా దర్శనం అవుతుంది....</p><p class="ltr-element" data-indentation="1">ఇప్పటి వరకు మనం పద్య గమనం తెలుసుకున్నాం ఇప్పుడు అర్ధ విశేషాలు తెలుసుకుందాం...</p><p class="ltr-element" data-indentation="1">ఎలాగు నేను మిత్రులకు పద్యానికి ప్రతిపదార్ధ రూపం, వచన అర్ధ రూపం కాకుండా అంతర్గత భావ అర్ధ విశేష విశ్లేషణ విధానం లో ముందుకు వెళుతున్నాం కాబట్టి...</p><p class="ltr-element" data-indentation="1">పోతన గారు భాగవతం రాసినది.. కీర్తి, కనకం కోసం కాదు "భవ హరం" .</p><p class="ltr-element" data-indentation="1">అదే విషయం అనేక మార్లు ప్రస్తావించారు...మరి దానిపైన ఒక పద్యం రాసినారు " ఇమ్మనుజ రాజేశ్వరులు"...</p><p class="ltr-element" data-indentation="1">మరి భవం అంటే....</p><p class="ltr-element" data-indentation="1">మానవుడి పుట్టు రోగం...</p><p class="ltr-element" data-indentation="1">ఇది సంచిత ప్రారబ్ధం...గత జన్మ కర్మ యావత్తు మోసుకుంటూ వచ్చాం...</p><p class="ltr-element" data-indentation="1">మరలా ఈ జన్మ లో చేయి, జరుగు క్రియలు వలన జనించు కర్మ ఫలం ఇక్కడే అనుభవిస్తున్నామా లేదే ఆగామిత కర్మ ఫలం గా వచ్చే జన్మకి మోసుకుని పోతున్నాం...</p><p class="ltr-element" data-indentation="1">మరి ఇది పూర్తిగా పరిహారం అయి మోక్ష స్థితి కలగాలి అంటే ఏమి చేయాలి, ఎవరిని ఆశ్రయం చేయాలి...అందుకే రాముడు అని అనకుండా రాముభద్రుడు అనే పద విశేషం...అనగా రాముడు తగిన వాడు, భద్రమైన వాడు, నమ్మ తగిన వాడు...రామ ఆశ్రయం, రామ నామ ధ్యానం తో మనం మనయొక్క భవ హరం చేసుకో గలం...</p><p class="ltr-element" data-indentation="1">మరి అంతటి రామభద్రడే...</p><p class="ltr-element" data-indentation="1">భాగవతం రాయమని స్పష్టం గా తెలుపుతూ...ఇది రామ ఆజ్ఞ, ఇది రాముని పలుకు , ఇది రాముని వాక్కు కనుక భాగవతం రాస్తున్నాను...</p><p class="ltr-element" data-indentation="1">వేరే వేరే కధలు, వేరే వారి కధలు నేను పలుకనేల...( ఆ రోజుల్లో వీరి బంధువు అయిన శ్రీనాథుడు కాశీ ఖండం, శృంగార నైషధం వ్రాసి ఖ్యాతిలో వున్నారు )</p><p class="ltr-element" data-indentation="1">మరి ఇది ఆయన కోసమా కాదు మన కోసం మన అందరి కోసం...</p><p class="ltr-element" data-indentation="1">జననమరణ చక్ర విచ్ఛేదన సుదర్శన చక్రధారి ఈ కోదండ రాముడు అంతటి రాముని పలుకు అయిన భాగవతం మన భవ హరం కూడా అవుతుంది...</p><p class="ltr-element" data-indentation="1">ఇది పద్య అర్ధ విశేషం...</p><p class="ltr-element" data-indentation="1">(పండితార్ధాలు తెలపాలి అంటే ఇంకను చాలా వున్నాయి...కాని నేటి సమాజ నడవడి కి కొంత లలితంగా తెలిపితే నే బాబోయ్ ఆంటున్నారు)</p><p class="ltr-element" data-indentation="1">సకలం సర్వం శ్రీరామ జయం...</p><p class="ltr-element" data-indentation="1">సర్వులకు శ్రీరామ జయం...</p><p class="ltr-element" data-indentation="1">తమరు చదివి భాగున్నది అని భావన చేస్తే... శ్రీరామ రామ రామ అని ఒకసారి పలకండి...</p><p class="ltr-element" data-indentation="1">తప్పులన్నియూనూ నావే....కనుక తమరు తెలియ చేసిన సరిదిద్దుకుంటాను...</p><p class="ltr-element" data-indentation="1">మీ </p><p class="ltr-element" data-indentation="1">ఆత్మీయ మిత్రడు/ సహోదరుడు</p><p class="ltr-element" data-indentation="1">ఆలపాటి రమేష్ బాబు...</p><p class="ltr-element" data-indentation="1">శ్రీ సంతోషి సాయి బుక్ డిపో </p><p class="ltr-element" data-indentation="1">విజయవాడ....</p><p class="ltr-element" data-indentation="1">9440172262</p><p class="" data-indentation="1"></p><p class="" data-indentation="1"></p>Alapati Ramesh Babuhttp://www.blogger.com/profile/10902788241134698143noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2337893138436064619.post-16329308959314842072023-03-13T12:43:00.001+05:302023-03-13T12:43:33.678+05:30సిగ్గు పూబంతి... సిరివెన్నెల పదప్రయోగాలు <p dir="ltr">సిగ్గు పూబంతి ఇసిరే సీత మా లచ్చి<br>
మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి (2)<br>
సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా<br>
రాముని సిత్తంలో కాముడు సింతలు రేపంగా</p>
<p dir="ltr">విరజాజి పూల బంతి అర చేత మోయలేని<br>
సుకుమారి ఈ సిన్నదేనా శివుని విల్లు మోసిన జాణ ఈ సిన్నదేనా<br>
ఔరా అని రామయ కన్నులు మేలమాడి నవ్విన సిన్నెలు<br>
సూసి అలకలొచ్చిన కలికి ఏసినది కులుకుల మెలికి</p>
<p dir="ltr">సిరసొంచి కూరుసున్న గురిసూసి సేరుతున్న(2)<br>
సిలకమ్మ కొన సూపు సౌరు బొండు మల్లె చెండు జోరు<br>
సేరే ఆ సూపుల తళుకు ముసురుతున్న రామయ్య రూపు(2)<br>
మెరిసే నల్ల మబ్బైనాది వలపు జల్లు వరదైనాది.<br>
పై గీతం....స్వయంకృషి సినిమాలో విశ్వనాథ్ దర్శకత్వంలో సిరివెన్నెల గారు వ్రాయగా బాలుగారు , జానకి గారు పాడినారు...సంగీతం రమేష్ నాయిడు.<br>
గత కొద్ది కాలంగా ఈ పాటలోని సాహిత్యం నన్ను ఆకట్టుకున్నది..అంతకన్నా ముందు ఈ పాటలోని పద ప్రయోగాలు గురించి చెప్పాలని భావించాను. నేను పెద్ద పండితుడిని కాకపోయిననూ ఏదో నాలుగు అక్షరాలు భగవత్ కృపతో వ్రాస్తున్నాను...<br>
భారతీయ సమాజవ్యవస్థ ఇంత బలంగా వున్నదంటే దానికి కారణం కుటుంబ వ్యవస్థ బలంగా వుండటమే.<br>
పూర్వకాలంలో అష్టావర్షత్ భవేత్ కన్యా అన్న ప్రమాణానుసారం వధువుకి 8సంలలోపు వివాహం చేసేవారు....ఈ వివాహం తరువాత అనేక రకాల కుటుంబ వేడుకలు ప్రతి ఒక్కరు నిర్వహిస్తారు కారణం వధువుకి వరునకు సాన్నిహిత్యం ఎర్పరచటమనే ప్రక్రియలో భాగంగా దీని వలన ఒకరిపై ఒకరికి ఆకర్షణ, అనురాగం ఏర్పడి వారి భవిష్యత్ సజావుగా వుంటుంది.<br>
ఈ కుటుంబ వేడుకలలో ముఖ్యమైనది పానుపు లేక చెండ్లాట అని పిలుస్తారు.ఈ వేడుకలో వధూవరులను ఓక పానుపుపై ఎదురు ఎదురు కూర్చోనబెట్టి...ఏవో కొన్ని ఆటలతో పాటు...ఓక పూల మాలను బంతిలాగా చేసి వధువరులను ఆడుకోవడానికి అందిస్తారు...ఇరుపక్షాల బంధువర్గాలు వధువరులను సపోర్ట్ చేస్తూ ఆట ఆడించుతారు...ఇందులో ఎవ్వరు ఓడి పోరు...గెలిచేది వధూవరుల మధ్య ఆకర్షణ.<br>
ఇక పాట విషయానికి వద్దాం....<br>
మన స్త్రీల పాటల సాహిత్యం మొత్తం<br>
వధూవరులను శ్రీరామ చంద్రునిగా , సీతమ్మ తల్లిగా భావన చేస్తూ పాటలు పాడతారు....ఈ పాటకూడా అటువంటిదే....<br>
ముందు చూడండి ప్రారంభమే...<br>
"సిగ్గు పూబంతి ఇసిరే సీత మాలచ్చి..."<br>
అమ్మవారు బిడియంతో సిగ్గుతో మనోహరంగా రామునిపై పూలబంతి విసిరారు అంట....<br>
అది <u>ఎ</u>లా మొగ్గ సింగారం <br>
" ఇరిసే సుదతి మినాచ్చి..."<br>
అమ్మవారు కన్య కాబట్టి ఆమేను మొగ్గగా భావన...ఆమే అలంకరణ పువ్వు విచ్చుకునబోయేటప్పుడు వున్నంత మనోహరంగా వుండటంతో పాటు ఆమే మనోహరమైన పలువరుసతో అందంగా నవ్వటంతో పాటు...ఆమే రెప్పవాల్చకుండా రామునే చూస్తున్నారు..అని తెలుపుతున్నారు...<br>
చూడండి ఈ వాక్యంలో సుదతి ప్రయోగం , మీనాక్షి ప్రయోగం విశిష్టమైనవి....<br>
భార్య మనోహరంగా నగుమోముతో వుంటే భర్త చాలా జయించిన వాడులా<br>
ఆనందపడతాడు. అలాగే మీనాక్షి అన్న పదం చూడండి...ఏమి ఆడవారి కన్నులు చేప కన్నులేనా వేరే ప్రయోగం చేయవచ్చుగా....<br>
చేపకు శరీరంలో రెండుప్రక్కలా రెండు కనులుంటాయి...అవి భిన్న దృశ్యాలను చూపుతాయి...(ఈనాటికి ఫిష్ విజన్ గురించి పలురకాల చర్చలు)...<br>
ఒకటి పుట్టింట వారి దృశ్యమైతే రెండోవది అత్త ఇంటివారి దృశ్యం... రెండిటిని కలగలిపి తనదైన దృశ్యం అనగా....ఇరుకుటుంబాల మధ్యవున్న సాధ్యాసాధ్యాలు మరియి తన భర్త వ్యవహరదక్షత మరియి సంతానం యొక్క కోరికలు తో ఆమే ఒడుపుగా తనదైన ముద్రవేస్తుంది...ఇంత చేసి చేప నీటి నుంచి తీసివేస్తే ఇబ్బంది పడుతుంది స్త్రీ కూడా తన సంసార సాగరం నుంచి దూరంగా వుండటమో లేక ఇంకొక ఇబ్బంది వస్తే ఆమే కూడా విలవిల లాడిపోతుంది....<br>
అమ్మవారి సిగ్గు , నవ్వు మొదలైన వాటితో రాములవారిపై మన్మధ బాణాలు తగిలినవంట...<br>
తరువాత చూడండి కవి తన ప్రయోగం...<br>
"విరజాజి పూల బంతి అర చేత మోయలేని<br>
సుకుమారి ఈ సిన్నదేనా శివుని విల్లు మోసిన జాణ ఈ సిన్నదేనా"<br>
విరజాజి పూల బంతి అమ్మవారు మోయలేకుండా వున్నారట...<br>
ఇది సీతమ్మ సౌకుమార్యం తెలుపుతున్నారు....విరజాజి పూలబంతి...విరజాజి మొగ్గ చిన్నగా వుండి చాలా బరువుతక్కువగా వుంటుంది.... ఆ విరజాజి పూలబంతి కూడ మోయలేనంత సుకుమారమా అన్నట్లుగా వున్నారట సీతమ్మ తల్లి...అందుకనే మన జానపద కధలలో రాకుమారి ని ఏడుమల్లేల ఎత్తు అని వర్ణన చేసేవాళ్ళు....(నేను కూడా నా భార్య ను వివాహం అయిన కొత్తలో ఏడుమల్లేల సుకుమారి అని ఆటపట్టించే వాడిని)....<br>
మరి ఇంత సుకుమారి అయినా సీతమ్మ ఎంతో బరువైన శివధనస్సుని అలవోకగా ప్రక్కకు జరిపినది ఈ సుకుమారి చిన్నదేనా...అంత పెద్ద కార్యం చేసిననూ తనకూ ఏమి తెలియనట్టు నవ్వుతూ సుకుమారంగా వున్నదా...ఏమి ఈ జాణ తనం....<br>
అమ్మవారిపై జాణ అనే పద ప్రయోగం పెద్ద సాహసం అయితే కవి సమర్ధన చేసుకోవటం ఎలాగంటే శివుని విల్లుని సోదాహరణంగా తీసుకోవటంతో సరిపోయింది.<br>
సాధారణ గృహకృత్యాలలో సతమతమైన గృహస్థు సంతానం ఏవో కొత్త కోరికలు , నూతన భాధ్యత నిర్వాహణకు బెంబేలు పడుతుంటే స్త్రీ తనదైన ఆచరణాత్మక ఆలోచన తన పొదుపు నుంచి భర్తను కాపాడికూడా...ఏమి తెలవన్నట్టుగా వుంటారు....అదే ఇది..<br>
ఇక తరువాత వాక్యాలు కి వెళదాం.....<br>
"ఔరా అని రామయ కన్నులు మేలమాడి నవ్విన సిన్నెలు<br>
సూసి అలకలొచ్చిన కలికి ఏసినది కులుకుల మెలికి...."<br>
సీతమ్మ వారి సౌకుమార్యం చూసి రాములవారు ఆశ్చర్యం తో భలే భలే అన్నట్టుగా సీతమ్మవారికన్నులలో కొంటేగా చూశారట...<br>
మరి చూశారా మేలమాడి అనే పద ప్రయోగం...సాధారణంగా వధూవరుల మధ్య కాని బావమరదల మధ్యకాని ఓక విధమైన మనోహరమైన శృంగార వెటకారం వేళాకోళం వుంటుంది... కాని ఇదే వరుస అయినవారి మధ్యమాత్రమే సన్నిహితత్వం తో కూడిన హస్యసంభాషణను మేలమాడటం అంటారు.<br>
దీనితో సీతమ్మ వారు రాముల వారి భావం గ్రహించినదై కొంత అలకతో కూడిన సిగ్గుతో నవ్వినారట....<br>
మరి తరువాత చరణాలు కి వెళదామా.....<br>
"సిరసొంచి కూరుసున్న గురిసూసి సేరుతున్న(2)<br>
సిలకమ్మ కొన సూపు సౌరు బొండు మల్లె చెండు జోరు"<br>
ఇంత చేసిన సీతమ్మ వారు ముగ్ధమనోహరంగా తలవంచి కూర్చుని...తన కొన చూపుతో రాములవారిని అందంగా చూస్తున్నదట...అది ఎలా బొండుమల్లే చెండు జోరు....ఆమేను ఏమో విరజాజి గా వర్ణించుతూ....కాని ఆమే చూపులను బొండుమల్లేలుతో వర్ణించటం గమ్మత్తు... బొండుమల్లేలు సౌరభం గుబాళింపు వధూవరుల మధ్య ఎనలేని సాన్నిహిత్యం కలుగచేసి ఓకరిపై ఓకరికి ఆకర్షణ బలపడేవిధంగా వుంటుంది... అందుకే ఆ పద ప్రయోగం....<br>
మరి సౌరు అన్న పదానికి అర్ధం అందంగా నవ్వటం అని...వధువు తన మనోహరమైన నవ్వుతో సిగ్గుతోను వరుని మదిలో స్థానం అనే భావనలో ప్రయోగం....<br>
మరి తరువాత చరణాలు కూడా చూద్దాం.....<br>
"సేరే ఆ సూపుల తళుకు ముసురుతున్న రామయ్య రూపు(2)<br>
మెరిసే నల్ల మబ్బైనాది వలపు జల్లు వరదైనాది."<br>
పంట పండాలి అంటే వర్షం అవసరం...ఆ వర్షం నల్లమబ్బుల రూపంలో వస్తుంది...<br>
మరి సీతమ్మ వారు మనోహరమైన సిగ్గు నవ్వులతో రాముని వారు ప్రేమాస్పదుడై అమ్మవారిపై వర్షపు మబ్బులా తన ప్రేమ ఆప్యాయత ఆనే వర్షం వరద వచ్చేంతగా కురిపించారట...<br>
ఈ వాక్యాలు లో తళుకు, నల్లమబ్బు ,వరదైనాది పద ప్రయోగాలు విశిష్టత కలిగినాయి....తళుకు అనేది స్త్రీ తన అందచందాలు ప్రవర్తనతో భర్తను ఆకట్టుకుంటదని.....<br>
నల్లమబ్బు....నల్లమబ్బు లో మాత్రమే వర్షపు నీరు దాగి వుంటుంది అని తన భార్య పై పురుషునకు అదేవిధమైన ప్రేమ కలిగివుంటుంది అని....<br>
ఇంతటి అనురాగ పూరితమైన సంసారంలో వలపు వరదలా వుంటుంది అనేది కవి భావన...<br>
మరి ఇంతటి గొప్ప సాహిత్యం... దాని వెనుక పరామార్ధం...ఎంతమంది వధూవరులు ఆచరణో....అసలు వారికి తెలుసా...ఏమో....తెలిసినది ఓకటే ఈగోలు , ప్యాకేజిల మధ్య చిక్కుకుపోతున్నారు....<br>
మీ అభిప్రాయం తెలపండి<br>
ఆలపాటి రమేష్ బాబు<br>
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో<br>
విజయవాడ.<br>
<a href="tel:9440172262">9440172262</a> వాట్సప్...., టెలిగ్రాం...<br>
<a href="mailto:rameshsssbd@gmail.com">rameshsssbd@gmail.com</a>.<br>
సకలం సర్వం...<br>
శ్రీరామ జయం.<br><br></p>Alapati Ramesh Babuhttp://www.blogger.com/profile/10902788241134698143noreply@blogger.com2tag:blogger.com,1999:blog-2337893138436064619.post-83849847803099608412023-03-09T03:16:00.001+05:302023-03-09T03:16:49.840+05:30సంపుటీకరణ - మంత్ర వివరణ<p dir="ltr">సంపుటికరణ...<br>
బహుశా ఈ పదం చాలా మంది సాధారణ ప్రజలకు కొత్త. కాని అధ్యాత్మికత రంగంలో శ్రద్ధ వున్నవారికి ఇది <a href="http://తెలుసు.మరీయు">తెలుసు, మరీయు</a> బీజాక్షరాలు అన్నీయును పరమేశ్వర ప్రోక్తం అన్నది గమనార్హం. మరి ఈ బీజా ఆక్షరకూర్పు మంత్రం అన్నది కూడా మీకు తెలుసు. <br>
సహజంగా మానవుడు అనేక రకాల కామ్యంలు గురించి మంత్ర సాధన చేస్తాడు. అవి అతని జీవన కాలంలో ఇంక చెప్పాలంటే త్వరగా సిద్ధించితే ఫలితంను పరమేశ్వరాను గ్రహంగా భావించి సంతోషించి ఆనందపడతాడు. కాని కొంతమందికి అది జీవనకాలంలో సాధ్యపడదు. ఎందుకు ఎలా అనేదానికి పరిష్కారం చిక్కదు.<br>
ఇది ఈనాటి జీవన విధానంలో కాదు పూర్వం<br>
మహర్షుల కాలంలో కూడా వున్నదే..అందుకు ఋషులు పరమేశ్వరుని ద్వారా సందేహ నివృత్తి కై పరమేశ్వర మంత్రం సాధనలో కల అవరోధాలను , సాధనలో ఫలితాలలో కల ఆలస్యాలు వలన మేము ఈ జన్మలో సంకల్ప సిద్ధి లేక ..కొండకచో ఆయష్షు తీరి మరుజన్మ ఎత్త వలసి వస్తున్నది...అప్పుడు కూడా సంచిత ప్రారబ్దకర్మలు వలన అనేకానేక ఇబ్బందులు వీటీని దాటగలటానికి తరుణోపాయం తెలియచేయగలరు అని అడగటంతో..ఆయన వారికి ఈ సంపుటికరణ ను సూచించారు.<br>
అసలు సంపుటికరణ అంటే ఏమిటి.. కూర్పు లేదా జోడింపు. అనగా మన కామ్యసిద్ధిగా జప , పారాయణలో వున్న మంత్ర , స్తోత్రాలకి ఇంకోక వేగ వంతమైన మంత్రం జోడించి జప , హోమ , తర్పణాదులు చేయాలి. స్తోత్రాలకి అయితే పారాయణ మాత్రం సరిపోతుంది. అనగా మన గృహిణులు లలిత పారాయణ చేస్తారు..అందులో వున్న ఓక్కో శ్లోకం కొన్ని నామాలా కూర్పు గా వుంటుంది. మీరు సంకల్ప కార్యసిద్ధి త్వరగా కావాలంటే ఈ స్తోత్రాలకి మరో నామం కాని శ్లోకం కాని సంపుటి చేయాలి...<br>
ఇది ఎలాగంటే లలితలో ప్రారంభ శ్లోకం అయిన<br>
శ్రీమాత శ్రీమహరాజ్ఞి శ్లోకం చదివి తదుపరి మీరు సంపుటి చేయవలసిన శ్లోకం పఠించాలి.<br>
ఇలా అన్నీ శ్లోకాలకి ముందు పారాయణ శ్లోకం తదుపరి సంపుటి శ్లోకం చదివాలి ఇందువలన మీ సంకల్ప సిద్ధి నందు వేగం కలుగుతుంది.<br>
సాధారణ శ్లోకం మీరు ఓక్కసారి పారాయణ చేస్తే సంపుటీ శ్లోకం బహుమార్లు పారాయణ చేస్తారు. అందువలన ఈ సంపుటి శ్లోకం మీ సంకల్పంనకు ప్రచోదనం లా పని చేస్తుంది.<br>
సాధారణ పరిభాషలో వేగంగా వెళ్ళు కారుకి ఇంకొంత వేగంగా వెళ్ళు శక్తిని జోడింపు.<br>
ఇది ఓక తాంత్రిక పద్ధతి. సాధారణంగా తాంత్రిక పద్ధతి వామాచారంలో గమనిస్తాం. మరి ఈ వామాచారం అంటే ఏమిటి...<br>
సాధరణంగా మనం చేయి పూజలు పురాణోక్త , వేదోక్తంగా వుంటాయి వీటిలో వాడు వస్తువులు కూడా పండ్లు , పూలు లాంటివే . కాని వామాచారంలో మద్య , మాంసాలు లాంటి మరికొన్ని ఉపయోగం చేస్తారు. మనం పూజించి దేవతా రూపాలని బట్టి ఈ వస్తు వినియోగం వుంటుంది. అనగా శాంతరూపాలకి ఓక విధంగా , అదే దేవత తామస రూపాలకి మరో విధంగా వుంటుంది. ఇది ఎలాగంటే లలిత , రాజరాజేశ్వరి శాంత రూపాలైతే తామస రూపాలైన కాళి ,(కాళిలో 24రూపాలు),భైరవి ,చండి లాంటివన్నమాట..అంత మాత్రం చేత భయపడవలసిన పనిలేదు. అమ్మ సదా అమ్మే...చాలామంది మూఢనమ్మకాలతో అమ్మో ఆరూపం చెడు ఈ రూపం చేటు అనే వాఖ్యానాలు చేస్తారు...కాని జగన్మాత ఏ రూపంలో వున్నను తన సహజ లక్షణమైన కరుణను విడవదు...ఇది తెలిసిన వారికి కాళి రూపం ముగ్దమనోహరంగా దర్శనం...అందుకే రామక్రిష్ణ పరమహంస కాళిరూపంలో మమేకం అయి సదా ఆమే ధ్యానంలో వుండేవారు.<br>
అసలు వామాచారంనకు ఆ పేరు రావటంనకు గల కారణం...అర్ధనారీశ్వర రూపంలో గల వామభాగం నందు అమ్మ వుండటమే. మనం ఈశ్వరుని ధ్యానిస్తే సరిపోతుందా...ఆయన వరం ఇవ్వటానికి అమ్మ ప్రోద్బలం వుండాలిగా అందుకే సంపుటిలో అమ్మవారి నామం జోడింపుతో అమ్మ వాడు నా బిడ్డ వాడి సంకల్పం ఏమి చేశారు అని ఈశ్వరుని కోరి సిద్ధింప చేస్తుంది. కావలంటే గమనించండి మన ఇళ్ళల్లో పిల్లలు తండ్రికి చెప్పినా చేయని పనిని తల్లిద్వారా అడిగి చేయించుకుంటారు. ఆకార్య సాధనలో భర్తతో విముఖత అయినా లక్ష్యపెట్టదు. ఆమేకి కావలసినది తన బిడ్డ మనోరధం తీర్చటం. సాధారణ గృహిణిలే ఇలా వుంటే జగద్ధాత్రి ఆ పరమేశ్వరి ఏరూపంలో వున్న తన బిడ్డ సంకల్పం మరచిపోతుందా...ఇది ఇంకనూ సూక్షంగా చెప్పాలంటే శిశువు స్తన్యం గురించి రోదన చేసే సమయంలో దూరంగా తల్లి తండ్రి వున్నను ప్రకృతిలోని సూక్ష్మ ప్రకంపనల వలన తల్లికే ముందు తెలుస్తుంది. శిశు రోదన వలన స్తన్యం ఉబికి వక్షం భారమవుతుంది. అందుకే తల్లులు శిశువు రోదన ప్రారంభం కాగానే స్తన్యం ఇవ్వటానికి తపన పడతారు. ఇది మరీ ఏక్కవగా ఆవు, దూడలలో మనకు తెలుస్తుంది.<br>
నేను సంపుటి గురించి తెలుపుతూ ఇవి అన్ని తెలపటం వేరు కాదు...మీరు భయపడవలసిన పనిలేదని తెలపటం.<br>
ఈ సంపుటిలో కొన్ని సార్లు పాశుపతం కూడా సంపుటిస్తారు. అసలు సంపుటి శ్లోకం , మంత్రం ఎలా ఎన్నుకోవాలి. మీ నామ నక్షత్రాలకి , దశ నాధులకి , సంకల్ప కార్య సాధనకి గల అధిష్టాన దేవతను బట్టీ ఎన్నుకోవాలి. ఇది వ్యక్తిని బట్టి , సందర్భాన్ని బట్టి మార్పు వుంటుంది. కనుక మీ సంకల్ప సిద్ధికై తగు శ్లోకంతో సంపుటికరించి లబ్దిపొందండి.<br>
సర్వులకి శ్రీరామ జయం.<br>
ఆలపాటి రమేష్ బాబు<br>
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో<br>
విజయవాడ<br>
<a href="tel:9440172262">94401 72262</a><br>
పై వ్యాసంలోని సందేహలకి సంప్రదించండి.</p>Alapati Ramesh Babuhttp://www.blogger.com/profile/10902788241134698143noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2337893138436064619.post-45456834901453561392023-03-05T21:32:00.001+05:302023-03-05T21:32:00.562+05:30వాలి సంహారం అంతర్గత రహస్యాలు <p dir="ltr">రాముడు - పరిశీలన - సీరిస్ 4<br>
************************<br>
వాలి సంహరం.<br>
రామాయణం తో పరిచయం వున్న ప్రతి ఓక్కరికి తెలిసే <a href="http://పాత్రలు.వాలి">పాత్రలు.వాలి</a>,సుగ్రీవులు.<br>
మన తెలుగు నాట సతతంకీచులాడుకునే అన్నదమ్ములను నర్మగర్భంగా..ఆ.... వారి మధ్య వాలి సుగ్రీవుల సంబంధం అని ఉదహరిస్తారు. ఆ శ్లేష...తెలిసిన వారికి మాత్రం అర్ధం అవుతుంది... ధనం గురించో , కుటుంబ స్త్రీల గురించో వారిలో వైరుద్ధ్యాలున్నాయని....<br>
పౌరాణికంగా ఆంజనేయుని విశిష్టత ముందు వాలిప్రభ మనకు అంతగా పరిచయం లేదు...<br>
కాని వాలి మహ వీరుడు...కాకపోతే స్త్రీ వ్యామోహి...<br>
వాలి ఇంద్రుని కుమారుడు. వాలి తండ్రి ఋక్షరజుడు...(కొంతమంది వృక్షజుడు అంటారు..అంటే చెట్లమీద పుట్టినవి...అని.. చెట్లమీద ఏమి వుంటాయి..పక్షులు , కోతులు)<br>
ఇతను వానర రాజు...ఇతను ఓకరోజు పొరపాటున ఓక కొలనులో పడి...అప్సరస గా మారిపోతాడు...ఈ అప్సర సౌందర్యం చూసిన ఇంద్రుడు మోహించి కామించి...ఆమేను చెర పట్టుతాడు...ఈ హడావుడి ఇలాగుంటే ఇదే అప్సరను బ్రహ్మదేవుడు చూసి కామించి మోహించి..తాను కూడా ఆమేతో పొందుకోరతాడు..(.వీళ్ళద్దరు ఆమేతో సంగమం నేను కొద్దిగా శ్లేషగా వివరిస్తున్నాను...మీరు అర్ధం చేసుకోండి). ఈ అప్సర వాలభాగం నుంచి ఇంద్రుడు సంగమించి ఆప్రదేశంలో తన వీర్యనిక్షిప్తం...కంఠభాగంలో బ్రహ్మ సంగమించి... తన వీర్యనిక్షిప్తం.... అందువల్లనే...ఇంద్రాంశతో...వాలి..బ్రహ్మంశతో సుగ్రీవజననం. ఇద్దరూ మహవీరులే. ఇంద్రుడు <br>
తార అనే అప్సరసను వాలికి ఇచ్చి భార్యను చేస్తాడు, అలాగే విపరీతమైన మహిమగల ఓక హరం ఇస్తాడు.<br>
కాకపోతే మొదటి నుంచి సోదరుల మధ్య స్త్రీ పర వైషమ్యం వున్నది. అది తార , వాలి భార్య కావటంతో కొంత ముదిరి పాకాన పడింది... ఇరువురి మధ్య ప్రచ్ఛన వైరం....<br>
దీనితో బ్రహ్మదేవుని గురించి వాలి తపస్సు చేసి...లౌక్యంగా ఓక వరం కోరతాడు..యుద్ధంలో తన ప్రత్యర్ధి నుండి తనకు సగం బలం సంక్రమించాలని కోరతాడు...దానితో బ్రహ్మ ఆ వరం ఇస్తాడు. బ్రహ్మ నాలుగు తలకాయలు వున్నను తేడా పడి...తపస్సుకు వరం కాబట్టి ఇస్తాడు. వాలి యొక్క శత్రవు సుగ్రీవుడు తన కుమారుడు (అంశ)అన్న విషయం మరచి పోతాడు. (కొన్ని వాటిల్లో వాలికి వరం బ్రహ్మ ఇచ్చారని మరికొన్నింటీల్లో ఇంద్రుడు ఇచ్చారని వున్నది...మొత్తానికి వరం వున్నది )(అందుకే మనవాళ్ళు అంటారు బ్రహ్మ నాలుగుతలలులో ఓకటి అవునంటది ఇంకోటి కాదంటది మరోకటి లేదంటది ఆతరువాతది చూద్దాం అంటుంది అంటారు)... దీనితో వాలి , సుగ్రీవుని లక్ష్య పెట్టని రీతిలో కిష్కింధను పాలిస్తుంటాడు.<br>
ఇంతలో దుందుభి అనే రాక్షసుడు వాడి వీరత్వాన్ని పరిశీలించుకోవటానికి వరణుడు , సముద్రుడు లను యుద్ధానికి ఆహ్వానిస్తారు.<br>
దానితో వారిద్దరు తమ వల్లకాదు ..నీ వీరత్వం మొత్తం.. వాలి వద్ద ప్రదర్శించు అంటారు. దానితో వాడు దున్నపోతు రూపం ధరించి వాలిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు. కాని వాలి అనునయంగా వద్దులే అంటాడు..కాని దుందుభి.. వాలి వీరత్వాన్ని కించపరిచే మాటలు పలుకుతాడు...దానితో వాలి దుందుభి తో యుద్ధానికి దిగి వాడితో పోరాటంలో భాగంగా వాడి కొమ్ములు పట్టుకుని గిరగిరా తిప్పి విసరివేస్తాడు..వాడేమో ఋష్యమూక పర్వతంపైన వున్న మతంగమహర్షి ఆశ్రమంలో పడి రక్తం కక్కుతూ మరణిస్తాడు. దీనితో మతంగమహర్షి.. ఆశ్రమప్రాంతం కలుషితమైనదన్న ఆగ్రహంతో వాలిని ఋష్యమూక పర్వతంపై అడుగు పెట్టితే నీ తల వేయి ముక్కలవుతుంది శాపం పెట్టుతాడు...ఈ విషయం తెలిసిన వాలి ఋష్యమూక పర్వతాన్ని వదిలి మిగిలిన ప్రాంతాల్లో సంచారం.<br>
ఇది ఇలావుంటే వాలికి రావణునితో విపరీతమైన మైత్రి ఏర్పడుతుంది . ఇదో విచిత్ర సంబంధం. రావణునికి విపరీతమైన అహం..తాను వీరాధివీరుడననని...దానితో ఓకసారి కార్తవీర్యార్జునుడిపై యుద్ధానికి సిద్ధపడతాడు. కార్తవీర్యార్జునుడు తన సహస్రబాహువులచే రావణుని బంధించితే రావణునికి ఊపిరందక గిలగిలాడిపోతు శరణుజోచ్చి అగ్నిసాక్షిగా మైత్రి చేసుకుంటాడు.<br>
అయిననూ బుద్ధి రాక మరోక్క సారి వాలిపై యుద్ధానికి వస్తాడు. ఆసమయంలో వాలి సంధ్యావందనంనకు సముద్రతీరానికి వస్తాడు..ఆ సమయంలో రావణుని కవ్వింపు... దానితో వాలి రావణుని క్రిమి కీటకంతో సమానంగా భావించి ఓక్కసారిగా రావణుని చంకన పెట్టుకుని ఆకాశపయనం...<br>
వాలి ప్రతిరోజు తన సంధ్యావందనం లో భాగంగా...సప్తసముద్రాలలో సూర్యుడు ఏ సముద్రం వద్ద ఉదయించుతాడో...అంతకన్నా ముందు వెళ్ళి పూజాదికాలు చేసేంత వేగం.<br>
ఇలా సప్తసముద్రాలను రెండు ఘడియలలో చుట్టి వచ్చేంత వేగం. ఇలా రావణుడు వాలి చంకలో బందిగా చాలా రోజులు <a href="http://వుంటాడు.ఇదే">వుంటాడు.ఇదే</a> సమయంలో వాలి ప్రవర్తన వలన వాలికి గల స్త్రీ వ్యామోహం తెలుసుకున్న వాడై. రావణుడు ఎలాగోలా అగ్నిసాక్షిగా మైత్రి. ఈ మైత్రికి ఓక ఓప్పందం ఇస్తాడు <a href="http://రావణుడు.లంకలోని">రావణుడు.లంకలోని</a> సమస్తానికి తన భార్యలతో సహ..తనతో పాటు అనుభవించే సహ హక్కులు ఇస్తాడు. కాని వాలి పట్టించుకోక ఓక నెల వుండి వస్తాడు.<br>
దుందుభి కొడుకు మాయావి అనేవాడు వచ్చి వాలిని కవ్విస్తాడు..దానితో వాలి వాడి వెంటపడతాడు...ముందు మాయావి తరువాత వాలి...వీరి వెనుక సుగ్రీవుడు..<br>
మాయావి ఓక గుహలో ప్రవేశిస్తాడు...వాడి వెంట వాలి...సుగ్రీవుడు తన అన్నగారి కోసం బయటనే ఆగి ఎదురు చూస్తుంటాడు...ఓక నెలరోజుల తరువాత గుహనుంచి అరుపులు కేకలుతో పాటు రక్తం బయటకు వస్తుంది...అది తన అన్నగారిదేనన్న భావనతో సుగ్రీవుడు లోపల వున్న మాయావి మరలా బయటకి రాకూడదని ఓక పెద్ద బండరాయి ని గుహకి అడ్డుగా పెట్టి తిరిగి రాజ్యానికి వెళ్ళి..మంత్రుల సలహపై రాజ్యపాలన చేస్తుంటాడు...కాని వాలి లోపల మాయావిని సంహరించటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది... బయటకు వచ్చిన వాలికి..అది సుగ్రీవరాజ్యం అని తెలుస్తుంది. దానితో తమ్మునితో యుద్ధంచేసి తమ్ముని ఓడించి...రాజ్య బహిష్కరణతో పాటు...తమ్ముని భార్య రుమ ని స్వాధిన పరుచుకొని...సుగ్రీవుడు తన రాజ్యంలో వుంటే మరణశిక్ష అనే ఆదేశం...దానితో సుగ్రీవుడు తన మంత్రులు అయిన హనుమ , జాంబవంతుడు , సుశేషణుడు మొదలగు వారితో ఋష్యమూక పర్వతంపైన నివాసం...మంచి కాలం కోసం ఎదురు చూపులు...<br>
ఇటువంటి నేపథ్యంలో సీతాపహరణం...ఆమేని అన్వేషిస్తూ రామలక్ష్మణుల వెదుకులాటలో జటాయువు ని కలుస్తారు. ఇతను <a href="http://పక్షిరాజు.ఇతను">పక్షిరాజు.ఇతను</a> దశరధుని మిత్రుడు. రామభక్తుడు. కధా కాలానికి <a href="http://వృద్ధుడైనాడు.ఇతను">వృద్ధుడైనాడు.ఇతను</a> గరుత్మంతుని సోదరుని కుమారుడు. ఇతను మొదటిసారిగా రామునికి సీతాపహరణం జరిగినది రావణుని వలన అని తెలియచెప్పి ...తాను సీతాపహరణాన్ని ఎలా ఎదుర్కోన్నది...వీటితోపాటు రావణుని తాలూకు అన్నీ వివరాలు తెలిపి...వాడిని ఎదుర్కోవటంలో భాగంగా తగిలిన గాయాలతో పాటు ఋష్యమూకపర్వతం పైన తగిన జాడలు కాని తగు సహయం కాని లభిస్తుంది ఆని తెలిపి ప్రాణత్యాగం చేస్తాడు. దీనితో రాముడు ఎంతో బాధతో జటాయువు కి అగ్నిసంస్కారం జరిపి ఉత్తమగతులు కల్పించుతాడు. (గమనించారో లేదో రాముడు పక్షి కి కూడా అగ్ని సంస్కారం చేస్తాడు. కాని నేటి కాలంలో స్వంత తల్లి తండ్రులకి చేయాలంటే నీవంటే నీవు అనుకుంటూ ఆస్థులు లెక్క తేలేంత వరకు విభేదాలు... మరి ఈ కోవిడ్ రోజుల్లో ఈ గోల మొత్తం మునిసిపాలిటీ వాళ్ళు చేస్తుండటంతో మన సన్నాసులు విపరీతమైన నటన ప్రదర్శన . నేటికి ఆవుకి మాత్రమే అగ్ని సంస్కారం కొంతమంది చేస్తున్నారు)<br>
తదనంతరం రామలక్షణులు ఋష్యమూక పర్వతం వద్దకు వస్తారు...అక్కడ వున్న హనుమని మొదట గుర్తించి హనుమని ఆలింగనం చేసుకుని సుగ్రీవునితో <a href="http://పరిచయం.సుగ్రీవునికి">పరిచయం.సుగ్రీవునికి</a> అనుమానం వీరు వాలి పంపిన చారులని...వీరి ఉభయులు మధ్య పరిచయాలు కష్టసుఖాలను పంచుకున్న తరువాత ఇద్దరునూ ఓకే విధమైన కష్టాలలో వున్నారని...కాకపోతే రాముడు సుగ్రీవుల మధ్య వానర మానవ బేధం తప్ప అంతా <a href="http://ఓక్కటే.దీనితో">ఓక్కటే.దీనితో</a> ఇద్దరు ఓకరికొకరు సహయం చేసుకోవాలనే నిశ్చయంకి వస్తారు. అయిననూ సుగ్రీవునకు ఇంకనూ శంక..వాలి వధ..రాముని వల్లన అవుతుందా...దానిని లౌక్యం గా అడుగుతాడు...మీ అన్న ఎంత విశేష ప్రజ్ఞ , వీరత్వం కొద్దిగా తెలుపుదూ అంటే...ఓక ప్రదేశంలో వున్న 7సాల వృక్షాలను చూపి మా అన్న వీటిన్నంటిని కలిపి ఓక్క సారిగా పెకలించ గలడు అన్నాడు. దీనితో రాముడు తన బాణం సంధించి వదులుతాడు...ఆవిఅన్నీ...ఓక్కసారిగా నేలకూలుతాయి...దీనితో సుగ్రీవుడు స్థిమితపడి రామునిపై సంపూర్ణ విశ్వాసం ప్రకటించగా...అగ్నిసాక్షిగా వీరిద్దరి మధ్య స్నేహ సంబంధం ఏర్పడుతుంది. రాముడు సుగ్రీవునికి రాజ్యం , అతని భార్య లభ్యతలో సహయం చేయాలని...అలాగే సుగ్రీవుడు సీతాన్వేషణకి అవసరమైన సహయం చేయాలని.<br>
దీనితో సుగ్రీవుడు రాముడు వెన్ను వున్నాడన్న ధైర్యం తో వాలిని ద్వందయుద్ధానికి ఆహ్వానిస్తాడు...అసలే తమ్మడంటే పడని వాలి కోపంతో యుద్ధం చేస్తాడు...ఇరువురు ఏక సమయంలో జన్మించిన నందున ఏకరూపంలో వుంటారు రాముడు కొద్దిగా గందరగోళం పడి తన బాణ ప్రయోగం చేయడు. దానితో వాలి సుగ్రీవుని తీవ్రంగా గాయపరచి ఓడించుతాడు. వాలి వెళ్ళగానే సుగ్రీవుడు రామునితో నీవున్నావన్న నమ్మకంతో కదా నేను యుద్ధం సిద్ధం అయినది...ఇలా జరిగింది ఏమిటి అని వాపోతాడు...దానికి రాముడు... మీ ఇరువురూ ఓకే విధంగానే వున్నారు...నేను ఆనవాలు కట్టలేక పోయాను అంటూ మీ అన్ననూ మరలా యుద్ధానికి పిలువు..ఈసారి నిన్ను గుర్తింపు కి వీలుగా ఈ పూలమాల ధరించు అని సూచనతో...అదే విధంగా చేసి..అన్న అయిన వాలిని మరలా యుద్ధానికి ఆహ్వానిస్తాడు...వాలి సిద్ధపడతాడు...కాని తార వారించుతుంది..ఇంత అర్ధరాత్రి పూట యుద్ధ ఆహ్వానం అంటే ఎదో అనుమానంగా వున్నది...అందునా మన చారుల వార్త ప్రకారం సుగ్రీవునకు రాముడనే వానితో స్నేహం ఏర్పడినది...అతను మహ ప్రజ్ఞ కలవాడు అని తెలిసినది....కాని వాలి ఆవేశంలో ఈమాటలు లక్ష్య పెట్టక...వీడికి ఈసారి మరణమే శరణ్యం లాగున్నది...అని యుద్ధానికి బయలుదేరతాడు.<br>
వాలి సుగ్రీవుని యుద్ధంలో సమయంచూసి రాముడు చెట్టు చాటునుంచి వాలిపైకి తన బాణం ప్రయోగిస్తాడు...దానితో వాలి నేలకూలతాడు....వాలి వలవలా ఏడుస్తూ రాముని అనేక ప్రశ్నలు సంధిస్తాడు...<br>
రామా వానరాన్ని...నీకు ఆహరంగా పనికిరాను...నీ భక్తుడనే...వీరుడవే..చాటునుంచి కొడతవా...ఇది న్యాయమా...అంటాడు...పోని సీత గురించి అంటావా...ఆవిషయం నీవు తెలిపితే చాలు..నేను రావణుని ఆజ్ఞాపించితే చాలునే రావణుడే స్వయంగా సీతను తిరిగి తీసుకుని రాగలడే..<br>
దీనికి రాముడు సమాధానంగా...<br>
వాలి...నీవు నా భక్తుడవు అన్నమాట నిజమే..ఈ విషయంలో నీపట్ల ప్రపన్నత వున్ననూ..ఇది నీ తప్పులను కాయదు...పుత్ర సమానుడైన తమ్ముని భార్యను చెరపట్టటం..నీ అహంకారపూరిత ప్రవర్తన...వానరుల పట్ల నీ ప్రవర్తన నీవు జ్ఞప్తీకీ తెచ్చుకో..అందునా మేము క్షత్రియులము వేట మా నైజం...నీవా వానరానివి,జంతు సమానుడివి కాబట్టి వేటాడాను...పోని నేను నిన్ను ఎదుర్కోవాలంటే నీ వరం వల్లన అది సాధ్యపడదు...ఇది మా మహరాజ్యం..ప్రస్తుతం రాజప్రతినిధిగా ఈ ప్రాంతంలో వున్నా...రాజప్రతినిధికి వున్న దండనాధికారం గురించి నీకు తెలియనది కాదు...అయిననూ నీ పశ్చాత్తాపం వలన నీ ప్రాణం నిలబడక పోయినూ నీకు సద్గతి వున్నది...నీ అంతిమ కోర్కేను అమలు పరచటం నా కనిస ధర్మం...<br>
అనగా..వాలి..రామచంద్రా..బుద్ధికర్మాను సారణి అన్న విధంగా ప్రవర్తించా..ఈనాడు ఆలోచిస్తే తెలుస్తుంది.. కాని నా బాధ ఈనాడు... అంగదుని గురించే...దీనితో రాముడు అంగదుని బాధ్యత తనదని చెప్పి...అంగదుడు యువరాజుగానే వుంటాడు అన్న మాటతో వాలి సంతృప్తిగా మరణిస్తాడు...<br>
ఇది మొత్తం పౌరాణిక కధ...<br>
వాల్మీకి వారి నామధారణలోనే వారి బుద్ధులు తెలిపినాడు.. వాలం అంటే తోక..ఓక విధంగా అది వాడి ఆధినంలో వుండదు అని భావన..అనగా వాలి ఇష్టానుసారం ప్రవర్తన అని సూచన..సుగ్రీవుడు.. అనగా మంచి వారిలో కొమ్ము లాంటి వాడు..అనగా నమ్మ దగిన వాడు..అందునా సుగ్రీవుడు బ్రహ్మ అంశ , హనుమంతుడు శివాంశ వీరిద్దరూ కలసి నారాయణాంశకై ఎదురు చూపు...ఇక త్రిమూర్తులు చేరికతో తదుపరి జగన్మాత సీతమ్మ రక్షణ...రావణ పతనంనకు ఇది సూచన.<br>
రావణుడు , వాలి మధ్య ఉమ్మడిస్నేహకారణం స్త్రీ వ్యామోహం. వాలి చనిపోయే ముందు నీ భక్తుడను అంటాడు..మరి అంతటి వినయవిధేయతలు వున్నవాడు...సీతాపహరణ విషయం వాడికి తెలసి ఉదాసీనత తో వూరకున్నాడు...ఈ విషయం రామునికి తెలియదా..అంటే వాడి ఉద్దేశ్యం మంచా చెడా... వాలి మాటతో రావణుడు సీతను తిరిగి తెస్తే...రాముని వ్యక్తిత్వ ,క్షాత్ర హీనత అవుతుంది.<br>
ఇక సుగ్రీవ స్నేహనికి రాజకీయ కారణం..నిర్వాహణ కారణం ..సూత్రబద్ధ ధర్మ కారణ హేతువులు వున్నాయి.<br>
కిష్కింధలోని వానరులు , సుగ్రీవుడు సర్వులు వాలి భాధితులే...వాడి అహంకార పూరిత ప్రవర్తనకి విసిగి వేసారి పోయారు...పోని ఎదురుతిరిగే అవకాశం కూడా లేదు వాడి వరం వల్లన ఇది మనకు సుగ్రీవుని భార్య రుమని తన స్వాధీనం లో వుంచుకోవటమే..ఆమే ఏమి చేయలేదు..హితులు సన్నిహితులు ఏమి చేయలేక బయటకు రావటమే సూచన. దీనితో వాళ్ళను వాలి నుంచి ఎవరు కాపాడుతారో అన్వేషణ...ద్వంద యుద్ధంతో పనికి రాదు..అస్త్రనిపుణుడే కావాలి...వానరుల హస్తనిర్మాణం విలువిద్యకు సరికాదు...ఓకవేళ ఎవరైనా వున్ననూ వారు నిపుణులు కాదు...దాదాపు వానరులు అందరూ ద్వంద యుద్ధంలో గాని , భుజ బలం వల్లకాని , గద , పరిఘ , బరిశ లాంటి ఆయిధప్రయోగం..అవి వాలి వద్ద పనికి రావు..కారణం అవి ముఖతా ప్రయోగం...కాని శర అస్త్ర ప్రయోగం అలాకాదు దూరం నుంచి అవకాశం... అందుకే సుగ్రీవుడు రాముని విలువిద్యా నైపుణ్యం పరిక్షించుతాడు..దానితో సుగ్రీవునికి నమ్మకం కుదురుతుంది. వానరులకి వాలి పీడ పోయిన తరువాత అంత ఉత్సాహంగా కోట్లాదిమంది రామదండుగా కదులుతారు.<br>
రాముని కారణాలు రాముని కున్నాయి...<br>
ముందు రాముడు ఎంత వీరుడైననూ రావణుని వంటి వాడి మీద దండయాత్రకు తాను ఒక్కడే చాలడు..ఈ విషయం పై పూర్తి అవగాహన వున్నది. అందుకే తోడ్పాటు కావాలి. ఎవరన్నా రాజసహయాం అడిగితే ఇతని <u>క్షాత్రంనకు</u> అవమానం..అలా జరిగితే రాముని వ్యక్తిత్వం వీరత్వం బలహీనపడుతుంది...పోని అటువంటి వాడు దొరికినా రాముడు అతనితో స్నేహనికి ఆరాజు యొక్క అంతఃపురానికి వెళ్ళాలి..అప్పుడు తన తండ్రికి ఇచ్చిన మాటకి వాగ్దాన భంగం జరుగుతుంది... అరణ్యవాసం పదనాలుగు సంవత్సరాల కాలంలో ఏ రాజ్యవాసం చేయరాదు.. అందువల్ల తప్పని సరిగా అరణ్యవాసులతోనే స్నేహం..వారి సైనికులతోనే దాడి చేయాలి. రామునికి వానరుల సహయాం కావలని జటాయువు తో మాట్లాడిన తరువాత అవగాహన కి వస్తుంది.. మరి దగ్గరలో అందుకు తగ్గ వానర రాజ్యం..కిష్కింద మాత్రమే...పోని వెనుకకు పోయి తనకు తెలిసిన వానర రాజ్యాల సహయం తీసుకోవాలన్నా సమయాతీతం..అప్పటికే అరణ్యవాసంలో పదిసంవత్సరాల కాలం అయిపోయింది...వెనుకకూ పోయేది ఎప్పడు అందుకు తగ్గ వానరులను వెదికి వాళ్ళను కూడగట్టి తీసుకుని రావాలి అంటే పూర్తి సమయాతీతం..సమయంలో అయోధ్య కి తిరిగి వెళ్ళక పోతే భరతుని ప్రాణత్యాగం అనే మాట ఇన్ని పరిధిల మధ్య సుగ్రీవ స్నేహం చేయాలి, అందునా వానరులు , వానరప్రముఖులు సుగ్రీవునితో...ఇదే కాకుండా భార్యా వియోగం , రాజ్య పాలనలో ఇద్దరిది సరిసమాన బాధ...ఓకరు పాలనలో వున్న వారికి రాజ్యం పోయింది.. రెండోవ వారికి రేపు రాజ్యపట్టాభిషేకం అనగా అరణ్యవాసం...ఓక బాధితుడు రెండోవ బాధితుడి దుఃఖం , అవసరం గుర్తించ కలడు...<br>
అలాగే కాకుండా శత్రవు మిత్రడు కూడా శత్రువు తో సమానం అన్న రాజనీతి .<br>
ఇది పూర్తిగా దైవ ప్రణాళిక.<br>
ఇది రాముని రాజ , క్షాత్ర ,వీర ,వ్యక్తిత్వ ధర్మం.<br>
ఇన్ని విధాల ఆలోచన చేసి మాత్రమే వాలిని సంహరించాడు.<br>
సకలం సర్వం శ్రీరామ జయం.<br>
సర్వం శ్రీరామ ప్రసాదమే...<br>
మిత్రులకు , విమర్శకులకు స్వాగతం.<br>
ఆలపాటి రమేష్ బాబు<br>
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో<br>
విజయవాడ<br>
<a href="tel:9440172262">94401 72262</a><br>
మీకు తప్పు అని తలచిన విషయం వాట్సప్ చేయండి...పరిశీలించి సరిదిద్దుకుంటాను.<br>
ఇది నా ఘనత కాదు పూర్తిగా రామునిదే...ఆయన ఆశీస్సులు లేకుండా ఇది సాధ్యం కాదు...<br>
కనుక సర్వం శ్రీరామ జయం.<br><br><br><br></p>Alapati Ramesh Babuhttp://www.blogger.com/profile/10902788241134698143noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2337893138436064619.post-68940445452301489062023-03-04T20:56:00.002+05:302023-09-26T20:59:21.604+05:30సీతా కళ్యాణ వైభోగమే - కీర్తన అర్ధం విశేషాలు <p dir="ltr">శంకరాభరణము - ఖండలఘువు<br></p>
<p dir="ltr">పల్లవి<br>
సీతా కళ్యాణ వైభోగమే<br>
రామ కళ్యాణ వైభోగమే | | సీతా | |</p>
<p dir="ltr">అనుపల్లవి<br>
పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర<br>
రవిసోమ వరనేత్ర రమణీయ గాత్ర | | సీతా | |</p>
<p dir="ltr">చరణము 1<br>
భక్తజన పరిపాల భరిత శరజాల<br>
భుక్తి ముక్తిద లీల భూదేవ పాల | | సీతా | <br>
చరణము 2<br>
పామరా సురభీమ పరిపూర్ణ కామ<br>
శ్యామ జగదభిరామ సాకేతధామ | | సీతా | |<br>
చరణము 3<br>
సర్వలోకాధార సమరైకధీర<br>
గర్వమానసదూర కనకాగధీర | | సీతా | |<br>
చరణము 4<br>
నిగమాగమ విహార నిరుపమ శరీర<br>
నగధ రాగ విదార నత లోకాధార | | సీతా | |<br>
చరణము 5<br>
పరమేశనుత గీత భవజలధి పోత<br>
తరణికుల సంజాత త్యాగరాజనుత | | సీతా.<br>"సీతా కళ్యాణ వైభోగమే" ఈ కీర్తన ప్రముఖ వాగ్గేయకారులు త్యాగరాజు స్వామి వారిచే సృజించ బడినది.<br>
ఈ కీర్తన శంకరాభరణం రాగంలో, ఖండలఘువు తాళంలో స్వర పరచినారు.<br>
ఈ కీర్తన ఎంతో ప్రాముఖ్యత కలది...<br>
పూర్వం దక్షిణాదిన ప్రతి పెళ్ళి నందు ఈ కీర్తన తప్పనిసరి , కాని నేటి కాలమాన ప్రభావం వలన ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఆ సాంప్రదాయ ఆచారం తగ్గి పోయింది...కాని నేటికి తమిళ, మళయాళ ప్రాంతాల్లో ఈ సాంప్రదాయం కొనసాగుతోంది....దానికి అభినందించాలో... తెలుగు కీర్తన తెలుగు భాషా ప్రాంతాలలో కనుమరుగు అవుతున్నందుకు బాధ పడాలో తెలియని సందిగ్దావస్థ లో వున్నాం.<br>
త్యాగయ్య గారు తెలుగు వారు , వారి కీర్తన సాహిత్యం అంతయునూ తెలుగులో వున్ననూ...తమిళ నాట తెలుగు మాతృభాష కాని వారు కూడా త్యాగరాజ కీర్తనలు విద్వాంసులుగా పాడుట వలన చాలా కీర్తనలలో అక్షర దోషాలు వున్నాయి...ఈ కీర్తన కూడా నేను శోధన చేయగా 5,6 వెర్షన్ దొరికినాయి. నేను దాదాపు 30 మంది ఔత్సాహికులు నుంచి ప్రముఖులు వరకూ పాడిన విధానం మరియి నా స్వబుద్ధి ఉపయోగించి శ్రీరాముల వారి కరుణతో మీ ముందుకు ....ఈ కీర్తన లోని అర్ధ విశేషాలు తెలియ చేయ ప్రయత్నం.<br>
మాములు వచన సాహిత్యము కి పరిమితి వుండదు...కాని పద్యం నందు మరి ముఖ్యంగా కీర్తన యందు పూర్తిగా చాలా పరిధి లో సృజన చేయాలి.<br>
రాగం, తాళం,చందస్సు, వృత్తం లాంటివి అన్నియునూ పరిధి నిర్దేశం . అయిననూ త్యాగయ్య గారు రామకరుణా కటాక్షములు, నారదలు వారి ఆశీస్సులు లతో లభించిన "స్వరార్ణవం" సంగీత గ్రంధం సహాయంతో అనేక విశిష్ట కీర్తనలు రచన చేశారు.<br>
ఈ కీర్తన స్వరూపాన్ని పరిశీలన చేస్తే అనుపల్లవి, పల్లవి, 5 చరణాలు గా వున్నది. అనుపల్లవి నందు ఆంజనేయ ప్రస్తావన, ఆఖరి చరణం నందు పరమేశ్వర ప్రస్తావన వుంటుంది గమనించండి.<br>
ఇది ఎందుకో గమనించండి...<br>
మన పౌరాణిక కధలు, గాధలు, వ్రతాలలో ప్రారంభ సమయంలో నైమిశారణ్యంలో శౌనకాది ప్రముఖ మునుల మధ్యన, లేక ఫలానా దేవతా ఉవాచ అంటూ ప్రారంభం కాని అవే ముగింపు సమయంలో ఫలిత నిర్ణయ సమయంలో<br>
ఈ వ్రతం, నామం పఠించిన, పారాయణ చేసిన , లేక వ్రతం శ్రద్ధగా నిర్వర్తించితే ఫలానా దేవి దేవతా స్వరూపం ఈ విధమైన ఫలితం అని నిర్దేశించుతారు గమనించండి. అదే సాంప్రదాయం, అదే ఆచరణ ఈ కీర్తన యందు కూడా త్యాగరాజ స్వామి వారు పాటించారు.<br>
దీనికి కారణం మీరు చేయి ఈ క్రియ ఫలానా దేవతా స్వరూపం వారిది అని మనకు తెలియ చేయటం.<br>
ఇక ఈ కీర్తన సమయం త్యాగయ్య గారి ఏకైక కుమార్తె సీతామహాలక్ష్మి వివాహ సందర్భంగా అని నా అభిప్రాయం.<br>
ప్రతి తండ్రి తన కుమార్తె వివాహం చేయాలని కలలు కంటాడు .తను అల్లారుముద్దుగా పెంచుకున్న తన లావణ్యరాశి, బంగారు బొమ్మ, సాక్షాత్తు తన ఇంటి మహాలక్ష్మి గా భావించే కన్యకు ఎటువంటి వరుడు లభిస్తాడో అని సర్వులు భావిస్తారు. ఆ కన్య వివాహ సమయంలో వరుని యొక్క వంశ, రూప, గుణాలను పరిశీలించి ప్రస్తుతిస్తుంటారు . అందుకే కాబోలు త్యాగయ్య గారు వరుని గుణ గణాలు శ్రీరాముని పరంగా చూపుతూ అదే సమయంలో శ్రీరాముని ఆధ్యాత్మికంగా కీర్తీంచారు. మనము శ్రీరామ కీర్తన గా భావన లేక వర ఎంపిక లక్షణ కీర్తన అంటే వారి వారి భావజాలం పరంగా భావన చేయండి.<br>
పల్లవి<br>
" సీతా కళ్యాణ వైభోగమే<br>
రామ కళ్యాణ వైభోగమే"<br>
చూడండి గమ్మత్తు... కీర్తన ఏమో రామ ప్రస్తుతి, కాని కీర్తన ఆరంభం మాత్రం సీతతో... ఎందుకంటే మనం సమాజం మాతృ స్వామ్యయ వ్యవస్థ నుంచి పితృ స్వామ్యం కి మారినది అన్న విషయం మనం గుర్తించాలి , అయినా వివాహ విషయంలో స్త్రీ కి వున్న ప్రాధాన్యత పురుషునకు కొంత తక్కువ. అమ్మాయి వివాహం అంటే అందరూ కదలి వస్తారు తమ వంతు పాత్ర నిర్వర్తించుతారు.</p><p dir="ltr">
ఇది మన సాంప్రదాయం... స్త్రీ చేరిక తరువాత మాత్రమే పురుషుడు వ్యక్తుడుగా , కుటుంబ జీవన అర్హుడుగా సమాజంలో గుర్తింపు , తద్వారా సమాజం నకు ఇంకొక చైతన్య వంతమైన చేరిక కలుగుతుంది. దీనికి రాముడు కూడా బద్ధుడే...<br>"సీతా కళ్యాణ వైభోగమే" అన్న పల్లవిలో సీతారాముల కళ్యాణ విశిష్టత ను "వైభోగమే" అన్న పదం ద్వారా మనకు సూచన చేస్తున్నారు.<br>
భోగము, విభవం, వైభోగం మూడునూ సమరూప పద ప్రయోగాలుగా భావిస్తారు కాని ఇవి మూడునూ వేరు వేరు సందర్భాలలో ఉపయోగిస్తారు.<br>
భోగము అన్నది ఐహిక సుఖ, లేక ఆహర నివేదన సమయాలలో మాత్రమే వినియోగం.<br>
వైభవం అన్నది ఐశ్వర్య జీవన ప్రదర్శన సమయాల్లో ప్రయోగం.<br>
వైభోగం అన్నది మాత్రము దైవకృప మరియి దైవసంబంధ సామూహిక ఘట్టాలలో ప్రయోగం...<br>
మరి వైభోగం ఆయా దేవతా రూపాలకా...<br>
కాదు కానేరదు... ఆయా దేవి దేవతా రూపాల కళ్యాణ దృశ్యదర్శనం మనకు యోగం. సాక్షాత్తు లక్షీ, నారాయణ రూపాలైన సీతారాముల కళ్యాణ దర్శనం మనకున్న యోగంలలో ఒక గొప్ప యోగం. అందుకే త్యాగయ్య గారు <br>
"సీతా కళ్యాణ వైభోగమే<br>
రామ కళ్యాణ వైభోగమే"<br>
అని ప్రారంభించారు.<br>
అనుపల్లవి<br>
"పవనిజస్తుతి పాత్ర పావన చరిత్ర<br>
రవి సోమ వర నేత్ర రమణీయ గాత్ర"<br>
సాధారణంగా కీర్తన సాహిత్యం లో మనం పల్లవి మాత్రం గమనిస్తాం. కాని ఈ కీర్తన లో అనుపల్లవి కూడా కలదు.<br>
ఈ అనుపల్లవి లో శ్రీరాముని యొక్క విశేషతను ఒక దైవ రూపం ద్వారా ప్రారంభించారు. పవనిజ అనగ వాయు పుత్రుడు అయిన ఆంజనేయుడు అని సర్వ విదితిమే. ఆంజనేయుడు , శ్రీరాముని పవిత్ర చరిత్రను స్తుతి చేస్తున్నారు.<br>
హనుమది అచంచలమైన రామభక్తి అని మనకు తెలిసినదే.<br>
ఈ సమయంలో మనం హనుమ రామ భక్తుడు ఎందుకు అనేది కొంత వరకు తెలుసుకుందాం....<br>
మనం ఆంజనేయుని ఈ విధంగా ప్రార్ధన చేస్తాం " మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధీమతాన్వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామ దూతం శిరసా నమామి"<br>
ఆంజనేయుడు శివ అంశ. విశేష ప్రజ్ఞ కలవాడు. నవ వ్యాకరణ పండితుడు, సూర్యుని వద్ద విద్యని అభ్యసించినవాడు. సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు. సర్వ ప్రాణకోటికి చైతన్యం ప్రసాదించు వాడు. సూర్యుడు ఆత్మరూపానికి గుర్తు. మరి అంతటి సూర్యుని వద్ద విద్య నేర్వటం అంటే ఆత్మ నిగ్రహ శక్తి కలిగి వుండటం.<br>
వాల్మీకి వారు ఈ విషయంను రామ, హనుమ ప్రధమ సమాగమ ఘట్టం అయిన కిష్కింధ కాండ , 3 సర్గ యందు విశేషంగా వివరించారు.<br>
రాముడు ధర్మ రూపం. ధర్మం అన్నిటి కన్నా గొప్పది. కనుక హనుమ, శ్రీరామ భక్తుడు అవటంలో అసంబద్ధం ఏమి లేదు.<br>
తరువాత పాదం<br>
"రవి సోమ వర నేత్ర రమణీయ గాత్ర"<br>
శ్రీరాముని కన్నులు ఈ విధంగా వున్నాయట...ఒక కన్ను దగ్ధాయమానంగా ప్రకాశించు సూర్యునిలాగా, రెండోవ కన్ను చల్లని హాయి కొలుపు చంద్ర కాంతిలా...<br>
మనం ఈ ఉపమానం చదువుతాము కాని ఇలా ఎందుకు అని మనం ప్రశ్నించుకుంటే......<br>
మనం ఎవరినైనా దర్శనం చేసినప్పుడు మొట్ట మొదట మనకు అప్రయత్నంగా వారి ముఖ కవళికలు లోని కన్నులు వారికి మన పట్ల గల భావం కాని వారి స్థితిని కాని ప్రస్ఫుటంగా తెలియ చేస్తాయి. తద్వారా వారు ఆనంద, దుఖః, వైరాగ్య, సంతాప, సంతోష, సందిగ్ధత లాంటి అనేకానేక వ్యక్తి అవస్థలు మనం గుర్తు పట్టగలం.<br>
కాని ఇక్కడ మనం తెలుసుకోవాలి అనుకుంటున్నది శ్రీరాముని గురించి...<br>
అయన ఇటువంటి అవస్థలన్నింటికి అతీతుడు....వారి కన్నులు సదా ప్రకాశవంతంగా, ఆత్మనిగ్రహంతోను, గంభీరంగా ఎంతో సుదూరంగా వున్న విషయం అయననూ గ్రహించే విధంగా, సర్వ జనులకు ఆకర్షణీయంగా వుంటూ ప్రశాంతత, ఆదరణీయ దృష్టితో, తనను <u>అర్ధించే వారి పట్ల ప్రసన్నత కలిగి వుంటాడని.... తద్వారా సర్వులకు భరోసా నమ్మకం ఉపశమనం కేవల వీక్షణ ద్వారా లభిస్తుంది.</u><br>
అందుకే త్యాగయ్య గారు సోమ వర నేత్ర..సోమ అంటే చంద్రుడు. చంద్ర కాంతి వంటి శీతలత్వం మరియి హాయి కలుగ చేయు కలడని, వర అనగా మనకు ఒక భరోసా, ఒక నమ్మిక ఏర్పరచ గల పరమపురుషుడని వారి భావన.<br>
ఇటువంటి పరమ పురుష చరిత్ర ఏ విధంగా వున్నదో అంటే రమణీయంగా ప్రజలు గాత్రం చేస్తున్నారట.<br>
రామచరిత్ర మాత్రమే రమణీయం ఎందుకైనది....అంటే అనేకానేక కారణాలు...ఎందుకు మీ చరిత్ర, నా చరిత్ర లాంటివి కావు అవి స్వొత్కర్ష మరియి సుత్తి అవుతాయి రెండోవ సారికే మనకు మనకే బోర్ అనుకుంటాం కాని రాముడు త్రేతాయుగ నాటి అవతార పురుషుడు నేడు కలియుగంలో వున్నాం ..అయిననూ అనేక విశేషాలు కలవి కాబట్టి యుగాలు మారినా నేటికి ఆరాధ్యుడు...అదియును గాక రామ చరిత్ర ఎన్ని సార్లు విన్నను ,దర్శించిననూ ఏమిటో అక్షణం లో కొత్తగా ఇంకొక విషయం తెలుసుకొని ఆశ్చర్యం చెందుతాం...అరే ఈ విషయం మనకు ఇంతకు ముందు తెలియదే అని ఆశ్చర్యం చెందుతాం...<br>
ఈ సమయంలో అప్రస్తుతం అయిననూ ఇహలోక సంబంధ విషయం కొంత ప్రస్తావన...<br>
మనం అందరం గమనిస్తూ వుంటాం...మనం ఇండ్ల లోని కుటుంబ స్త్రీ లు, బాలికలు, యువతులు రక రకాల అలంకరణలతో ఎప్పటి కప్పుడు నిత్యనూతనంగా...రోజు చూసే మన బంగారు తల్లి కూడా ఎప్పటి కప్పుడు కొత్తగా నిత్య నూతనంగా... గౌను లో ఒకలా, సల్వార్ లో మరోలా, పట్టు పావడా పరికిణి లలో మరోలా, చీరలో, పూల జడ తో, ఇలా అనేకానేక అలంకరణలతో ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా దర్శనం ఇచ్చి మనకు ఆనందం కలిగిస్తారు....<br>
మరి రామ చరిత ఎన్ని సార్లు విన్నను మరలా మరలా విని ప్రస్తుతించ గలం కాబట్టే రామ చరిత్ర రమణీయం అయినది.<br>
చరణం1<br>
"భక్తజన పరిపాల భరిత శరజాల<br>
భుక్తి ముక్తిద లీల భూదేవ పాల"<br>
ఈ చరణంలో శ్రీరాముడు తన ఆశ్రీతులకు, భక్తులకు, బ్రాహ్మణులకు, సాత్వికులకు ఏవిధైమన రక్షణ కల్పిస్తున్నారో మనకు తెలియ చేస్తున్నారు.<br>
శ్రీరాముడు అయోధ్యకు మహారాజు మరియు జగత్ ప్రభువు అన్న కోణంలో వివరించు కుందాము...<br>
ఈ చరణంలో శ్రీరాముని రాజసం,క్షాత్రం ను తెలుపుతున్నారు.<br>
రాజు యొక్క అధికారం రాజ్యపాలన.<br>
రాజ్యపాలన అంటే అధికార దర్పం,అధికార ప్రదర్శన కాదు కానేరదు<br>
అధికారమంటే ప్రజలను రక్షించటం, కాపాడటం,శిక్షించడం..<br>
ఈ విషయం లో వాల్మీకి వారే రామాయణ రచన లోనే అద్భుతమైన కౌశలం చూపారు.. శ్రీరాముడు బాల్యం తదుపరి యౌవ్వన ప్రారంభం, అంతేకాదు రావణ సంహరనకు ప్రాతిపదిక మరియు ,రాముని యొక్క క్షాత్రాన్ని అనన్యమైన రీతిలో మనకు రామాయణం లో చూపదలచి విశ్వామిత్ర పాత్ర ప్రవేశం ద్వారా జరిపించారు. విశ్వామిత్రుడు <u>రాముని</u><br>
యాగ సంరక్షణార్థం తన వెంట తీసుకుని వెళ్ళి ప్రజా కంటకంగా వున్న తాటకి సంహారం. యాగ విధ్వంసం చేయుచున్న మారీచ సుభాహులలో, సుబాహు సంహారం, మారీచుడు పలాయనం రాముని యొక్క వీరత్వ క్షాత్ర లక్షణం ప్రదర్శన...<br>
రాముడు భక్తితో తనను ఆశ్రయించిన వారి యొక్క కార్య నిమిత్తం తన తూణిరం నుంచి శర పరంపరతో సదా సిద్ధమే... భక్తితో అంటే.... నమ్మకం, విశ్వాసం, ఆర్తి తో కూడిన హృదయ నివేదన భక్తి....<br>
సరే రాజ ధర్మం అయిన క్షాత్రం , వీరత్వం తో పాటు పాలన...భుక్తి ముక్తిద లీల భూదేవ పాల...<br>
ఈ చరణం గురించి త్యాగయ్య గారిని ఎంత ప్రశంసించననూ తక్కువే...<br>
తన ఆశ్రయించిన భూదేవులు అనగా బ్రాహ్మణులు కి...భుక్తి...అనగా సాత్వికులకు అవసరమైన నిత్యకర్మానుష్ఠానం, యజ్ఞ యాగాదులకి అవసరమైన ధన, కనక, వస్తు ,వాహన,సంభారాలు అన్నింటిని సమకూర్చే వాడు.<br>
సరే రాజ ధర్మం లో అవి రెండును సహజమే కదా అనుకుందాం...మరి "ముక్తి"...<br>
ముక్తి మాములుగా క్షేత్రాలలో దొరకు పంట...కాదే...<br>
అసలు ముక్తి అంటే...<br>
మానవుడు పునరపి జననం పునరపి మరణం అన్నారు... ఆత్మ తన ప్రార్బద కర్మలను బట్టి జన్మ తీసుకోవటం..ఈ జన్మ కర్మలను బట్టి ఇంకొక జన్మ తీసుకునే జనన మరణ చక్రం లోని వారికి శ్రీరాముడు జన్మరాహిత్య స్థితిని ప్రసాదించటమే ముక్తి....ఇది భగవత్ కృప వలన మాత్రమే సాధ్యం.<br>
మరి 'లీల' అంటే....<br>
సాధారణ మానవుడు చేయి క్రియలు, చర్యలు అన్నియినూ భౌతికమైనవి కనుక ఇవి జీవన క్రియలు గా అభివర్ణిస్తారు. కాని అధి మానవుడైన దైవ రూపం చేయి అధి భౌతిక చర్య లీల గా పిలుస్తారు.<br>
మరి రామాయణం లో రాములువారు తాను అవతార పురుషుడు అనే ప్రకటనే లేదు మరి ఇక లీలలు ఏమిటండి...<br>
లీలలు అంటే శ్రీక్రిష్ణులవారివే కదా!...<br>
రామాయణంలో కూడా వున్నదా అంటే వున్నది అండి అది " అహల్య శాప విమోచనం"...<br>
యాగ సంరక్షణ తరువాత విశ్వామిత్రుడు తో కలిసి శ్రీరాముడు ప్రయాణిస్తున్న సందర్భం లో గౌతమ ముని ఆశ్రమం లో రాయిగావున్న అహల్య శ్రీరామ పాద స్పర్శ చే మరలా స్త్రీ గా మారుటే అహల్య శాప విమోచనం.<br>
అహల్య శాప సమయం కి శ్రీరాముని వలన శాప విమోచనం కి మధ్యలో కాలవ్యవధి చాలా వున్నది...ఈ మధ్యలో జరగని శాపవిమోచనం ఆ సమయంలో<br>
జరగడమే లీల అని నా అభిప్రాయం.<br>
మీరు శ్రద్ధగా గమనిస్తే... సీతా స్వయంవరం ముందు వచ్చు ఘట్టాలు అన్నీ శ్రీరాముడు వరుడు గా కాబోతున్నారని వాల్మీకి సూచన ప్రాయంగా తెలిపినారు.<br>
సీత అయోనిజ...భూమి నందు జనకునికి లభించిన పుత్రిక....భూమి నందు అంటే... సహజంగానే మనం మన తల్లి తండ్రుల వారసత్వ లక్షణాలు కలిగి వుంటాము. మరి సీత భూదేవి ద్వారా అంటే భూమాతకి కలిగిన సహనం, ఓర్పు, సచ్ఛీలత,శీలం అన్నవి ఆమేకు సహజ సిద్ధంగా వున్నవి...మరి ఆమెను పొందవలనంటే శ్రీరాముడు ఎంతటి వాడు గా వుండాలి....<br>
రామాయణం లో ఇంతవరకూ సీత ప్రస్తావన వుండదు...కాని వాల్మీకి రచన నైపుణ్యం అదే.. రాబోవు సన్నివేశాలకు ముందుగానే ఇక్కడే ప్రస్తావన చేస్తూ మనకు సూచనలు ఇస్తుంటాడు...<br>
రాముని యొక్క వీర, ధీర, క్షాత్రం తోపాటు పరస్త్రీ లో పట్ల మాతృభావం కలిగినవాడు అన్న కోణం కూడా అహల్య శాపవిమోచనం ద్వారా తెలియ చేస్తూ మనల్ని శ్రీరాముడు వరుడు కాబోతున్నాడు అని సమాయత్తం చేస్తున్నాడు...<br>
మరి ఈనాటి కాలం కి మనం ఏ విధంగా అన్వయం చేసుకోవాలి...<br>
వర ఎంపిక నందు వధువు తల్లి తండ్రులు చూడ వలసినది ఏమిటి..<br>
వరుని రూప, గుణాలతో వ్యక్తిత్వ, సౌశీల్యం, కుటుంబ జీవనంలో తమ కుమార్తె ను ఏ విధంగా సంరక్షించ గలడు అన్నది, మరియు తన వంతు బాధ్యత ఏ విధంగా నిర్వర్తించ గలడు అన్నది చూడాలి... కాని నేటి వాతావరణం తత్ భిన్నంగా వున్నది. <br>
మన వివాహ మంత్రముల లోనే ధర్మేచ ,అర్ధేచ,కామేచ, మోక్షేచ నాతిచరామి అని వర ప్రమాణం వున్నది...<br>
కాని నేటి సమాజం లో 'అర్ధం ' ఒక్కటి పట్టుకుని మిగతావన్ని వదిలివేసినారు...<br>
కాబట్టి సమాజం లో ఇన్ని విపర్యాలు చోటు చేసుకున్నవి.<br>
2 చరణం<br>
" పామర సుర భీమ పరిపూర్ణ కామ<br>
శ్యామ జగదభిరామ సాకేత ధామ"<br>
సాకేతం అంటే అయోధ్య నగరం .<br>
సాకేతం అంటే అర్ధం స్వర్గానికి దగ్గరగా...<br>
అనగా ఆనాటి సాధారణ ప్రజలు కూడా ఎటువంటి అండ లేని వారు అయిననూ<br>
అనగా విద్య, ధన, వర్ణ, వర్గం,లేని దుర్బల పామర ప్రజలు కూడా మా దేవుడు శ్రీరాముడు వారి అండ మాకు బలం , రక్షణ అని విశ్వసించే వారు వారి ధర్మ బద్ధ మనో కామనలు అన్నీయునూ పూర్తి చేయగలిగేవారు. అందుకనే రాముడు జగదభిరాముడైనాడు.<br>
3 చరణం<br>
"సర్వలోకాధార సమరైక ధీర<br>
గర్వ మానసదూర కనకాగధీర"<br>
సర్వలోకాలను రక్షించుట కొరకు యుద్ధం చేయగల ధైర్య వంతుడు...లోక చలనం దేనిమీద... ధర్మం అనే నియతి పైన...<br>
మరి ఆ ధర్మమే సరిగ్గా లేని నాడు <br>
ధర్మ బద్ధుడైన శ్రీరామడు యుద్ధం చేయగల ధీరుడు.<br>
అలాగే తన వెంట ఎంత సంపద వున్ననూ...ఆయన స్థితప్రజ్ఞత తో వుంటారు...<br>
ఈ చరణంలో క్లుప్తంగా ఒక చిన్న పదం<br>
కనకగాధీర ....చూడండి...<br>
ఈ పదం యొక్క అర్ధం...కనకం అంటే బంగారం...అంటే లక్ష్మి...అంటే అష్టలక్ష్మీ స్వరూపాలు....అంటే రాజ్యలక్ష్మి తో కలిపి కూడా అని...ఇంకొక అర్ధం ఇల్లాలు అని కూడా మనం అన్వయం చేసుకోవాలి...<br>
సీత సాక్షాత్ లక్ష్మీ స్వరూపం...శ్రీరాముని ఇల్లాలు...మరి అంతటి సిరి కల లక్ష్మీ వున్నదని శ్రీరాముడు అహంతో వున్నాడా లేదే స్థితప్రజ్ఞత వున్నారు...<br>
అటు వంటి గర్వం తో వ్యవహరించే వారిని ఇతను చేరనీయడు...<br>
అనగా వరుడు డబ్బు వ్యామోహంలో భార్యను నిర్లక్ష్యం చేయు వాడు కాదు...<br>
తన జీవన సమరంలో స్థితప్రజ్ఞత తో వుండి తన వద్ద డబ్బు, అందమైన భార్య వున్నది, ఆమే తో వచ్చు సిరి సంపదలకు ఆశపడి గర్వంతో వ్యవహరించు వాడు కారాదు...తన జీవన పోరాటంలో తన కుటుంబ సభ్యులందరికి ఆధార భూతుడై వుండగలవాడుగా భావించాలి...<br>
ఆ విధంగా నేడు వధు, వరులు వున్నారా అంటే... శూన్యం అనే సమాధానం...<br>
సమాజం...ఉమ్మడి కుటుంబం నుంచి వ్యష్ఠి కుటుంబానికి అక్కడ నుంచి నేను , నా భర్త మాత్రమే అన్న కోణంలోకి పయనం...దీని వలన వచ్చు సాధక బాధకాలు అనేకం...<br>
మనిషి సంఘజీవి, కుటుంబ జీవి...అలా కాకుండా నలుగురుతో కలవని పంచుకోని జీవనం ఏకాంత వాసం...అది ఘోరం దుర్భరం.. <br>
ఇది నేటి కాలపు తల్లిదండ్రులు గమనించుకోవాలి.<br>
చరణం 4<br>
" నిగమాగమ విహర నిరుపమ శరీర<br>
నగద రాగ విదార నత లోకా ధారా "<br>
ఈ చరణంలో తన అభిరుచి...తన కీర్తనలు అన్నీయునూ రాముని రూపం గానే అన్న భావన...<br>
శ్రీరాముడు వేదాంత వేద్యుడు...వేదం ప్రకారం నడుచు కొను స్వభావం కలవాడు... నిగమం అంటే వేదాలు...ఆగమం అంటే వివిధ రీతులలో దేవతలను పూజ చేయు విధానం అని అర్ధం...<br>
అంటే సర్వ వేదాలు, సకల శాస్త్రాలు, అన్నీ రకాల పూజలు ఎవరిని పూజ చేస్తున్నాయి... నిరుపమానమైన శరీరం కల శ్రీరాముని....<br>
ఉపమానం అంటే పోలిక, సామిప్యం అని అర్థం...అదే నిరుపమాన అంటే వర్ణనలకు కూడా అందనంత ప్రకాశవంతమైన ...<br>
రూపం అంటే కొంత పరిధి పరిమితి కలదని కాని శ్రీరాముని యొక్క సుగుణ రూపంనకు పరిమితులు నిర్దేశించటం సాధ్యం కాదు....<br>
మరి చూడండి అన్నీ కీర్తనలు, రాగాలు ఎవరిని పాడుతున్నాయి అంటే శ్రీరాముని... <br>
నగధరుడు అంటే విష్ణువు...<br>
కృష్ణావతారం లో గోవర్ధన ఘట్టం వలన ఈ నామధేయం.<br>
5 చరణం<br>
" పరమేశ నుత గీత భవ జలధి <u>పోత</u><br>
తరణికుల సంజాత త్యాగరాజ నుత"<br>
చూడండి అనుపల్లవి ప్రారంభం...పవనిజ అంటూ...<br>
ఈ చరణం ప్రారంభం పరమేశ నుత అంటూ...<br>
ఒక దైవాంశ ప్రారంభం..ఇంకొక దైవం కాలరూపుడైన పరమేశ్వరునితో కీర్తన ముగించటం..ఒక విశిష్ట సాంప్రదాయం.<br>
పరమేశ్వరుడు సమస్త మానవాళి కి...ఇహ లోక సంబంధమైన సమస్త విచారము లోను దాటటానికి ప్రసాదించిన మహామంత్రం<br>
" శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే"<br>
ఈ మహామంత్రం ను పార్వతి దేవి కోరిక పై సాక్షాత్తు పరమేశ్వరుడు తల్లి గర్భం ద్వార జన్మించిన సకల జీవ రాశి మీ ఇహ జీవన <u>సాధక బాధలు దాటి తరించ గల తారక మంత్రము...</u><br>
శ్రీరామ నామము.<br>
ఇది త్యాగరాజ కీర్తన పై నాకు భగవదనుగ్రహం గా లభించిన బుద్ధితో మీకు తెలుప బడిన కొన్ని విశేషాలు...<br>
ఈ కీర్తన ను నా మాతృచ్ఛాయ పరదేవతా ప్రసాదంగా భావించే నా బంగారు తల్లి వివాహ సమయంలో ఆలపించాలని భావన చేశాను....<br>
కాని రకరకాల కారణాంతరాల వలన అది సాధ్య పడలేదు...కాని నాటి నుండి <br>
నా మనస్సులో దాగి నేటికి శ్రీరామ కరుణచే రూపాంతరం చెంది ఈ విధంగా..స్వామి పాద పద్మాలకు...<br>
స్వామి వారి కరుణ సంపూర్తిగా నా బంగారు తల్లికి లభించాలని కోరుకుంటున్నా...<br>
అలాగే ఈ కీర్తన ఉపసంహరం చేసే ముందు...మరి కొన్ని...<br>
సీతారాములు...ఇరువురా ఒక్కరా అంటే<br>
చాలామంది , అదియునూ రామతత్వం పూర్తిగా తెలిసిన వారు చెప్పే మాట...<br>
వారు ఇరువురూ ఎన్నడు వేరు వేరు కాదు..<br>
ఇరువురునూ ద్విదేహలలో వున్న ఏక ఆత్మ స్వరూపులే అని, సీతారాములు ఇరువురునూ బింబ, ప్రతిబింబాలని...అంటే ఒకరిని దర్శనం చేస్తే రెండోవ వారు ప్రతిఫలిస్తారు...<br>
శ్రీరామ దర్శనం అయితే మనకు అప్రయత్నంగా సీతామాత దర్శనం అయినట్లే....<br>
మీరు గమనించితే శిల్ప శాస్త్రం, చిత్ర లేఖనంలో సీతారామస్వరూపాలు రెండుగా వున్ననూ...రెండురూపాలు ఒకే విధమైన పోలికలు, మొక్కట్లు తో వుంటాయి... కాకపోతే ఒకటి పురుష స్వరూపం...రెండవది స్త్రీ స్వరూపం...<br>
అంతటి ఘనమైన వారు కాబట్టి యుగయుగాలుగా దాంపత్య జీవనం అంటే సీతారాములదే...<br>
మరి ఈనాటి వధు, వరులు ఏంపికలో ఎవరిని, ఏ విధమైన వారిని ఆదర్శంగా తీసుకోవాలో వారు నిర్ణయం...<br>
సర్వం సకలం జయం కలగాలని...<br>
శ్రీరామ జయం.<br>
ఈ కీర్తన పై ఎవరికైనా సందేహం వున్నా నాకు ఫోన్ చేయవచ్చు <br>
సద్విమర్శ సదా ప్రీతి పాత్రమే...<br>
ఆలపాటి రమేష్ బాబు<br>
శ్రీ సంతోషి సాయి బుక్ డిప్<br>
విజయవాడ -1<br>
<a href="tel:9440172262">94401 72262</a>.<br><br><br><br><br><br><br><br><br><br><br><br><br><br><br><br><br><br><br><br><br><br><br><br><br></p>Alapati Ramesh Babuhttp://www.blogger.com/profile/10902788241134698143noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2337893138436064619.post-89392041232899553702023-02-26T18:43:00.001+05:302023-03-03T15:53:18.835+05:30బ్రోచేవారు ఎవరు రా నిను వినా రఘువరా కీర్తన విశేషాలు <p dir="ltr"></p>
<p dir="ltr"><b>బ్రోచేవారెవరురా</b></p>
<p dir="ltr">పల్లవి:</p>
<p dir="ltr">బ్రోచేవారెవరురా<br>
నిను విన ,నిను విన<br>
రఘువరా, రఘువరా<br>
నను బ్రోచేవారెవరురా<br>
నిను విన రఘువరా<br>
నీ చరణాం భుజములునే<br>
నీ చరణాం భుజములునే<br>
విడజాల కరుణాలవాల<br>
బ్రోచేవారెవరురా ఆ ఆ</p>
<p dir="ltr">చరణం1:</p>
<p dir="ltr">ఓ చతురా ననాది వందిత నీకు పరాకేలనయ్య<br>
ఓ చతురా ననాది వందిత నీకు పరాకేలనయ్య<br>
ఓ చతురా ననాది వందిత నీకు పరాకేలనయ్య<br>
నీ చరితము పొగడలేని నా చింత తీర్చి వరములీచ్చి వేగమే<br>
నీ చరితము పొగడలేని నా చింత తీర్చి వరములీచ్చి వేగమే<br>
సా సనిదపద నిస నినిదదపమ<br>
పాదమ గా మా పదాని సనిదపమ నీదాపమ<br>
గమపద మగరిస సమా గమపద మాపదని<br>
ససరిని నినిసదా దదనిపాద మపదని<br>
సానిదప మగమనిదని పదమాపదని<br>
సమా గరిస రిసానిదప సనిదపమ గామపదని<br>
బ్రోచేవారెవరురా ఆ ఆ</p>
<p dir="ltr">చరణం2:<br>
సీతాపతే నాపై నీకభిమానము లేదా<br>
సీతాపతే నాపై నీకభిమానము లేదా<br>
వాతాత్మజార్చిత పాద నా మొరలను వినరాదా<br>
భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా<br>
భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా<br>
భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా<br>
నా పాతకమెల్ల పొగొట్టి గట్టిగ నా చేయి పట్టి విడువక<br>
సా సనిదపద నిస నినిదదపమ<br>
పాదమ గా మా పాదాని సనిదపమ నీదపమ<br>
గమపద మగరిస సమా గమపద మాపదని<br>
ససరిని నినిసదా దదనిపాద మపదని<br>
ససరిని నినిసదా దదనిపాద మపదని<br>
సమా గరిస రిసానిదప సనిదపమ గామపదని<br>
బ్రోచేవారెవరురా ఆ ఆ<br>
K . విశ్వనాధ్ గారి స్వర్గ ప్రవేశం...<br>
ఈ సమయంలో వారికి నివాళిగా మరియి నా ఆత్మ నివేదన ను వ్రాయాలి అనిపించి పరిశీలించగా శంకరాభరణం చిత్రంలో ఈ కీర్తనను ఎంచుకున్నాను...<br>
దానికి కూడా కారణం వున్నది...<br>
నేను వ్యక్తిగతంగా సంగీత పాండితీ ప్రకర్ష మరియి సాహితి విద్వత్ వున్న వాడిని కాదు... ఈ రెండింటిలో అభినివేశం వున్నవాడిని మాత్రమే...<br>
ఈ కీర్తన రచించిన వారు మైసూర్ వాసుదేవా చార్య. చాలామంది ఈ కీర్తన ను త్యాగరాజు గారిది అని భావన చేస్తారు. త్యాగయ్య గారిది బ్రోచేవారు అనే కీర్తన వున్నది కాని అది వేరు ఇది వేరు.<br>
మైసూర్ వాసుదేవాచార్య గారు 28/05/1865 నా కర్ణాటకలో జన్మించారు. వీరు 200 పైగా కీర్తన లు రచించినారు. ఇందులో సింహభాగం తెలుగు లోను అందులోను శ్రీరామునిపై...అనేక కీర్తనలు ప్రాచుర్యం పొందినాయి.<br>
వీరి కీర్తనలో వాసుదేవ అన్న పదం మనం గమనించవచ్చు...వీరు అనేక తిల్లానలు, జావళీలు రచించినారు <br>
వీరు కృతి మంజరి అనే పుస్తకం వ్రాసినారు. వీరికి భారత ప్రభుత్వం వారు పద్మభూషణ్ బిరుదుతో సత్కరించారు. వీరు 17/05/1961 న స్వర్గ ప్రవేశం.<br>
ఇక కీర్తన విశేషాలు...ఈ కీర్తన ఖమాస్ రాగంలో, ఆది తాళం లో...<br>
కీర్తన విశ్లేషణ లోకి....<br>
బ్రోచేవారు ఎవరు రా....అంటే బ్రోవటం అంటే ఏమిటి మనం ప్రశ్నించుకుంటే...జన్మించిన ప్రతివ్యక్తి ఖచ్చితంగా తన తన ప్రార్బద కర్మలను బట్టి అనేకానేక కర్మ ఫలితాలను అనుభవిస్తారు. ఇవి హితమా అహితమా అంటే రెండునూ..కాని కొన్ని సమస్యలు జీవిని చుట్టుముట్టి అతను వాటిని దాటలేని పరిస్థితి... పూర్తిగా అంతర్మధనం తో బాధ పడుతుంటారు...ఆ సమయంలో ఏ దైవం అయితే ఈ విపత్కర పరిస్థితిని దాటించుతారో వారే బ్రోచేవారు...<br>
ఇది ఐహికం...<br>
కాని జీవుడు అనేకానేక జన్మజన్మల రాహిత్యం పొందటం తారకం అంటారు...కాని తారకం నకు ఏ దేవి దేవతలు ఉపాసన మరియి నామస్మరణ చేస్తారో వారే బ్రోచేవారు....<br>
అందుకనే బ్రోచేవారు ఎవరు రా నిను వినా రఘువరా....నాయనా శ్రీరామ చంద్ర ప్రభు రఘువంశంలో ఉత్తముడా!<br>
నీవు తప్ప నన్ను వేరెవరు బ్రోచగలరు.<br>
నాయనా! శ్రీరామ నీ పాదములు నేను విడవలేను...నీ కరుణ నా ప్రసరించవా ! ఇంత వరకూపల్లవి...తదనంతరం చరణం...<br>
ఓం చతురా ననాది వందిత నీకు పరాకేలనయ్యా!....<br>
నాయనా! శ్రీరామ చంద్ర, బ్రహ్మ మొదలగు సర్వ దేవతలు నిన్ను పూజించుతారు...మరి నీవు నామీద ఎందుకు నాయనా పరాకు...<br>
పరాకు...ఇదో గమ్మత్తు పదం...పరాకు అంటే...మనం ఏ కార్యక్రమం అయినా చేయాలని సంకల్పం వుంటుంది కాని పూర్తి చేయటానికి ఆలశ్యం, ఏవో మనం సృష్టించుకున్న అవాంతరాలు వలన ఆ పని లక్ష్య సిద్ధి కాదు...దీనినే పరాకు అంటారు ...లేక పోతే వాయిదా .<br>
అలాగే చాలా కీర్తన లలో బ్రహ్మ నిన్ను కొలువగా,నీ పాదం పూజించగా అని వాగ్గేయకారులు రచించారు.. ఏమి మిగతా దేవతలు లేరా...అక్కడే ఒక రహస్యం మనం గమనించాలి...<br>
బ్రహ్మ విష్ణు కుమారుడు...అనేదాని ఆధారంగా మనం కొంత చర్చ చేద్దాం...<br>
బ్రహ్మ అంటే చతుర్ముఖుడేనా...బ్రహ్మం అనగా అంతటా నిండి వున్న శక్తి...అణువు నుంచి బ్రహ్మాండం వరకూ వున్న అనేకానేక జీవ రాశులు స్థావర జంగమాది క్రిమి కీటకాలు, తమ వునికిని వ్యక్త పరిచేవి, వ్యక్త పరచనవి, వీటి అన్నీంటా దాగి వున్న చైతన్య శక్తే బ్రహ్మం.<br>
మరి విష్ణువు అనగా సర్వ వ్యాపకుడు అనే వరకు క్లుప్తంగా తీసుకుందాం.<br>
మరి బ్రహ్మ ఉద్భవ స్థానం. విష్ణువు యొక్క నాభి...సర్వ వ్యాపకుడు అయిన<br>
విష్ణువు కేంద్ర స్థానం నుంచి ఉద్భవించిన శక్తి అని...<br>
తరువాత పాదం కొద్దిగా జాగ్రత్తగా గమనిస్తే...<br>
నీ చరితము పొగడలేని నా చింత తీర్చి వరములీచ్చి వేగమే...<br>
నాయినా ! శ్రీరామ...నేను నీ ఘనమైన కీర్తిని పోగడలేను...మరలా చింత అన్న పదం... చింత అంటే మనకున్న సమస్య నిద్రలో కూడా విడవక వేధించటం. మన మాట, ఆలోచన సవ్యంగా సక్రమముగా కాని కార్యం పైన లగ్నం చేసి బాధ పడటమే చింత.<br>
నాయనా శ్రీరామ నీ కరుణ కృప వలన నీవు త్వరగా ఇచ్చే వరం తోనే నా చింత తీరగలదు.<br>
తరువాత వున్న స్వరాలు మొత్తం ఖమాస్ రాగ ఆరోహణ అవరోహణ రాగాలాపన...<br>
తదనంతరం...<br>
రెండోవ చరణం....<br>
సీతాపతీ నాపై నీకభిమానము లేదా<br>
సీతాపతే నాపై నీకభిమానము లేదా<br>
వాతాత్మజార్చిత పాద నా మొరలను వినరాదా<br>
భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా<br>
భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా<br>
నా పాతకమెల్ల పొగొట్టి గట్టిగ నా చేయి పట్టి విడువక....<br>
ఒక్కసారి పై చరణము మరలా మరలా చదవండి...<br>
కీర్తన కారులు ఈ చరణ ప్రారంభాన్నీ సీతాపతే అన్నీ పదంతో ప్రారంభించారు....<br>
సీతా రాములు దంపతులు అన్నది జగద్విదితం...సీత సాధ్వి శిరోమణి, సౌశీల్యం, అనేకానేక సుగుణ రాశి...అంతటి జగన్మాత కూడా రాముని వరించినది అంటే రామునిలో మనం చూడవలసినది శివధనుర్భంగ వీరత్వమే కాదు, ఆయన లోని రామోవిగ్రహన్ ధర్మః అన్న లక్షణాలు కలవని...<br>
మరి మనం రాముని పొందవలనంటే అంతటి లక్షణాలు మనం అలవర్చుకోవాలి....<br>
సీతా రామ చంద్ర! నా పైన అభిమానం చూపు.....<br>
నీ పాదములు సదా పూజించు ఆంజనేయుడు గా నా మొర వినవా....<br>
తరువాత చరణము ఇంకనూ గమ్మత్తు....<br>
"భాసురముగా కరిరాజును బ్రోచిన వాసు దేవుడవు నీవు కదా<br>
నా పాతకమెల్ల పోగొట్టి గట్టిగా నా చేయి విడువక....<br>
ఈ రెండు పాదములలో శ్రీరామ నామ మహిమ మొత్తం పూర్తిగాను... భాగవతం లో గజేంద్ర మోక్షం ఘట్టం మనకు అవగాహన కి వస్తుంది...<br>
అసలు ఈనాటి కాలం లో భాసురముగా<br>
అన్న పదానికి అర్థం అవగాహన లేదు...<br>
కొంత తెలియ చేయి ప్రయత్నం...<br>
సంస్కృతం నందు భ అన్న అక్షరానికి అర్ధం...వెలుగు, ఆకాశం ...<br>
ఆకాశం అనగా అనంతమైన వెలుగు, అనంతమైన ప్రయాణం, స్వర్గం, భగవంతుని ఆవాసం...ఇలా అనేకానేకాలుగా మనం భావన చేయాలి...<br>
భాసురం అనగా దివ్యమైన, ప్రకాశవంతం అని కూడా అర్ధాలున్నాయి.<br>
మరి ఇంకో పదం వాసుదేవుడు <br>
అన్న పదం విష్ణువు యొక్క సహస్ర నామాలలో ఒకటి గా భావిస్తారు. ఈ వాసుదేవ అన్న పదం విష్ణు సహస్రనామ లలో 3 సార్లు పునరుక్తి....కాని ఆది శంకరుల వారి భాష్యం లో 3 వేరు వేరు అర్ధాలు తెలిపినారు.<br>
సర్వ జగత్తును వసనం , ఆవాసం, ఆచ్ఛాదన చేసిన పరమస్వరూపం....<br>
ఈ సమయంలో మనకు కీర్తన కారుడు... కరిరాజు గురించి తెలుపుతున్నారు....<br>
నిజంగా భాగవతం లో గజేంద్ర మోక్షము ఒక అత్యద్భుతమైన ఘట్టం...ఈ ఘట్టం గురించి మనం తెలుసుకోవలసిన ది..<br>
గజేంద్రుడు అనగా వేరు ఎవరో కాదు...మీరు , నేను , ప్రతి ఒక్కరూ ప్రతిఫలిస్తారు...మనిషిలో అహం అధికాధికంగా ఏనుగు పరిమాణంలో వుంటే...అతని ప్రవర్తన ఏ విధంగా వుంటుంది....దాని ప్రభావం వలన<br>
అతను కాలమహిమ వలన మడుగులో చిక్కి...మొసలి వంటి కష్టాలు కి చిక్కితే....ఎంత పోరాటం సలిపిననూ....నిరుపయోగంగా..నిష్ఫలం...మరి మనలోని అహం తుడచివేసి... భగవంతుని పాదపద్మములకు..లావోక్కింతయి.. ధైర్యం విలోలంబ అయ్యే...ఠావుల్ తప్పే గుండేల్.....కానరావే వరదా భధ్రాత్మకా...అని శరణు వేడితే..అప్పుడు... భగవంతుడు..అల వైకుంఠ పురిలో...వున్న వాడైననూ...సిరికిం చెప్పడు శంఖుచక్ర యుగళం సందోయడు...అన్నరీతిలో వేగంగావచ్చి అనుగ్రహం...దానినే భాసురముగా కరిరాజును బ్రోచిన...అని మనకు తెలిపినారు...</p><p dir="ltr">
తరువాత పాదం గమనించండి...<br>
నా పాతకమెల్ల పోగొట్టి గట్టిగా నా చేయి పట్టి విడువక...<br>
మానవుడు కర్మ బద్ధ జీవి కదా..ఈ కర్మల వలన లభించు పాప పుణ్యాలు...జన్మపరంపర వరకు వుంటాయి...వాటినే మనం ప్రారబ్ద కర్మలు అంటాం కదా...మరి పూర్వ జన్మల యందు తెలిసి తెలియక చేసిన పాప కర్మలు జన్మపరంపర ను వెంటాడి...అధోగతి పాలు అవటమే...పాతకం...కనుక భగవత్ సాక్షాత్కారం, భగవన్నామ స్మరణ అనే చేయి పట్టుకుని విడువక వుంటే పాతకం నిర్మూలనం....<br>
కనుక శ్రీరామ నామం సదా సర్వదా పవిత్రం....మానవ జన్మ ఉద్ధరణకు బ్రోవు నామం శ్రీరామ నామం...<br>
ఈ వ్యాసం పై మీ అభిప్రాయం నిర్మొహమాటంగా తెలిపిన....సవరణ వున్నా సవరించు కుంటాను...<br>
సకలం సర్వం శ్రీరామ జయం...<br>
ఆలపాటి రమేష్ బాబు....<br>
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో <br>
విజయవాడ...<br>
<a href="tel:9440172262">94401 72262</a><br>
సూచన...<br>
నా వ్యాస పరంపర కావలెను అన్న వారు నాకు తెలిపిన...మరికొన్ని పంప గలను...<br><br></p>
<p dir="ltr"> <br><br><br><br><br><br></p>Alapati Ramesh Babuhttp://www.blogger.com/profile/10902788241134698143noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2337893138436064619.post-58089672374887747952022-07-24T06:05:00.000+05:302023-03-17T10:37:47.535+05:30అదివో చూడరో అందరూ మొక్కరో .. అన్నమాచార్య కీర్తన .. విశ్లేషణ. <p> </p><p dir="ltr">అదివో చూడరో అందరు మొక్కరో<br>
గుదిగొను బ్రహ్మము కోనేటిదరిని</p>
<p dir="ltr">రవిమండలమున రంజిల్లు తేజము<br>
దివి చంద్రునిలోని తేజము<br>
భువిననలంబున బొడమిన తేజము<br>
వివిధంబులైన విశ్వతేజము</p>
<p dir="ltr">క్షీరంబుధిలో చెలగు సాకారము<br>
సారె వైకుంఠపు సాకారము<br>
యీరీతి యోగీంద్రులెంచు సాకారము<br>
సారెకు జగముల సాకారము</p>
<p dir="ltr">పొలసినయాగంబులలో ఫలమును<br>
పలుతపములలో ఫలమును<br>
తలచిన తలపుల దానఫలంబును<br>
బలిమి శ్రీవేంకటపతియే ఫలము<br>
************************<br>
ఈ కీర్తన పదకవితా పితామహుడు అయిన తాళ్ళపాక అన్నమాచార్యులు వారిది.<br>
ఈ కీర్తన తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్ట్ లోనిది.దీని వరుస నెంబరు 498. వాల్యుం నంబరు2,<br>
అన్నమయ్య రాగి రేకు నెంబరు 197.<br>
రాగం పాడి.<br>
ఈ రాగం పాడి మేళకర్త రాగం అయినా మాయామాళవగౌళ 15వ జన్యురాగం.<br>
ఈ కీర్తన వినవలసినది గాయని<br>
శ్రీమతి శోభారాజ్ గారి గళంలోనే...ఈ కీర్తన ఆలాపన తదనంతరం పాడి రాగంలో ఈ కీర్తన పాడిన విధానం మీలో అంతర్గతంగా వున్న అధ్యాత్మిక తృష్ణని ఒక్క సారి మేలుకోలుపుతుంది...<br>
చాలామంది అదివో అల్లదివో మరియు అదిగో చూడరో రెండూ ఒక్కటే అనే భావనలో వుంటారు.<br>
కాని ఇవి రెండునూ వేరు వేరు...<br>
ప్రారంభం చరణాలలో సమరూపకత్వం వున్ననూ...ఇవి రెండునూ శ్రీ వేంకటేశ్వరుని దివ్యత్వాన్ని వేరు వేరు మార్గాల్లో స్తుతిస్తాయి...<br>
ప్రస్తుతం నేను వివరణ ఇవ్వబోయే అదిగో చూడరో కీర్తన శ్రీవేంకటేశ్వరుని విరాట్ రూపం వర్ణన.<br>
సహజంగా మనవారికి భాగవతంలోని పోతన గారి ఇంతింతై వటుడింతై పద్యం గుర్తుకు వస్తుంది..కాని అన్నమయ్య గారు ఇదే వర్ణనని రాగం, తాళంతో మంచి భావంతో కీర్తన పద్ధతిలో తెలియచేశారు...<br>
ఇక కీర్తన విషయానికి వస్తే నాలుగు భాగాలుగా వున్నది...<br>
పల్లవి ప్రకటన గాను ,<br>
తదనంతర మూడు చరణాలు<br>
వివరణ ,నిరూపణ మరియి ఫలితంగా భావించాలి...<br>
మొదటి భాగమైన ప్రకటన విషయానికి వస్తే ఈ విధంగా<br>
" అదివో చూడరో అందరు మొక్కరో<br>
గుదిగొను బ్రహ్మము కోనేటిదరిని"<br>
మనం కనుగొన్న విషయం సత్యం అయితే కాలాలకు అతీతంగా సర్వకాల సర్వాస్థలయందు పరిక్షలకు నిలువగలది అయితే విశ్వాసంగా రండి చూడండి లేదంటే ఆచరణ చేసి చూడండి మీకు కూడా ఇదే అనుభవం కలుగుతుంది అనే విశ్వాసం ప్రకటిస్తాం.<br>
ఇదే విషయాన్ని శ్రీవేంకటేశ్వరుని పట్ల గల తన అచంచల భక్తి విశ్వాసాలును ప్రకటన రూపకంగా చాటుతున్నాడు.<br>
ఈ పల్లవిలోని మొదటి పాదం అర్ధం అందరికి తెలిసినదే...రెండోవ పాదం లోని "గుదిగొని బ్రహ్మము"<br>
ఈ రెండు పదాలు చిన్నవిగా వున్ననూ మహోన్నత భావం దాగివున్నది.<br>
గుదిగొని అంటే వేరు వేరుగా వున్నా అంశాలను ఒక్కటిగా కూర్పు స్ఫుష్టత నివ్వటం, ఆకారంని సాకారం చేయిటను గుదిగుచ్చుట అంటారు.<br>
పూలని గుదిగుచ్చి దండలా, భావజాలంను గుదిగుచ్చి పుస్తకంలా అనేవి ఉదాహరణ.<br>
మరి ఇక్కడ గుదిగుచ్చినది ఏమిటో..అది బ్రహ్మము...<br>
బ్రహ్మము అంటే చతుర్ముఖ రూపమా...కాదు <br>
బ్రహ్మము సాకారా , నిరాకార స్వరూపము లందు , సకల సర్వాస్థలందు,సకల జీవ, అజీవ ప్రాణికోటి యందు సకల వస్తు సంచారంనందు..పంచభూతములు యందు, అణువు నుంచి విశ్వం వరకూ వ్యాపించి వున్న తత్వం బ్రహ్మము అంటారు.<br>
కంటికి దృశ్యమానంగా వుండక, కాని తన అనుభవాన్ని వ్యక్త పరిచేది బ్రహ్మము...<br>
అలాగే సాకారా రూపంగా దర్శనమిస్తూ..ఆ దృశ్యాన్ని శబ్దం , రూపం, వర్ణనలు లొంగని దానినే బ్రహ్మము..అంటారు...<br>
ఏమిటి పై రెండు వాక్యాలు పరస్పర విరుద్ధంగా వున్ననూ అది నిజం.<br>
ఇది మీకు తెలియ చేయటానికి నేను తెలిపిన అతి సాధారణ వర్ణనలు.<br>
(యోగ సాధకులకు , ధ్యాన సాధకులకు ఈ విషయమై అవగాహన వుంటుంది గమనించండి)<br>
మరి ఇంతటి సాకారం బ్రహ్మము ఎక్కడ వ్యక్తం అంటే కోనేటి దరిన...<br>
కనుక అన్నమయ్య తన భావాన్ని , అనుభవాన్ని తన కీర్తన ద్వారా స్పష్టంగా ప్రకటన చేయుచున్నాడు...<br>
శ్రీ వేంకటేశ్వరుడు ఆది మధ్యాంత రహిత బ్రహ్మ రూపుడని...<br>
ఆయననూ సేవించమని...<br>
మనకు తెలుపుతున్నారు.<br>
మరి తరువాత భాగం అయిన<br>
మొదటి చరణం అనగా కీర్తన విశ్లేషణ లోని వివరణ భాగం తెలుసుకుందాం.</p>
<p dir="ltr">"రవిమండలమున రంజిల్లు తేజము<br>
దివి చంద్రునిలోని తేజము<br>
భువిననలంబున బొడమిన తేజము<br>
వివిధంబులైన విశ్వతేజము "<br>
ఒక్కసారి మిత్రులు పై నాలుగు పాదములు మరోక్కసారి పరిశీలన చేయండి....విశ్వం గురించి పూర్తిగా...శ్రీ వేంకటేశ్వరుని విరాట్ రూపం వర్ణన మనకు పరిచయం...<br>
"రవి మండలమున రంజిల్లు తేజము"<br>
మన బాల్యం లో సోషల్ పాఠాలు చదువుకున్నాం. సౌరకుటుంబం అంటే... సూర్యుడు మరియు మిగిలిన అన్నీ గ్రహములు కలిపి సౌరకుటుంబం అన్నారు.<br>
సూర్యుడు కేంద్రంగా వుండి మిగిలిన గ్రహములు అన్నీయునూ సూర్యుని చుట్టూ తిరుగుతవి కాబట్టి రవిమండలము అన్నాడు.<br>
అనగా సూర్యుడు తేజా శక్తి , గ్రహములు చలన శక్తి మధ్య వున్న ఆకర్షణ శక్తి వలన సౌరమండలం ఆవిధంగా నిలిపి వుంచింది శ్రీవేంకటేశ్వరుని అని తెలుపుతున్నారు.<br>
(మరి ఈ సౌర కుటుంబం గురించి అన్నమయ్య గారు కోపర్నికస్ సిద్ధాంతాలు చదువుకోలేదు అంతకన్నా ప్రాచీనుడైన మన ఆర్యభట్టు లు గారు, భాస్కరచార్యులు తెలుసు)<br>
తరువాత చరణం గురించి...<br>
"దివి చంద్రునిలోని తేజం"<br>
భూమి , దాని ఉపగ్రహం అయిన చంద్రుడు మాత్రమే మనకు సాకార అనుభవం...వీటి చలన శీలత...వీటి వలన ఏర్పడే కాలం, తిధి, ఋతు మొదలగు అన్నీయునూ శ్రీవేంకటేశ్వరునిదే అని మనకు ఎరుక పరుస్తున్నారు.<br>
ఇక మూడవ పాదము<br>
"భువిననలంబున బొడమిన తేజం"<br>
ఈ పాదం గురించి విస్తృతంగా వివరించవలసిననూ మీకు క్లుప్తంగా పరిచయం చేస్తాను.<br>
భువి అనగా భూమి అని విదితమే.<br>
అనలము అంటే అగ్నీ... ఒక శక్తి...<br>
భూమి , భూకేంద్రకంగా వున్న దాని గురుత్వాకర్షణ శక్తి .దీని వలన చలన గ్రహము అయిననూ సర్వమూ స్థిరముగా వుండుట.<br>
దీనినే అగ్నితత్వంగా భువిననలంబున అని వర్ణన...<br>
మరి అన్ని సార్లు సాకారమవుతుందా అంటే అందుకే బొడమిన తేజం అన్నారు.<br>
ప్రకృతి యొక్క అనంతశక్తి పంచభూతాలు గా, మహసముద్రాలుగా, బడబానలం,<br>
పిడుగుపాట్లు, వర్షాలు ఇవి అన్నీ అగ్నీ రూపక తేజాలు....ఇవి ఆయా సమయాల్లో మాత్రమే తమ లో దాగిన అనంత శక్తి ప్రదర్శన...<br>
మనం ప్రమాదం, విపత్కరం అని భావించిననూ శ్రీవేంకటేశ్వరుని విరాట్ రూపం యొక్క భాగంగా గ్రహించాలి.<br>
మరి నాలుగవ పాదం<br>
"వివిధంబులైన విశ్వం తేజం"<br>
పైన మూడు పాదాల్లో ఒక్క కుటుంబమే కాని ఈ నాలుగొవ పాదములో ఈ విరాట్ పురుషుని విశ్వశక్తి లో ఇటువంటి సౌర కుటుంబం అనంతం....<br>
చూశారా అన్నమయ్య ఎంత అలవోకగా నాలుగు పాదములలో ఒక చరణములో విశ్వరూపుని విరాట్ తత్వం మనకు తెలియ చేశారు.<br>
ఇంతవరకూ మనము అన్నమయ్య కీర్తనలోని ప్రకటన , వివరణ గురించి తెలుసుకున్నాము... తదనంతర భాగం అయిన అధ్యాత్మీక స్వరూప సాకార నిరూపణ గురించి...<br>
రెండోవ చరణం...మూడవ భాగం అయిన సాకార నిరూపణకు<br>
"క్షీరంబుధిలో చెలగు సాకారము<br>
సారె వైకుంఠపు సాకారము ఈరీతి యోగీంద్రులెంచు సాకారము<br>
సారెకు జగముల సాకారము"<br>
మరి ఈ విరాట్ పురుషుడు ఎవరు అనేది మనకు స్పష్టంగా తెలియ చేయిచున్నాడు...<br>
పాలకడలిపై శేషశయనంగా విరాజమానము అగు వైకుంఠ వాసుడగు శ్రీమన్నారాయణుడు ఈవిరాట్ పురుషుడు.<br>
ఈయన సమస్త జగదాధిపతిగా , యోగింద్రుల మనః కర్తగా , యాగాదులు తోపాటు తపః ఫలితమున వారికి లభించు సాకారం దర్శనం...సకల జగత్తు తహ తహలాడు సాకార దర్శనం అయిన వైకుంఠ వాసుని దివ్యదర్శనం.<br>
మరి ఈ చరణంలో నిరూపణ అంటే విరాట్ పురుషుడే ... వైకుంఠ వాసుడు...ఆయనే..శ్రీ వేంకటేశ్వర స్వామి వారు...ఈయనే కోనేటి దరిన వున్న గోవిందుడు.<br>
ఇప్పుడు మనం చివరి భాగం అయిన ఫలితం గురించి తెలుసుకుందాం.<br>
"పొలసినయాగంబులలో ఫలమును<br>
పలుతపములలో ఫలమును<br>
తలచిన తలపుల దానఫలంబును<br>
బలిమి శ్రీవేంకటపతియే ఫలము"<br>
అనేక యాగ ,తపః , జపం, హోమం, దాన ఫలితం వలన సిద్ధించే సాకార బ్రహ్మము యొక్క దర్శనం ..మీరు నామః స్మరణతో..<br>
మనః వాచా కర్మలతో శ్రీవేంకటేశ్వర డే నాకు రక్ష అని నమ్మి...<br>
అన్యధా పాదశరణం ...రక్ష రక్ష శ్రీ వేంకటేశ్వర...మీరే నా పెన్నిధి భావించి ఆ స్వామిని ఆశ్రయించితే...నీకు సకల విధ ఫలితము అనుగ్రహించి...మీకు కైవల్యం ప్రసాదించు తారని...ఈ కీర్తన భావం....<br>
చూశారా కీర్తన చిన్నదిగా వున్ననూ భావన ఎంత సమగ్రముగా వున్నదో...<br>
కనుక మనమందరం సదా వేంకటేశం స్మరామి స్మరామి...<br>
గోవింద గోవింద....<br>
ఈ వ్యాసంకు కర్త, కర్మ , క్రియ అంతా ఆ గోవిందుడే...ఇచ్చిన శక్తి...ఆయన పాదపద్మముల సాక్షిగా ఇది ఆయన మాట...<br>
స్వత్కృష గా భావించకుండా..నా అనుభవం ఇది...<br>
గత 3 రోజులుగా వివిధ సందర్భాలలో శోభారాజ్ గారి ఆలాపన ..కీర్తన పల్లవి..ఒకటికి రెండుసార్లు గుర్తుకు రావటం...వినటం జరిగింది...అది మెలుకువ తో వున్నప్పుడే కాక నిద్రలో కూడా కలలో ఈ కీర్తన ఆలాపన కలలో కూడా కనపడింది... స్వామి వారి చరణాలు ఫోటో నాకు దర్శనం...దానితో స్వామి వారు...ఈ నాలుగు మాటలు వ్రాయమనే ఆనతిగా భావించి...ఈ వివరణ సిద్ధం చేశాను.<br>
నేను సహజంగా ఒక్కసారే వ్రాస్తాను...వ్రాయటం... దిద్దుబాటు..లాంటివి వుండదు..<br>
స్వామి పాదరక్షగా భావిస్తూ...ఆయన నా మనః ఫలకం పై ఉదయించే అక్షరాలు టైపు చేయటం ...<br>
కనుక మీ అభినందనలు అన్నీ...<br>
ఆ విరాట్ పురుషుని పాద పద్మములకే....<br>
ఈ వ్యాసం వ్రాయగలిగాను అంటే...<br>
మా నాన్నగారు కీ.శే. శ్రీ ఆలపాటి పాండురంగారావు గారు నాకు ప్రసాదించిన అక్షర బిక్ష...<br>
వారి పాద పద్మములు నేను సదా శరణు.<br>
గోవింద..గోవింద..గోవింద...<br>
ఆలపాటి రమేష్ బాబు<br>
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో...<br>
విజయవాడ.<br>
<a href="tel:9440172262">94401 72262</a>.<br><br><br><br><br><br></p>Alapati Ramesh Babuhttp://www.blogger.com/profile/10902788241134698143noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2337893138436064619.post-34014210941007596672021-07-14T22:20:00.001+05:302021-07-14T22:20:00.730+05:30ఆముక్తమూల్యద<p dir="ltr">ఆముక్తమాల్యద<br>
అముక్తమాల్యద అనే తెలుగు పద్య కావ్యం రచించిన వారు సాహితి సమరాంగణ సార్వభౌముడు , ఆంధ్రభోజుడు అయిన శ్రీకృష్ణదేవరాయలు వారు.<br>
శ్రీకృష్ణదేవరాయలు జన్మతః తుళు ప్రాంతంలో కన్నడిగుడైననూ మన తెలుగు వారు ఆయననూ స్వంతం చేసుకున్నంతగా మరి, ఏ ఇతర రాజుని చేసుకోలేదు...ఆయన జీవితం జీవనం అనేకానేక కాల్పనిక మహమహిమాన్విత ఘట్టాలతో కూడి వుంటుంది.<br>
ఆయన రాజ్యవిస్తరణ , పరిపాలన దక్షత , కార్యశూరత్వ కారణంగా విజయనగరసామాజ్యం అరేబియా మహసముద్ర తీరం నుంచి అనగా మంగళూరు , గోవా, కర్నాటక ,తమిళనాడులో చాలాభాగం నుంచి ఉత్తరాది న కటకం వరకు అనగా నేటి ఒడియాలోని కటక్ వరకూ విస్తరించినది. ఇది ఓక పార్శ్వం అయితే వీరిలో ఇంకొక కోణం వీరు బహుభాషా కోవిదులు , సాహితి అభిమానులు. అందువల్లనే వీరి నిండు పేరలోగం (ఇది అచ్చ తెలుగు పదం దీని అర్ధం సకల విభాగాలతో నిండి వున్న రాజసభ) ని భువనవిజయం అని పిలిచేవారు...ఈ భువనవిజయంలో సాహిత్యం పాలు ఎక్కువగా వుండేది కారణం వీరి సభలో వున్న అష్టదిగ్గజ కవులను వీరు ఆదరించారు. అల్లసాని పెద్దన , నందితిమ్మన , మాదయగారి మల్లన , తెనాలి రామక్రిష్ణుడు , ధూర్జటి , రామరాజభూషణుడు , అయ్యలరాజు రామభద్రుడు ఇలా అనేక మంది కవులను వీరి కొలువులో వున్నారు. వీరే కాదు అపర శంకరులని పిలిచే అప్పయ్య దీక్షితులు కూడాను.<br>
శ్రీకృష్ణదేవరాయలు వైష్ణవులు .అయననూ వీరు నంది తిమ్మన , ధూర్జటి లాంటి శైవులను ఆదరించాడు. తెనాలి రామక్రిష్ణుడు వ్రాసిన ఉద్భటరాద్యుని చరిత్ర అనే కావ్యంని కూడా ఆదరించారు. ఇది శైవ కావ్యం. అలాగే వీరు హంపిలోని విరుపాక్షుని కూడా కొలచారు. కాని వీరి ఆరాధ్య దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారు.<br>
ఇక వీరు తెలుగులో వ్రాసిన ప్రభంద కావ్యం ఆముక్తమాల్యద అనే గ్రంధం.<br>
ప్రబంధం అంటే చిక్కటి వర్ణనలతో కూడినది అని అర్ధం. అలాగే ప్రబంధానికి 18 రకాల లక్షణాలు వుండాలి. ఇన్ని వున్నవి కాబట్టే ఇది ప్రబంధం కాగలిగినది.<br>
శ్రీకృష్ణదేవరాయలు వైష్ణవ భక్తుడు కనుక విష్ణు భక్తుల కధలు వ్రాసినాడు . <br>
శ్రీకృష్ణదేవరాయలు గజపతులతో యుద్ధ యాత్రలో భాగంగా విజయవాడ సమిపంలో క్రిష్ణా నదితీరములో గల శ్రీకాకుళ ఆంధ్ర మహవిష్ణువుని దర్శించిన సమయంలో ఆయన రాయలవారికి స్వష్నములో తన కధ వ్రాయమని ఆదేశించారని వాడుక. ఈ దేవాలయం నేటికిని ప్రతివారు దర్శించవచ్చు.<br>
ఆముక్తమూల్యద అనేది గోదాదేవికధ. దీనినే విష్ణుచిత్తీయం గా కూడా వాడుక.<br>
ఆముక్తమాల్యద నాయక గోదాదేవి. <br>
ఆముక్తమూల్యద అంటే ధరించి విడిచిన పూలమాలను సమర్పణ చేయునది అని అర్ధం. అందుకనే గోదాదేవి ని తమిళంలో చూడి కొడుత్త నాచ్చియార్ అంటారు.<br>
ఇక కధ ఏమిటో క్లుప్తంగా చూద్దాం.<br>
విష్ణుచిత్తుడు శ్రీవల్లిపుత్తూరులోని మన్నారు స్వామి ఆర్చకుడు. పన్నిద్దరు ఆళ్వార్ లలో ఓకడు. ఆళ్వార్ లు వైష్ణవ భక్తాగ్రేసులు. వీరికి తులసి వనంలో ఓక బాలిక లభిస్తుంది ఆమేకు గోదాదేవి అనేపేరుతో పెంచుకుంటాడు. ఆమే యుక్తవయస్సుకు వస్తూంది , గోదాదేవి స్వామి వారికోసం సిద్ధం చేసిన పూలమాలలను తాను ధరించి చూసి మురిసిపోయి మరలా అవే మాలలను స్వామికి సమర్పణ చేసేది.<br>
గోదాదేవి భూదేవి అంశ. ఈమే గత జన్మలో తాను కృష్ణుని పట్ట మహిషిలలో ఓకరుగా స్పురణకి వస్తుంది. దానితో విష్ణువు నందు విపరీతమైన అనురాగ పూరితంగా వుంటుంది. ఆమే ఆప్రాంతంనకు సమీపంలోని శ్రీరంగంలోని శ్రీరంగేశుని తన భర్తగా భావించి శ్రీరంగం తరలి వెళ్ళి స్వామి వారి ఆనుగ్రహ పాత్రురాలై స్వామి వారిలో ఐక్యం అవుతుంది. గోదా శ్రీరంగేశుల కళ్యాణం వరకూ ఈ ఆముక్తమూల్యద కావ్యం వుంటుంది.<br>
రాయలు వారు ఎంతో నేర్పుతో ఈ కావ్యంనకు "ఆముక్తమూల్యద" అనే పేరు పెట్టినారు . నాయక లక్షణం , కావ్య స్వభావం దీనిలోనే అన్యాపదేశంగా చెప్పారు.<br>
ముక్తం అనగా స్వీకరణ , ఆముక్తం అనగా తిరిగి ఇచ్చుట , మాల్యద అనగా పూలమాల ధరించుట. కనుక ధరించిన పూల మాల తిరిగి ఇచ్చుట.<br>
గోదా దేవి భూదేవి అంశ అని ఉదహరించారు అని మీకు ఇంతకు ముందే తెలిపినాను. భూమికి గల విశేష లక్షణాలు సహనశీలత తో పాటు తనలో నిక్షిప్తం చేసిన ప్రతి విత్తనం నకు పలు రెట్లు ఫలసాయ రూపంలో తిరిగి ఇస్తుంది.<br>
శ్రీమన్నారాయుణ అంశలో భాగమైన సూర్యుడు స్థిరముగా తన ఉష్ణ ప్రభావం చేత భూమిపై అనంతమైన వెలుగు , వేడిని ప్రసాదించు తున్నాడు. భూమి స్ధిరంగా గల సూర్యుని చుట్టు గల భ్రమణ పరిభ్రమణాలతో పాటు సంవత్సరం నకు రెండుసార్లు తన భ్రమణ దిశను మార్పులు అనే విశేషాంశల వలన మనకు ఋతువులు , కాలాలు ఏర్పడి సాధారణ వ్యక్తుల జీవనం జరుగుతున్నాయు. భూమిలో వివిధ రకాల పంటలు పండుతున్నాయు. గోదాదేవి భూదేవి అంశ గనుక వనంలో ప్రకృతి సిద్ధంగా తనకు లభించిన పూలను పూలమాలలను తాను ధరించి మరలా స్వామి కి ఇవ్వటంలోని అంతరార్ధం తనకు లభించిన ప్రేమ భావనను స్వీకరించుట. వధువు మెడపై పూలమాల వేయుట ద్వారా వరుడు వధూ స్వీకారం , వధువు పూలమాలను స్వీకరించి ధరించుతూ వరునకు పూలమాల వేయుట ద్వారా వర స్వీకారం జరుగుతుంది తద్వారా వారు జీవన గమనం సాగిస్తారు. కాని గోదాదేవి భూ అంశ కనుక శ్రీమన్నారాయణుని కృపచే లభించిన పూలమాల రూప ప్రేమను స్వీకరించి మరలా తనకు గల భూ అంశ అయిన విశేషాంశ అయిన పలురెట్లు గుణింపు చెసి ఇచ్చె గుణమైన దాని వలన ఆప్రేమను పలురెట్లుగా స్వామి కి తిరిగి సమర్పించినదని దీని భావం. అందువల్లనే గోదాదేవి అచంచలమైన భక్తి ప్రేమలతో శ్రీరంగేశుని భర్తగా పొందినది.<br>
సూర్యుని వలన ఋతువులు ఏర్పడుతాయని తమకు తెలిసినదే కదా...<br>
గోదాదేవి భూ అంశ , శ్రీమన్నారాయణుడు సూర్య అంశ వీరి ఇరువురి మధ్యగల ప్రేమోత్పన్నం ఋతువులు.. ఈ ఋతువర్ణనం ఆముక్తమూల్యద కావ్యంలో బహు విశేషంగా వుంటుంది.<br>
అసలే రాయలు వారు అల్లసాని వారి కృతి అయిన మనుచరిత్ర కు కృతిపతి...మరి ఆయన ప్రభావం వీరిపై లేకుండా వుంటుందా...అయునా వీరి శైలి వీరిదే....<br>
ఆముక్తమూల్యద ఏడు ఆశ్వాసములు గల కావ్యం.<br>
అది ఈ విధముగా వుంటుంది.<br>
<u>గ్రంథస్త విషయ క్రమము</u><br>
1 ఆశ్వాసము (ఆ) - విలుబుత్తూరు వర్ణనము, భాగవతులు, విష్ణుచిత్తుడు గురుంచి వర్ణన.<br>
2 ఆ. - మధురాపుర వర్ణనము, మత్స్యధ్వజుడు గురుంచి, గ్రీష్మఋతు వర్ణన.<br>
3 ఆ. - విష్ణుచిత్తవాదము, ఖాండిక్యకేశిధ్వజసంవాదము.<br>
4 ఆ. - విష్ణుచిత్తుని విజయము, విష్ణుచిత్తునకు భగవంతుడు సాక్షాత్కరించుట, విష్ణుచిత్తుని స్వపుర ప్రవేశము, యమునాచార్య చరిత్రము, వర్షాకాలము, శరదృతువర్ణనము, యామున ప్రభువు, యామున ప్రభురాజనీతి.</p>
<p dir="ltr">5 ఆ. - గోదాదేవి, వసంతఋతువర్ణనము.</p>
<p dir="ltr">6 ఆ. - మాలదాసరి.<br>
7 ఆ. - బ్రహ్మరాక్షస వృత్తాంతము, గోదాదేవి శ్రీరంగమున రంగనాధుని సేవించుట, గోదాదేవీ రంగనాధుల వివాహము.<br>
గోదా పరిణయ కధతో పాటు ఉప కధలుగా ఖాండిఖ్య కేశి ధ్వజుని కధ , మాల దాసరి కధ. ఇందు మాల దాసరి కధ ప్రశంశ పూర్వకమైన కధ. నిర్మల భక్తికి సోదాహరణ. ఈ మాల దాసరి కధ విషయమై ఈనాటికి చర్చలు ఆగలేదంటే అతిశయోక్తి కాదు.<br>
వైష్ణవుడైన రాయలు వారు తనకావ్యమైన ఆముక్తమూల్యద ను విష్ణుభక్తుల కధగా వర్ణించటానికే ఇష్టపడ్డారు. అందుకే చూడండి గోదాదేవి తండ్రిపేరు విష్ణుచిత్తుడు. విష్ణువును మనస్సు నందు నిలిపినవాడు అని దీని అర్ధం. వీరినే తమిళంలో తొండరప్పొడి ఆళ్వార్ అని పిలుస్తారు.<br>
అలాగే ఈ కావ్యంలోని ఖాండిఖ్య కేశిధ్వజుల గురించి కొంత పరిశీలన చేద్దాం.</p>
<p dir="ltr">పూర్వం ఇద్దరు రాజులు యుద్ధానికి దిగారు. ఓడిన రాజు తన రాజ్యాన్ని వీడి, అడవుల్లోకి పారిపోయాడు. అక్కడే ఆధ్యాత్మిక చింతనతో కాలం గడుపుతున్నాడు. <br>
గెలిచిన రాజు ఆ ఉత్సాహంతో యజ్ఞం తలపెట్టాడు. అనుకోకుండా, అక్కడ యాగధేనువు మరణించింది. అది అశుభ సూచన. యజ్ఞాన్ని ఎలా పూర్తిచేయాలో తెలియక ఆ రాజు తికమక పడ్డాడు. <br>
నగర పురోహితుల్ని సంప్రతిస్తే- ఆ ధర్మసూక్ష్మం తెలిసినవాడు ఓడిపోయిన రాజేనని తేలింది. ధర్మసంకటం నుంచి గట్టెక్కించగలవాడు ఆయనేనని నిశ్చయమైంది.</p>
<p dir="ltr">గెలిచిన రాజు ఏమాత్రం సందేహించకుండా ఓడిన రాజు వద్దకు వెళ్లి, యజ్ఞాన్ని పరిపూర్తి చేయాలని అర్థించాడు. ఆయనా ఏ శషభిషలకూ తావు లేకుండా ధర్మనిర్ణయం కోసం ముందుకొచ్చాడు. శత్రువుకు సహకరించాడు.<br>
ఆ ఇద్దరు రాజులూ ఆర్షధర్మ నిర్వహణ విషయంలో అహంకారాల్ని త్యజించారు. <br>
వారి కథే- శ్రీకృష్ణదేవరాయల ‘ఆముక్తమాల్యద’లోని ‘ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం’ సారాంశం. సమాజం అనే ధర్మసౌధం పటిష్ఠంగా నిలిచేందుకు భారతీయ ప్రాచీన సాహిత్యం ఎంతగా తోడ్పడిందో <br>
ఈ ఉదాహరణ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. <br>
ఈ కథలో ఓడిన రాజు ఖాండిక్యుడు; గెలిచినవాడు కేశిధ్వజుడు. <br>
కథ చివర గొప్ప మలుపు ఒకటుంది.</p>
<p dir="ltr">తన యజ్ఞ సంపూర్తికి సహకరించిన ఖాండిక్యుడికి గురుదక్షిణగా ఏది కావాలన్నా ఇస్తానని కేశిధ్వజుడు ప్రకటిస్తాడు. అది సంప్రదాయం. ఓడిన రాజుకు ఓర్మి ఎంత ప్రధానమో- గెలిచిన రాజుకు సంయమనం, ధర్మ సంప్రదాయ పరిరక్షణ అంతే అవసరం. <br>
ఈ అవకాశాన్ని చేజిక్కించుకున్న ఖాండిక్యుడు తాను కోల్పోయిన రాజ్యం తిరిగి గురుదక్షిణగా కావాలన్నా ఇచ్చేయడానికి కేశిధ్వజుడు సిద్ధపడతాడు. <br>
ఇక్కడే ఓ చిత్రం చోటుచేసుకుంటుంది. <br>
రాజ్యసంపద అయాచితంగా వచ్చిపడుతున్నా ఖాండిక్యుడు కాదంటాడు! తనకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించాలని, అదే కేశిధ్వజుడి నుంచి తాను కోరుకునే గురుదక్షిణ అని ప్రకటిస్తాడు.</p>
<p dir="ltr">ఖాండిక్యుడి నిర్ణయం కేశిధ్వజుణ్ని విస్మయానికి గురిచేస్తుంది. <br>
ఆయన ఆలోచన ఏమిటో తెలుసుకోవాలని అనిపిస్తుంది. అప్పుడు ఖాండిక్యుడు అంటాడు- ‘రాజ్యభోగాలు కేవలం భౌతిక సంపదలు. వాటిని కష్టంతో, శారీరక శ్రమతో సాధించుకోవాలి. అంతేగాని, అవి అయాచితంగా లభించాలని కోరుకోకూడదు. కష్టపడి సాధిస్తేనే, వాటి విలువ తెలుస్తుంది. నా కంటే బలవంతుడి చేతిలో ఓడిపోయాను. అందులో సిగ్గు పడాల్సింది ఏముంటుంది? తిరిగి పుంజుకొని ధర్మమార్గంలో, క్షాత్రంతో నా రాజ్యాన్ని నేను తిరిగి చేజిక్కించుకోవాలి. <br>
అది ఒప్పుతుంది గాని, దొడ్డిదారిన పొందితే పాపమవుతుంది’ అని బదులిస్తాడు ఖాండిక్యుడు!</p>
<p dir="ltr">ఇలాంటి కథల్ని పిల్లలకు పాఠ్యాంశాలుగా నిర్ణయిస్తే, వారి బాల్యాన్ని అవి ధార్మిక పథంలోకి నడిపిస్తాయి. వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయి. ఉచితాల కోసం తాపత్రయపడకుండా ఆపుతాయి. ఉచితానుచిత జ్ఞానాన్ని వారికి అలవరుస్తాయి.</p>
<p dir="ltr">ఆముక్తమాల్యదలోని ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం- ఆ కావ్యానికి గుండెకాయ వంటిదని ప్రశస్తి రావడానికి ముఖ్య కారణాలేమిటి? ఆ కథలోని ధార్మిక నేపథ్యం, ప్రబోధ గుణం. <br>
గెలుపు ఓటముల విషయంలో, కర్తవ్య నిర్వహణలో, అయాచిత అవకాశాల తిరస్కరణలో ప్రతిఫలించిన ధర్మస్వరూపమే- భారతీయతకు వన్నెలద్దుతూ వచ్చింది.</p>
<p dir="ltr">లోకంలో ఇలాంటి కథలు ఒళ్లు మరిపించడమే కాదు, <br>
కళ్లు తెరుచుకొనేలా చేస్తాయి. దీనికి మన ప్రాచీన సాహిత్యమే గొప్ప ఆదరువు.<br>
రాయలు వారి కావ్యం పై వ్యాఖ్యలు చేసే స్థాయి కాకపోయినా ఈ నాటి ప్రజలకు, యువతకు కొంత అయునా ఆముక్తమూల్యద గురించి తెలపాలనేది నా ప్రయత్నం.<br>
ఇంతేకాక ఆధ్యాత్మిక కోణంలో గోదాదేవి భూఅంశ గా ఉదహరించారు...అనగా పాంచభౌతిక శరిరాలతో జన్మించిన ప్రతి ఓక్కరు భూ అంశయే గదా...కాని సాధారణ మానవులు విషయ లంపటులై, సాంసారిక , వస్తు వ్యామోహలు దుర్గుణ పీడితులై జనన మరణ చక్రంలోనే ఇమిడి పోతున్నారు...కాని భగవత్ కృప వలన లభించిన ఈ జన్మలో ప్రేమ అనురాగం నమ్మకం అనే పూలదండను సేకరించి , స్వీకరించి , ధరించి వాటి మధురిమను భగవంతునికి అందించే ప్రయత్నం మరలా స్వామికి ధరింపచేయటం...తద్వారా ముక్తి...గోదా కళ్యాణం అంటే సాధారణ వివాహమా కాదే...భగవంతుడు భక్తుడు ఆత్మీయ కలయుక , ముక్తి సంగమమే కళ్యాణం...సాధారణ మనుజుడు సర్వజీవుల పట్ల దయ ప్రేమ తో పాటు ఆ నారాయణుని దర్శించాలనే అంతర్లీన అభిలాష....<br>
నా ప్రయత్నం నచ్చిన తెలుపగలరు.<br>
కృతజ్ఞతతో<br>
మీ<br>
ఆలపాటి రమేష్ బాబు.<br>
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో<br>
విజయవాడ.<br>
<a href="tel:9440172262">9440172262</a>.<br><br><br><br><br><br><br></p>Alapati Ramesh Babuhttp://www.blogger.com/profile/10902788241134698143noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2337893138436064619.post-28566177807267299832021-06-30T21:24:00.001+05:302021-06-30T21:24:05.743+05:30మధురాపురి సదన విశేషార్ధములు<p dir="ltr">మధురాపురి సదన<br>
మృదువదన మధుసూదన…<br>
ఇహ స్వాగతం కృష్ణా… శరణాగతం కృష్ణా</p>
<p dir="ltr">మధురాపురి సదన<br>
మృదువదన మధుసూదన…<br>
ఇహ స్వాగతం కృష్ణా… శరణాగతం కృష్ణా</p>
<p dir="ltr">మధురాపురి సదన<br>
మృదువదన మధుసూదన…<br>
ఇహ స్వాగతం కృష్ణా… శరణాగతం కృష్ణా</p>
<p dir="ltr">మధురాపురి సదన<br>
మృదు వదన మధుసూదన…<br>
ఇహ స్వాగతం కృష్ణా… కృష్ణా… ఆ ఆ</p>
<p dir="ltr">ముష్టికాసూర చాణూర మల్ల<br>
మల్లవిశారథ మధుసూదన…<br>
ముష్టికాసూర చాణూర మల్ల<br>
మల్లవిశారథ మధుసూదన…</p>
<p dir="ltr">ముష్టికాసూర చాణూర మల్ల<br>
మల్లవిశారథ కువలయపీడన…</p>
<p dir="ltr">మర్దన కాళింగ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ దేవ…<br>
మర్దన కాళింగ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ దేవ…</p>
<p dir="ltr">శిష్ట జనపాల సంకల్పకల్ప… కల్పశతకోటి అసమపరాభవ<br>
శిష్ట జనపాల సంకల్పకల్ప… కల్పశతకోటి అసమపరాభవ</p>
<p dir="ltr">ధీర మునిజన విహర మదన సుకుమార దైత్య సంహార దేవా…<br>
ధీర మునిజన విహర మదన సుకుమార దైత్య సంహార దేవా…</p>
<p dir="ltr">మధుర మధురరతి సాహస సాహస<br>
వ్రజ యువతీజనమానసపూజిత…<br>
మధుర మధురరతి సాహస సాహస<br>
వ్రజ యువతీజనమానసపూజిత…</p>
<p dir="ltr">స ద ప గ రి… పగరిసదస<br>
స రి గ ప ద స ద ప గ రి పగరిసదస…</p>
<p dir="ltr">స స రి రి గ గ పద స స<br>
ద ప ప గ రి రి<br>
ప గ రి స ద స…</p>
<p dir="ltr">సరిగ రిగప గపదస ద ప గ రి పగరిసదస…</p>
<p dir="ltr">తత్తిక్ తకజను, తత్తిక్ తకజను<br>
తక్ తకజను తోం…<br>
స ద ప గ రి<br>
ప గ రి స ద స…<br>
తత్తిక్ తకజను, తత్తిక్ తకజను<br>
తక్ తకజను తోం…<br>
స ద ప గ రి<br>
ప గ రి స ద స…</p>
<p dir="ltr">తకతరి కుకుతన కిట తకధీం… ||8||</p>
<p dir="ltr">కృష్ణా… ఆ ఆ ఆ<br>
**************<br>
బహుశా ఈ కీర్తన విన్న ఈనాటి యువతరానికి పవన్ కళ్యాణ్ సినిమా లో పాట గా జ్ఞాపకం వుంటుంది... కాని అది మనసునుంచి చెరిపి...<br>
ఓక్కసారి ఈ క్రింద విశేషాలు చదవండి...<br>
ఈ కీర్తన రచించిన వారు ఊతుకాడు వెంకట సుబ్బయ్యర్. వీరి జీవన కాలం <a href="tel:17001765">1700 - 1765</a> వరకు. వీరు సంస్కృతంలో అసమాన పండితులు....వీరు సంస్కృతంలో , మరాఠి (ఆనాటి ఆప్రాంత రాజ భాష) , మాతృభాష తమిళంలో ఎన్నో కీర్తనలు రచించారు...ప్రస్తుతం వీటిల్లో ఓక 500 కీర్తనలు లభ్యం.<br>
వీరు వీరి గురువు గారి వద్ద పూర్తిగా సంగీతం నేర్చుకున్న తరువాత... నాయన నాకు తెలిసిన సంగీతం అంతా నీకు నేర్పినాను అని తెలుపగా... వీరు తదనంతర గురువు కృష్ణం వందే జగద్గురుం అన్న నానుడితో కృష్ణుని గురువుగా స్వీకరించి అనేక కీర్తనలను కృష్ణుని పై రచన చేశారు.<br>
వీరి కీర్తన " అలై పాయిదే కన్నా ఆనంద మోహన అలై పాయిదే కన్నా" కానడ రాగంలో స్వర పరిచిన ఈ తమిళ కీర్తన జగద్విదితం...ప్రతి తమిళుడు ఈ కీర్తన ను వారి పిల్లల బాల్య వేడుకలలో పాడతారు...<br>
ఇక ప్రస్తుత కీర్తన మోహనరాగంలో సంస్కృతంలోనిది...<br>
ఈ కీర్తన స్వభావం పల్లవి , అనుపల్లవి (సినిమాలో ఇవ్వలేదు నిడివి పెరుగుతుంది మరియి కొన్ని క్లిష్ట పదాలు మరియి సినిమా స్వభావం నకు సరిపోక) , చరణం , థిల్లాన చివరకూ మరలా పల్లవితో ముగుస్తుంది....<br>
ఇక కీర్తన విశేషానికి వస్తే <br>
ఈ కీర్తన స్వభావం... కష్టంలో సమస్యలలో వున్న వారిని కాపాడటానికి క్రిష్ణుడు ఏ విధంగా వస్తారో వివరణ. కంసుని పాలనలో కష్టాలు పడుతున్న ప్రజలు కృష్ణనికి స్వాగతం పలకటం ఈ కీర్తన లో కనపడుతుంది... మధుర ప్రజలకు గోకులంలో కృష్ణుని లీలా వైభవాలు , పూతన , శకటాసుర , తృణావర్త మొదలగు రాక్షస నిర్మూలన కాళింగ నర్తన , గోవర్ధన ధారణ , గో , గోపాలక , గోపికా జన రక్షణ గురించి తెలుసుకున్న ప్రజలు కృష్ణుని స్వాగత వర్ణన ఈ కీర్తన లో మనం గమనించ వచ్చు.<br>
అసలు ఈ కీర్తన ఎత్తుగడే ఓక గమ్మత్తు...మధురాపురి సదన...ఈ పదం వరకు అర్ధం మధురకు వేంచేస్తున్న క్రిష్ణా నీకు స్వాగతం...అని...కాని ఛాయమాత్రంగా అనాటి ప్రజల దుస్థితి ని ఆ మొదటి పదంలోనే సూచించారు...<br>
మధుర అంటే తేనే...తేనే తీపిదనం , ఔషధగుణాలు కాని ఇదే తేనేలో ఈగ పడితే దానికి విషంగా మారుతుంది.ఇది నాటి ప్రజల స్థితి...కంసుని మధాంధ నిర్భంధ క్రూర పరిపాలన తట్టుకోలేక విలపిస్తున్నవాళ్ళు..మరి గమ్మత్తు చూడండి క్రిష్ణుడు మధురలోనే జననం కాని కొద్ది క్షణాలు కూడా గడవకుండానే వసుదేవుడు యమున ద్వారా గోకులంకి యశోద వద్దకు.. ఇక అక్కడ స్వామి వారి లీలా వైభవం ...ఓహ్ ఆనాటి గోకులం వారికి ఎన్నో ప్రాకృత జన్మ సౌభాగ్యం... ఆయనతో కలసి జీవించి ఆడి పాడి మమేకం అయుపోయారు...క్రిష్ణుడు ,వారు వేరు కాదు ఏకీకృత స్వరూపం అన్న విధంగా తాదాత్మ్యం చెందినారు...<br>
మరి జన్మతః క్రిష్ణుడు మధుర వాసి...<br>
అందులోను దేవకి వసుదేవులు కారాగారంలో...కనుకనే మధుర పునరాగమనం...<br>
చూడండి కాల ప్రభావం...భగవంతుడైననా కాల ప్రభావం తప్పించుకోలేక పోయాడు...నిర్ణిత కాల వ్యవధి బయట<br>
గడిపి సమయ పరిపక్వం అయున తరువాత అవతార లక్ష్యం అయిన కంస నిర్మూలన నిమిత్తం పునరాగమనం... <br>
మరి ఆయన మధుర కు వేంచేసే సమయంలో ఎలా వున్నారు..చూడండి<br>
మృదువదన మధుసూదన...<br>
ఎంతటి భారమైన కర్మ నిమిత్తం వస్తున్ననూ ప్రశాంత వదనం తో వున్నారట...మరి తదనంతర పదం మధుసూదన..<br>
మధు , కైటభులు అనే రాక్షసులను సంహరించారు..అది ఈ సమయంలో ప్రస్తావన...కాని మధుర ప్రజలు అన్యాపదేశంగా కంసనిర్మూలన చేయు స్వామి అని వేడుకోవటం.<br>
అసలు కీలకం అంతా ఏత్తుగడ పదం లోనే వున్నది.<br>
మధు ..దీని మీద కొంత స్వేచ్ఛా వివరణ.<br>
సహజంగా మనం మన మిత్రులను మీ జీవనం ఎలా సాగుతోంది అని ప్రశ్నించితే...వారు బాగుంది.. మధురంగా సాగుతుంది ఆని జనాతిక సమాధానం ఇస్తారు. ఇది సాధారణ జనులకు శాంత స్వభావులకు.<br>
మరి దమన గుణమే ప్రాకృతిక జీవనం కలిగిన మానవులకు , రాక్షస స్వభావులకు,అధికారయుతులకు , ఈ మధురం ఉన్మత్తత ,అహంకారం , కండకావరం ఇత్యాది గుణాలు అలవడుతాయి...కారణం వాళ్ళకు ఏది కావాలంటే అది మాట మాత్రం లభిస్తాయి...దానితో ప్రతిది చులకన గా మారిపోతుంది...వీరి పాలనలో వున్న సాధు జనావళి బాధలు పడుతారు.<br>
తేనె ను మనం మధు అని వాడుక. <br>
మరి ఇదే మధుని భల్లూకాలు త్రావి ఉన్మత్తతో ప్రవర్తించుతాయి. ఈ విషయం రామాయణం వాల్మీకి లో చక్కగా వివరుంచుతాడు. మరి మీకు భల్లూకం అంటే అవగాహన వున్నది వాటి తాలూకు ప్రవర్తన పై అవగాహన వున్నది కదా...<br>
ఇక తదనంతర పదాలు పరిశీలించండి కీర్తనలో...కంసుని కన్నా ముందు ఎవరిని ఏదుర్కోవాలో తెలుపుతున్నారు.<br>
ముష్టికాసురుడు , చాణూరుడు.<br>
ముష్టికుడు పిడిగుద్దులతో ప్రత్యర్దిపై దాడి చేసి సంహరించుతాడు . చాణూరుడు భీతిగొలిపే శరీరంతో విపరీతమైన శక్తితో ప్రత్యర్దిపై దాడి...ఓక విధంగా చెప్పాలి అంటే ప్రత్యర్ధిని పిప్పి చేస్తాడు. చమనం అంటే నములుట...కాని వీడు శక్తితో యుక్తితో పిప్పి చేస్తాడు కాబట్టి వీడికి చాణూరుడు అనే పేరు...వీరిద్దరిని క్రిష్ణుడు సంహరించుతాడు.<br>
కువలయపీడన...కువలయం కంసుని భద్రగజం...కాని ఇది మదగజం...దీని<br>
వలన అందరూ ఇబ్బంది ...కంసునకు వినోదం. ఏనుగుకు చిక్కిన ప్రజలను తన తొండంతో గిరగిరా త్రిప్పి నేలకేసి కొట్టి చంపుతుంది .దీనిని కూడా క్రిష్ణుడు ముష్టిఘూతాలతో లొంగదీసు కుంటాడు...<br>
తదుపరి చరణం<br>
మర్దన కాళింగ నర్తన...ఇది భగవస్తుతి...నాయనా క్రిష్ణ! విషం చిమ్మే కాళీయుని మదమణచి గోకులాన్ని రక్షించావు..స్వజనం పైనే విషం చిమ్ముతున్న కంసుని మదమణచవా దేవా..మరి కంసుడు స్వజనం స్వబంధువర్గం...తండ్రిని , సోదరిని బావని<br>
ఖైదు చేశాడు...<br>
తదుపరి చరణం...మకుటాయమాన చరణం అసలు అద్భుత చరణం...<br>
ఓకసారి పరిశీలించుదాము..<br>
ఈ చరణానికి లోని పదప్రయోగానికి ఊతుకాడు వెంకటకవి గారికి సాష్టాంగ దండ ప్రమాణాలు...<br>
"శిష్టజనపాల సంకల్ప కల్ప కల్ప శతకోటి అసమపరాభవ"<br>
సహజంగా కల్ప అనే శబ్దం మూడు సార్లు పునరుక్తం అవుతుంది...మొదటది సంకల్ప, కల్ప , కల్ప శతకోటి ..<br>
ఈ మూడు శబ్దాలకి వేరు వేరు అర్ధం.. కాని ఓకే శబ్దంతో గుదిగుచ్చాడు...<br>
మొదటి శబ్దమైన సంకల్ప కి అర్ధం సాధారణమైనదే సంకల్పం అనగా డిటర్మినేషన్...( తెలుగు పదానికి ఇంగ్లీషు అర్ధం)<br>
రెండోవ శబ్దం కల్ప...దీని అర్ధం క్రియ , ఓక కార్యము , ఓక పోరాటం<br>
మూడవ కల్ప కి అర్ధం...కాల గణన , సంఖ్యా గణన...కల్పం అనగా..బ్రహ్మకు ఓక పగలు కాలం అనగా 432 కోట్ల మానవ సంవత్సరాలు...<br>
ఇప్పుడు మీరు పూర్తి వివరణ తెలుసుకొందురు...<br>
భగవంతుడు భక్తులను , సాధుజన రక్షణ సంకల్పుడైతే తనపోరాటం కల్ప పరిధి అయునా చేస్తాడు అని తెలుపుతున్నాడు..అయుతే ఈ బ్రహ్మ కల్పాలు , పోరాటాలు ఏన్నో తెలుసా శతకోటి అనగా వందకోట్లు ..<br>
అనగా భక్త జన రక్షణకు అన్నీ కాలాలో , అన్నీ మార్గాలలో , అన్నీ విధాలుగా సిద్ధమై వుంటాడు అని తెలపటమే...<br>
తరువాత రెండు చరణాలు భగవస్తుతి...<br>
మిత్రులు చదివిన తరువాత తమరి రిప్లై లని మరువక తెలపండి...<br>
ఆలపాటి రమేష్ బాబు.<br>
<a href="tel:9440172262">9440172262</a>.<br><br><br><br><br><br><br></p>Alapati Ramesh Babuhttp://www.blogger.com/profile/10902788241134698143noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2337893138436064619.post-46695406124395929442021-06-30T21:15:00.001+05:302021-06-30T21:15:59.390+05:30గరుడ గమన విశేషార్ధం<p dir="ltr"><br>
గరుడ గమన తవ చరణకమలమిహ<br>
మనసి లసతు మమ నిత్యం ( 2)</p>
<p dir="ltr">మనసి లసతు మమ నిత్యం !!</p>
<p dir="ltr">మమతాపమపాకురుదేవ<br>
మమపాపమపాకురుదేవ (2)</p>
<p dir="ltr">జలజనయన విధినముచిహరణముఖ<br>
విబుధవినుత-పదపద్మ (2)</p>
<p dir="ltr">విబుధవినుత-పదపద్మ</p>
<p dir="ltr">మమతాపమపాకురుదేవ<br>
మమపాపమపాకురుదేవ (2)</p>
<p dir="ltr">భుజగశయన భవ మదనజనక మమ<br>
జననమరణ-భయహార (2)</p>
<p dir="ltr">జననమరణ-భయహార<br></p>
<p dir="ltr">మమతాపమపాకురుదేవ<br>
మమపాపమపాకురుదేవ (2).</p>
<p dir="ltr">శంఖచక్రధర దుష్టదైత్యహర<br>
సర్వలోక-శరణ ( 2)</p>
<p dir="ltr">సర్వలోక-శరణ</p>
<p dir="ltr">మమతాపమపాకురుదేవ<br>
మమపాపమపాకురుదేవ (2)</p>
<p dir="ltr">అగణిత గుణగణ అశరణశరణద<br>
విదళిత-సురరిపుజాల ( 2)</p>
<p dir="ltr">విదళిత-సురరిపుజాల</p>
<p dir="ltr">మమతాపమపాకురుదేవ<br>
మమపాపమపాకురుదేవ (2)</p>
<p dir="ltr">భక్తవర్యమిహ భూరికరుణయా<br>
పాహి భారతీ తీర్థం ( 2)</p>
<p dir="ltr">పాహి భారతీ తీర్థం</p>
<p dir="ltr">మమతాపమపాకురుదేవ<br>
మమపాపమపాకురుదేవ (2)</p>
<p dir="ltr">గరుడ గమన తవ చరణకమలమిహ<br>
మనసి లసతు మమ నిత్యం2)</p>
<p dir="ltr">మనసి లసతు మమ నిత్యం !!</p>
<p dir="ltr">మమతాపమపాకురుదేవ<br>
మమపాపమపాకురుదేవ (2)</p>
<p dir="ltr">మమపాపమపాకురుదేవ<br>
మమపాపమపాకురుదేవ…</p>
<p dir="ltr">సహజంగా భగవన్నామాన్ని అనేక విధాలుగా ప్రస్తుతించటమే స్తోత్రం... స్తుతి గా పిలువ బడుతుంది.<br>
కాకపోతే కొన్ని స్తోత్రములకు ప్రత్యేక లక్షణం కలవిగా , ప్రత్యేక పర్వ దినములలో , ప్రత్యేక పూజ విధానాలలో స్తుతించేవిగా వుంటాయి. కాని మీరు గమనించితే ఆ ఆయా స్తోత్రాల ప్రారంభ , గమన మరియు చివరి నందు స్వామి వారి వైభవం ను కొన్ని ప్రత్యేక పద సంచయంతోను , విశేష నామ ,గుణ ,రూప , యశో ,లీలా వైభవాలను ప్రస్తుతించుతారు....<br>
చాలామంది అవి ఏందుకో విచారణ చేయకనే భగవన్నామ సంకీర్తన గావించి ధన్యులు అవుతారు.<br>
భగవన్నామాన్ని దివ్యాఔషధిగా చెపుతారు. శరీర అసౌకర్యంనకు మనం ఔషధం స్వీకరిస్తాం. ఆ ఔషధం మీరు తయారు చేసినారా లేదే మీ వలన లభించినదా లేదే...కాని సిద్ధపరచి వున్న ఔషధంను స్వీకరిస్తే వెంఠనే శరీర బాధ నివారణ జరుగుతుంది. అలాగే భగవన్నామము అనే దివ్య ఔషధం జీవన తరుణోపాయం , జీవన్ముక్తిని ప్రసాదించుతుంది. ఇంకొద్దిగా మీకు వివరించు దామనే ప్రయత్నం...<br>
రావణ సంహర నిమిత్తం శ్రీమన్నారాయణుడు శ్రీరామునిగా అవతార ధారణ అన్న రహస్యం నారదుల వారికి తెలిసినది. దేవ రహస్యం బయట పెట్టరాదు.. కాని చెప్పనిదే కుదిరిచావదు...అందుకే భూలోకం వచ్చి ఏవరు లేని ఏకాంత ప్రదేశంలో వున్న పుట్టలో దేవ రహస్యంని యుక్తిగా చెప్పాడు ఏమని..." రావణ సంహరణార్ధం శ్రీమన్నారాయణుడు 'మరా' అవతారం ధరించపోవుచున్నారు...ఆ అవతార మహిమ వలన అనేక జీవరాశులు ముక్తినొందపోవుచున్నారు అని. కాని భగవద్ లీల చూడండి...ఈ పుట్టలో వున్నది రత్నాకరుడు అనే బోయవాడు. ఈ బోయవాడిని పాపకూపం నుంచి రక్షణార్ధం అతనిని పాపమార్గం నుంచి నారదుడే తప్పించుతాడు. రత్నాకరుడు దీనితో భగవన్నామ తపోదీక్షలో వున్నాడు.<br>
మరి రత్నాకరునికి ప్రచ్ఛన్నంగా అయిన భగవన్నామం లభించినది...దానిని ఉపాసించే వాల్మీకి అయినారు ...ఆద్భుత దివ్యగాధ..మానవ...జన్మసాఫల్యత నొసగు రామాయణం ప్రసాదించారు.<br>
మరి కొన్ని ఉదాహరణలు వున్నాయి కాని నేటి వివరణ లక్ష్యానికి దూరం అవుతాము...<br>
గరుడ గమన స్తోత్రం. భక్తకోటికి ప్రసాదించిన వారు శృంగేరి పీఠాధిపతులు ,<br>
జగద్గురు ఆదిశంకరాచార్య పరంపరలోని వారు ఈనాటి పీఠాధిపతులు అయిన శ్రీశ్రీశ్రీ భారతితీర్ధ మహస్వామి వారు.వీరు తెలుగు , తమిళ ,కన్నడ ,హింది మరియు సంస్కృతంలో అపార పండితులు...తపః సంపన్నులు..మరియు..భక్తజన కోటిపై అపార కరుణా సముద్రులు.<br>
ఈ స్తోత్రం ను ఓకసారి పరిశీలించితే...<br>
మొదటి పద్య చరణాలు అయిన గరుడ గమన నుంచి మమ పాపమపాకురు దేవ వరకు తదనంతర ఆరు పద్యాలనంతరం పునరావృతం అవుతుంటాయు. <br>
కనుక ఈ పునరావృత చరణాలను గురించి వివరించటమే ఈ వ్యాస లక్ష్యం.<br>
ఈ మొదటి పద్య చరణాల సాధారణ అర్ధం పరిశీలించితే...<br>
ఓ గరుడ వాహన ! నీ పాద పద్మములపై మా మనస్సు సదా నిలుపునట్టు..<br>
మా తాపాలను , మా పాపాలను ఉపశమింపు దేవా!<br>
మరి ఈ పద్య పాదాలపై శ్రీరాముని దయవలన నా విశేషార్ధం ఆయన పాద పద్మాలతో పాటు మీకు గూడా...<br>
మనిషి జననమే సంచిత ప్రార్బద కర్మలతో జననం ఆన్నది జగద్విదితమే. కాని ఈ లౌకిక జీవన సౌలభ్యాల కోసం అనేక రకాల పోరాటాలు అనేక మార్గాలలో ఆరాటాలు పడుతుంటారు....వీటి వలన చాలా సార్లు కర్మ , ధర్మ విఘాతం జరుగుతునే వుంటాయు. వీటినే మనం పాపం గా పిలుస్తాం. దైనందిన జీవనంలో వైదిక సాంప్రదాయం కాని అనేక క్రియా కర్మ వలన పాప పంకిలం వ్యక్తులను ఆవహిస్తున్నది.<br>
మరి కొంతమంది విపరీత సుఖలాలసకో మరో దానికో చాలా ఎక్కువ హైరానా , ప్రయత్నాలు చేస్తుంటారు...ఆ సమయంలో<br>
మన ఇంటిలోని పెద్దవారు విజ్ఞులు "ఏమిరా! ఎందుకు అంత తాపత్రయం పడిపోతున్నావు. కొద్దిగా నెమ్మది . అయినా భగవదాజ్ఞ లేనిదే జరుగుతుందా అని మనలను హెచ్చరిస్తారు.<br>
మరి పాపం అంటే సాధారణ ప్రజలకి కొంత అవగాహన వున్నది మరి తాపత్రయం అంటే ఏమిటి అనే ప్రశ్న వేసుకుంటే...<br>
తాపం అనగా వేడి. ధాన్యం బియ్యంగా మారాలంటే రోకటిపోటు అవసరం ఇదో రకం తాపం. ఈ బియ్యం అన్నం గా మారాలంటే మరలా వేడి అవసరమే...<br>
అలాగే సంచిత ప్రారబ్దాలు సుకర్మలుగా , దుష్కర్మలుగా మార్పు చెందటం ఓక విధమైన తాపం. ఈ అర్దం వరకు సాధారణ జీవన శైలికి.. మరి అథ్యాత్మిక జీవనంకి<br>
ఈ తాపం అనే దానిని ఏవిధంగా వుంటుంది అనేది పరిశీలించుదాం.<br>
“తాపం” అంటే దుఃఖం; “త్రయం” అంటే మూడు.<br>
త్రివిధ దుఃఖాలనే “తాపత్రయం” అంటారు;<br>
తాపాలు అన్నవి మూడు రకాలుగా ఉంటాయి;<br>
<b>ఆధ్యాత్మిక తాపం:</b><br>
మనలోని కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు అనబడే<br>
అరిషడ్వర్గాల వలన మనకు కలిగే బాధలనే “ఆధ్యాత్మిక తాపాలు” అంటాం;<br>
ప్రతి మనిషికీ ఉండే ఇహలోక బాధల మొత్తంలో <br>
నిజానికి 90% ఈ విధంగా ఎవరికి వారు కల్పించుకున్న,<br>
మరి మనకు మనం కల్పించుకుంటూన్న బాధలే.<br>
<b>అదిభౌతిక తాపం:</b><br>
ఇతర ప్రాణికోటి వలన కలిగే తాపాలను “ఆదిభౌతిక తాపాలు” అంటాం.<br>
మన ప్రమేయం లేకుండా ఇతరుల అజ్ఞాన, అక్రమ చర్యల వలన<br>
మనకు కలిగే భౌతికపరమైన బాధలు అన్నమాట;<br>
ప్రతి మనిషికి 9% ఇహలోక బాధలు మాత్రమే ఈ కోవకు చెందినవి.</p>
<p dir="ltr"><b>అదిదైవిక తాపం:</b><br>
ప్రకృతి సహజమైన మార్పుల వలన కలిగే తాపాలను<br>
“ఆదిదైవిక తాపాలు” అంటాం . . <br>
ఉదాహరణకు: అతివృష్టి, అనావృష్టి, అతిశీతలం, అతిఉష్ణం మొదలైనవి<br>
అనేక బాధలను కలిగిస్తూ ఉంటాయి;<br>
ప్రతి మనిషికి 1% ఇహలోక బాధలు మాత్రమే ఈ కోవకు చెందినవి.<br>
గమనించారా అందుకే మానవులను తాపత్రయపీడితులు అనేది.<br>
సరే మరి ఈ తాపం , పాపం చేయటానికి మూలకారణం ఏమిటి అంటే మనస్సు.<br>
భగవంతుడు మానవులకి తన దేహ అవసరాలకి , మానవి పరిధికి సరిపోయిన అన్ని అవయవాలు ఇచ్చినా...ఇవి వాటి పరిధిలోనే పని చేస్తాయి...కాని దృష్టి మాత్రం అలాకాదు పరిధి అనంతం. దీనికి చలన శీలత వున్నది. కన్ను సుకుమారమైన , అందమైన ,లావణ్యమైన ప్రతి దానియందు ఆకర్షితమవుతుంది.<br>
మరి ఈ దృష్టిలో వచ్చిన ప్రతిది ఎక్కడ నిక్షిప్తం అవుతాయి అంటే మనస్సులో.<br>
ఈ మనస్సు అనేది తుఫాను నాటి సాగరగర్భం. కదిలే కాలం ఆపవచ్చునేమో కాని మనస్సు స్థిర పరచటం ఆపటం కష్టసాధ్యం అంటారు. కాని యోగులు ఋషులు దీనిని ఆచరణ చేసి చూపారు. మరి నిత్య జీవనంలో అనేకానేక పోరాట పీడితులమైన మనకు సులభం ఎలాగు అంటే భగవన్నామం అనే సాధనంతో దేనికి సంధానపరచాలి అంటే భగవంతుని పాదపద్మాలకు.<br>
అనగా స్థిర చిత్తంతో భగవన్నామంతో ఆయన పాదపద్మాలను ఆశ్రయంచటం.<br>
అలాగే మనవాళ్ళు ఇంకో మాట కూడ అంటారు. పాపం పాము వంటింది ఎదో నాడు నిన్ను కాటు వేస్తుంది అంటారు.<br>
మరి ఈ పాము నిన్ను విడవాలి అంటే<br>
ఎవరు రావాలి...అమృతకలశం అతి వేగంగా తెచ్చిన గరుత్మంతుని వలనే సాధ్యం. గరుడఛాయ పడిన వెంఠనే ఎంతటి పాము అయినా బెదరి పారిపోవటం సాధారణ జీవనంలోనే మనకు ఎరుక. మరి స్వామి వారు గరుడ వాహనధారిగా రావటమంటే ...మన తాప , పాప ఉపశమనం.<br>
కనుక మిత్రులారా భగవన్నామము అనే సాధనతో మీ మనస్సును లగ్నం చేయండి<br>
స్వామివారి కృపకు పాత్రులు కండి.**<br>
*********************<br>
ఈ వ్యాసం పై మీ స్పందననూ<br>
ఆలపాటి రమేష్ బాబు<br>
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో<br>
విజయవాడ<br>
<a href="tel:9440172262">94401 72262</a><br>
తెలియ చేయ ప్రార్ధన.<br><br><br><br></p>Alapati Ramesh Babuhttp://www.blogger.com/profile/10902788241134698143noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2337893138436064619.post-72140919108879605772020-08-05T02:07:00.001+05:302020-08-05T02:07:06.838+05:30శ్రీరాముడు - పరిశీలన - సీరిస్ - 3<p dir="ltr">రాముడు - పరీశీలన - సీరిస్ 3<br>
**************************<br>
శివధనుర్భంగం</p>
<p dir="ltr"> సీతా రామ కళ్యాణం మన తెలుగు వారు అందరికి ఓక పర్వదినం. అది ఏమిటో వివిధ దేవతా రూపాలకు మన తెలుగు నాట వున్న ఆచారంలో కళ్యాణం ఓకటి...ఇది మరే ఇతర ప్రాంతంలోను మనకు కనపడని ఆచారం.<br>
మనం దేవతా రూపాలకు కళ్యాణం చేసి మురిసిపోతాం ఆనందపడిపోతాం. మరీ ఇక సీతారామకళ్యాణమంటే...ఇక ఆ హడావుడి ఊరందరిది...ఆ వైభోగమే కన్నులారా చూడవలిసినదే...అలా ఆ సమయంలో పాటలు పద్యాలు పూజలు..అబ్బో అదో సందడి అదో వేడుక...<br>
రామ లక్ష్మణులు విశ్వామిత్రుని యాగ సంరక్షణ చేసినారు. విశ్వామిత్రడు తన శిష్యులైన రామ లక్ష్మణులను వెంట పెట్టుకుని మిధిలా నగరానికి పయనం. అదే సమయంలో జనకుడు యాగ నిర్వాహణ ...సీతాస్వయంవరం...దీనికి ఓక పరిక్ష...మహ మహిమాన్వితమైన శివధనస్సుని ఎక్కు పెట్టుట...దీనికి " వీర్యశుల్క" గా సీతతో పరిణయం అని ప్రకటిస్తాడు.<br>
మీకు ఇక్కడ జనకుని గురించి కొంత క్లుప్తంగా తెలియచేయాలి.<br>
మిధిలానగరానికి రాజు జనకుడు. వీరు మహ యోగి పురుషులు ఆత్మజ్ఞాన సంపన్నులు.<br>
వీరికి ఇంకో పేరున్నది సీరద్వజుడు. వీరు యాజ్ఞవల్క్యమహర్షి అనుగ్రహం చే...బ్రహ్మత్వం పొందుతారు. వీరి వంశం పేరు నిమి. వీరి వంశ మూల పురుషుడు మిధి. వీరి వంశంలో లో దేవరాతుడు ఆనే అతను దక్షయజ్ఞంలో పాల్గోన్నాడు. దక్షయజ్ఞంలో దక్షుని అవమానంచే సతిదేవి ప్రాణత్యాగం చేస్తుంది. ఈ విషయం తెలిసిన పరమేశ్వరుడు దక్షయజ్ఞవాటికపై తాను మరియి తన అంశ వీరభద్రడు , ప్రమధగణాలు కలసి భీభిత్స భయానకంతో దక్షుని శిరస్సు ఖండించి...సతిదేవి దేహంతో విరక్తితో వైరాగ్యంతో మరలిపోయే సమయంలో తన ధనస్సును ఆక్కడే వదలి వెళ్ళిపోతాడు....దీనితో దేవతలను ప్రసన్నం చేసుకుని దేవరాతుడు శివధనస్సుని దేవతల నుంచి పొంది తన గృహంనకు తెచ్చి ఓక మంజూషలో వుంచి పూజాదికాలు నిర్వహిస్తుంటాడు. ఈ శివధనస్సు పేరు "పినాకం". ఈ దేవరాతుడు తదనంతరం ఓకరి తరువాత ఓకరికి అది సంక్రమించ బడుతూ ఇప్పుడూ అది జనకుని ఆధినంలో వున్నది.<br>
ఈ జనకుడు , యాజ్ఞవల్క్యమహర్షి నిర్వాహణలో ఓక యజ్ఞంచేయ నిశ్చయించి...ఆ యజ్ఞవాటికకు అవసరమైన భూమి దున్నతున్న సమయంలో ఆ నాగలి చాలు నందు ఓ బాలిక లభ్యం అవుతుంది... ఆమే సీత....ఆమే భూమి నందు లభించింనందున భూజాత అయినది...అందువల్లనే ఈమే అయోనిజ...అయినది....(సీత జన్మరహస్యం వాల్మీకి రహస్యంగా వుంచదలచినట్టున్నాడు. ఆమేకు అయోనిజ లాంటి విశిష్టత కల్పించి...జనకుని తండ్రి చేసి...మరి సంక్లిష్టం చేశాడు... కారణం జనకుడు ఎన్నడు ఎవరితోనైనా అనవసరార్ధం ఓక్క మాటలేదు. దీనితో సీతాదేవి జన్మ రహస్యం పై అనేకానేక విచిత్ర వాదనలు వున్నాయి వాటిని ఇంకోసారి వివరణ). ఆమే బాలికగానున్నప్పుడు ఆటలు ఆడుతున్న సమయంలో ఓక బంతి మంజూష క్రిందకు పోగా ఈమే మంజూషను అలవోకగా ప్రక్కకు జరిపి తన బంతి తీసుకుని వెడలిపోయి..తన ఆట తాను ఆడుకుంటున్నది...ఈ సంఘటనను నారదునితో ఆద్యాత్మిక చర్చలో వున్న నారద ,జనకులు ఇరువురూ గమనించిన వారై ఆశ్చర్య పోతారు....కాని అప్పటికే దేవరహస్యం తెలిసిన నారదుడు తెప్పరిల్లి జనకుని పరిశీలిస్తుంటాడు....ఆశ్చర్యం నుంచి తేరుకోని జనకుడు అలాగే నిశ్చేష్టుడైపోతాడు...ఎందుకంటే తానుగాని...తన వంశంలో మరి ఎవ్వరు కాని ఆ మంజూషను కదల్చిన దాఖలా లేదు...దానితో నారదసముఖంలో యుక్తవయస్కురాలు అయిన సీతను ఎవరికి ఎలా వివాహం చేయాలి అన్న ప్రశ్నకు దొరికిన వాడై ...ఆ ధనస్సును ఎక్కుపెట్ట కలిగిన వారికి సీతతో పరిణయం చేయ నిశ్చయం చేశాడు. <br>
మరి ఇదే సమయంలో మిధిలానగరానికి రామలక్ష్మణులు తో విచ్చేసిన విశ్వామిత్రుని స్వాగతపరచి సకల సత్కార మర్యాదలు ఆచరించి వినమ్రంగా వున్న సమయంలో...విశ్వామిత్రడు రామలక్ష్మణులను పరిచయం చేయటం...వారికి శివధనస్సు దర్శనాభిలాష గురించి తెలపగా....అప్పటికే తాను ప్రకటించిన సీతాస్వయం వరం....అందు నియమం గురించి ప్రకటించినందున...రేపు సభలో చూడవచ్చు అనే వినమ్రసమాధానం నకు సమ్మతించిన వాడై విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కూడి తన బసకేగి మరునాడు సభకు విచ్చేస్తారు.<br>
సభకు మంజూషను ఎంతో కష్టంతో ఏనుగులు , అనేక వందలవేల బల శాలురు అధికప్రయాసలతో సభలో ప్రవేశపెడతారు.<br>
జనకుడు సీతా స్వయంవర నియమం మరియి వీర్యశుల్కం సీతతో పరిణయం అంటారు...<br>
దానితో దేశ దేశాల రాజులు , రాజకుమారులు ఆ శివధనస్సుని ఎక్కు పెట్టే ప్రయత్నం చేయబోతారు...అందరూ అభాసుపాలు అవుతారు...<br>
దానితో రాముడు విశ్వామిత్రుని ఆదేశంతో ఆ శివధనస్సుని అలవోకగా తన చేతిలోకి తీసుకుంటాడు.....దాని అల్లేత్రాడుని దాని నారిభాగంలో బంధించి....ఓక్కసారి నారి సారించబోవ....ఆ శివధనస్సు ఫెళ్ళున విరిగి పోతుంది..... ఇది గమనించిన సర్వులు ఆశ్చర్య చకితులు అవుతారు....ఆనందంలో మునిగినవారు...ఇద్దరే...సీత...తనకు ఇష్టపడిన వరుడు లభించాడని , జనకుడు... ఆశించిన వరడు లభించాడని...గుంభనంగా వున్నది విశ్వామిత్రుడు ఓక్కరే...ఆశించిన ,అప్పచెప్పిన కార్యనిర్వాసణ పూర్తి అయినదని .....<br>
దానితో జనకుడు , రాముని సీతను పరిణయమాడ కోరతాడు... కాని రాముడు సమ్మతించక...తాను విశ్వామిత్ర ఆదేశానుసారం పాల్గోన్నొను...తన వివాహం తన తండ్రి దశరథుని నిర్ణయాను సారమే జరుగుతుంది.. ప్రస్తుతం తాను తన తండ్రి ఆదేశంపై విశ్వామిత్రుని ఆజ్ఞపాలన చేస్తున్నాను అన్న విషయం తెలపటంతో...విశ్వామిత్రుని సూచనపై వాయువేగాలతో పోవు వార్తాహరులని పంపి అన్నీ విషయాలు విశదికరించుతాడు. <br>
ఈ విషయాలన్ని తెలిసిన దశరధుడు ఆనందంతో తన ఆమోదం తెలుపుతాడు.<br>
దశరథుడు తన సకల జన పరివారంతో మిథిలా నగరానికి విచ్చేస్తాడు. అంత ఇరువురి పురోహితులు ఇరువురి గోత్ర ప్రవరలు మరోకరు తెలుపుకునే సమయంలో దశరథుడు తన మనోభిష్టం చెపుతాడు...తన మిగిలిన ముగ్గురు పుత్రులకి కూడా వివాహం చేయ నిశ్చయం... అంత జనకుడు తన సోదరుడు కుశధ్వజుని కుమార్తెలు ఉర్మీళ ను లక్ష్మణునికి , మాండవిని భరతునికి , శృతకీర్తిని శతృఘ్ననికి ఇచ్చి వివాహం జరుపుతారు.<br>
బాగుంది ఇది అంతా పౌరాణిక కధ...కాకపోతే మరికొన్ని విషయాలు మనకి తెలిసినవి...కాకపోతే శివధనస్సు రహస్యం...అందరికి అలా అపరిష్కృతంగా వుండవలసినదేనా...సీత బాలిక గా వున్నప్పుడు ఆమేకి సాధ్యం... మరలా రామునికి సాధ్యం... మరి ఎవ్వరికి ఈ కార్య నిర్వాహణ సాధ్యపడలేదు...అన్నీ తరాలు జనకుని వద్ద వున్ననూ ఎవ్వరూ దానిని కదల్చలేక పోయారు...స్వయం వరంలో పాల్గోన్న వీరాధి వీరులైన రాజులకి సాధ్యపడలేదు...ఓక్క సీతా రాములకి తప్ప....<br>
అదే దేవరహస్యం దాన్నీ విప్పి చెప్పటమే ఈనాటి లక్ష్యం....<br>
సీత , రాములు వైకుంఠ వాసులైన లక్ష్మీనారాయణులని....వారే ఈ విధంగా ఉద్భవించారని ఈనాడు మనకు తెలుసు....ఆనాడు దేవతలకి తెలుసు...దేవతల కార్యనిర్వాహణలో వున్న విశ్వామిత్రునికి తెలుసు....కాని సీతా , రాములు ఉభయులకు తాము వైకుంఠ వాసులమని తెలియదు...కారణం మానవ జీవితం లోని ప్రకృతి ధర్మం అయిన స్త్రీ పురుష ఆకర్షణలను వారు అనుభవించాలని...దంపతులుగా వారి దాంపత్యం...దానిలోని ధర్మాచరణ ని వారు పాటించాలని..ఆచరించాలని....ఇది బాగుంది... మరి శివ ధనస్సు....<br>
సీత , శివుని మధ్య సోదర సోదరి సంబంధం వున్నదని మీకు తెలుసు. క్షీరసాగర మధనంలో భాగంగా వచ్చిన లక్ష్మీ దేవిని విష్ణువు స్వీకరించారని...ఆమేతో ఉద్భవించిన హలాహలం ని శివుడు స్వీకరించారని బుధజనులకి తెలుసు...అందువల్లనే లక్ష్మీ దేవి శివునికి సోదరి అయినది. మరి సోదర సోదరిమణులు ఇరువురునూ సమాన శక్తి కలవారు...హలహలంతో ఆమె జన్మించితే....ఆయన హలాహలాన్ని గరళంలో నిలిపి లోక రక్షణ చేసినాడు. చాలామంది ధనం విషంతో సమానం అనే మాటకి అర్ధం ఇదే...ధనం , విషం కలిసే పుడతాయి అనే నానుడి కూడా ఇక్కడి నుంచే వాడుక....<br>
మరి సోదరిగా శివశక్తి సీతకి వశపడటం అతి సులభం....<br>
అందుకే సీత బాలికగా వున్నప్పుడు అది సాధ్యపడుతుందా లేదా అన్న దైవపరిక్షని జాగ్రత్తగా నిర్వహించినవాడు నారదుడు.<br>
హమ్మయ్య అది సాధ్యపడింది దైవప్రణాళికలో ఓక భాగం పూర్తి అయినది....వారు చూడండి ఎంత జాగ్రత్తగా చేస్తున్నారో...ప్రకృతి అయిన సీతకి పరిక్షపెట్టి అందులో ఆమే ఉత్తీర్ణత నిశ్చయించి తదనంతరం మాత్రమే పురుష రూపం అయిన శ్రీరామచంద్ర పాత్ర ప్రవేశం....<br>
మనం అయినా వ్యవసాయంలో దుక్కి దున్ని...దమ్ముచేసి...నీరు పెట్టి తదనంతరం విత్తనం చల్లుతాం...అందుకే క్షేత్ర రూపం స్త్రీ రూపం అయిన సీతకి ముందు బాలికగానే పరిక్ష...తదనంతరం బీజరూపం , పురుష రూపం అయిన రాముని ప్రవేశం...పరిక్షా నిర్వాహణ.<br>
మరి సీత పరంగా మీరు నా ఆలోచన తెలుసు కున్నారు.... మరి రాముని పరంగా ఏమిటి అన్నది తెలుపుతాను....<br>
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు అని సృష్టి స్థితి లయలు వారి నిర్వాహణ భాధ్యతలని మీకు తెలుసు.....<br>
శివుని ధనస్సు ఏ పరిస్థితి లో దేవరాతుని వద్దకు వచ్చినది....సతీదేవి వియోగ సమయంలో శివధనస్సు అక్కడ విడవ బడుతుంది... శివుడు సతిదేవి వియోగాన్ని భరించలేడు....మరి నారాయణ స్వరూపం అయిన శ్రీరాముడు భవిష్యత్ లో వచ్చే భార్యవియోగం తట్టుకుంటాడా లేక శివుని వలే ప్రవర్తిస్తాడా అన్నదానికి ఓక సమాధానం మనకూ మార్మీకంగా తెలియచేస్తున్నారు. సతిదేవి వియోగం లోని శివధనస్సు ఇంకనూ శివుని స్పర్శ వలన ఆనాటి తాలూకు భావనలు దానిలో నిక్షిప్తమై వున్నాయి.....<br>
అందుకే ఆభారం దాన్నీ ఆవహించినది....అసలే శివుడు లయకారుడు...అందునా ప్రళయ సమయంలోని ధనస్సు ...స్థితి కారుడైన నారయాణుడు ఎలా నిభాయించుతాడు....<br>
ఆత్మనిగ్రహం , మనోనిగ్రహం పూర్తిగా కల రాముడు అలవోకగా శివధనస్సు తన చేతిలోకి తీసుకోగానే లయకారుని లయతత్వం స్థితికారుని చేతిలోకి అలా రాగానే తనలక్షణం కోల్పోతుంది....అందుకే రాముడు శివధనస్సు అల్లేత్రాడు దానికి బంధించి నారి సారించే సమయంలో ఫేటిల్లున అది విరిగి పోతుంది.... దైవనిర్ణయం సక్రమంగా అమలుపరచబడుతున్నదని విశ్వామిత్రుని కి తెలుస్తుంది.... తద్వారా మనకి....<br>
సీత ఈనాడు పూర్ణ యవ్వన వతి. ఆమే శ్రీరాముని చూసి ఆకర్షణకు లోనవుతుంది...కాని రాముడు ఆమేని దర్శించిననూ తన ఆత్మనిగ్రహత వలన తన భావం ఏమిటో ఆంగీక వాచక లక్షణాలలో ప్రదర్శించక..గుంభనంగా...అంటే స్త్రీ పూర్వకంగా వచ్చే మార్పులకు రాముడు లోనవుతాడా లేదా అనే ప్రాధమిక పరిక్ష...<br>
ఓకే ఇదంతా పౌరాణికం...ఏమిటో మీరు...ఏనాటి కాలంలో జరిగిన వాటిని మీ సంఘటనకి అన్వయింపచేస్తున్నారు అనే బుద్ధి జీవులకి ఇంకోక్కటి.....<br>
శివధనస్సు... శివుని శక్తికి మరో రూపం అని.<br>
శివుడు సదా కాలరూపునిగానే మనం భావించాలి.....<br>
మీకు కాలం బాగున్నది...సరే కృతజ్ఞతతో పరమేశ్వరార్చన...మీకు కాలం బాగోలేదు...ఆయన కరుణకి పరమేశ్వరార్చన...<br>
మన దైనందిన జీవితాలలో పరమేశ్వరార్చన అంత విశేషం ప్రాముఖ్యత వహిస్తుంది....<br>
మరి సీత , రాములకి సాధ్య పడింది అంటే ఆ కాలం పెట్టే పరిక్షలకి ఎవరైతే తట్టుకొని నిలబడతారో వారికే శివధనస్సు యొక్క శక్తి వారికి మాత్రమే సమన్వయపరచ బడుతుంది అనేది మనం తెలుసుకోవాలి.<br>
అందుకే త్రేతాయుగం నాటి సీతారాములు ఈనాటికి మనకు ఆరాధన పూర్వక దంపతులు అయ్యారు.<br>
ఇది శివధనుర్భంగంపై శ్రీరాముని దయవలన నా ఆలోచనలు.....<br>
సర్వులకు శ్రీరామ జయం.<br>
సర్వం శ్రీరామజయం...<br>
శ్రీరామ చరణం దొరికితే చాలు నా ఈ జీవితానికి...<br>
ఆయన కృపాకటాక్షంకై....<br>
శ్రీరామజయం...<br>
మిత్రులకి , విమర్శకులకి సదా స్వాగతం.<br>
మీ తాలుకు సందేహలకి సమాధానం <br>
ఆలపాటి రమేష్ బాబు<br>
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో<br>
విజయవాడ<br>
<a href="tel:9440172262">94401 72262</a>.<br>
<a href="tel:94401722">94401722</a></p>Alapati Ramesh Babuhttp://www.blogger.com/profile/10902788241134698143noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2337893138436064619.post-67685494629633180642020-08-05T02:04:00.000+05:302020-08-05T02:04:05.171+05:30శ్రీరామ చంద్రుడు - పరిశీలన - సీరిస్ - 2<p dir="ltr">రాముడు పరిశీలన సీరిస్ - 2<br>
************************************<br>
రామునికి ఎన్నో విశిష్ట లక్షణాలు. వాటిల్లో<br>
రాముని ఏక పత్నీ వ్రతం గురించి ఆనాటి నుంచి ఈనాటి వరకూ గొప్పగా చెప్పుతారు....<br>
మరి రాముడు ఏకపత్నీ వ్రతం అనేది ఎందుకంత విశేషత....ఈనాటి వారికి అదో సాధారణ సంగతిలా వుంటుంది... కాని విశేషమే...అసలు రాముడు మహిళల పట్ల గౌరవ మర్యాదలు చూపే అంత విశిష్టత నిర్ణయం రావటానికి గల కారణాలు విశ్లేషించటమే...ఈనాటి టాపిక్ లక్ష్యం.<br>
రామావతార లక్ష్యమే రావణసంహరం.<br>
రావణుని బలహీనత స్త్రీ వ్యామోహం.<br>
రావణునికి గల రాక్షస ప్రవృత్తి లో ఇది ఓకటి మాత్రమే....<br>
మరి ఇటువంటి రాక్షస ప్రవృత్తిని ఎదుర్కోవాలంటే....అటువంటి అవలక్షణము లేని వ్యక్తి కావాలి...మరి దశరధుడు అటువంటి వాడా కాదు అని మనకు తెలుసు....కాని విశిష్ట వంశం...దశరధుడు కూడా దేవాసుర సంగ్రామంలో దేవతల పక్షాన పోరాడిన వాడు...ఇవి సానుకూలతలు...ఇంతమాత్రం చేత దశరధుని ఔరసపుత్రడుగా ముందుగానే జరుగలేదు...దశరధునికి ముగ్గురు భార్యలున్ననూ నిస్సంతుగా వుండటానికి కారణము దైవనిర్ణయం....మరి ఈ సమయంలో దశరధునికి పుత్రకామేష్ఠి యజ్ఞం గురించి తెలియచేసి అతనిచే ఈయాగ నిర్వాహణ. అసలు పుత్రకామేష్ఠి అంటే...పుత్రకామేష్టి యజ్ఞం సనాతన ధర్మం లో కొడుకు పుట్టడానికి చేసే ఒక ప్రత్యేక యజ్ఞము. ఇది ఒక కామ్య-కర్మ.<br>
మరి ఈ పుత్రకామేష్ఠి యజ్ఞం ఎవరి ఆర్ధ్వర్యంలో నిర్వహించాలి.....మరి ఇంతటి శ్రేష్టుడు ఎవరు.... ఋషులందరూ గొప్పవారే కాని ఓక్కొక్కరిది ఓక్కో కధ గాధ...మరి ఆసమయంలో వారందరికి ఓక్కరే స్ఫురణకు వస్తారు వారు ఋష్యశృంగుడు. <br>
కశ్యప ప్రజాపతి కుమారుడైన విభాండకుడు అనే మహర్షి ఒక రోజు సంధ్యా వందనము చేసుకొను సమయమున, ఆయనకు ఆకాశమార్గాన పోతున్న ఊర్వశి కనిపిస్తుంది. ఆ ఊర్వశిని చూసి విభండక మహర్షి తన వీర్యాన్ని సరోవరములో విడిచిపెడతాడు. ఆ వీర్యాన్ని త్రాగిన ఒక జింక గర్భం ధరించి, కొమ్ము కల బాలునికి జన్మనిస్తుంది. కొమ్ముతో జన్మించాడు కావున ఆ బాలకునకు ఋష్యశృంగుడు అని పేరు పెడతాడు విభండకుడు. ఋష్యశృంగునికి సకల విద్యలు, వేదాలు, వేదాంగాలు, యజ్ఞయాగాది క్రతువులు తానే గురువై, విభండక మహర్షి నేర్పుతాడు. విభండక మహర్షి ఋష్యశృంగుడిని బాహ్యప్రపంచము అంటే ఏమిటో తెలియకుండా పెంచుతాడు. అలా పెరిగిన ఋష్యశృంగునికి లోకములోని స్త్రీపురుష తారతమ్యములు తెలియవు. విషయ సుఖాలంటే ఏమిటో తెలియదు. ఆ ఋష్యశృంగుడు జ్వలిస్తున్న అగ్ని గుండము వలె ఉండేవాడు. కనుకనే దైవనిర్ణయానుసారం..యాగ ఆర్ధ్వర్యం వీరికి ఓసగబడినది...అందునా వీరు యజుర్వేదంలో నిష్ణాతులు. యజుర్వేదంలో పుత్రకామేష్ఠి క్రతువు వున్నది.<br>
ఇక్కడే మీరు సాధారణంగా చదువుకుంటూ వెళ్ళే సమయంలో ఓక క్షణం ఆగి ఆలోచన సాగించండి.....<br>
మనం నిత్యపూజ సంకల్పానికే విశేషత వహించేటప్పుడు....రావణ సంహర కర్త జన్మించటానికి ఎన్ని విధాల జాగ్రత్తలు అవసరం...<br>
మన నిత్యవంటలో దినుసులు సరి సమంగా...శుభ్రతగా...శుచిగా చేస్తాం...అలాగే పూజాదికాలు భక్తి శ్రద్ధలతో వివిధ పద్ధతులలో వివిధ రూపాల వస్తు వినియోగం చేసి సంతృప్తి చెందుతాం....మరి రావణసంహరమే లక్ష్యం గా అంశ ఉద్భవించాలంటే....స్త్రీ బలహీనత లేని యజ్ఞ ఆర్ధ్వర్యుని నిర్వాహణలో యజ్ఞ ఫలంగా అంతటి విశిష్టత గల అంశ పుట్టుట మాత్రమే<br>
సాధ్యం....అందుకే దేవతలు ఏరి కోరి మరి...ఋష్యశృంగుని....ఎన్నుకున్నది....<br>
వశిష్ఠుల వారు వున్ననూ వారి కన్ననూ యజ్ఞ నిర్వాహణకి ఋష్యశృంగునికి అప్ప చెప్పినది....<br>
మరి ఈ యాగ నిర్వాహణలో చివరగా అగ్ని ఇచ్చిన యాగ ఫలిత పాయస ప్రభావంచే...శ్రీరామ జననం.<br>
మీకు ఇంత వివరించటానికి కారణం...ఓక కార్యసిద్ధి కి అత్యుత్తమ సంకల్పం కలిగి అటువంటి విశిష్టత గల వ్యక్తులచే నిర్వహించ బడితే అంతటి మంచి ఫలితం లభిస్తుంది...<br>
అందు వల్లనే జన్మతః రామునికి ఈ లక్షణం వున్నది...కాని ఆనాటి సామాజిక రాజకీయ కుటుంబ నేపథ్యంలో ఆయన ఇటువంటి నిర్ణయం తీసుకోవటానికి బలమైన కారణాలు ప్రస్తావిస్తాను.....<br>
రాముడు క్షత్రీయుడు... అందునా రాజ్యాధికారం సిద్ధించబోయేవాడు...మరి మిగతా వారి వలనే బహు భార్యత్వాన్ని ఎందుకు ఎంచుకోలేదు...రాముడు అన్నీంటికి తన పూర్వీకుల మార్గం పాటించినా ఇందులో మాత్రం తన ప్రత్యేకత నిలుపుకోవటానికి ప్రధమ కారణం...తన తండ్రి బహు భార్యత్వానికి ప్రధమంగా ఇబ్బంది పడినది...రాముని తల్లి కౌసల్య....ఈమే పట్టపు రాణి అయిననూ భర్త ఆదరణ లేక వ్యధతో కూడిన జీవితం...మరి తల్లి తాలూకు వేదన చూసిన రాముడు అటువంటి పొరపాటు చేయగలడా....<br>
అలాగే రాముని అరణ్యవాసం కారణం కూడా...దశరధుని వ్యామోహమే....<br>
రామునికి ధర్మ , కర్మ ఆచారణ పట్ల ఎంతో మక్కువ.... సీతా స్వయంవరం ముందు జరిగిన అహల్య శాపవిమోచన ఘట్టం లో తనవలన ఓక స్త్రీ కి శాపవిమోచన కి సంతోషించిననూ...అది అతని మనస్సులో ఓక ముద్ర ఏర్పరిచినది....గౌతముని వంటి తపస్వికి ఇల్లాలు అయిననూ పరపురుష వ్యామోహంచే<br>
ఆమే ధర్మ , కర్మ భ్రష్టత్వం పొంది..ఆ విధంగా శిలగా వుండటం రాముని ఆలోచింప చేసినది...<br>
అందుకే పురుషునకో నియమం , స్త్రీ కో నియమం వుండుటను అతను నిరసించి....ఏకపత్నీ వ్రతం అనే కొత్త సూత్రం తనదిగా చేసుకున్నాడు....<br>
ఇటువంటి నూతన విధానంలో కాబోవు రాజు మక్కువ చూపుతున్నారు అని ప్రజలలో తెలిస్తే వారికి రాముని పట్ల గౌరవం పెరుగుతుంది.<br>
రాజుకి రాజ్యం లోని ప్రజలకి ఉభయుల మధ్య ఓక విధమైన సంఘటితం ఏర్పడుతుంది... ఆ రాజ్యం బలపడుతుంది.<br>
మీరు ఈ వివరణ సాగిన విధం గమనించండి...<br>
రావణుని రాక్షసత్వంచే విసిగి వేసారిన దైవ , ఋషి వర్గాల అభిప్రాయం అణుగుణంగా నారాయణుడు జన్మ తీసుకోవాలి..అందుకూ అతని వరంలోని వున్న మానవ , వానరులు వలన నాకు మృత్యువు రాకూడదు అన్నది విస్మరింపో లేక అహంకార పూరితమో అయినా దేవ , ఋషి ప్రణాళిక లో అదే మూలం అయి...నారాయణుడు మానవజన్మ తీసుకోవటానికి ప్రధాన కారణం అయినది. రావణుని పర స్త్రీ వ్యామోహం అనే దుర్బలత్వానికి విరుగుడు ఏకపత్నీ వ్రతం అనే బలమైన ఆయుధం...ధర్మ , కర్మ ఆచారణ కు బలంగా మారినాయి...ఇక తదుపరి వివరణలు కుటుంబ , రాజకీయ ,సామాజిక వివరణలు...<br>
ఇలా రామాయణాన్ని, రాముని మనం ఇష్టపడుతూ...ఆ జగదభిరాముని లీలావిలాసాన్ని ఓక్కసారి ఆయన పాదం పట్టి అడిగితే తన తత్వాన్ని ఓకింత మన బుద్ధి మేర కొంత కరుణిస్తాడు.....సర్వం శ్రీరామ మయం...<br>
సర్వులకు సర్వం శ్రీరామ జయం......<br>
మిత్రులు, విమర్శలు సదా స్వాగతం.....<br>
మీ యొక్క సందేహలకి సమాధానం...<br>
ఆలపాటి రమేష్ బాబు<br>
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో<br>
విజయవాడ.<br>
<a href="tel:9440172262">94401 72262</a>.<br><br><br><br><br><br></p>Alapati Ramesh Babuhttp://www.blogger.com/profile/10902788241134698143noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2337893138436064619.post-34545964136347639872020-08-05T02:00:00.001+05:302020-08-05T02:00:45.863+05:30శ్రీరామచంద్రుడు - పరిశీలన - సీరిస్ - 1<p dir="ltr">రాముడు - పరిశీలన సీరిస్ - 1<br>
*******************************<br>
రాముడు భరతవర్ష ఆత్మ. మిత్రులు గమనించారో లేదో నేను భారతదేశం అన్న పదం ఉపయోగించలేదు...భరతవర్ష అనే మన పూజాదికాలలో సంకల్పం లోని పదం... కారణం పౌరాణిక భారతవిస్తారం చాలా చాలా విస్తృతం కనుక...ఇంత భూభాగం పై రాముని ప్రభావమున్నది అనుటలో సందేహం లేదు. మిత్రులు ఈనాటి రాజకీయ ,మత ప్రాభవాలు కాదు...త్రేతాయుగం నాటి నుంచి నేటి కాలం వరకు రాముడు వారి వారి సమాజాలలో సాహిత్యం లో వారి మనస్సులో వారి కుటుంబ సాంప్రదాయాలలోకి చొచ్చుకుపోయేలా ఓ ప్రత్యేక స్థానం లభించేలా వుండటానికి...రాముని కధ జన కధగా ప్రతి ఓక్కరి జీవనానికి ఆధారసూచికలా మారటానికి గల కారణాలు మనం పరిశీలించటమే ఈ కధనం ముఖ్యోద్దేశ్యం.......<br>
రాముడు దశవతారాలలో ఏడవదిగా మనకు మొదటసారిగా భాగవతం పరిచయం చేస్తుంది. వాల్మీకి రామాయణం రాముని వైశిష్ట్యాన్ని రాముని జీవనప్రయాణాన్ని మాత్రమే పరిచయం చేస్తుంది. రామాయణంలో మొదట ఉత్తర కాండ లేదని...తదనంతర కాలాల్లో అది ప్రక్షిప్తమని వాదించేవారు కోకొల్లలు. రాముని జీవనగాధ ఎంత సరళమో ఆచరణ అంత సంక్లిష్టమైనది...కారణం రాముని జీవతం లోని ప్రతిక్షణం ప్రతి అడుగు ధర్మబద్ధంగా వేదప్రమాణంగా పూర్వుల ఔన్నత్యం భంగపడని రీతిలో అదేసమయంలో తనతో కలసివున్నవారితో కల ఆత్మీయసంబంధాలు మానవ జీవత ప్రమాణాలలో ఉదాహరణకు నిలిపే విధంగా సాగింది. ఇంతటి సంక్లిష్టతగా మనకు తోచిననూ రాముడు అవలీలగా పాటించుతూ ఇది ధర్మం ఇది జీవనవిధానం అని పాటించి చూపాడు. ఈ మహకావ్య నాయకుని ఇంత గొప్పగా తీర్చిదీద్దటం వాల్మీకి వారికి తప్ప ప్రపంచంలో ఏభాషలోను మరే రచయిత చేయలేని చేయని ఓ అద్భుత పాత్ర రాముడు.<br>
అది అలా అలా జనుల జీవన వేదం గా నిలచిపోయింది.<br>
అసలు రాముడు వైశిష్ట్యాన్ని రామునితోనే ముడి పడినదా లేదంటారు రఘువంశకర్త కాళీదాసు... ఈ రఘువంశంలో రాముని పూర్వ తరాలు వారి విశిష్టత మనకు వివరంగా చెపుతారు...<br>
సూర్యుడు , సంధ్య లు వంశమూల పురుషులైతే<br>
రాముడు వీరి పరంపరలో 62వ తరం వాడు....<br>
మనకు రఘువంశం లో రాముని పూర్వులు ఇక్ష్వాకుడు ,నాభాగుడు, మాంధాత ,సత్యవ్రతుడు ,హరిశ్చంద్రుడు ,సగరుడు, దీలిపుడు,భగీరధుడు ,అంబరీషుడు,రఘువు ,అజుడు ....ఈయన కుమారుడే దశరథుడు... ఇంతటి వంశక్రమంలో దశరధునికి మాత్రమే పుత్రకామేష్ఠి యాగ ఫలితంగా శ్రీరామ జననం గా మనకు తెలియవస్తుంది. మీకు ఇంత వివరంగా తెలుపుటకు కారణం...శ్రీమన్నారాయణుడు వైకుంఠం వీడి పూర్ణ మానవ అవతారంగా తన ప్రకటన వుండాలంటే ఆ వంశం ఏంత గొప్పగానో మరియు ఏంతటి ధర్మదీక్షాపరులో ఏంతటీ పట్టుదల కలవారిగా వుండాలో తెలిసిన వారు కాబట్టి ఏర్చి కూర్చి కోరి మరి ఈ వంశంలో తన జననం...పోని అది అయినా దశరధుడు , కౌసల్య సంయోగ ఫలితమా కాదే నిస్సాంతన పరితాపాన్ని కలిగించి ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ...పుత్రకామేష్ఠి యాగ ఫలితంగా మాత్రమే రాముని అవతార ప్రకటన....అనగా రాముడు అగ్నితః జన్మించినవాడయినాడు...అగ్ని సర్వాన్ని పునీతం చేయ గల శక్తి కలది....<br>
అలాగే రాముని లక్షణాలు వారి వంశమూలపురుషుల ఓక్కోక్కరి శక్తి...రాముడు వీరందరి జీవనం లో కల మూలన్ని గ్రహించినవాడై సంపూర్తిగా ఆ విధంగా ఆచరించి చూపాడు....పట్టుదల సగరుని నుంచి... దీక్ష భగీరధుని నుంచి... సత్యవాక్పరిపాలన హరిశ్చంద్రుడు నుండి...ఇలా అనేకానేకం....<br>
అందుకే రాముడు జీవితంలో కఠిన సందర్భం అరణ్యవాసం పాలంచే ముందు స్వయంగా తండ్రి సలహ ఇస్తాడు...నాయనా రామా! నేను వృద్ధుడను చాంచల్యం చే ఏనాడో వరం ఇచ్చాను...అది ఈనాడు కాలం తెచ్చిన కఠిన పరిక్షలా మారింది.... అదియినూ నేనూ నీ జీవితం పై నిర్ణయం తగదు కనుక నీవు నా నిర్ణయాన్ని తోసిరాజనే హక్కు వున్నది...ఎలాగు అంతఃపుర అధికారం నీ తల్లిదే కనుక...నీవు నన్ను ఖైదు చేసి రాజుగా వుండూ....అని కోరినా...రాముడు ఓకపరి సున్నితంగా మరొకంత కఠిన పదాలు ఉపయోగించిననూ...మీ సలహ విని నేను ఈనాడు రాజ్యపాలన చేస్తే...నేను వంశంలో తప్పు పుట్టినవాడినవుతాను....మీతో సహ నా పూర్వుల ఔన్నత్యాన్ని నేను కాలరాచిన వాడినవుతాను ....అయిననూ ఆత్మావై పుత్ర నామాసి అనే ఆర్యోక్తి ప్రకారం మీరే నేను....కనుక ..మీ వారసుడు గా మీ హక్కులు నాకు సంక్రమిస్తున్నప్పుడు యధావిధిగా మీ భాధ్యతలు నాకు దఖలు పడతాయి... అందునా ఈసమయంలో మీరు పాలకులు మేమంతా పాలితులం...కాకపోతే రేపు నేను పాలకుడను అవ్వాలి మరి ఇటువంటి సమయంలో మీ స్వార్థం గురించి నన్ను ధర్మం తప్పమనే హక్కు మీకు లేదు...పాలకుడుగా రాజశాసనం ఆచరించండి అని రేపు నేను చేయబోయే ఆజ్ఞకు ఈనాటి మీమాట ప్రకారం మిమ్మల్ని ఖైదు చేసి అధికారంలో వస్తే విలువ వుండదు...అయిననూ మన అంతఃపురం ఏవరు లేని ఏకాంతం కాదు...మీ అంతరంగం కాదు...ఇది ఓ బహిరంగ రహస్యం..దాసదాసీజన నిండిన ఈ అంతఃపుర విషయం రేపు రాజ్యం అంతా ప్రాకటానికి ఎంత సమయం పడుతుంది... మరి ఆసమయంలో నేను ప్రజల దృష్టిలో హినుడను హేయమైన పని చేసినవాడుగాను స్వార్థపూరిత వ్యక్తిగాను...అందులో భరతుడు లేని ఈ విపత్కర సమయంలో మీ వరప్రభావంచే అతనికి బదాలాయించవలసిన రాజ్యాధికారం నేను కుట్రతో కుయిక్తులతో నేను స్వాధినపరచుకున్నట్టు అవుతుంది.... ఏమి చేయగలం సిద్ధాన్నం సిద్ధించటానికి నాకు యోగ్యత వున్ననూ కాలం అనుకూలించటం లేదు....ఇలా కొనసాగుతుంది....ఇటువంటి ఆత్మవిచక్షణ రాముని ఆజీవనపర్యంతం కొనసాగుతుంది...సీతాగ్నిప్రవేశంలోను...సీతాపరిత్యజంలోను ఇటువంటి సన్నివేశం వచ్చింది...వీటి వివరణ మరియొక పరి....<br>
మిత్రులు...<br>
నమస్కారం.... అసలు ఈ రామ రావణ వైరుద్ధ్యాలను వివరంగా తెలియచెప్పాలనే ప్రయత్నం... అదేమిటో రాముని పై నా ఆలోచన కొనసాగుతున్నంత సేపు రావణునిపై రాయబుద్ధి కాలేదు...అందునా..ఇది ఓక వ్యాసంలో పూర్తి అయ్యే లక్షణం కనపడటం లేదు...రాముడు అనుగ్రహించ నంత వరకూ...ఇంకనూ ఇంకనూ నా అభిప్రాయం లను మీ సముఖానికి తీసుకుని రాగల ప్రయత్నం... అంతయినూ ఆయన కటాక్షము వల్లనే సాధ్యం.... సకలం సర్వం శ్రీరామ జయం.<br>
మీ సందేహం సమాధానం....<br>
ఆలపాటి రమేష్ బాబు...<br>
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో<br>
విజయవాడ<br>
<a href="tel:9440172262">94401 72262</a>.</p>Alapati Ramesh Babuhttp://www.blogger.com/profile/10902788241134698143noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2337893138436064619.post-32929873865460510902020-08-04T20:16:00.001+05:302020-08-04T20:16:09.080+05:30మా అమ్మతో వాట్సప్ డైరి - 1ఈ బ్లాగు నామధేయమే..మా అమ్మ పేరు.<div>కాకపోతే ఈమే మా మమ్మి 2.0.</div><div>ఇదిగో ఈ మాట అంటేనే ఆమే అలిగేది ఆగ్రహించేది. నా తల్లి కీ.శే. సుభద్రాదేవి గారు నన్ను శ్రావణ బహుళ విదియ , 09/08/1968 న ఈ లోకానికి పరిచయం... నేను కన్న తల్లి సుభద్రాకీర్తి చైత్ర పౌర్ణమి రోజు 15/04/1995 న..నన్ను మురిపించటానికి , నాతో మాట్లాడటానికి , నాతో ఆడటానికి , నన్ను లాలించటానికి , నన్ను పాలించటానికి అబ్బో ఓకటేమిటి..అన్నియునూ ఆమే అంతట ఆమే అన్న రీతిలో , దీనికి తోడు ఆమే కృష్ణ అనురక్తురాలు , దానితో ఆమే నాకు సజీవ కృష్ఢ స్వరూపం... ఆమే ఆట, పాట, కోపం అన్నియునూ నాకు లీలా వైభవాలే...</div><div>దీనితో ఆమే నాకు అమ్మ , అమ్మి , అమ్మరో , స్వాములు , స్వామి వారు...ఇవే పదాలతో పిలుపు...</div><div>అదేమిటో నా హృదయ తంత్రి ఇంకనూ ఆమేను..చిన్ని బుజ్జి పిల్లగానే గుర్తింపు...</div><div>ఇన్ని విశేషాల మధ్య..ఆమే..MCA First class లో ఉత్తీర్ణత...</div><div>యుక్తవయస్కురాలు అయ్యారు మా మమ్మి వారు.</div><div>దైవం అనుకూలించిన అల్లుడు గారు... సతీష్ చంద్ర గుప్తా గారు... వీరి వివాహం ఫిబ్రవరి 14, 2019 న...వాలంటైన్స్ డే రోజున..</div><div>మా అమ్మాయి...ఓ చైతన్య ఝరి...మా అల్లుడు గారు నెమ్మది వివేక వంతులు...ఆయన మాకో వరప్రసాదం..మా అమ్మాయి కి కొంగు బంగారం... వారిద్దరి మధ్య స్నేహం మాకో ముచ్చట... నా భావన ప్రకారం.. దంపతుల మధ్య వుండ వలసినది ...మొదప స్నేహం...తదుపరి దాంపత్యం..</div><div>ఇన్ని సంగతుల మధ్య..మా అల్లుడు గారు..మా అమ్మాయి తో అమెరికా చేరిక...దానితో రోజు...నా వాట్సప్ సందేశాలు...</div><div>వాటిల్లో కొన్ని మీకు అలా...</div><div><div>10/3/2019, 6:33 PM</div><div>మమ్మి</div><div>జయహో మాత శ్రీ అనసూయ... రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి...<br></div><div>అమ్మరో...<br></div><div>జాగ్రత్త....</div><div> శ్రీ చక్ర సంచారణి...నా తల్లి... నన్ను ఏలు నా కల్పవల్లి....</div><div>10/3/2019, 8:35 PM: స్వామి వారిని మరువ వద్దు...</div><div> అన్నిటా అంతటా ఆయనే...సతతం నిరంతరం...ప్రతి పని ఆయనకు చెప్పు....నిరంతర నామ ధ్యానం...నీకు డెస్టిని చేరటానికి ఉపయోగపడుతుంది.</div><div>డబ్బు జాగ్రత్త....</div></div><div>18/03/2019</div><div><div>వరాలు</div><div>వజ్రాలు</div><div>వైఢూర్యాలు</div><div>రత్నాలు</div><div>పగడాలు</div><div>గోమేధికాలు</div><div>పుష్యరాగాలు</div><div>మరకతాలు</div><div>మాణిక్యాలు</div><div>ముత్యాలు</div><div>పచ్చలు</div><div>కెంపులు</div><div>ఇంద్రనీలమణులు</div><div>.ఇవి అన్నీ ...</div><div>మా బంగారం.</div></div><div><br></div><div><div>[19/3/2019, 10:28 AM] Alapati Ramesh Babu: లావోక్కింతయి లేదు ధైర్యం విలోలంబైయ్యే...</div><div><br></div><div>పై పద్యం నీకు చాలా సార్లు వినిపించా కాని ఆనాడు నీవు చిన్నదానివి , నా సంరక్షణ లో వున్నదానివి...కాని నీవు నేడు అమెరికాలో భర్త తో ఒంటరి కాపురం..</div><div>ఈ సమయంలో ఆత్మస్థైర్యం అన్ని విధాలా అవసరం.</div><div> స్థిరంగా వుండు...</div><div> స్వామి పై స్థిరచిత్తంతో ముందుకు వెళ్ళు...</div><div>సదా జాగురుకత...</div></div><div>21/03/2019</div><div><div>జిజ్జోయమ్మ...</div><div>గుడ్ మార్నింగ్...</div><div>ఈ రోజు హోలి.</div><div>స్వామికి వసంతం చల్లి...</div><div>మీ ఆయన మీద కూడ చల్లు...</div><div>అలాగే పాలు , తీపి ప్రసాదం గా పెట్టు...</div></div><div><div>హోళీ హోళి ర హోళి చమ్మ కేళిర హోళి...</div><div>అనందం సంతోషం నిండుగా మెండుగా ప్రతి రోజు పున్నమి వెన్నేల లా సరదాగా కలసి మెలసి వుండాలని </div><div>హోళి శుభాకాంక్షలు.</div></div><div>01/04/2019</div><div><div>అమ్మ మీరు అమెరికా వెళ్ళి నెల రోజులు అయింది. ఆ దేశం వాతావరణం మీకు బాగున్నదా...</div><div>అల్లుడు గారు మీరు అరమరికలు లేకుండా చక్కగా వున్నారు అని భావిస్తున్నాను.</div><div>మీరు సతిష్ గారిని భర్త గా కాకుండా ఓ స్నేహితులు గా భావించండి....పొరపచ్చాలు లేకుండా చల్లగా చక్కగా సాగిపోండి. మిమ్మల్ని కూడా సతిష్ గారు భార్యగా కన్నా ఓ స్నేహితురాలుగా మెలిగే విధంగా చూడండి. జీవితంలో ప్రతిక్షణం మధురమే దానిని అనుభవంనకు సదా సిద్ధంగా వుండండి.</div><div>మీ అమ్మ మంచిదే కాని ఇంటలెక్చువల్ కాదు అందువలన ఆమె స్థాయి కి నేను వెళ్ళినా నా భావజాలం ఆమెకు ఏన్నటికి అర్ధం కాదు...ఇది అలా కొనసాగుతున్న జీవన నాటకం.</div><div> మీరు చదువుకున్నావారు జీవితం పట్ల ఓ దృక్పథం ఓ లక్ష్యం వున్నవారు అందులోను పరిణితి చెందిన కాలం.</div><div>మీకు మీ చిన్నప్పుడు సౌకర్యాలు తెలుసు పెరిగిన తరువాత నా ఆర్ధిక పరిస్థితి తెలుసు. </div><div>ఇలా అనేక రకాల వత్తిడిలు ఇబ్బందులు మధ్య దైవకృపతో మీ వివాహం చేయగలిగా...</div><div>డబ్బు అనే సౌకర్యం తప్పితే మిగిలినవి బాగానే వుంటవని నామనసు చెపుతుంది.</div><div>నేను మిమ్మల్ని ఈ విషయం మీద ఏమన్నా ప్రశ్న వేసినా తప్పు , వేయకున్నా తప్పు... నా బంగారు తల్లి ఈ రెండిటికి మధ్య వున్న సన్నని గీతను మీరు అర్ధం చేసుకుంటారని నా భావం.</div><div>ఓ తండ్రిగా నా బిడ్డ సదా చిరునవ్వుతో వుండాలని కోరిక....</div></div><div><br></div><div>13/04/2019</div><div><div>అమ్మీ ! ఉదయాన్నే ఏన్నింటికి లేస్తున్నారూ...</div><div>ఇంకా 2 మినిట్స్ లీలలు కొనసాగుతున్నవా...</div></div><div>( మా అమ్మికి ఓ అలవాటు... నేను ఉదయాన్నే..ఎన్ని సార్లు లేపినా..2 మినిట్స్.. అదో ప్రహసనం..కాని వాళ్ళమ్మ..ఓక్క పిలుపే..ఈమే సిద్ధం)</div><div>15/04/2019</div><div><div>అమ్మరో!</div><div>మండువేసవిలో వెన్నేల ఉదయం అంటే ఈ బుజ్జి బంగారం ...ఓరే నేను వచ్చేస్తున్నా అని కొండమీద నుండి వచ్చారట....</div><div>కలిమితో , బలిమితో , సౌభాగ్యం తో కలకాలం వర్ధీల్లాలని... మా ఆకాంక్ష.....</div><div>శతమానం భవతి...</div><div>జయహోమాత శ్రీఅనసూయ రాజరాజేశ్వరి శ్రీపరాత్పరి...</div></div><div>20/04/2019</div><div>No matter how old my daughter get , She'll always be my baby girl.<br></div><div>21/04/2019</div><div><div>ఇది ఏలా వున్నదో తెలుసా....</div><div>కోర్టు లో జడ్జిగారి దగ్గర "యువరానర్ ! అని ప్రారంభించి అనేక సెక్షన్లు అనేక క్లాజులు ఉదాహరించుతూ రెండు గంటలు పాటు అనర్గళంగా వాదించితే సింపుల్ గా వాదన "కొట్టివేయటమైనది" అని ఓక్కమాట లో తేల్చివేశారు.... అలా వున్నది...</div><div>అసలు మీ స్వామి వారు వచ్చి ఈ రోజు మీ అమ్మాయి పాలు ఇవ్వకుండా బజ్జీలు పెట్టిందంటూ ఏవో కంప్లైంట్స్ చెపితే పోవయ్యా బాబు మా మమ్మీ వారు మీ మాటే వింటారు కదా అంటే..అదేప్పటి మాట అమెరికా విమానం ఏక్కిన దగ్గర నుండి ఆమె నేనే వింటున్నా ...నా మాట వినటంలేదు...అని ఎదురుమాటలు.....</div><div>పోనిలే అని ఆయన చూపించిన బజ్జీల ఇమేజ్ తో అనాలసిస్ చేసి కారణం మీకు చెపితే....మీరేమో సింపుల్ గా ok అని ఓక్కమాటతో తేల్చారు...</div><div>అదిదా....ఈ రోజు కధ...</div><div>సరేనా తల్లీ.....</div><div>జయహోమాత శ్రీఅనసూయ రాజరాజేశ్వరి శ్రీపరాత్పరి......</div><div>అంగరక్ష ఆదిరక్ష మా అమ్మకి సర్వకాల సర్వావస్థలందు సర్వేశ్వరుని రక్ష శ్రీరామ రక్ష...</div></div><div><br></div>Alapati Ramesh Babuhttp://www.blogger.com/profile/10902788241134698143noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2337893138436064619.post-42667038832050050772020-08-04T19:05:00.001+05:302020-08-04T19:05:33.895+05:30అమ్మరో<div>అమ్మరో!</div><div>పుట్టినరోజు శుభాకాంక్షలు...</div><div>నన్ను ఏలు నాతల్లి! నా కల్పవల్లి!</div><div>అంగరక్ష ఆదిరక్ష శ్రీరామ రక్ష.....</div><div>వసంతకాలంలో కోకిల..</div><div>చల్లని సాయంత్రంలో ఇంద్రధనస్సు...</div><div>గలగలా గోదారి అలల సవ్వడి...</div><div>విరబూసిన పండువెన్నెల...</div><div>అరవిచ్చిన గుండుమల్లెల పరిమళం...</div><div>విరబూసిన పూదోట మనోహరం...</div><div>పసి నవ్వుల స్వచ్ఛత....</div><div>ఇలా ఎన్నో ఎన్నేనో నాచేతీలోకి...</div><div>వచ్చిన రోజు...</div><div>గుండె నిండటం అంటే తెలిసినరోజు...</div><div>చెప్పినవి కొన్నే చెప్పనవి ఎన్నో...</div><div>ఇంకొకసారి మరోక్కసారి...</div><div>పుట్టినరోజు శుభాకాంక్షలు...</div><div>ఆడుతూ పాడుతూ వర్ధిల్లు....</div><div><br></div>Alapati Ramesh Babuhttp://www.blogger.com/profile/10902788241134698143noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2337893138436064619.post-56776407048500073042020-08-04T19:03:00.001+05:302020-08-04T19:03:46.728+05:30నిర్వాణషట్కం<div align="center"><p dir="ltr">జగద్గురు ఆదిశంకరాచార్య విరచిత ''నిర్వాణ షట్కం'' </p>
</div><p dir="ltr"></p>
<div align="center"><p dir="ltr">**********</p>
</div><p dir="ltr"></p>
<p dir="ltr">ఇది 'నిర్వాణ షట్కము'నకు సాహిత్యానువాదము, కొద్ది వ్యాఖ్యానముతో. ఆది శంకరాచార్యులవారి సాహిత్యమును స్తోత్ర (భక్తి) సాహిత్యము, వైరాగ్య ప్రకరణములు అని రెండుగా విభజించవచ్చు క్లుప్తముగా. ఇది వైరాగ్య ప్రకరణముల కోవలోనిది. నిర్వాణషట్కం భారతీయ వేదాంత మార్గంలో ఉన్నతమైన రచన. నిజానికి ఎంతో దీర్ఘమైన వ్యాఖ్యానము, వివరణ అవసరము కాని, ఇక్కడ క్లుప్తముగా మాత్రమే చర్చ ప్రస్తుతానికి! ఆదిశంకరుల సారస్వతాన్ని క్లుప్తంగా పరిచయం చేయడానికి నాకున్న కొద్దిపరిధిలో, అల్పజ్ఞానముతో చేస్తున్న ప్రయత్నము ఇది.</p>
<p dir="ltr">ఆధునిక పోటీ పరీక్షలలో జవాబులు తప్పుగా ఇచ్చినప్పుడు, సరిగా జవాబులిచ్చిన కారణంగా వచ్చే 'మార్కుల'నుండి తప్పుగా ఇచ్చిన వాటికి శిక్షగా మార్కులు తగ్గించే పద్ధతి వుంటుంది కొన్ని పరిక్షలలో, (నెగెటివ్ మార్కింగ్) అందుకని సమాధానం సరిగా తెలియనప్పుడు, సరైనవి కాని సమాధానములను వరుసగా ఇది కాదు, ఇది కాదు అని చివరికి సరిఐన లేదా సరిఐనట్లు అనిపించిన సమాధానమును చేరుకొనే పద్ధతి ఒకటి ఉంది. దీనినే తీసివేత పద్ధతి లేదా ఆంగ్లంలో ఎలిమినేషన్ ప్రాసెస్ అంటారు. భగవంతుని రూపమును, తత్త్వమును తెలిసికొనడం అసాధ్యం కనుక, ఏది భగవంతుడో తెలియనప్పుడు, ఏది భగవంతుని తత్త్వమో తెలియనప్పుడు ఏది భగవంతుని తత్త్వము కాదో తెలిసికొనడం తేలిక కనుక 'ఇది కాదు' 'ఇది కాదు'అని తీసి వేస్తూ చివరికి మిగిలిన వర్ణనకు, వ్యాఖ్యానమునకూ అందని తత్త్వమేదో అదే పరమాత్మ తత్త్వము అని తెలిసికొనడాన్ని వేదాంతం 'నేతి','నేతి', అంటే, 'న ఇతి', 'న ఇతి', అంటే, 'ఇది కాదు' 'ఇది కాదు'..అనే 'నేతి' మార్గం అని చెప్పింది! ఈ 'నిర్వాణ షట్కము' లో 'చిదానంద రూపుడైన శివుడు' అనే పరమాత్మ తత్త్వాన్నిఅదే మార్గంలో ఆది శంకరుడు తెలియ జేశారు!</p>
<p dir="ltr">మనో బుద్ధ్య హంకార చిత్తాని నాహం న కర్ణం న జిహ్వా న చ ఘ్రాణ నేత్రే<br>
నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు: చిదానంద రూపశ్శివోహం శివోహం</p>
<p dir="ltr">నేను మనసునూ కాను, బుద్దినీ కాను, అహంకారమునూ కాను,చిత్తమునూ కాను, నేను కర్ణములనూ కాను, నేను జిహ్వనూ కాను, నేను ఘ్రాణ ఇంద్రియము ఐననాసికనూ కాను,నేను చక్షురింద్రియము ఐన నేత్రములనూ కాను. నేను ఆకాశమునూ కాను, నేను భూమినీ కాను నేను తేజస్సునూ కాను, నేను వాయువునూ కాను, చిదానంద రూపుదనైన శివుడనే, శివుడనే. నేను అంతః కరణ చతుష్టయము ఐన మనసు, బుద్ధి, చిత్తము, అహంకారములను కాను. నేను జ్ఞానేద్రియములైన త్వక్, చక్షు, శ్రోత్ర, (జిహ్వ)రసన, ఘ్రాణ ఇంద్రియములు అంటే చర్మము, కనులు, చెవులు, నాలుక, నాసిక(ముక్కునూ) కాను.అంటే 'నాకోసం' అని ఎవరి కోసం అయితే చర్మము ద్వారా, కనుల ద్వారా, చెవుల ద్వారా, నాలుక ద్వారా, ముక్కు ద్వారా ఆనందాన్ని అనుభవిస్తున్నాను అని అనుకుంటున్నానో ఆ అనుభవించేది నేను కాను. ఆ అనుభవము నాదీ కాదు. అంటే అనుభవించే వాడు వేరే, నేను కాదు. అంటే నాకోసం అని తుచ్చమైన ఆనందాలకు నేను లోను కానవసరం లేదు, కాకూడదు, అంటే నేనే కాదు, ఎవరూ కూడా లోను కావలసిన అవసరం లేదు. ఎందుకంటే వీటి ద్వారా కలిగే ఆనందాలు క్షణికాలు కనుక! నేను పంచ మహా భూతములు ఐన పృదివ్యాపస్తేజో వాయురాకాశములను కాను.అంటే నేను భూమిని కాను, జలమును అంటే నీరునూ కాను, తేజస్సు అంటే అగ్నినీ కాను, నేను వాయువునూ కాను, ఆకాశమునూ కాను. పంచ భూతాత్మకమైన ఈ శరీరమును నేను కాను. ఎందుకంటే పంచ భూతాత్మికమైన ఈ శరీరం పంచభూతములలో కలిసిపోతుంది కనుక. ఇక్కడి ఇంకొక రహస్యం ఏమిటంటే పంచ తన్మాత్రలైన శబ్ద, రూప, స్పర్శ, రస, గంధములనుండి వరుసగా పంచ మహా భూతములు ఐన ఆకాశము,అగ్ని,వాయువు, జలము, భూమి ఉద్భవించాయి, వీనిని గ్రహించడానికి, అనుభవించడానికి వరుసగా పంచ జ్ఞానేంద్రియములు ఐన చెవులు, కనులు, చర్మము, జిహ్వ, నాసిక ఉద్భవించాయి. వీటి ద్వారా ఈ జ్ఞానములు అనుభవం లోకి వస్తాయి కనుక వీటిని జ్ఞానేంద్రియములు అన్నారు.</p>
<p dir="ltr">నచ ప్రాణ సంజ్ఞో నవై పంచ వాయుర్నవా సప్త ధాతుర్నవా పంచ కోశః<br>
న వాక్ పాణి పాదౌ నచోపస్థ పాయు చిదానంద రూపశ్శివోహం శివోహం</p>
<p dir="ltr">నేను ప్రాణ వాయువులైన ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయు సంఘమును కాను, సప్త ధాతువులైన రక్త, మాంస, మేథ, అస్థి, మజ్జ, శుక్ర, రసములను కాను, నేను అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములనే పంచ కోశములను కాను, నేను పంచ కర్మేంద్రియములైన వాక్కు, చేతులు, పాదములు, కామయిచ్చను తీర్చుకునే ఇంద్రియమును కాను, విసర్జక అవయవ ఇంద్రియమునూ కాను, చిదానంద రూపుడనైన శివుడనే, నేను శివుడనే!</p>
<p dir="ltr">న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ మదో నైవ మే నైవ మాత్సర్య భావ<br>
న ధర్మో నచార్దో న కామో న మోక్షః చిదానంద రూపశ్శివోహం శివోహం</p>
<p dir="ltr">నాకు ద్వేషము లేదు, రాగము లేదు, నాకు లోభము లేదు, మోహము లేదు, నాకు మదము కానీ, మాత్సర్యము కానీ లేవు, నాకు ధర్మము, అర్ధము, కామము, మోక్షము లేవు, నేను చిదానంద రూపుడనైన శివుడనే, నేను శివుడనే! అనగా నాకు ఏ ద్వంద్వములూ లేవు, నాకు యే పురుషార్ధములూ లేవు, ఎందుకనగా, నేను భౌతిక శరీరాన్ని కలిగిన మానవుడిని కాను కనుక, నేను సాక్షాత్తూ శివుడను కనుక, మానవ సహజమైన మంచి చెడులకు అతీతుడను కనుక!</p>
<p dir="ltr">న పుణ్యం న పాపం న సౌఖ్యం న దు:ఖం న మంత్రో న తీర్ధం న వేదా న యజ్ఞ<br>
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానంద రూప శ్శివోహం శివోహం</p>
<p dir="ltr">నాకు పుణ్యము లేదు, పాపమూ లేదు, సౌఖ్యము లేదు, దు:ఖము లేదు,మంత్రము, తీర్ధము,వేదము, యజ్ఞము, ఏవీ లేవు. నేను అనుభవమును కాను, అనుభవించుట యను క్రియనూ కాను, అనుభవించే వాడినీ కాను, నేను చిదానంద రూపుడనైన శివుడను, నేను శివుడను!</p>
<p dir="ltr">న మృత్యుర్నశంకా నమే జాతి భేద: పితా నైవ మే నైవ మాతా చ జన్మ<br>
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః చిదానంద రూపశ్శివోహం శివోహం</p>
<p dir="ltr">నాకు మృత్యువు లేదు, శంకా లేదు, జాతి భేదములు లేవు, నాకు తల్లి లేదు, తండ్రి లేడు, జన్మ లేదు, నాకు బంధువులు లేరు, మిత్రులు లేరు, గురువు లేడు, శిష్యులు లేరు, నేను చిదానంద రూపుడనైన శివుడనే, నేను శివుడనే! జనన, మరణములు, జాతి భేదములు, తల్లి దండ్రులు, గురు శిష్యులు, ఏ బంధములు లేవు, ఎందుకనగా, నేను శివుడను కనుక, అన్ని బంధములకు, అనుబంధములకు అతీతుడను కనుక!</p>
<p dir="ltr">అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణామ్<br>
న చా సంగతం నైవ ముక్తిర్నబంధః చిదానంద రూపశ్శివోహం శివోహం</p>
<p dir="ltr">నేను నిర్వికల్పుడను అనగా నాకు వేరే సాటి ఐనది లేదు, నేను నిరాకారుడను, ఎందుకంటే ఈ ఆకారం శాశ్వతం కాదు కనుక, అన్నింటికీ, అంతటా అన్ని ఇంద్రియములకూనేనే అధిపతిని, నాకు సంబంధించినవి, సంబంధించనివి ఏవీ లేవు, నాకు ముక్తి లేదు, బంధమూ లేదు, నేను చిదానంద రూపుడనైన శివుడనే, నేను శివుడనే! 'మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహం' మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే నాలుగువిధములైన అంతఃకరణ ప్రవృత్తులు వున్నాయి. మనసు అన్నింటికీ అధిపతి. లేని దాన్ని ఉన్నట్లుగా, తనది కాని దాన్ని తనదే అన్నట్లుగా, క్షణికమైన దానిని శాశ్వతమన్నట్లుగా మరులు గొల్పుతుంది, వుసి గొల్పుతుంది, పురి కొల్పుతుంది, భ్రమింప జేస్తుంది, మరిపిస్తుంది, మురిపిస్తుంది, ఆకాశానికి ఎత్తేస్తుంది, అందలాలెక్కిస్తుంది, అధః పాతాళానికి తొక్కేస్తుంది.</p>
<p dir="ltr">కనుకనే మనసే అన్నింటికీ కారణం, ప్రేరణం, ఉత్ప్రేరకం, వినాశకరం. అందుకే ' మన ఏవ మనుష్యాణామ్ కారణం బంధ మోక్షయో:' మనుషుల బంధాలకు, మోక్షానికి కారణం మనసే అన్నది ఒక ఉపనిషత్తు! 'ద్వే శబ్దే బంధ మోక్షాయ మమేతి న మమేతిచ, మమేతి బధ్యతే జంతు: న మమేతి విముచ్యతే., 'నాది', 'నాది కాదు' అనే రెండు శబ్దాలే బంధానికీ, మోక్షానికీ కారణాలు, నాది అనుకుంటే బంధం, ఎందుకంటే నాది అనే దానితో మొదలై, నాది మాత్రమే, నాకు మాత్రమే, నాకు కాకున్నా పరవాలేదు ఎవరికీ కాకూడదు, నాది కాకున్నా పరవా లేదు, ఎవరిదీ కాకూడదు, ఎవరికీ చెందకూడదు..అనే దాకా దారి తీస్తుంది. ఆది వినాశనానికి దారి తీస్తుంది. ఈ నాడు సమాజంలో జరుగుతున్న హింసకు, దౌర్జన్యానికీ అదే కారణం! బుద్ధి విచక్షణను కలిగిస్తుంది. మంచి, చెడులను గ్రహింప గలుగుతుంది. చిత్తము తన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించేలా చేస్తుంది.</p>
<p dir="ltr">అహంకారం మహదహంకారం(గొప్ప అంధకారం) మిధ్యాహంకారం (మిధ్యాన్ధకారం) అని రెండు రకాలుగా ఉన్నది. అహంకారం అంటేనే అంధ కారం. సృష్టికి మొదలు మహా అంధకారం వ్యాపించి వున్నది. ఏదీ తెలియని బ్రహ్మ దేవుడు తనకన్నా పరమాత్ముడు ఐన వాడిని ప్రార్ధిస్తే ఆ శ్రీ మహా విష్ణువు తన తేజః పుంజములతో దానిని తొలగించి కరుణిస్తే, అప్పుడు బ్రహ్మ తన సృష్టిని కొనసాగించాడు అని పురాణ గాధ. నేను అనేది సాత్త్వికాహంకారం, నేను కూడా అనేది రాజసిక అహంకారం, నేను మాత్రమే అనేది తామసిక అహంకారం! నేను ఏమిటి, ఎవరు, ఎందుకు, ఎక్కడి నుండి, ఎక్కడికి అనే అన్వేషణ సాత్త్వికమైనది, మనిషిని వున్నతుడిని చేస్తుంది. నేను కూడా అనేది రాజసికమైనది, నాకూ ఒక ఉనికి, ఒక సత్తా ఉంది అనే సాధనకు ఉపకరిస్తుంది. ఈ రెండూ మంచివే.అవసరమైనవే. నేను మాత్రమే, నాకు మాత్రమే, నాది మాత్రమే అనేది తామసికమైనది, అది దాన్ని కలిగివున్నవాడిని, వాడి ద్వారా సర్వాన్నీ నాశనం చేస్తుంది. ఈ నాశనానికి చిత్తం బాటు వేస్తుంది, చిత్తం వచ్చినట్లు ప్రవర్తించడం ద్వారా, దానికి మనసు కారణమౌతుంది సరిగా వుపయోగించకుంటే, మనసే అన్నింటికీ కారణం కనుక దానిని బుద్ధికి స్వాధీనం చేసి, అప్పుడు బుద్ధి ద్వారా కలిగిన విచక్షణతో మంచి చెడులను తెలిసికొని, మంచిని గ్రహించి, చెడును విసర్జించాలి కనుక బుద్ధి పరమాత్మ తత్త్వం. ఉపనిషత్తులు అన్నీ ఇదే చెప్పాయి.</p>
<p dir="ltr">"ఆత్మానగుం రధినం విద్ధి శరీరం రధమేవతు బుద్ధించ సారధిం విద్ధి, మనః ప్రగ్రహమేవచ,<br>
ఇన్ద్రియాణి హయాన్యాహు: తేషాం విషయ గోచరాన్, ఆత్మేంద్రియ మనో యుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః " ... అన్నది ఒక ఉపనిషత్తు. అంటే శరీరమే రధము. ఆత్మ అంటే పరమాత్మ స్వరూపి ఐన జీవాత్మ రధికుడు. అంటే రధాన్ని ఎక్కేవాడు. బుద్ధి సారధి. అంటే పరమాత్మ రూపకమైన బుద్ధి ఈ రధాన్ని నడిపితే, గుర్రములవంటి ఇంద్రియములను మనసుఅనే కళ్ళెంతో అదుపు చేస్తూ, పరమాత్ముడి సారధ్యంలో, సర్వం ఆయనకే అప్పగించి, నమ్మి,కూర్చుంటే రధాన్ని క్షేమంగా గమ్యానికి నడుపుతాడు, కనుక మనసు అనే కళ్ళెమును కూడా సారధి ఐన పరమాత్ముడికి అప్పగించాలి అంటే మనసును పరమాత్ముని యందు లగ్నం చేయాలి. ఆత్మ, ఇంద్రియాలు, మనసు కలిగిన వాడిని భోక్త అంటారు, దానికి బుద్ధిని కూడా జోడిస్తే ఆ భోక్తృత్వభావన నశిస్తుంది. అప్పుడు నేను చేస్తున్నాను, చూస్తున్నాను, అనుభవిస్తున్నాను అనే భావన నశిస్తుంది. అప్పుడు సుఖ దు:ఖాలూ, రాగ ద్వేషాలు, బంధ మోక్షాలూ, మంచీ చెడూ, ఇలాంటి ద్వంద్వాలు నశిస్తాయి. శివమే అంటే శాంతమే, సౌఖ్యమే, ఆనందమే మిగులుతుంది. కనుక శివోహం, శివోహం! బుద్ధికి అప్పజెప్పి ప్రయాణం చేస్తే కర్మేంద్రియాలూ, జ్ఞానేంద్రియాలూ దారి తప్పవు, మంచికర్మలే మిగులుతాయి, మంచిజ్ఞానమే మిగులుతుంది అప్పుడు శివుడౌతాడు మానవుడు, కనుక ఇంతా కలిగిన శివుడనే నేను! సప్త ధాతువులు, పంచ ప్రాణాలు, పంచ కోశాలు, బంధాలు, భవ బంధాలు, అనుబంధాలు, సంబంధాలు అన్నీ నేను దేహం అనుకుంటే అవి గెలుస్తాయి, నేను దేహమును కాను, ఎందుకంటే దేహం శాశ్వతం కాదు కనుక, అని తెలిసికొంటే దేహం నశిస్తుంది, ఆత్మ రహిస్తుంది, ఆత్మ మిగులుతుంది, ఆ ఆత్మ పరమాత్మ తత్త్వం కనుక, 'జీవం ఉన్నంతకాలం జీవునితో వుండి తరువాత దేవునితో కలిసిపోతుంది' కనుక, దానికి మరణం లేదు, కనుక ఆది శాశ్వతం. ఈజ్ఞానం కలిగితే దేహం ద్వారా వచ్చే ఏ మంచి చెడు, సుఖ దు:ఖాలు, మొదలైన ద్వంద్వాలుండవు కనుక అప్పుడు మిగిలేది పరమానందమే, కనుక నేను శివుడను, నేను శివుడనే! మనసును బుద్ధి ద్వారా నియమించుకుని కామ,క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములను జయించి, కర్మేన్ద్రియములను, జ్ఞానేన్ద్రియములను, ప్రాణ వాయువులను, సప్త ధాతువులను,పంచమహాభూతాలను, పంచ కోశాలను జయించి అంటే ఇవన్నీ జయించడం ద్వారా మిగిలిన పరమానందమును అనుభవించడం ద్వారా చిదానంద రూపుడైన శివుడను నేను, శివుడనే నేను!</p>
<p dir="ltr">యద్వాచా నాభ్యు దితం యేన వాగభ్యుధ్యతే ....<br>
యన్మనసా న మనుతే ఏనాహుర్మనోమతం ....<br>
యత్ చక్షుసా న పశ్యతి యేన చక్షూగుమ్సి పశ్యతి....<br>
యత్ శ్రోత్రే ణ న శ్రుణోతి యేన శ్రోత్రమిదం శ్రుతం...<br>
యత్ ప్రాణేన న ప్రాణితి యేన ప్రాణాః ప్రణీయతే...<br>
తదేవ బ్రహ్మ త్వం విద్ధి నేదం యదిద ముపాసతే!!!</p>
<p dir="ltr">ఏది వాక్కుల ద్వారా తెలిసికొన బడ జాలదో, దేని ద్వారా వాక్కు పలుకడం జరుగుతుందో, ఏది మనసు ద్వారా తెలిసికొన బడజాలదో, దేని ద్వారా మనసు దేనినైనా తెలిసికొన గలుగుతుందో, ఏది కనుల ద్వారా చూడ బడ జాలదో, దేనిద్వారా కనులు చూడ గలుగుతాయో, ఏది చెవుల ద్వారా వినబడ జాలదో దేని ద్వారా చెవులు విన గలుగుతాయో, ఏది ప్రాణములచేత జీవింపదో, దేని ద్వారా ప్రాణములు జీవింప గలుగుతాయో అదియే బ్రహ్మము, వేరేది ఏదీ కాదు, అని చెప్పింది ఒక ఉపనిషత్తు. రెండు పెదవులు, ముప్పై రెండు పళ్ళూ, నాలుక, కొండ నాలుక వున్నవాళ్ళు కూడా పలుకలేని వారు వున్నారు, మూగ వాళ్ళు, అంటే వీటన్నింటికీ పలుకును ఇచ్చే శక్తి ఒకటి వున్నది కదా, ఆది లేక పోతే ఇవన్నీ వున్న వాళ్ళు కూడా పలుకలేరు కదా, కళ్ళు, కను బొమలు, కను గుడ్లు అన్నీ సరిగా వున్నా చూపులేని వాళ్ళు గుడ్డివాళ్ళు వున్నారు, అంటే వీటన్నింటికీ చూపును ఇచ్చే శక్తి ఒకటి వేరేది వున్నది, అలాగే చెవులున్నా, కర్ణభేరి వున్నా మిగిలినవి అన్నీ సరిగా వున్నా వినలేని చెవిటి వాళ్ళు వున్నారు, అంటే వీటన్నిటికీ విన గలిగిన శక్తిని ఇచ్చే శక్తి ఒకటి వున్నది కదా, ప్రాణములు వున్నప్పుడూ తెలియబడనిది, అదేదో తెలియనిది ఐన ఏది లేకుంటే ప్రాణములు లేకుండా పోతాయో, దానివల్లనే ప్రాణములున్నట్లు, జీవం వున్నట్లు కనిపిస్తుందో, .అదియే బ్రహ్మము. అంటే కేవలం పైకి కనిపించే నోరు, కళ్ళు, చెవులు,ఇవన్నీ సరిగా వున్నా అవి పని చేయకుండ పోతాయి, అంటే వీటికి శక్తినిచ్చే శక్తి ఒకటి ఉందికదా, అదే బ్రహ్మం. పంచకర్మేంద్రియాలూ, పంచ జ్ఞానేంద్రియాలు అలాగే వున్నా ప్రాణం లేని శరీరం ఎందుకూ పనికిరాదు, ఏదీ చేయ లేదు. నోరున్నా పలుకలేదు, చేతులున్నా పనులు చేయ లేవు, కాళ్ళు వున్నా నడువలేవు, కామేంద్రియం వున్నా పని చేయదు, కామం వుండదు, విసర్జక అవయవం వున్నా విసర్జించే శక్తి వుండదు , చర్మం వున్నా స్పర్శను గ్రహింపలేదు, కనులు వున్నా చూడలేవు, చెవులు వున్నా వినలేవు, నాలుక వున్నా రుచి చూడ లేదు, ముక్కు వున్నా వాసన చూడలేదు, సప్త ధాతువులూ వున్నా వాటి పని అవి చేయ లేవు, పంచ కోశాలు వున్నా పనికి రావు. ఇవన్నీ వున్నా ఏది లేకుంటే ఇవన్నీ లేనట్లే లెక్కనో అదే ప్రాణ శక్తి, అదే బ్రహ్మం, అదే జీవం, అదే నాదం, అదే వేదం! కనుక ఆ శక్తిని మాత్రమే శాశ్వతము ఐన శక్తిగా తెలిసికొంటే మిగిలినవన్నీఅశాశ్వతాలు అని తెలిసికొనడం జరుగుతుంది. అప్పుడు మిగిలిన వాటి ద్వారా వచ్చే సుఖ దు:ఖాలు, జయాపజయాలు,</p>
<p dir="ltr">క్షణికమైనవి అని తెలుస్తుంది, ఆనందమే మిగులుతుంది, కనుక శివుడనై పోతాను కనుక నేను శివుడను, నేను శివుడనే!</p>
<p dir="ltr">"అశబ్ద మస్పర్శ మరూప మవ్యయం<br>
తథా అరసం నిత్య మగంధ వచ్చయత్<br>
అనాద్యనంతం మహతః పరం ధృవం<br>
నిచాయ్య తన్మ్రుత్యు ముఖాత్ప్ర ముచ్యతే"</p>
<p dir="ltr">అన్నది ఒక ఉపనిషత్తు ఇదే భావాన్ని తెలియజేస్తూ. ఈ జ్ఞానం కలిగినప్పుడు మృత్యువు లేకుండా పోతుంది, పుట్టుకే శాశ్వతం కాదు అని తెలిస్తే మృత్యువూ శాశ్వతం కాదు అని తెలుస్తుంది కనుక మృత్యువు వుండదు, ఇదంతా అశాశ్వతం అని తెలుస్తుంది కనుక ఇవన్నీ పోయేవే అని తెలుస్తుంది కనుక భయం వుండదు, ఆ భయమే మృత్యువు, ఆ బలహీనతే మృత్యువు, తెలిసికొన్న ఆ శాశ్వత సత్యం, ఆ శక్తి అదే జీవం, ఎందుకంటే దానికి చావు, అంతం అనేది లేదు కనుక, ఇదే భావాన్ని స్వామి వివేకానంద చెప్పింది! ఇక్కడ చావు వుండదు అంటే పుట్టుకా శాశ్వతం కాదు, చావూ శాశ్వతం కాదు, అవి సహజ ధర్మాలు,అనివార్యాలు అని తెలియడం వలన కలిగే జ్ఞానం వలన కలిగే ఆనందం వలన మృత్యు భీతి వుండదు, కనుక మృత్యు భావం వుండదు, కనుక మృత్యువు వుండదు అని అర్థం, అంతే కానీ, ఈ జ్ఞానం కలిగిన వాడు శారీరకంగా చిరంజీవి అని కాదు, శరీరానికే మృత్యువు, ఆత్మకు కాదు అని తెలిసికొనడం వలన కలిగే చావులేని ఆత్మజ్ఞానం అని అర్థం! ఎందుకంటే ఆ ఆత్మకు చావు లేదు కనుక. ఇదే శ్రీ కృష్ణుడు అర్జునునితో చెప్పింది!</p>
<p dir="ltr">ఇన్ని ఉపనిషత్తుల మర్మాలను స్ఫురింపజేస్తూ, నిత్యమూ శివమూ, శాంతమూ, అద్వైతమూ ఐన పరమాత్మఅనుభవమునకు సంబంధించిన బ్రహ్మానందానుభూతిని పొందటానికి కావలసిన సాధనా విధానాన్ని, భావనా విధానాన్ని ఈ 'నిర్వాణ షట్కము' లో తెలిపి పరమోత్క్రుష్టమైన వేదాంత దర్శనం చేశారు ఆదిశంకరాచార్యుల వారు. నా అల్పబుద్ధికి అందినమేరకు ఆ విషయాన్ని ఇక్కడ ఇవ్వడానికి ప్రేరణనిచ్చిన ఆదిశంకరుల పాదపద్మములకు వినయంగా అంజలిస్తూ, స్వస్తి!<br><br><br></p>Alapati Ramesh Babuhttp://www.blogger.com/profile/10902788241134698143noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2337893138436064619.post-60861878699608505812020-08-04T18:58:00.001+05:302020-08-04T18:58:25.462+05:30రామో విగ్రహన్ ధర్మః<p dir="ltr">రామో విగ్రహన్ ధర్మః<br>
ఈ వాక్యం రాముని ధర్మనిరతిని సూచిస్తూ పలువురు ప్రస్తావిస్తారు. అయితే రామాయణం లో ఈ వాక్యాన్ని వాల్మీకి గారు మారీచునితో అనిపిస్తాడు. వినటానికి మనకు గమ్మత్తుగా వున్నది. మారీచుడు ఏమిటి రాముని అంతలా విగ్రహన్ ధర్మః అనే అంతగా...వివరాలు లోకి వెళితే ...మారీచుడు రావణాసురిని వద్ధ ముఖ్యుడు. ఏంత అంటే రావణాసురిని అంతరింగక వర్గంలోని ముఖ్యుడు రావణాసురిని బంధువు. తాటకి కుమారుడు. తాటకి రావణాసురిని అమ్మమ్మ. అంటే మారీచుడు రావణాసురుని మేనమామ. ఇది వారి సంబంధం. ఇంత విశ్వసనీయత వారి మధ్య వున్నది.<br>
రావణుడు మారీచుని సీతాపహరణంనకు ఆజ్ఞాపించాడు. ఆ సమయంలో మారీచునకు అంతకు క్రితమే విశ్వామిత్రులతో యాగసంరక్షణార్ధం వచ్చిన రాముని చేతిలో తనతల్లి మరణం , తనసోదరుడు సుబాహు మరణం ఇత్యాదులవలన మరియు సహజ సిద్ధమైన తన రాక్షసమాయలతో ప్రజలద్వారా చారుల ద్వారా ఇలే అనేక విధాలుగా రామచంద్రుని ధర్మనిరతి ఆయన వీరత్వం కర్తవ్యపరాయణత్వం రాముని బాణం యొక్క వాడి వేడి తెలిసిన వాడగుటచేత రావణాసురునికి సీతాపహరణం కూడదు అని హితవు చెప్పే సమయంలో రావణాసురిని ఉద్దేశించి ఉద్దశేంచి " రామో విగ్రహన్ ధర్మః" అని ప్రస్తావిస్తాడు. రావణా విను రాముడు మామూలు వాడు కాదు ధర్మం పోత పోసి సశరీరంగా నడయాడే స్వరూపం అటువంటి ధర్మశిఖతో ప్రజ్వరిల్లే రాముని ధర్మపత్నిని అపహరించమంటున్నావు నీవు శలభంలా మాడిపోతావు అంతేకాదు నీవు , నీతో అనుసరించిన నేను , మేము కడకు ఈ రాక్షసజాతి వినాశనమునకు ,లంకకు మంగళకరము కాదు అని పలువిధాలా బ్రతిమలాడుతాడు కాని వినడు చివరకు విధిలేని పరిస్థితి లో బంగారు జింక వేషం ధరించి వెళ్ళి రామబాణం తగిలి మరణిస్తాడు కాని రాక్షస బుద్ధిగా చనిపోయో సమయంలో హలక్ష్మణా అనే ఆర్తనాదాలు చేసి చనిపోతాడు.తదుపరీ సీతాపహరణం , ఆతదుపరి రావణసంహరం . ఇది అంతా రాముని ధర్మనిరతిని తెలుసుకోవటమో. అందుకే రామో విగ్రహన్ ధర్మః.<br>
అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు.<br>
శ్రీరామ జయం.<br>
ఆలపాటి రమేష్ బాబు<br>
విజయవాడ.<br>
<a href="tel:9440172262">94401 72262</a>.</p>Alapati Ramesh Babuhttp://www.blogger.com/profile/10902788241134698143noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2337893138436064619.post-57824910037985289932020-08-04T18:55:00.001+05:302020-08-04T18:55:26.475+05:30లోకఃసమస్తా సుఖినో భవంతు<p dir="ltr">లోకఃసమస్తా సుఖినో భవంతు.<br>
*********************************<br>
లోకః సమస్తా సుఖినోభవంతు. ఈ వాక్యం మనలో చాలా మంది అనేకసార్లు విని , చదవి వుంటారు. కాని దీని విశేషం తెలుపుటతో పాటు <br>
వర్తమాన కాల అన్వయం చేసి మన భరతజాతి గొప్పదనాన్ని పునఃశ్చరణ చేయిటయే ఈ వ్యాస ముఖ్యోద్దేశ్యం.<br>
మన భరతజాతి లో హైందవం అనేది నేడు మతము అయినా ఇది ఓ జీవనమార్గం అనేది సత్యం.<br>
మనం తెలుసుకో కోరే వాక్యం స్వస్తి వచనాలలో ఓ భాగంగా వున్నది. ఈ స్వస్తి వాక్యాలు మనం విశేషకార్యక్రమాలు నిర్వహించినప్పడు ఆకార్యక్రమం చివరలో బ్రహ్మగారు ఈ క్రింది మంత్రాలతో దీవిస్తారు అవి...<br><br></p>
<p dir="ltr">*******<br>
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం!</p>
<p dir="ltr">న్యాయేన మార్గేణ మహీం మహీశాః!!</p>
<p dir="ltr">గోబ్రాహ్మణ్యేభ శ్శుభ మస్తు నిత్యం!</p>
<p dir="ltr">లోకాస్సమస్తా స్సుఖినోభవంతు !!</p>
<p dir="ltr">కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యస్యాలినీ!<br>
దేశోయం క్షోభ రహితో బ్రాహ్మణా స్సంతు నిర్భయాః!!<br>
అపుత్రాః పుత్రిణస్సంత్తు,పుత్రిణస్సంత్తు పౌత్రిణః!<br>
అధనా స్సధనా స్సంతు జీవంతు శరదాం శతం!!<br>
యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే!<br>
వృతనాళౌ సమభవత్ తత్తే భవతు మంగళం!!<br>
ఋతవ స్సాగరా ద్వీపా వేదా లోకా దిశశ్చతే!<br>
మంగళాని మహారాహో దిశంతు తవ సర్వదా!!</p>
<p dir="ltr">పై శ్లోకాలు కి అర్ధం <br>
శుభం కలుగుగాక! ప్రజలకి, న్యాయమార్గంలో వుండి ఈ భూమిని ప్రజలను ,రక్షించు ప్రభువులకి. <br>
గోవులు , బ్రాహ్మణులకు సదా శుభం కలుగుగాక.<br>
లోకములో అందరు శుభముగా వుందురుగాక.<br>
అన్నీకాలములలోను భూమిపైన వర్షాలు కురిసి పంటలు పచ్చగా పండుగాక.<br>
దేశాలు అన్నీ ఈతి భాధలు కరువు కాటకాలు లేకుండా వుండుగాక , బ్రాహ్మణులు వారి సంతానం వారి గురుకులాలు శుభంగా వుండుగాక.<br>
పుత్రులు లేని వారికి పుత్రులు , పుత్రులు వున్నవారు పౌత్రులు ప్రపౌత్రులతో శుభంగా వుండుగాక.<br>
ధనంలేని వారు ధనం కలిగి , ధనం కలిగిన వారు పాడి పంటలతో చల్లగా వందసంవత్సరాలు జీవింతురుగాక.<br>
మాకు జయం కలిగించు ఇంద్రాది దేవతలకి శుభం.<br>
ఈ జీవనచక్రమార్గం నుంచి ఆత్మదర్శనం కావించే భగవంతునికి శుభం.<br>
సకల సమాయాలలో సకల దిక్కులలో శుభం కలుగుగాక.<br>
చూశారా వేల సంవత్సరాలుగా ఈ వేదభూమిలో ప్రతి ఓక్కరి మనుగడ ప్రతి జీవ జాలం మనుగడే మన కాంక్ష ఆకాంక్ష...ఈ పద్ధతే మన జీవన విధానం.<br>
కాని వర్తమానం లో ఈ భూగోళం పై జరుగుతున్న విధానం ఏమిటి... మేము మాత్రమే బాగుండాలి అన్న అహంకార పూరిత విధానం ప్రదర్శించిన ప్రతి సమయంలో కాలపురుషుడు ప్రకృతి రూపంలో ఈ వైపరిత్యం ను సమం చేసే వెళుతున్నారు...కాలపురుషుడు తన పాఠాలు నిర్దయగా చెప్పుకుంటూ వెళుతున్నా మూర్ఖ పద్ధతిలో వున్న అనేక దేశాలకి వర్తమాన వైరస్ ఓక దండనే...ఈ వైరస్ ప్రారంభ దేశం నుంచి గమనించండి...వాళ్ళు నిజం చెప్పటానికి సిద్ధంగా లేరు కాని..ఆ దేశంలో అనేక వేల మరణాలు...మరి అగ్ర రాజ్యంలో మరణాలు లెక్క కొనసాగుతుంది...మతవాదంతో , కుట్రలు కుహకాలతో నిండిన ఇటలి పీనుగల పోగు...మరి కొన్ని దేశాలది అదే పరిస్థితి... అంత ఎందుకు మన ప్రక్కనే వుండే పాకిస్థాన్ పరిస్థితి ఏమిటి వున్నవాడు ఎవరో చచ్చేవారు ఎవరో తెలియని దిక్కుమోక్కులేని స్థితి....<br>
ఇలా గమనించండి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే భారతదేశం బాగానే వున్నది. మేమే బాగుండాలి అన్న ప్రతి ఓక్క దేశంనకు ఈ కరోనా వైరస్ శిక్ష గా తన భాధ్యత నేరవేర్చాడు కాలపురుషుడు.</p>
<p dir="ltr">"లోకః సమస్తా సుఖినో భవంతు"<br>
" మన సంకల్పం ఓకటై వుండుగాక<br>
మన భావం ఓకటై వుండుగాక<br>
మన చింతన ఓకటై వుండుగాక<br>
మన మధ్య అద్భుతమైన సామరస్యం నెలకొనుగాక"<br>
(అధర్వ - 6 - 64 - 4)<br>
ఓం శాంతి శాంతి శాంతిః.<br>
శ్రీరామ జయం.<br>
ఆలపాటి రమేష్ బాబు<br>
విజయవాడ<br>
<a href="tel:9440172262">94401 72262</a>..<br><br><br><br><br></p>Alapati Ramesh Babuhttp://www.blogger.com/profile/10902788241134698143noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2337893138436064619.post-11170450563332224022020-08-04T18:53:00.001+05:302020-08-04T18:53:38.464+05:30రుద్ర నమక చమక పారాయణ విశేషాలు<div>మిత్రులు,</div><div>నమస్కారం...</div><div>మనవారు తమ జీవన ఆనందాలకి కృతజ్ఞతలు మరియు కష్టనష్టాల నివేదనకు రుద్రాభిషేకం, అభిషేకం చేశాం చేస్తాం..మరి ఈ అభిషేకంలో అయ్యవారు కొన్ని మంత్రాలు చదువుతారు చివరకు మనకు రెండు చుక్కల తీర్ధం ఇస్తే పుచ్చుకుని వస్తున్నాం. ఆ భోళాశంకరుడు మన మన ప్రాప్త , అప్రాప్తలను బట్టి తన కరుణప్రసాదిస్తున్నారు. మరి ఇంతటి రుద్రాభిషేకంలో ఏమున్నాయి..మనం స్వామి వారిని ఏమి అడుగుతున్నాం స్వామి వారిని ఏ ఏ ప్రదేశాలలో దర్శిస్తున్నామో తెలుసా..వీటిని తెలియచెప్పేది . ఈ రుద్రాభిషేకవిధిలో వున్నవి మహన్యాసం , రుద్రనమక , చమకాలు.</div><div>శివుని (రుద్ర) దర్శించాలంటే శివుడు కానివాడు శివుని చూడలేరు. అంటే స్థిరచిత్తంతో ధ్యానంలో వున్న శివుని అంతే స్థిరచిత్తంతో మీ ఆత్మనందు మీ మనస్సు నందు స్థిర పరచిన కాని ఆయన దర్శనం కాదు..ఆయనను స్పృశించలేము. మరి స్వామిని స్పృశించటం అంటే అగ్నిశిఖలా ప్రజ్వరిల్లే స్వామిని ఈ కారణభూత శరీరంతో ఎలా స్పృశించాలో తెలియచేసే ప్రక్రియ మహన్యాసం.దీనిని రౌద్రికరణ అంటారు. ఈ ప్రక్రియలో ఐదురకాల అంగన్యాసాలు వుంటాయి..అంటే శిఖాది పర్యంతం పాదాంతం వరకూ శుద్ధి చేతనత్వం కలిగించే ప్రక్రియ ఈ మహన్యాసం.</div><div>గమనించారా అయ్యవారు మనలను పైకి క్రిందకూ చూడమంటారు. మన సహస్రారం నుండి పాయువు వరకూ , మన శిఖ నుండి అరి పాదం వరకూ ప్రతి అంగాన్ని స్పృశించి శుద్ధి చేయమంటారు. ఈ సమయంలో ఆయా ప్రదేశాలలో వున్న అంతఃశ్చక్రశక్తిని సమంత్రపూర్వకంగా చేతనత్వం కలిగించటమే ఈ మసన్యాస లక్ష్యం.</div><div>దీని తదుపరి రుద్రనమక,చమకపారాయణ చేస్తారు. మరి ఇవి ఏమిటి ....</div><div>రుద్రపారాయణ..ఇది శివుని వైభవాన్ని ప్రస్తుతించే మంత్రాలు..ఇందు శివుడు ఏక్కడ ఏక్కడ వున్నాడో తన దర్శనాలు , ప్రజ్ఞ ,కరుణ ఇత్యాది అనేకానేకం ఈ రుద్రంలో వుంటాయి.</div><div>ఇది మొదట రుద్రం ఇది రుద్రధ్యానం..తదుపరి నమకం... ఇందు శివుని ప్రస్తుతించుతూ 11 అనువాకాలు వుంటాయి..ఈ 11అనువాకాలలో ఈ సృష్టిలోని జీవ అజీవ పశు పక్ష్యాదులు సూర్య చంద్రగోళాదులు సకల దిక్కులు సకల చర అచర ప్రపంచం మొత్తంలో శివుని దర్శించుతూ అంజలి ఘటించటం అనగా నమస్కరించటం..ఇది ఏ విధంగా వుంటుందో క్లుప్తంగా ప్రథమ , పదకొండవ అనువాకాలు మీకు తెలియచేస్తాను..</div><div>ఇక్కడ నేను మంత్రాలు తెలుపను వచనం మాత్రమే..</div><div>మొదటి అనువాకం :</div><div>:</div><div>భగవంతుడైన రుద్రునికి నా నమస్కారములు. ఓ రుద్ర! నీ శరములకు, ధనుస్సుకు, బాహువులకు నమస్కారము. ఎంతో శుభకరమైన నీ అమ్ముల పొది, అస్త్ర శస్త్రముల్తో మాకు ఆనందాన్ని కలిగించు. వెండి కొండ పైనుండి మమ్మల్ని ఆనంద పరిచే ఓ రుద్రా! ఎంతో శాంతి కలిగిన, శుభకరమైన, పాపరహితమైన, మోక్షకరమైన, ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళే నీ వీక్షణములను మా వైపు ప్రసరించు. మాకు ఆత్మ జ్ఞానాన్ని కలిగించు. ధవళగిరిపై కూర్చుని మాకు ఆనందము, ఉపశమనము కలిగించే, పాపులను నాశనం చేయటానికి పొందిన అస్త్రాలను శాంతింప చేయుము. నిన్ను కాన్చుటకు మేము నిన్ను స్తుతించి, నుతించు చున్నాము. ప్రసన్నుడవై మమ్ము, మా బంధువులను, గోవులను కాపాడి మాకు రోగములనుండి విముక్తి కలిగించుము. మేము ప్రేమతో ఉండునట్లుగా చేయుము. అన్నిటా ప్రథముడై, దేవతలలో దైవత్వమై, భక్తుల రోగాలను బాపే వైద్యుడై, భక్తుల సత్కార్యములను పొగడే వాడి, వారి పాపములను పోగోట్టేవాడైన ఓ రుద్ర! అసురులను, క్రూర మృగములను నాశనము చేసి మమ్ము కాపాడుము. ఎరుపు, బంగారపు వర్ణములో ఉండి, తానే సూర్యుడై ఉన్నాడు ఆ రుద్రుడు. అటువంటి సహస్ర దిక్కులలో ఉన్న సహస్ర రుద్రులకు మా నమస్కారములు. వారంతా శాంతిన్చెదరు గాక. గరళము కంఠం నందు కలిగి పశుకాపరులకు, స్త్రీలకు కూడా ఎర్రని కాంతితో రాగి రంగులో సూర్యుని వలె కనిపించే ఆ రుద్రుడు మా అందరికి ఆనందమునిచ్చు గాక. నీలకంఠుడు, వేయి కన్నులు కలవాడు, అనంతమైన వరాలు ఇచ్చేవాడు అయిన ఆ రుద్రునికి, ఆయన భక్తులకు నా నమస్కారములు. ఓ దేవా! ధనుస్సు యొక్క తాడు ముడి తీసి, దానిని దించి, అస్త్రములను అమ్ములపొదిలో ఉంచి దానిని పక్కకు పెట్టుము. బాణముల పదునైన మొనలను త్రుంచి, ధనుస్సును దించి, శాంత రూపంతో మమ్మల్ని ప్రసన్నించు. అస్త్రములు, ఆయుధములు అన్ని శాంతించి, వాటి స్థానాల్లో ఉండు గాక. భక్తుల కోర్కెలను తీర్చే ఓ రుద్రా! మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడు. నీ ఆయుధాలకు, ధనుస్సుకు నా వందనములు. నీ అస్త్ర శస్త్రాలు మా శత్రువులను నాశనము చేయు గాక (శత్రువులంటే పాపములు). అవి మా నుండి దూరముగా వెళ్ళు గాక. జగత్పతి, దేవాదిదేవుడు, త్రినేత్రుడు, త్రిపురాంతకుడు, ప్రళయాగ్ని రూపుడు, నీలకంఠుడు, యముని జయించిన వాడు, అన్నిటికి నాథుడు, శాంతముర్తి, సమస్త శుభకరుడు అయిన రుద్రునికి నా నమస్కారములు.</div><div>పదకొండవ అనువాకం :</div><div><br></div><div>ఓ రుద్రా! వేల కొలది, వేల రకాల ఆయుధాలు కలిగి ఉన్న వేల మంది నీ సైనికులను మాకు వేల మైళ్ళ దూరమున ఉంచు. ఈ విశ్వములో ఉన్న అనంతమైన రుద్రుని సైనికులు - కంఠములు నీలము, తెల్లగను గలిగిన వారు, పాతాళంలో, స్వర్గంలో ఉండే వారు, కంఠములు నీలము, ఎరుపుగాను ఉండి వ్రుక్షములపై ఉన్నవారు, ముడి వేసుకున్నవారు, కేశములు లేని వారు, జనులను బాధించి వారు పాత్రలనుండి ఆహారము, నీరు తీసుకునే వారు, అన్ని మార్గములలో నున్న వారిని రక్షించే వారు, కాపాడే వారు, పదునైన ఆయుధములు కలిగిన వారు, పవిత్రమైన జలాలను కాపాడే వారు - వివిధ దిక్కులలో నున్న వీరందరినీ, వారి ఆయుధాలను మానుండి దూరముగా ఉంచుము. భూమి, ఆకాశము, ఇతర లోకములలో ఉండి మమ్మల్ని కాపాడే సైనికులకు మా వ్రేళ్ళతో, చేతులతో, దిక్కు దిక్కున నమస్కారములు. మాకు వారు ఆనందము కలిగింతురు గాక. వారికి మేము మా శత్రువులను ఆహారముగా సమర్పిస్తున్నాము. సుగంధం వెదజల్లేవాడు, ఆహారం ఇచ్చి పోషించేవాడు, త్రినేత్రుడు అయిన పరమశివుడిని ఆరాధిద్దాం. దోసపండు కాడ నుండి విడిపడేటట్లు మరణం పట్టు నుండి విడివడెదము గాక! ఆత్మ స్థితి నుండి విడివడక ఉందాం గాక!. సమస్త జగత్తు యందు ఉన్న ఆ శివునికి మా నమస్కారములు. ఉత్తమమైన అస్త్ర శాస్త్రములు కలిగి, వైద్యుడై మన రోగాలను నిర్మూలించే, రాక్షసులను సంహరించే రుద్రునికి మన మనస్సులను పవిత్రం చేస్తున్నందుకు నమస్కారములు. శివుని తాకి, పూజించే ఈ హస్తము మాకు దేవునితో సమానము. శివుని తాకినా ఈ హస్తము నా సర్వ రోగములకు దివ్యౌషధము. ఓ దేవా! ప్రాణులను చంపుటకు ఉపయోగించే సహస్రమైన నీ పాశములను మాకు దూరముగా యుంచమని మా ప్రార్థన. దానికోరకై మేము ఈ అగ్నిహోత్రము ద్వారా నీకు ప్రీతిని సమర్పిస్తున్నాము. రుద్రునకు నా నమస్కారములు. మృత్యుదేవత నా వాద్దకు రాకుండు గాక. ప్రాణము, ఇంద్రియముల కలిసే గ్రంధులలో నివసించే ఓ దేవా! నేను సమర్పిస్తున్న ఆహారమును స్వీకరించి నాయందు నివసించుము. మృత్యు దేవతను నా నుండి దూరముగా ఉండు గాక.</div><div>ఇవేకాదు మానవజీవతంలో ప్రతి అవస్ధలో ప్రతి స్వభావం లో శివుని దర్శించారు మన పూర్వీకులు. బాల్య యవ్వనాది అవస్థలలో శాంత కోపాది స్వభావాలలో దర్శనం..</div><div>చమకపారాయణం:</div><div>ఇది ఇంకా విశిష్టం అయినది. చమే అంటే నాకు ప్రసాదించు అని వేడుకోవటమే..మానవ జీవితానికి అవసరం అయిన ప్రతి దానిని ప్రసాదించమని వేడుకోవటమే..</div><div>జన్మనుంచి జన్మరాహిత్యం వరుకు , పుట్టుక నుండి మరణం వరకూ...మీరు చదివినది నిజమే మరణం..అవును నాయన మాకు బాధ నొప్పి ఎవరి మీద ఆధారపడని మరణం ప్రసాదించమని వేడుకోవటం..జీవితానికి కావలసిన తేజస్సు ఓజస్సు ఊర్జత్వం ఇలా ప్రతి ఓక్కటి..ఇంతేనా ఆహరం పానియం ...భూమి ఆకాశం , జ్ఞానం అజ్ఞానం ఇలా ప్రతి ఓక్కటి ప్రసాదించమని వేడుకోవటమే..</div><div>ఇది కూడా పదకొండు అనువాకాలు వుంటుంది</div><div>కొన్నిటి గురించి తెలుసుకుందాం</div><div>ఇక్కడ కూడా నేను మంత్రాలు తెలుపట లేదు వచన వివరణ మాత్రమే...</div><div>1వ అనువాకం.</div><div>ఓ దేవా! అగ్ని విష్ణు రూపమైన వాడ! మీరు నా పట్ల సంతుష్టులై ఉండుటకు నేను నుతించే ఈ పదములు ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతుండు గాక. నాకు ఎల్లపుడు ఆహారము, ధనము సమృద్ధిగా నుండు గాక. </div><div>2 వ అనువాకం:</div><div>నేను రుద్రుని అర్చించుట వలన - ఆహారము, దాన్ని ఇచ్చే మనసు, ఉత్సాహము, కాపాడుకునే శక్తి, ఆహారాన్ని సంపాదించే శక్తి, దోషములు లేకుండా మంత్రోచ్చారణ చేసే సామర్థ్యం, యశస్సు, ఉచ్చారణ, వివేకము, స్వర్గము, ఆత్మ శక్తి, అపాన వ్యానాదులు, ఆత్మ, ఆలోచన, ఆలోచనచే గ్రహించ బడేవి, వాక్కు, మనస్సు, ఇంద్రియములు, జ్ఞానమును పొందుటకు కావలసిన ఇంద్రియ శక్తి, ఆత్మ బలము, శత్రువులను సంహరించే శక్తి, ఆయుష్షు, వృద్ధాప్యం, ఆరోగ్యకరమైన శరీరము, ఆనందము, శరీరాన్ని కాపాడటానికి ఆయుధాలు, బలమైన, స్థిరమైన అవయవములు, ఎముకలు, కీళ్ళు మొదలగు అవయవములు - నాతో, నాలో ఉండు గాక. </div><div>3వ అనువాకం</div><div>ఓ రుద్రా! నిన్ను అర్చించుట వలన - కీర్తి, నాయకత్వము, క్రోధము, చలించని మనసు, చల్లని నీరు, గెలిచే మరియు గౌరవము పొందే సామర్థ్యము, స్థిరాస్తులు, పుత్ర పౌత్రాదులు, అప మృత్యువు లేని సంతానము, ధన ధాన్యములు, పెరిగే జ్ఞానము, సత్యము, వివరము పట్ల ధ్యాస, ఆకట్టుకునే సామర్థ్యము, శరీర సౌందర్యము, క్రీడలు ఇతర విషయముల వలన కలిగే ఆనందము, చేసేది, చేయబడేది, దేవతలా ఆశీర్వాదము, సత్కార్యములు, ఖజానా, నిలిచే సంపాదన, ఎక్కువ సంపాదించే సామర్థ్యము, ఎక్కడికైనా వెళ్ళగలిగే శక్తి, మంచి మార్గములు, మంచి యజ్ఞ ఫలము, పుణ్యము, సత్సంపాదన, పని చేయ గలిగిన మంచి సామర్థ్యము, ముందు చూపు, నిలకడ - నాకు కలిగి, నాతో ఉండు గాక.</div><div>ఇలా విశేషమైనది విశిష్టమైనది..</div><div><br></div><div><br></div><div><br></div>Alapati Ramesh Babuhttp://www.blogger.com/profile/10902788241134698143noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2337893138436064619.post-15686228457542791412020-08-04T18:48:00.001+05:302020-08-04T18:48:44.818+05:30మార్కండేయుని చరిత్ర - మరి కొన్ని విశేషాలు<div>మార్కండేయుని చరిత్ర.</div><div>మార్కండేయుడి చరిత్ర చదవటం అంటే ఈనాటి వారికి తెలియదుకాని పాతరోజులలో చిన్నపిల్లలు ఆరోగ్యం లేక విధివశాత్తు వ్యాధిగ్రస్తుడై బాధపడుతుంటే ఏమి చేయాలో తెలియక తోచని స్థితిలో వున్నవారికి ఇచ్చే సలహా మార్కండేయపురాణం చదవమని.</div><div>ఈనాటి పిల్లలకు పురాణమంటే అవగాహన పోయింది కాని పురాణపఠనమంటే కధారూప పూజ , కధారూప ఈశ్వరార్చన. కధ చదువుతు ఈశ్వరమహిమను ప్రభుతను విభుతను అర్ధం చేసుకుంటూ ధ్యానసమాధి కావటమే అని ఎందరికి తెలుసు. ఆసమయంలో తమ పిల్లల ఆరోగ్య సంరక్షణ చేయమని భగవంతుని వేడుకోవటం...అలాగే చిన్నపిల్లలు వరుసగా తుమ్ము తే చిరంజీవ చిరంజీవతో పాటు మార్కేండేయ ఆయష్షు , హనుమంత ఆయష్షు అని ఉచ్ఛరించేవారు..ఈ ఆచారం మెల్లగా పోయింది. కారణం తుమ్మిన సమయంలో కొన్ని సార్లు హృదయస్పందన ఆగిపోయి ప్రాణాపాయం జరిగేవి...వాటికి కారణాలు తెలియక అన్నిటికి దేవుడే దిక్కు అనే రోజులలో ఇటువంటి ఆచారాలు ప్రవేశం...</div><div>ఇక మన మార్కండేయుని కధ తెలుసుకుందం.</div><div>మార్కండేయుడు కధ భృగువు కి జైమినికి సంవాదరూపకంగా ఓకసారి , భాగవతపురాణంలో ఇంకొకసారి ప్రస్తావనకి వస్తుంది.</div><div>మార్కండేయుడు తండ్రి మృకండుమహర్షి , తల్లి మరుద్వతి. మృకండుడు గొప్పతపఃశాలి..ఆయన ఎంత నిశ్చలంగా వుండేవాడంటే ఆయన తపస్సలో వున్నప్పడు ఆయన శరీరం కొండలా మారిపోతే జంతుజాలం ఆ శిలకు తభ శరీరం ను రాపాడించి వాటి దేహభాధ ఉపశమింప చేసుకునేవి కాబట్టి మృగముల కండూతి తీర్చిన వాడు కాబట్టి మృకండుడు అని పిలిచేవారు. </div><div>ఈ దంపతులకి పిల్లలు లేరు. అపుత్రస్య గతిఃర్నాస్తి ..అనగా పుత్రులు లేకపోతే ఉత్తమగతులు వుండవని వాడుక దీనితో ఆ దంపతులు కాశీలో రెండు శివలింగాలు ప్రతిష్టించి శ్రద్ధగా అర్చించగా పరమేశ్వరుడు వారికి ప్రత్యక్షం అయి సకల సద్గుణవంతుడు పదహరు సంవత్సరాల ఆయుష్షు కలవాడు కావాలా లేక దురవ్యసనపరుడైన చిరాయువు వున్నవాడు కావలనగా .వారు సద్గుణవంతుడు అయిన పుత్రవరం పొందితే ఆ దంపతులకి మాఘపౌర్ణమి రోజున మార్కండేయుడి జననం. ఆ రోజునే మార్కండేయుడి జననానికి కారణం..</div><div>మాఘమాసం పౌర్ణమి రోజు మఖ నక్షత్రం. ఈ మఖనక్షత్రం అధిపతి కేతువు. ఈ కేతువు ఆధ్యాత్మిక కారకుడు , మోక్షకారకుడు..అదియునుగాక మాఘమాసంలో చంద్రుడుపూర్ణకళలతో విరాజిల్లుతాడు. సింహరాశిలో చంద్రుడు కేతువు వుంటారు..కుంభరాశిలో రవి వుండటం ఆ రోజు ప్రత్యేకత..</div><div>ఈ బాలుడు మృకండుడు పుత్రుడు కాబట్టి మార్కండేయనామధేయంతో పిలుస్తున్నారు.అతను దిన దిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడు. ఈ సమయంలో సప్త ఋషులు మృకండుని ఆశ్రమంనకు వచ్చిన సమయంలో వారు మార్కండేయుడి ని చిరంజీవ అని దీవిస్తారు దానితో మృకండుని మదిలో కొత్త ఆశలు వచ్చి నా బిడ్డ చిరంజీవికదా అని ప్రశ్నించగా...సప్త ఋషులు తమ యోగదృష్టితో శివుని వరం గురించి తెలుసుకున్నవారై..అయ్యా ఈశ్వరానుగ్రహం ఎలాగున్నదో ఆయన లీల ఏమిటో ఎరుగక వున్నాం అయిననూ ఋషివాక్కు వ్యర్ధం కాదు అంటూ బాలునితో బ్రహ్మవద్దకు వెళ్ళగా ఆయనకూడా అప్రయత్నంగా చిరంజీవ అని దీవిస్తారు... అప్పుడు బ్రహ్మదేవ అలా ఎలా ఆశ్వీరదించారు మీ లలాటలిఖితం చూడలేదా అనగా..అయ్యయో అని ఆయన విచారిస్తూ తన భార్య సరస్వతి వంక ఏమి ఇటువంటి వాక్కు ఇచ్చావు అని ప్రశ్నించగా మన తప్పు ఏమిలేదు అంతా కాలపురుషుడు అయిన పరమేశ్వరుని లీలావినోదం అని ఆమె పలికినది. దీనితో బ్రహ్మదేవుడు మార్కండేయుని ఓ సలహ ఇచ్చాడు నాయనా మార్కండేయ కనురెప్పపాటు కూడ విడవక ఈశ్వరార్చన చేయమని ప్రభోదించాడు. దానితో మార్కండేయుడి శివలింగ ప్రతిష్టకావించి బ్రహ్మదేవుడు చెప్పిన ప్రకారం అకుంఠిత దీక్షతో శివోపాసన చేయసాగాడు. ఈ శివోపాసన తీక్షణతకు లోకాలు అల్లకల్లోలం అవుతున్నాయి.అంతలో మార్కండేయునికి పదహరుసంవత్సరాలు నిండపోతున్నాయి...ఈ హడావుడి అంతా గమనించిన నారదుడు యముని వద్దకు పోయి..ఏమిటి యమ ధర్మరాజ మార్కండేయుని ఆయష్షు ఇంకనూ రోజులు ఘడియలలో వున్నవి తమరు ఆ బాలకుని వదిలివేస్తున్నారా అని ప్రశ్నించగా..యమధర్మరాజు నా మృత్యుపాశంనకు సర్వులు సమమే వాని విధివ్రాత ప్రకారం జరుగవలిసినదే అని తన కింకరులను ఆదేశిస్తారు మార్కండేయుని తీసుకుని రమ్మని.. ఆజ్ఞ మేర కింకరులు మార్కండేయుని తీసుకుని రావటంనకు అతనివద్దకు చేరటం సరికదా మార్కండేయుని తపఃతీక్షణతకు అతని వద్దకు అడుగు పెట్టలేని స్థితిలో యమధర్మరాజు కి తమ అశక్తతను మొరపెట్టుకున్నారు. దానితో యమధర్మరాజు తన మృత్యుపాశంతో మార్కండేయుడు వున్న ప్రదేశంనకు ప్రవేశించి తన కాలపాశం ప్రయోగించగా...మార్కండేయుడు భయంతో మహదేవ పాహిమాం రక్షమాం అంటూ శివలింగాన్ని కౌగిలించుకున్నాడు. దానితో యమధర్మరాజు ప్రయోగించిన కాలపాశం లింగంను కౌగిలించుకున్న మార్కండేయుని స్పృశించునంతలో ఫెఠిల్లున పరమ ఉగ్రరూపంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమై నాసన్నిధిలో నా వొడిలో నారక్షణలో వున్న మార్కండేయునిపై నీ మృత్యుపాశమా అని ఆగ్రహంతో తన త్రిశూలం తో మృత్యుపాశంను ఏదుర్కొన్నాడు...అంత ఆమృత్యుపాశం ప్రయోగించిన యమధర్మరాజు మీదకి రాసాగినది...దానితో యమధర్మరాజు సంకటస్థితికి లోనై ...శివా! మీ అజ్ఞానుసారం నాకర్తవ్య నిర్వాహణతప్ప వేరుకాదు ...నన్ను మన్నించి అనుగ్రహించి నాకర్తవ్యబోధ చేయమని ప్రార్ధన చేయగా...పరమేశ్వరుడు ప్రసన్నత చెందిన వాడై...యమునికి కూడా అభయప్రదాయం చేస్తూ మార్కండేయుడు నా వీక్షణతో అమృతత్వం పొంది చిరంజీవి అయినాడు అనే వరం ప్రసాదించాడు...దానితో మార్కండేయుడు పరమేశ్వరానుగ్రహంతో చిరంజీవత్వం సాధించాడు.</div><div>ఆ తదనంతరం మార్కండేయుడు తన వంశస్థులకు , తనను ఆరాధించేవారికి పాశములను బంధన శక్తి వుండే విధంగా అనుగ్రహించాడు...అందుకే ఆయన పరంపరలోని వారే పద్మశాలిలు.. వారి నేత పోగులు (దారాలు ,పాశాలు) అంత ధృడంగా వుండుటకు ఆయన వరమే కారణం అని వారి నమ్మిక. అందుకే పద్మసాలిలు వున్న ప్రాంతాలలో మార్కండేయుని మందిరాలు వుంటాయి.</div><div>మార్కండేయునిపై యముడు తన యమపాశం ప్రయోగించిన సమయంలో మార్కండేయుడు స్తుతించినది "చంద్రశేఖరాష్టకం" .</div><div>ఇందు మొదటిది ఓక శ్లోకం రాస్తాను...</div><div>చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహి మామ్ |</div><div><br></div><div>చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! రక్ష మామ్| 1</div><div><br></div><div><br></div><div>రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం |</div><div><br></div><div>శింజినీకృతపన్నగేశ్వర మచ్చుతానలసాయకం |</div><div><br></div><div>క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయై రభివందితం |</div><div><br></div><div>చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః| 2</div><div>ఇంకనూ ఆరు శ్లోకాలు వున్నాయి అన్నింటా చివర కిం కరిష్యతి వై యమః అని వుంటుంది.. ఈ యముని బారి నుండి నన్ను ఎందుకు రక్షించవు అని వుంటుంది.</div><div>ఈ సంఘటన తరువాత పరమశివుని "కాలంతక" అనే నామంతో పిలుస్తారు.</div><div>మార్కండేయునికి అమృతత్వం ప్రసాదించారు కాబట్టి అమృతేశ్వరుడు అంటారు.</div><div>ఈ అమృతేశ్వర దేవాలయం తమిళనాడులోని మాయవరం కి 21కిమి దూరంలో వున్న తిరుకడయూరు అనే ఊరు వున్నది . అక్కడ ఓ పెద్ద దేవాలయం వున్నది. అది అత్యద్భుతంగా వుంటుంది. ఈ గుడి విశిష్టత షష్టిపూర్తి చేయించటం. ఈ గుడిలో షష్టిపూర్తి చేసుకొనటానికి వందలు వేలకొద్ది వస్తారు. అన్నీ వేదోక్తంగా చేయటానికి చాలా మంది అయ్యవార్లు వున్నారు.</div><div><br></div><div><br></div><div><br></div>Alapati Ramesh Babuhttp://www.blogger.com/profile/10902788241134698143noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2337893138436064619.post-88928470518372795722020-08-04T18:43:00.001+05:302020-08-04T18:43:21.130+05:30భావయామి గోపాలబాలం..నా భావనలు 💐భావయామి గోపాల బాలం💐<div>మనం అందరం కలియుగ దైవం వేంకటేశ్వరుని</div><div>నివాసమైన తిరుమల దర్శన సమయంలో షుమారు 1980 ప్రాంతం నుండి వివిధ ప్రదేశాలు సందర్శన సమయంలో మనకు దేవస్థాన ప్రసారమాధ్యమాల ద్వారా అమ్మ M.S.సుబ్బలక్ష్మి మృధుమధురంగా "భావయామి గోపాలబాలం" అన్న కీర్తన వినని వారు అరుదు..మనవారు అందరు తెలియకుండా నే ఆ ముగ్ధమనోహర స్వరం, ఆ గోపాల బాలుని పాదవిన్యాసాలు మన హృదయంలో ముద్రపడి మనం కూడా శృతి కట్టి ఓక పదం అయినా పాడుతాం. అంతటి ఓ గొప్ప కీర్తన , అందులోను అమ్మ పాట పై ఓ నాలుగు మాటలు...</div><div><br></div><div>భావయామి గోపాలబాలం </div><div>రాగం: యమునా కళ్యాణి</div><div>తాళం : ఖాండ చాపు</div><div><br></div><div>ప|| భావయామి గోపాలబాలం మన- | స్సేవితం తత్పదం చింతయేయం సదా ||</div><div><br></div><div>చ|| కటి ఘటిత మేఖలా ఖచిత మణి ఘంటికా- | పటల నినదేన విభ్రాజమానం |</div><div>కుటిల పద ఘటిత సంకుల శింజితేనతం | చటుల నటనా సముజ్జ్వల విలాసం ||</div><div><br></div><div>చ|| నిరతకర కలితనవనీతం బ్రహ్మాది- | సుర నికర భావనా శోభిత పదం |</div><div>తిరువేంకటాచల స్థిత మనుపమం హరిం | పరమ పురుషం గోపాలబాలం ||</div><div>ఇది ఆ కీర్తన... పూర్తి రూపం.</div><div>ఈ కీర్తన రచించినవారు అన్నమాచార్యులు.</div><div>వీరి సంస్కృత కీర్తన ఇది. ఇది దేవస్థానంలో వెలుగు చూసిన అన్నమయ్య కీర్తనలో స్వర్గీయ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు పరిష్కరించిన రేకు నంబరు 23/1 గల దానిలో వున్నది.</div><div>ఇక కీర్తన వివరణలు వచన రూపంలోనే...</div><div>ఈ ప్రకృతి మొత్తం ఆ పరమపురుషుడైన గోవిందుని రూపమే.. మీరు ఆయన పట్ల అనురక్తితో వుంటే ఆయన మీకు బాలగోపాలునిగా మీ హృదయంలో ప్రతిష్టించుకుంటే..ఆ బాలగోపాలుని ఆలోచనలో వుంటే ఆ గోపాలుని అడుగుల సవ్వడి మీకు ఖచ్చితంగా వినపడుతుంది ..ఎంతలా అంటే..</div><div>ఆయన మొలకు కట్టబడిన చిరుగంటల సవ్వడి..తో కూడి రత్నాలు పొదగ బడిన మేఖల అంటే వడ్డాణం...సుందరంగా మనోహరంగా... అసలు క్రిష్ణుడంటేనే అలంకరణ ఆయినను ఎన్ని రూపాలలో ఎన్ని రకాలుగా అలంకరించిననూ మనకు తనివి తీరనంత కావాలంటే చూడండీ కంఠహారాలు , పూలమాలలు ,తులసి , కడియాలు.,దండకడియిలు ,బాజుబంద్ లు , నెమలిపింఛాలు ,మురళీ ,నిరంతరం ఆయన చేతిలో నవనీతం ఇలా అనేకం...</div><div>ఇన్నీ అలంకారలతో కూడిన ఆ బాలగోపాలుని పదవిన్యాసాల వలన మనకు వినబడే అలంకరణ భూషణముల శబ్దాలు ఎంతో మనోహరంగా వున్నాయి..ఈ బాలగోపాలుని దర్శించి మనం వివశులం అవుతున్నాం...ఈ బాలగోపాలుడే ఆలయంలో పరమపురుషుడు..ఆయనను దర్శించిటానికి బ్రహ్మాది దేవతలు, దేవతా సముహాలు కూడా పోటి పడుతున్నాయి.</div><div>మరి ఇంతటి మహత్తు గల ఆ బాలగోపాలుని మీ మనస్సులో నిలుపుకుంటే ఆ వేంకటాచలపతిని మనం సులువుగా దర్శించ వచ్చు.</div><div><br></div><div><br></div>Alapati Ramesh Babuhttp://www.blogger.com/profile/10902788241134698143noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2337893138436064619.post-72452422274901052552020-08-04T18:40:00.001+05:302020-08-04T18:40:38.355+05:30జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం..వివరణ<p dir="ltr">"జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం ఎనుగులు తిన్న వెలగపండు జీర్ణం గుర్రాలు తిన్న గుగ్గిళ్ళు జీర్ణం కృష్ణుని తిన్న వెన్న ముద్ద జీర్ణం ఈ పాపాయి తినే పాల బువ్వ జీర్ణం..."<br>
బహుశా ఈ శ్లోకం తెలియని తెలుగువారు వుండరు. మన ఇండ్లలో పసివారికి పాలబువ్వ తినిపించిన తరువాత తల్లులు పాపాయికి తినిపించిన పాలబువ్వ గిన్నేను దిష్టి తీస్తూ<br>
పై పద్యం చదువుతారు.<br>
హైందవ సాంప్రదాయం లో జాతకర్మలైన షోడశకర్మలలో ఏడవది అన్నప్రాసన.<br>
శిశువు జన్మ లగాయితు మాతృ స్తన్యం తో అతని జీవన అవసరాలు తీరుతాయి. ఆరు నెలల తరువాత శిశువు ఎదుగుదలకు శారీరక పటుత్వానికి స్తన్యం చాలదు. అదియును గాక మహిళ శారీరక నిర్మాణం వలనకాని , నిత్యకృత్యాలైన గృహకృత్యాల వలన కాని , సంసార జీవనం ప్రారంభం వలన కాని ఆమేయందు స్తన్యం లభించటం తగ్గుతుంది. అందువలన శిశువు కు ఘన ఆహరం పెట్టాలి. ఈ విషయం సుశ్రుతుడు కూడా తన గ్రంధాలలో తెలిపియున్నాడు. దీనినే మన వారు వేదోక్తంగా మంత్రబద్ధంగా షోడశ కర్మలలో ఓకటిగా ఆచరిస్తున్నారు. తదాదిగా శిశువుకు తెలికగా జీర్ణం అయ్యే పాల బువ్వ తినిపిస్తారు.<br>
అన్నం ప్రాణ ఆధారం, జీవ ఆధారం. దీనిని ఆశ్రయించి అనేక పాప పుణ్యాలు వుంటాయి.<br>
శిశువు భూవాతావరణం వచ్చిన తదాదిగా ఈ భూప్రపంచంలో వున్న కర్మలు ప్రారంభం అయితే అది స్టేజి ఓకటి అయితే అన్న ప్రాసన నుండి మరో స్టేజి .<br>
ఇది అలావుంటే ఇక మన శ్లోక వివరణకు వస్తే...<br>
అహరం ఆశ్రయించి అనేక సూక్ష్మ జీవులు , ఆహరం పులిసి పాడయిపోయి విషతుల్యం అయి ఓక్కోసారి ప్రాణం మీదకు వస్తాయి. దీనిని సూచిస్తూ రామాయణం లో ఓకధ వున్నది.<br>
వాతాపి , ఇల్వలుడు అనే సోదరులు రాక్షసులు. వీరు అనేక కపట మాయోపాయాలతో ప్రజలను చంపి తింటారు. వీరిలో వాతాపి మేక రూపం ధరిస్తాడు. ఇక ఇల్వలుడు దారిన పోతున్న సాధుజనులను , బుషుల వద్దకు వెళ్ళి అయ్యా ఈ రోజు మాతండ్రిగారి ఆబ్దీకం మీరు భోక్తగా రావాలి అని ఆహ్వానిస్తాడు. సరే అని వెళ్ళిన అతిధికి మేక రూపంలో వున్న వాతాపిని వధించి భోజనంగా వడ్డిస్తాడు. అతిధి భోజనం ముగియగానే ఇల్వలుడు వాతాపి రా..అని పిలుస్తాడు..దానితో అతిధి కుక్షి చీల్చుకుంటూ వాతాపి వస్తాడు . దీనితో మరణించిన అతిధిని సోదరులు ఇరువురు శుభ్రంగా తినేస్తారు.<br>
వీరి ఈ క్రూర కార్యం వలన ప్రజలు భయవిహ్వలు అయి అగస్త్యమహర్షిని శరణు కోరతారు. సరే అని అభయమిచ్చిన అగస్త్యులవారు వారి అతిధిగా వెళ్లి భోజన కార్యక్రమం అవగానే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనే మంత్రం పలుకు తారు. దీనితో అగస్త్యులవారి మంత్రశక్తికి వాతాపి జీర్ణం అయిపోతాడు. ఇది తెలియని ఇల్వలుడు వాతాపి రా అని పిలుస్తాడు కాని ఇంకేక్కడ వాతాపి వాడు ఎప్పుడో అగస్త్యులవారి కుక్షిలో జీర్ణం. ఇది కధ కాని పరిశీలిస్తే...సోదరులు ఇద్దరు వైరస్ లు గా ఆహరాన్ని పాడుచేసేవారుగా భావన చేయాలి. ఇక వాతాపి మేక రూపం చూడండి..మేక ఓక్కటే కనపడిన ప్రతి ఆకును మేస్తాయి...ఇది అది అని లేదు ప్రతి ఆకును ఆబగా మేస్తూనే వుంటాయి. అందువలన వాటి జీర్ణవ్యవస్థ సరిగా వుండక మేక విసర్జన పెంటికలుగా గోలిలుగా వుంటుంది.<br>
ఇటువంటి లక్షణాలు శిశువుకూడా వుంటాయి...శిశువు దోగాడుతున్నప్పుడు, పాకుతున్నప్పుడు ఏది కనపడితే అది ..అతనిని ఆకర్షించిన ప్రతి ఆహర , వస్తు సంచయాలను నోట్లో పెట్టుకుంటాడు దాని వలన అతనికి విరోచనాది లక్షణాలు కలుగుతాయి...అందుకే వాతాపి లాంటి రాక్షసుడే జీర్ణం అవ్వగా తల్లి తన మాతృహృదయ మమకారంతో తన బిడ్డకు అంతటి జీర్ణశక్తి కలగాలని కోరుకుంటుంది.<br>
ఇక రెండోవ వాక్యం ఏనుగులు తిన్న వెలగుపండు జీర్ణం. సహజంగా ఏనుగు భారి పరిమాణంలో వున్నను దానికి దంతాలు బాహ్యంగా వుండి చమన పద్దతి అనగా నమిలే అవకాశం లేక అన్నీటిని అలా మ్రింగుతాయి . వెలగపండు లోపల గుజ్జు వుంటుంది. దాని చుట్టూ వున్న దాని ఉపరితల భాగం బాగా కఠినంగా వుంటుంది. కాని ఏనుగు పొట్టలోనికి వెళ్ళిన వెలగపండు అక్కడి ఉష్ణోగ్రత కి లోపలి గుజ్జు జీర్ణం అయి విసర్జకంగా పండు పండుగానే వస్తుంది. ఇది మనకి గమత్తుగా వింతగా వున్నను ఇది వాస్తవం. చూడండి ఏనుగు లక్షణం ఆహరభాగం మాత్రమే స్వీకరించి పిప్పి భాగాన్ని విసర్జిస్తుంది.<br>
కనుక తల్లికి తన బిడ్డకు అంతటి జీర్ణశక్తి కావాలనే అర్ధం. ఇక ఇంకో అంతరంగీక అర్ధం వున్నది. గజముఖుడు వినాయకుడు అన్న సంగతి తెలిసినదే. మరి వినాయకుని విఘ్నాధిపతిగాను , విద్యలకెల్ల ఒజ్జ అయిన గణాధిప అనే భావంలో కొలుస్తాం. మరి ఇంతటి మహనీయిడి లక్షణం మాతాపితురుల ప్రదక్షిణం భూప్రదక్షిణం అని నమ్మీ విజయం పొంది విఘ్నాధిపత్యం స్వీకరిస్తాడు. కనుక తల్లికి తన బిడ్డ మంచి విషయాలు మంచి జ్ఞానం తల్లితండ్రులపట్ల ప్రేమ , బిడ్డశరిరంలో జీర్ణం అవ్వాలని కోరికతో ఏనుగులు తిన్న వెలగపండు జీర్ణం అంటారు.<br>
ఇక మూడవ వాక్యం గుర్రాలు తిన్న గుగ్గిళ్ళు జీర్ణం. గుర్రం అత్యంత వేగంగా పరుగు తీయగల జీవి. అలాగే గుర్రం ఎన్నడూ నేలపై పడుకోదు ...నించునే నిద్రపోతాయి...వాటి శక్తి అనంతం . అందుకే మన మోటారులను కూడా అశ్వశక్తితో పోల్చుతాం. ఇంతటి చలన శక్తికి వాటి కాళ్ళకున్న గిట్టలే కారణం. వీటి వలన కొండలు లాంటి కఠిన ప్రదేశాలలో కూడా పయనం. మరి వీటి ఆహరం గుగ్గిళ్ళు. మరి తల్లి అందుకే తన బిడ్డకు అశ్వం లాంటి శక్తి కోరుతున్నది. ఇది జీవలక్షణం. ఇక దైవరహస్యం పరిశీలించుదాం. హయగ్రీవుడు వైష్ణవసాంప్రదాయంలో సకల విద్యాధిపతి. వీరి తల గుర్రం గా వుంటుంది. తలమాత్రమే గుర్రంగా వుండటం అంటే మన మేధ అంత వేగంగా వుండాలి అని. జ్ఞాన స్వీకరణలో అంత వేగంగాను అంత స్థిరంగా వుండాలని. మన మెదడు అనేక ఆలోచనలు స్వీకరించి శోషణ చేసి తృటిలో మంచి చెడులను మనకు తెలియచెప్పుతుంది. అంటే ఈనాటి అడ్వాన్స్ ప్రోసేసర్ పని అంతా మన మెదడు నిర్వహిస్తుంది. కాబట్టి తల్లి తనబిడ్డ అంత జ్ఞానసంపన్నుడు , వేగ కార్య నిపుణుడు కావాలని గుర్రాలు తినే గుగ్గిళ్ళు జీర్ణం అని పలుకుతుంది.<br>
ఇక నాలుగో వాక్యం కృష్ణుడు తిన్న వెన్నముద్ద జీర్ణం. వెన్న ,పెరుగు చిలకగా మజ్జిగ మరియు వెన్న వస్తుంది అన్న విషయం సర్వులకి విదితమే. పాలు కాచి తోడు వేయగా పెరుగు ఏర్పడుతుంది. పాలు తోడు వేయటం వలన ఈష్ట్ గా మారి ..పెరుగు ఏర్పడుతుంది. దీనిని సైన్స్ పరిభాషలో ఫెర్మంటేషన్ అంటారు. పెరుగు రుచిగా వున్నను వాత లక్షణం కలది. అందుకే రాత్రి ఆహరంలో పెరుగు నిషిద్ధం. మరి ఈ పెరుగు చిలకగా ఆ ఉష్ణంనకు అందులోవున్న ప్రోటిన్ మరియి శక్తినిచ్చే పదార్థాలు వెన్నగాను . మిగిలిన ద్రవరూపం అంతా మజ్జిగ గాను ఏర్పడుతుంది. మరి కృష్ణుడికి ఇష్టమైన వెన్న వలనే ఆయన క్రీడా వినోదాలు , రాసలీలలు , లీలామానుషత్వ లక్షణాలు , సర్వులను అతను ఆకర్షించే లక్షణాలు , స్థిరమైన పురుషత్వ లక్షణాలు ఏర్పడుతాయని తల్లి నమ్మకం. అందుకే తన బిడ్డ కూడా కృష్ణుడంత మహనీయుడు కావాలని కృష్ణుడు తిన్న వెన్నముద్ద జీర్ణం అని పలికేది. చూశారా మన దేశంలో ప్రతి తల్లి దేవకి , యశోదలే ప్రతి శిశువు చిన్ని క్రిష్ణుడే....<br>
ఇక చివరిదైన పాపాయి తిన్న పాల బువ్వ జీర్ణం.<br>
ఇది మామూలే తన అనురాగతో ప్రేమతో తినిపించే పాల బువ్వ వలన శక్తితో ఆరోగ్యంతో తన బిడ్డ కలకాలం మనుగడ సాగించాలనే ఆకాంక్ష.<br>
చూశారా మీకు ఓ చిన్న శ్లోకం లాగా పద్యపాదం లా కనపడే ఈ నాలుగు వాక్యాలలో మన పూర్వీకులు ఇంత అంతరార్ధం లో మనకు సాంప్రదాయాలుగా ఆచారాలుగా ఏర్చి కూర్చినారు.<br>
ప్రతి శిశువు కి తల్లి చక్కని ఆరోగ్యవంతమైన ఆహరం అందచేయాలని , వారికి లభించాలని శ్రీరాముని ప్రార్ధిస్తున్నాను.<br>
సకలం సర్వం శ్రీరామ జయం.<br>
చదివి నచ్చినవారు ఓ చిన్న నవ్వు...సందేహం వున్నవారు తెలపండి నివృత్తికై...<br>
ఆలపాటి రమేష్ బాబు<br>
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో<br>
విజయవాడ<br>
<a href="tel:9440172262">94401 72262</a>.<br>
</p>Alapati Ramesh Babuhttp://www.blogger.com/profile/10902788241134698143noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2337893138436064619.post-45309273843362929542020-08-04T18:36:00.001+05:302020-08-04T18:36:46.089+05:30సామజ వర గమనా - శంకరాభరణం.. ఓ పరిశీలన<p dir="ltr">సామజవరగమన - శంకరాభరణం ఓక పరిశీలన.<br>
మానవమేధో వికాసంలో లలిత కళలు ఓక విభిన్నపరిణామం. లలితకళలలో సంగీతం మరి విశిష్టమైనది. సప్తస్వరాలు స , రి , గ , మ , ప ,ద ,ని. ఈ ఏడు స్వరాల కలయికే అనంతకోటి రాగాలు . ఈ సంగీత శాస్త్రం బహు విస్తారమైనది. ఇందు లయ , శృతి ప్రధాన్యత వహిస్తాయి. ఈ సంగీత సాధనలో మనస్సు కేంద్రీకరించి శృతి ,లయలతో పాటు రాగయుక్త స్వరసహితంగా పాడగలిగినదే సాంప్రదాయ కర్నాటక సంగీతం. మన భారతదేశ సంగీతాన్ని దక్షిణ భారత సాంప్రదాయం కర్నాటక సంగీతంగా , ఉత్తర భారత సాంప్రదాయం హిందుస్తాని సంగీతంగా ప్రాధమికంగా విభజించారు. మరలా ప్రాంతాలని అనుసరించి మత పరంగా జరిగే కార్యక్రమాలను అనుసరించి అనేక విభజనలు. మరలా ఇందులో గాత్ర సంగీతం వాయిద్య సంగీతం అనే విభజనలు....<br>
ఇలా మీకు కూలంకషగా వివరించాలని వున్నా ప్రస్తుత అంశంనకు అణుగుణంగా వివరించవలసి వున్నందున విస్తారభీతిచే ఇంతవరకూ చాలు...ఇక అంశం పరిధిలోకి వద్దాం......<br>
మన దక్షిణ భారత సంగీతంలో విశిష్టమైనది త్యాగరాజకీర్తనలు. త్యాగరాజుగారు ప్రస్తుత తమిళనాడు లోని తిరువైయ్యారులో జన్మించిన అచంచల రామభక్తుడు. ఆయన రాముని పరంగా ఏన్నో వేల కీర్తనలను సృజించారు....<br>
అందులో ఓక కీర్తన సామజవరగమన....<br>
సామజవరగమనా” త్యాగరాయ కీర్తన :<br>
హిందోళరాగం , ఆది తాళం...<br>
పల్లవి: సామజవరగమనా! సాధుహృత్సారసాబ్జపాల! కాలాతీతవిఖ్యాత! ॥సామజ॥<br>
అనుపల్లవి: సామనిగమజసుధామయ గానవిచక్షణ గుణశీల! దయాలవాల! మాంపాలయ! ॥సామజ॥<br>
చరణం: వేదశిరోమాతృజ సప్తస్వర నాదాచలదీపా। స్వీకృత యాదవకులమురళీ!<br>
గానవినోదన మోహనకర త్యాగరాజ వందనీయ ॥సామజ॥<br></p>
<p dir="ltr"> </p>
<p dir="ltr">ప్రతి పదార్ధం :</p>
<p dir="ltr">సామజ(ఏనుగు) వర(వంటి) గమనా(నడక కలిగిన వాడ) – ఏనుగు నడక లాంటి గంభీరమైన నడక కలవాడా</p>
<p dir="ltr">సాధుహృత్సారసాబ్జపాల – సాధువులు, సజ్జనుల హృదయపద్మములను పాలించేవాడా</p>
<p dir="ltr">కాలాతీతవిఖ్యాత – అన్నికాలములలోనూ కీర్తింపబడేవాడా</p>
<p dir="ltr">సామనిగమజ సుధామయగానవిచక్షణ – సామ వేదానికి మొదలు గా ఆ సంగీతముని నిత్యం పరిశీలిస్తూ పర్యవేక్షించేటి వాడ</p>
<p dir="ltr">గుణశీలదయాలవాల – గుణముకు దయకు ఉదాహరణగా నిలిచేటి వాడ</p>
<p dir="ltr">మాంపాలయ – నన్ను పాలించు</p>
<p dir="ltr">వేదశిరోమాతృజ – వేదములలో గొప్పదైన సామవేదమునుండి పుట్టిన</p>
<p dir="ltr">సప్తస్వరనాదాచలదీప – సప్తస్వరముల లయము వలన కలిగిన కదలని దీపమువంటి నాదమువలె ప్రకాశించువాడా</p>
<p dir="ltr">స్వీకృతయాదవకుల – యాదవకులములో జన్మించినవాడా</p>
<p dir="ltr">మురళీగానవినోదనమోహనకర – మురళీగానముచే వినోదించుచూ అందరిని ఆనదింప జేసేవాడా;</p>
<p dir="ltr">త్యాగరాజ వందనీయ – త్యాగరాజుచే నమస్కరింపబడినవాడా</p>
<p dir="ltr"> </p>
<p dir="ltr">అర్ధం:</p>
<p dir="ltr">ఏనుగు నడకవంటి గంభీరమైన నడక తో, మునులు మనిషులు హృదయాలను ఏలుతున్న ఓ శ్రీ హరి, నువ్వు కాలం తో సంబంధం లేకుండా అందరి చేత పొగడ బడతావు..<br>
సామవేదం పుట్టుక నీవల్లే జరిగింది.. సంగీతాన్ని రక్షించేవాడివి నీవే, గుణమునకి, దయకి ఉదాహరణ నీవే.. నన్ను కూడా నీవే నడిపించాలి..<br>
సామావేదమునుండి పుట్టిన సప్తస్వరముల వల్ల, ప్రకాశిస్తూ.. గోవులని రక్షిస్తూ.. మురళి గానం తో మమ్మలందరిని ఆనంద పరుస్తూ.., ఈ త్యాగరాజ వందనములను అందుకో..<br>
ఇది భక్తి పరంగా...శ్రీకృష్ణుని పరంగా...మన సాంప్రదాయ కీర్తన.....<br>
ఇక శంకరాభరణం సినిమా తెలుగు సినిమా ప్రాశస్త్యం మనందరికి తెలిసినదే....అదో గర్వించదగ్గ తెలుగు సినిమా...<br>
ఇందులో ఓ సాంప్రదాయ సంగీతకారుని జీవన వైభవాన్ని...కాల మహిమచే సమాజ నిరాదరణ వలన అతని జీవనంలో ఓడిదొడుకులను దర్శకులు విశ్వనాధ్ గారు ఏంతో చక్కగా దృశ్యకావ్యంలా వివరించారు...<br>
శంకరశాస్త్రికి సంగీతం అంటే ప్రాణ సమానం...<br>
ఓక రాగం ఆలాపన చేయాలంటే స్వరసహితంగా ఎక్కడా పొరపాటు పోనివ్వని నైజం...మనకు ఇదే విషయాన్ని శంకరశాస్త్రి తన కుమార్తె కి కృష్ణానదినీటిలో మంచులో గొంతువరకు చిన్న పాపను వుంచి సంగీత సాధన చేయించే దృశ్యం మనకు ఉపమానంగా చూపుతాడు. ఆ పాప సాధనలో ఓక స్వరం తప్పుగా పలకగానే..శంకరశాస్త్రి...ఊ ....అనే హూంకారంతో స్వరంను షరిదిద్దటం కూడా మీరు గమనించవచ్చు...ఈ దృశ్యం చూసిన వారికి శంకరశాస్త్రి శుద్ధ ఛాంధసుడిలాగా...ఫక్తూ సాంప్రదాయవాది లాగా కన పడతాడు...కాని సాంప్రదాయ సంగీత కారుల సాధన వైశిష్ట్యాన్ని మనకు దర్శకుడు ఈ విధంగా స్పృశించారను కోవచ్చు...<br>
ఓక రాగా ఆలాపాన స్వరసహితంగా ఆరోహణ ,అవరోహణ స్వర ప్రస్తారాలు తప్పు పోకుండా వుండాలి అంటే కఠోర సాధన మరియి మానసిక పరిపక్వత , మానసిక నిగ్రహం తద్వారా శరీరం ప్రతి అణువు సంగీతంకై కేటాయించిన విధంగా తయారవుతుంది.<br>
ఇక సినిమా విషయానికి వస్తే....శంకరశాస్త్రి జీవితం కాలమహిమచే కష్టాలపాలు...కచేరిలు లేవు సంపాదన లేదు...కాని అతని కూతురు యుక్తవయస్కురాలు అవుతుంది. యుక్తవయస్సు వచ్చిన అమ్మాయి సహజంగా తోడు కోరుకోవటం సహజం.....<br>
శంకరశాస్త్రి తో స్నేహాతీతంగా మాటమంతి జరిపే అల్లు గారు...శంకరశాస్త్రి కూతురు రాజ్యలక్ష్మి ని తీసుకుని అన్నవరం వెళ్ళటం...అక్కడ గుడి ప్రాంగణంలో చంద్రమోహన్ , రాజ్యలక్ష్మి ల కలయిక తద్వారా ఓకరంటే ఓకరు మరులు కొలిపి అభిమానం కలిగి ఉభయుల మధ్య ప్రేమ పుడుతుంది....కాని సాంప్రదాయ కుటుంబాలు అవటం వలన ఆ ప్రేమ గుడి ప్రాంగణంలోనే విరామం....కాని అల్లు వారు చంద్రమోహన్ నే పెళ్ళి చూపులకు ఆహ్వానిస్తారు కధా పరంగా...ఇక పెళ్ళి చూపులలో మరలా చంద్రమోహన్ , రాజ్యలక్ష్మి ల పునః పరిచయం...కాకపోతే ఇద్దరూ వధు , వరుల గా ఓకరికొకరు పరిచయం.... దానితో ఇద్దరి మనస్సులో అన్నవరం తాలుకు తీపి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని...ఓకరంటే ఓకరు ఆసక్తి అనురక్తి తో ఉత్సాహంగా వున్నారు....ఆ సమయంలో... సాంప్రదాయ అనుసారం వధువు కి గల అర్హతలు పరిశీలనలో ఓక పాట పాడమంటే...రాజ్యలక్ష్మి...<br>
సామజవరగమన పాట పాడుతుంది...<br>
**********<br>
సామజవరగమనా<br>
సామజవరగమనా సాధుహృత్ సారసాబ్జపాల<br>
కాలాతీతవిఖ్యాత సామజవరగమన<br>
సాధుహృత్ సారసాబ్జపాల<br>
కాలాతీతవిఖ్యాత సామజవరగమన<br>
ఆ ఆ ఆ...</p>
<p dir="ltr">సామనిగమజసుధా ఆ ఆ ఆ...<br>
సామనిగమజసుధామయ గానవిచక్షణ గుణశీల<br>
దయాలవాల మాం పాలయ<br>
సామనిగమజసుధామయ గానవిచక్షణ గుణశీల<br>
దయాలవాల మాం పాలయ<br>
సామజవరగమనా</p>
<p dir="ltr">ఆమని కోయిలా ఇలా నా జీవనవేణువు లూదగా<br>
ఆమని కోయిలా ఇలా నా జీవనవేణువు లూదగా<br>
మధురలాలసల మధుప లాలనల<br>
మధురలాలసల మధుప లాలనల<br>
పెదవిలోసి మధువులాను వ్రతము పూని జతకు చేరగా</p>
<p dir="ltr">నిసా దనీ మదా గమా<br>
సమమగ గదదమ<br>
మనిసద నసదమ గససని నిగగస<br>
సనినిద దనినిస మదదని గమదని గమదని<br>
సనిద మగసా<br>
సామజవరగమనా సాధుహృత్ సారసాబ్జపాల<br>
కాలాతీతవిఖ్యాత సామజవరగమన</p>
<p dir="ltr">వేసవి రేయిలా ఇలా నా ఎదలో మల్లెలు చల్లగా<br>
వేసవి రేయిలా ఇలా…<br>
ఈ విధంగా జరుగుతున్న సన్నీవేశంలో శంకరశాస్త్రి " శారద" అనే పెద్ద కేకతో సన్నివేశం మొత్తం రసాభస అవుతుంది... శంకరశాస్త్రి తన కుమార్తె ను నీవు పాడుతున్న రాగం ఏమిటి... దాని ఆరోహణ అవరోహణ ఏమిటి అనే విషయంతో ప్రేక్షకుడు అది రాగం తప్పుగా భావిస్తాడు...కాని కఠోర సాధనతో మనస్సు నిగ్రహపరచి సంగీతం పాడుతుంటే...యుక్తవయస్కురాలు అయిన<br>
రాజ్యలక్ష్మి , చంద్రమోహన్ పై ఆసక్తితో పాటలో తన భావిజీవితాన్ని ఊహించుకోవటం... తద్వారా ఇల్లాలుగా తన మధురోహలతో తనపై తాను అదుపు కోల్పోవుతుంది...దానితో రాగ ఆలాపనలో స్వరం తప్పుగా పాడుతుంది....<br>
ఇదంతా పరిశీలిస్తున్న శంకరశాస్త్రి తన కుమార్తె మానసిక పరిస్థితి తదుపరి దేహపరిస్థితి అవగాహన వచ్చిన వాడు...కాని పెళ్ళి చేయలేని ఆర్ధిక స్థితి...కాని కుమార్తె వయస్సు వచ్చినందున ఎదుట వున్న వరునితో తన భావిజీవతం అనే భావనతో కుటుంబ సాంప్రదాయ కట్టు దాటిపోతున్న విషయం పరిగణలోకి తీసుకున్న దర్శకుడు... దాన్ని నర్మగర్భంగా రాగం పై మరలచి....నీవు నీ స్వాధీనం లో వున్నావా అని కుమార్తె ను అన్యాపదేశంగా ప్రశ్నించారు......<br>
ఇలా ఈ చిత్రం లో మన దృశ్యమాన విషయం వేరు...అంతఃకోణంలో వివరం వేరు....<br>
ఇది ఓక పరిశీలన మాత్రమే....<br>
ఇక శంకరాభరణం సినిమాలోని సామజవరగమన పాట...పల్లవి , మకుటం త్యాగరాజకీర్తన లోనివి తదుపరి భావవ్యక్తీకరణ పార్ట్ వేటూరి సుందరరామ్ముర్తీ రాసినది.....<br>
ఇక ఈ మధ్య కాలంలో వచ్చిన సామజవరగమన గురించి వివరించాలని వున్నా వివరించలేని పరిస్థితి.... అది సీతారామశాస్త్రి మాత్రమే చెప్ప తగ్గరు....<br>
ఇది నా పరిశీలన మాత్రమే....<br>
సర్వులకు శ్రీరామ జయం.<br>
మీ అభిప్రాయాలను తెలపవలసినది<br>
ఆలపాటి రమేష్ బాబు...<br>
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో<br>
విజయవాడ<br>
<a href="tel:9440172262">9440172262</a>.<br>
మీ ఖండనలు , విమర్శలు కై ఎదురుచూపులు...<br><br><br><br><br></p>Alapati Ramesh Babuhttp://www.blogger.com/profile/10902788241134698143noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2337893138436064619.post-61798202739531026982020-08-04T07:36:00.001+05:302020-08-04T08:37:25.583+05:30సత్యనారాయణ వ్రతం విశిష్టత అంతరార్ధం<p dir="ltr">సత్యనారాయణ వ్రతం విశిష్టత.<br>
కార్తీక మాసంలో ను , మరి <br>విశిష్ట సమయంలో సర్వ బాహుళ్యం వారి నివాసంలోను , అన్నవరం లోను , వనభోజనం సమయంలో వ్రతం చేస్తారు కాని వీరిలో ఒక్క శాతం వారికి కూడా దీని విశిష్టత పై అవగాహన లేదు. మరి నేను నా కోణంలో తెలియచెప్పే ప్రయత్నం మాత్రమే అని గ్రహించ ప్రార్ధన.<br>
మనకున్న అనేకానేక పూజా విధానములలో సత్యనారాయణ వ్రతం ఎంతో విశిష్టత కలది.<br>
సహజంగా అందరు వివాహంతో గృహస్థులు కాగానే చేయి మొదటి దైవ కార్యం. చాలా మంది ఆసక్తిగా చేసినా తదనంతరం పరిణామం లో కొంత ఆసక్తి తగ్గుతుంది దానితో యాంత్రికత కలుగుతుంది. కాని వ్రతం శ్రద్ధగా చేయివారికి కొంగుబంగారంగా స్వామి వారిని కరుణిస్తారు అనటంలో సందేహం వలదు.<br>
ఈ వ్రతం స్మార్త విధానంలో గణపతిపూజతోను వైష్ణవవిధానంలో విష్వక్సేన పూజతో ప్రారంభం.<br>
అ తరువాత వ్రత కధ ప్రారంభం.<br>
ఈ వ్రత కధ ఐదు అధ్యాయాలు కలదిగా బహుళ ప్రచారంలో వున్నను ఇది 9 అధ్యాయాల వ్రత కధ. ఇందు మొదటి ఐదు కధలు పూజ సమయంలోను. తదుపరి నాలుగు కధలు వ్రతం ముగిసిన తరువాత రాత్రి సమయంలో భగవత్సేవ కైంకర్యం సమయంలో వినాలి అని నిర్దేశించారు. మరి ఏ సమయంలో ఏ పెద్దలు ఈ క్రతువును ఐదు కధలు కలదిగా మార్చే సంకల్పం చేసి కల్పోక్తపూజవిధానంగా మార్పు చేసి సుజనరంజకము సుభోదకముగా చేశారనుటలో సందేహంలేదు. <br>
ఈ విధానం మొత్తం రెండు భాగాలుగా విభజన. ప్రధమ భాగం దేవత ఆహ్వానం , వ్రత కధ రెండోవ భాగం.<br>
ఈనాడు గృహస్థులు యాంత్రిక తో చేయిచున్నారు కాని వారికి అవగాహన వున్న శ్రద్ధగా చేయగలరు అనుటలో సందేహం లేదు. దేవతా ఆహ్వానం ను మండపారాధన అంటారు. సాధారణంగా మనం గృహమునకు అతిధి వస్తే ఆసనం,నీరు లాంటి మర్యాదపూర్వక చర్యలు చేస్తాం కాని నేడు మనం దేవాది దేవుడు అగు సత్యనారాయణ స్వామిని, మన వ్రత ప్రదేశం నకు స్వామిని అర్చారూపకంగా ఆహ్వానం పలికి కలశరూపంలో స్థాపన చేయిటయే మండపారాధన.<br>
ఈ మండపారాధన కు, ఓ క్రమ పద్ధతి వున్నది.<br>
వ్రతం ప్రదేశం నందు చక్కగా రంగవల్లులు తో తీర్చి ఆపై అరటిఆకు గాని , వెడల్పయిన పీటగాని వేసి దానిపై నూతన వస్త్రం పరిచి దానిపై ప్రాణం జీవనాధారం అగు ధాన్యం (బియ్యం) ను పరిచి<br>
ఆపై గణేశాది పంచపాలకులు (గణపతి , బ్రహ్మ, విష్ణు, రుద్రుడు,గౌరి) తదనంతరం నవగ్రహాలు వాటి తాలూకు అధి దేవతా ప్రత్యధిదేవతా సహితంగా వీరిని క్రమంలో సమంత్రకంగా ఆహ్వానం చెపుతూ వారి వారి గ్రహ యొక్క శక్తి మన దేహంపై మన నిత్య జీవితంలో ఏవిభాగం పై వుంటుందో తెలుపుతూ ఆహ్వానిస్తారు.</p>
<p dir="ltr"> (సూర్యుడు - ఆత్మ - అగ్ని - రుద్రుడు<br>
చంద్రుడు - మనస్సు - ఆపః - గౌరి<br>
కుజుడు - రోగ, - భూమి - క్షేత్రపాలకం.<br>
బుధుడు - బుద్ధి - విష్ణుం - నారాయణం<br>
గురువు - సంతానం - బ్రహ్మణం - ఇంద్రుడు<br>
శుక్రుడు - కళత్ర - ఇంద్రాణి - ఇంద్రమరుత్తులు<br>
శని - కర్మ - యమం - ప్రజాపతి<br>
రాహువు - చక్షువు - గామం - సర్వాంగ<br>
కేతువు - మోక్ష - చిత్రగుప్తుడు -బ్రహ్మణం)<br>
తదనంతరం అష్టదిక్పాలకులు, వాస్తు పురుషుడు, క్షేత్ర పాలకుడు,భూమి,ఆకాశం ఇలా సమస్త దేవతలను వారు ,వారి కుటుంబ ,పరివారం,వాహనం,ఆయుధసమేతంగా విచ్చేయమని సమంత్రకంగా ఆృహ్వానిస్తూ వారి వారి స్థానాలకు వారిని ఉపస్థితులను కావింప చేయాలి.<br>
మరి వీరితో పాటు గృహస్థులు యెక్క జన్మనక్షత్రం అధిదేవత ప్రత్యధిదేవత సహితంగా ఆహ్వానం. దీని వలన గృహస్థులు కు గోచార రీత్యా క్షేమం.<br>
మరి వీరందరి ఆహ్వానంనకు ప్రతి ఒక్కరిని<br>
ఓ తమలపాకు పై వక్క, పసుపు కొమ్ము, ఖర్జూరం, అక్షింతలు, రూపాయికాసు సహితంగా ఆహ్వానం చేస్తాం. ఇందు వక్క దేవతాంశ గాను , పసుపు కొమ్ము దేవతాంశ స్త్రీ రూపం గాను ఖర్జూరం నివేదనగాను , అక్షింతలు వారికి అర్చన గాను , రూపాయి కాసు హిరణ్యరూపకంగాను (పాపం మన వాళ్ళు ఈ రూపాయి కాసు అయ్యవారికి వెళుతుందని లోభిస్తారు ) ఇది లోపం లేకుండా వుండాలి.<br>
కారణం విశ్వాంతరాళలలోనుండి వచ్చే దేవతలకు వారి పరివారాలకు ఆహ్వానం పలుకుటలో మనకు తెలియని లోపాలను నివృత్తి కై మరియి వారి నిమిత్తం దాన, దక్షిణకై...<br>
ఇలా ఇవి అన్ని కలిపి సుమారు 50 పైగా అవుతాయి. ఇలా వీరందరి మధ్య స్వామి ని కలశరూపకంగా సకల నది జలాలు సకల దిజ్మండలాల మధ్య సకల పరివారం సహితంగా శ్రీ సత్యనారాయణ స్వామి ని ప్రతిష్ట చేస్తాం.<br>
తదనంతరం స్వామి పురుష సూక్త పూజ , ఆ తదుపరి స్వామివారి రూపును పంచామృత అభిషేకం మన్యుసూక్తసహితంగా చేసి తదనంతరం స్వామి వారి అష్టోత్తర, సహస్రనామాలు తో స్తుతించడం తదనంతరం లక్ష్మీ దేవిని అష్టోత్తర పూజలతో వ్రతం నందు మొదటి భాగం పూర్తి.<br>
తదుపరి వ్రతం యొక్క ఉత్తర భాగం కధ భాగంలో అడుగు పెడతాం.<br>
మనం ఇప్పటి వరకూ వ్రత విధానం తెలుసుకున్నాం. మరి స్వామి వారు ఎవరు మన వ్రతం యెుక్క లక్ష్యం,ప్రసాదం మహిమ ఏమిటి చేస్తే వచ్చే ఫలితం ,చేయగలమని అనుకోని చేయకపోవటులో ఇబ్బంది తెలుసుకోవటమే కధ రూపకంగా.<br>
* ప్రధమ అధ్యాయం*<br>
వ్రతం ప్రధమ కధ నందు.<br>
నైమిశారణ్యం నందు సూతమహాముని శౌనకాది మహర్షులు కు మానవులు కష్టనష్టాలు తీర్చుటకు తరుణోపాయం అన్న వ్యాఖ్యలు తో కధ ప్రారంభం .</p>
<p dir="ltr">ఈ సకల చరాచర విశ్వం నందు జీవంతో కలిగిన గోళం ఒక్క భూగోళం మాత్రం...ఇందు గల అనేకానేక జీవావరుణంలో మానవుడు మాత్రమే అన్య ప్రాణులకు భిన్న ప్రకృతి కలవాడై వున్నాడు. బుద్ధి మనస్సు వాక్కు కలిగిన వాడుగా వున్నాడు. మిగిలిన ప్రాణులు ఇవి లభించక తమ మనుగడకు ప్రకృతిపై ఆధారపడి ప్రకృతిలో ఒకటిగా మనుగడ సాగిస్తున్నాయి కాని మానవుడు తన భిన్న ప్రకృతి చే తనకు గల విశిష్టత ను వినియోగం పరిచి ప్రకృతి ని తన ఆధిపత్యాన్ని కి తెచ్చుకుని పంచ భూతాలయిన వాటిని తనకు అనుకూలమైన వినియోగం మైన విధముగా చేశారు.అయనను అతని ఆశ తీరిక ఇంకను ఇంకనూ అన్న స్వభావం వలన అతని జీవన పరిణామం క్రమం తప్పి అనేక కష్టనష్టాలను చవి చూస్తున్నాడు . దీని వలన మానసిక సంతులనం కోల్పోయి దిగులుగా ఇబ్బంది గా వున్నాడు...<br>
ఈ సమయంలో నారదమహర్షి భూలోకం సంచారం చేయిచూ పై విషయాలను వైకుంఠ వాసుడైన విష్ణువుతో ప్రస్తావన...<br>
ఆసమయంలో స్వామి వారి వర్ణన ....<br>
స్వామి వారు తన అంశం రూపం అయిన సత్యనారాయణ వ్రతం చేసిన మానవుల కష్టాలు దూరం అవుతాయి మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని అంటారు.<br>
ఇక్కడే మన పూర్వీకులు మహర్షులు చమత్కారం మనకు తెలియజేస్తుంది...<br>
సాధారణ మానవుడు భోగలాలసతో జ్ఞాన శూన్యతతో భగవంతునికై కృషి సల్పుటలో అలసత్వం తో వుంటారు. మరి వారి మోక్ష ప్రాప్తి కి కొన్ని రకాల వ్రతం ,నోములు<u>,</u> పారాయణలు ప్రవేశం ...వీటి అన్నింటిలోను ఉత్తమమం నామధ్యానం....<br>
అసలు నారాయణుడు అంటే ఎవరు?<br>
మనం నారాయణుడు విష్ణ్వంశగా భావిస్తాం.<br>
ఈయన పని లోక పాలన...<br>
నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమమ్ అన్ని భాగవత వాక్యం అనుసరించి<br>
ఆయన మహ పురుషుడు...మరి ఆయన నామం రూప ధ్యానమే సత్యనారాయణ వ్రతం అన్నది రహస్యం.<br>
సత్ + య + నారాయణ అన్న పద సముచ్ఛయం సత్యనారాయణ గా వాడుక.<br>
ఇందు సత్ అన్ని పదానికి అర్ధం ఎల్లప్పుడు , సతతం , అన్నివేళలా అని......<br>
యం అన్నది మన దేహం నందు గల కుండలిని చక్రంలోని అనాహత చక్ర బీజాక్షరం.<br>
ఈ అనాహత చక్రం దేహం నందు <br>
హృదయ స్థానమునందున్నది. పండ్రెండు దళములు గలిగి, హేమవర్ణము గల వాయుతత్వ కమలము. దీని బీజ మంత్రం యం.<br>
అనగా నారాయణ అన్న నామమును హృదయమందు <u>ప్రతిష్టించుకోవాలి</u>.<br>
ఇంకను వ్రతం విధానం తెలుపుట మొదటి అధ్యాయం నందు కలదు. ఏ ఏ<u> </u>కాలాలు<u> </u>చేయాలి, ఏ విధంగా చేయాలి కావలసిన వస్తువులు అన్ని తెలుపుతుంది .</p>
<p dir="ltr">*రెండవ అధ్యాయం*<br>
ఈ అధ్యాయం నందు <br>
కాశీ పట్టణం నందు శతానందుడు అను బ్రాహ్మణుడు వేదం చదువుకున్న వాడయినను ఉపాధి లేక అనేక కష్టనష్టాలను చవి చూసి భగవత్ కృప వలన ఈ వ్రతం చేయిట మరియి ఈయన ను చూసిన కాలకష్ఠుడు అనే కట్టేలు కొట్టే వాడు అతని శక్త్యానుసారం చేసి తరించుట.<br>
చూడండి శతానందుడు అన్ని రకాల ఆనందాలు అన్నది నామధేయం లో , విద్య కలవాడు కాని ఉపాధి లేకపోవటమే పెద్ద కష్టం...<br>
కాలకష్ఠుడు అనేది దురదృష్టవంతుడు అనే పదానికి పర్యాయ పదం.<br>
ఇటువంటి పరిస్థితుల్లో వున్నవారు స్వామి వారి వ్రతం చేసిన వారి కష్టం నివారణ జరుగుతుంది అని తెలుపుట రెండవ అధ్యాయం అంతరార్ధం.<br>
*మూడవ అధ్యాయము*<br>
ఈ అధ్యాయం నందు ఉల్కాముఖుడు అను రాజుగారి రాజ్యం నందు ఒక వైశ్యుడు ఈ వ్రతం కధ తెలుసుకుని సంతానలేమి చే బాధ పడుతున్న అతను భగవంతుని కృపచే సంతానం లభించటం అయినను వ్రతం చేయక వాయిదాలు వేయటం అలా తన కుమార్తె వివాహం సమయంలో కూడా వాయిదా వేసి తన సంపాదన నిమిత్తం చంద్రకేతు మహరాజు<br>
పరిపాలనలోని రత్నసానుపురం వెళ్ళుట...ఇలా దైవ ధిక్కారం నకు పాల్పడుటతో అతని కుటుంబం ,అతను అనేక కష్టాలు గురి అవటం...దీనికి తరుణోపాయం గా వ్రతం చేసిన<br>
కష్టాలు తీరును అన్న బుద్ధి కలిగించును...<br>
ఈ క్రమంలో వ్రతం నిర్వాహణా లోపం శ్రద్ధాలోపం భక్తి లోపం వలన కలుగు ఇబ్బందులు తెలుపుట ఈ అధ్యాయం యెక్క ఉద్దేశ్యం.<br>
*నాలుగవ అధ్యాయము*<br>
ఈ అధ్యాయం నందు పై అధ్యాయం పాత్రలే వారి తప్పులు మన్నించి స్వామి వారు తరుణోపాయం చూపుట.<br>
భగవంతుడు భక్త సులభుడు మీకు దొరుకు సహాయం ఆకాశవాణి గా అన్యాపదేశంగా అజ్ఞాతం గా జరుగగలదని తెలుపట ఈ అధ్యాయం యెక్క లక్ష్యం.<br>
*ఐదవ అధ్యాయము*<br>
ఈ అధ్యాయం నందు తుంగధ్వజ మహరాజు అడవికి వేటకు వెళ్ళి ఆ సమయంలో అడవిలోని గొల్లవారు స్వామి వారి ప్రసాదం ఇవ్వగా వారు అనాచారులు అని ఆక్షేపణ చేస్తూ ప్రసాద్ స్వీకరణ చేయక నిర్లక్ష్యం వహించిన దైవ ఆగ్రహంనకు గురి అయి రాజ్యం ,సంతానం పోవటం అన్న కష్టం నాకు గురి అయి దైవజ్ఞల వలన ప్రసాద్ స్వీకరణ నిర్లక్ష్యం అని తెలుసుకుని తప్పు సరిదిద్దుకునటచే స్వామి వారిని కరుణించుట.<br>
ఈ అధ్యాయం లో ధర్మ సూక్ష్మం తుంగధ్వజుడు అన్న పేరుతో తెలిపారు. తుంగ ఎంతటీ నిస్సారవంతమైన భూమిలోను కూడా పెరుగుతుంది అంతేకాక తను పెరిగిన భూమి నిరుపయోగం అవుతుంది.<br>
అలాగే ధ్వజం అనగా జెండా.<br>
మనిషిలో అహంకారంతో, అధికార , ధనమదంతో<br>
దైవదూషణ ధిక్కారం చేస్తే తగిన ఫలితం అనుభవిస్తారని తెలుపుట, భగవంతుని సన్నిధిలో రాజు పేద అన్నది లేదు కావలసినది శ్రద్ధ, భక్తి మాత్రమే.. అలాగే స్వామి వారి వ్రత ప్రసాదం నందు నిర్లక్ష్యం కూడదు అని తెలుపుట. <br>
శ్రీరామ జయం.<br>
****************************************<br>
మిత్రులు నమస్కారం.<br>
ఇందు తప్పు ఒప్పు లు మన్నించి మీ సమాధానం పంపగలరు.<br>
Send your feedback to<br>
Alapati Ramesh Babu<br>
<a href="tel:9440172262">9440172262</a>.<br><br><br><br><br><br><br><br></p>Alapati Ramesh Babuhttp://www.blogger.com/profile/10902788241134698143noreply@blogger.com0