10, మే 2012, గురువారం

రాధ ఏవరు ? క్రిష్ణుడు రాసలీలలు ఎందుకు ఆడాడు?




                                      శ్రీ క్రిష్ణుడు ఇలా తలవగానే మనమదిలో ఒక హాయి ఇది బాలరూపము,  ఒక అల్లరి రూపము గొకులములొది,మరల అంతలొనే బృందావనరాసలీల మనొహర రూపము ఇలా మన మనస్సుని వశపరుచుకున్న పరమపురుష స్వరూపము. 
  
గోకులం లొ  నందుని ఇంటికి  క్రిష్ణుడు రావటము మానవజాతికి గొప్ప వరము. గోకులములో ఈ బాల క్రిష్ణుని లీలావినొదము అంతటికన్న  గొప్ప దివ్యచరితము.ఈ బాల క్రిష్ణునిలోవున్న పసితనము,ముగ్ధమోహనత్వము,అమాయకత్వము,గడుసుతనము,అల్లరి.

ఈ రూపములో యశొదకు,గోవులకు,గోపాలకులకు,గొల్లభామలకు,గిరులకు,తరులకు,మడుగులకు ఇలా సర్వప్రకృతి అంతటికి తన స్పర్శ ప్రసాదించాడు,తన ప్రేమ పంచాడు.వారి ఆరాధన స్వీకరించాడు.  


అసలు ఈ గోకులములో ఎన్నిలీలలు పరిశీలించండి పూతన,బకుడు,తృణావర్తుడు,శకాటాసురుడు,గోవర్ధనము,కాళింది,యశోదకు విశ్వరూపసందర్శనము ఇలా ఎన్ని చూపినా అన్నింటిలొను  ఒకటే లీలామానుష వినోదము.

మరి అదే బృందావనములో ఈ గోపికలంతా తామే క్రిష్ణులమయి, ఖచ్చితముగా చెప్పాలంటే విదేహులయి పూర్తిగా తమను క్రిష్ణునికి అర్పించేంతంటి ఆరాధన,ప్రేమ.

ఈ ఆరాధనకు,ప్రేమకు రూపము కలిపిస్తే "రాధ" అయింది. రాధ అంటే అఖండ ప్రేమతత్వము.రాధంటే ఓక్కరు కాదు గోపికలందరి ఉమ్మడిరూపము.అంతటి ఆఖండప్రేమమయిమైన రాధప్రేమలో క్రిష్ణుడు ఓలలాడాడు,ఆ ప్రేమను స్వీకరించాటానికి పరితపించాడు.తాను కూడా ఆగొపికలందరికి ప్రేమను పంచటానికి వివిధరూపాలు ధరించి రాసలీలలు జరిపాడు. 




9, మే 2012, బుధవారం

కారణ కారణ సంబంధాలు




 ఈ కారణ కారణ సంబంధాలు బహు విచిత్రముగా వుంటాయి. అనుభవములొనే తెలుస్తాయి.

ఆడవిలో ఉసిరికాయ,సముద్రములొని ఉప్పు,ఊరిలొని కారము కలిస్తే ఊరగాయగా మారింది.కాని వీటిని అనుసంధానము చేసినవాడు మానవుడు కాబట్టి ఆహారము అయింది,వ్యాపారము ఆయింది.


తోలుబొమ్మలాటలో ఏపాత్ర ఏప్పుడు ప్రవేశమో,నిష్క్రమణో,కథాగమనానికి తగ్గట్టు మొదటినుంచి చివరకు పాత్రలను నడిపించే బాధ్యత నిర్దేశకుడే.కాబట్టి వినొదము అయింది.

కాని జీవితము ఇవేవికాదు అనుభవాల సమాహారం.ఈ జీవన చిత్రణలో ఏవరిని ఏప్పుడు మనకు అనుసంధానము చేయాలి,ఏప్పుడు నిష్క్రమింపచేయాలి అన్నది పూర్తిగా పరమేశ్వర ఆధినములొనే వుంటుంది అన్నద్ది సర్వులకు విదితమే .  ఇంకొద్దిగా వివరము.

మనము మనసాధారణ జీవనములో ఎవరికన్నా ఉపయొగిపడినా,సహాయము చేసిన, మనకు వారు మన అవసరాలలో ఆదుకుంటారనో లేక ప్రత్యుపకారము చేస్తారనో భావనలో వుండటము సహజము.కాని ఆలా జరగదు.ఇందువలన కొంత ఖేదన సహజము.ఇది వ్యవహారికము.కాని ఈ కర్మఫలితము మన పాపపుణ్యాల ఖాతలో నమోదుచేయబడుతుంది.ఇది సృష్టిలోవున్న  అనుల్లిఖిత నిబంధన. ఇది జరుగుతుంది, జరిగీతీరుతుందీ. 
             
మీరు, మీకు అవసరమయినప్పుడు, ఆ పరమేశ్వరుదు తప్ప అన్యులు సహాయము చేయగలవారేవరు అన్న భావన కలిగితే, మీరు భక్తితో ఆ పరమేశ్వరుని కొరండి,పిలవండి చాలు.

ఇక, ఆపై పరమేశ్వరుని భాధ్యత.

ఎవరో ఎందుకో వచ్చి మీకుసహాయపడతారు. మీ తాలుకు ఆవసరము గడిపి,మీ ఇబ్బంది తీర్చుతారు.సహాయపడ్డవ్యక్తి ఎవరో, ఎందుకుమీకు సహయముచేస్తున్నరో,దాదాపు వారి పేరు ఎమిటోకూడా మీకు అడగాలని అనిపించదు.

కాని తరువాత ఆలోచిస్తే,దేవుడే వచ్చాడా అన్నమాయ.

ఇలా జీవులకు జీవులకు పరమేశ్వరుడు కలిపే అనుబంధాలను " కారణ కారణ సంబంధాలు" అని అంటారు.

ఇది నా జీవితములో నేను 2 సార్లు గమనించా.బహుచిత్రముగా అవి "వారాణాసి" మరియు "కేదారనాథ్" నందు.       


 


8, మే 2012, మంగళవారం

పరశురామ అఙ్ఞాతవాసము

రేణుకా,జమదగ్నిల పుత్రుడు పరశురాముడు పితృవాక్యపరిపాలన వలన తల్లిని సంహరించి,మరలా అదే తండ్రీ వరప్రభావముచే తల్లిని పునర్జీవింపచేసిన విశిష్టలక్షణుడు.ఇంతటి పరశురాముడు ఊగ్రుడు,ముక్కొపి.శివుని మెప్పించి ఆయిధముగా గొడ్డలిని సంపాదించినవాడు.తన తండ్రికి జరిగిన ఘోరమునకు ప్రతీకారముగా 21 మార్లు క్షత్రియవంశ నిర్మూలన కావించి సకల ధరామండలము అంతటిని తన ఆధినములో తెచ్చుకున్నవాడు.    


ఇంతవరకు కథ బాగానేవున్నది.అసలు మలుపు ఇక్కడే ప్రారంభము. క్షత్రియిలందరి నిర్మూలన రాజ్యాలన్ని పరశురామ ఆధినములో కానీ పరశురాముడు పాలనకాక తన తపస్సులో.మరి ఇంకేముంది రాజులేని రాజ్యములో పరిపాలన లేక, రాజ ఉద్యొగుల దుర్మర్గాలకు ప్రజలు బలి.శిక్షలు లేక నేరాలు పెచ్చరిల్లటము.ఇలా అనేక ఇబ్బందులతో రాజ్యాలన్ని అల్లకల్లొలముగా వున్నాయి.అంతా అరాచకము.ఇది గమనించిన సకల మునిగణ,పండిత సభలో ఈ సమస్యపై చర్చ.చివరకు ఓక నిర్ణయానికి వచ్చి భాధ్యత కశ్యపునకు అందచేసినారు. పరశురామునకు కబురుపంపి ఆయినను ఈ మునిగణ పేరలొగమునకు ఆహ్వానము.ఆంత పరశురాముడు రాగా ఈ సభనిర్ణయము ఇది అంటు మీవద్ద వున్న సకల రాజ్యాలను కశ్యపునకు ధారపొయాలని తెలిపినారు.ఆపై పరశురాముదు సకలభూమండలాన్ని కశ్యపునకు ధారపొయగా, దానితో కశ్యపుడు ఈ రాజ్యలన్నిటికి రాజుగా మారిపొయాడు.      

దానితో కశ్యపుడు ,పరశురాముని ఉగ్రలక్షణము తెలిసినవాడై మరలా పరశురాముడు జనజీవనస్రవంతిలో వుంటే మరలా ఇటువంటి ఇబ్బంది వస్తొందని పరశురాముని సముద్రతీరప్రాంతమునకు వెళ్ళమని అదేశించాడు.దానితో పరశురాముడు నేటి గోవా ప్రాంతములో శిక్ష,అఙ్ఞాతవాసము,సముద్రతీరప్రాంత ప్రవాసము ఇలా ఎమయిన అనండి అక్కడకు వెళ్ళిపొయాడు.  


7, మే 2012, సోమవారం

కులవర్గీకరణలు,కులపొరాటాలు ఓక్కటి చేస్తున్నవా? - ఓక్కడిని చేస్తున్నవా?


భారతదేశములో పేరు,ఊరు లేక పొయిన బ్రతుకుతారు కాని కులము లేకపొతే బ్రతకలేరంటే ఆశ్చర్యపొనవసరములేదు.
అంతలా భారతదేశ జనజీవనములో కులవ్యవస్థ పాదుకొనిఉన్నది.నేటి కాలములో సమాజము కన్నా కులము పేరు చెప్పి పబ్బము గడుపుకునే రాజకీయనాయకులకు,కుహనా కులపొరాటాలముసుగులో తమ ఆస్తులు,ప్రాబల్యము పెంచుకునే వారికి అవసరము ఎక్కువగావున్నది. వీరి ఆగడాలకు బయటవారికన్నా స్వవర్గమువారే ఎక్కువబలి ఆవుతున్నారు.  
మనువు 4 వర్ణాలు స్రష్టిస్తే.కాల సమాజ అవసారలనుబట్టి వ్రత్తులు ఏర్పడ్డాయి.అలా అనుచానంగా చేస్తున్న వ్రత్తులనుబట్టి కులవ్యవస్థ.గ్రామ ప్రజలకు ఆవసరమయిన వివిధసేవలను వివిధ వర్గాలు నిర్వర్తించటము, దాని లొనీ మంచి చేడులను బట్టి కొన్ని వర్గాల స్వార్థము వలన అగ్రకుల,దిగువకులాలు గా విభజన.   
ఇక దీనిలొని లొటుపాటులు,ఏవరు ఏవరిని దొచుకున్నారు,ఏవరు అణచివేతకు గురి అయ్యారు అన్నది అంతులేని చర్చ. 
ఇక విషయానికి వస్తే, మీరు ఓక్కసారి సముద్రాన్ని వూహించుకొండి, అనంత జలనిధి నర్మగర్భంగా దిక్ మండలము అంతా వ్యాపించివున్న జలరాశి.శాంతముగా వున్నప్పుడు ఎన్నొ ఇచ్చే సాగరుడు ఆగ్రహిస్తే ప్రళయము.మరి ఇంతటి జలరాశి ఒక్కసారి ఎర్పడినదా?అనేక వేల కొండల్లో కొనల్లో, వేల గ్రామాల్లో కురిసిన ఒక్కొ చినుకు ఏరులుగా, వాగులుగా,నదులుగా ప్రవహించి అనంత సాగారాన్ని ఏర్పరుస్తున్నాయి.కాని పారే నదులకు ఆనకట్టలుకట్టి సస్యామలము చేస్తున్నారు. ప్రక్రుతి కాబట్టి సహిష్ణుతవున్నది. సాగరము నిండుగానే వున్నది.      
ఇక  ఇదే విషయాన్ని  మనసమాజ జనసాగరానికి అన్వయించండి వ్యక్తులు,కుటుంబాలుగా,వర్గాలుగా,సమాజాలుగా,గ్రామాలుగా జన సాగరాలుగా ఏర్పడ్డాయి.   
    మరి ఇంతటి సమగ్రతకు,విశ్వజనీనతకు ముప్పు? కులసమాజాలు,కులవర్గీకరణలు,కులద్వేషాలు అడ్డుకట్టలుగా ఏర్పడి మానావసమాజము తిరొగమనములో పయనించి చివరకు వ్యక్తివద్ద ఆగిపొయే పరిస్థితి. ఇంతటి తిరొగమనానికి మూలకారణము "కులము".   
 ఇంతాలా ఓక్కడవటానికి కారణము మాత్రము సమాజము కన్నా నాయకులే ముఖ్యకారణము.

6, మే 2012, ఆదివారం

శోభనము ముచ్చట్లు - ఓక ప్రత్యేక కథనము.


ప్రతి జంట వివాహమయిన తరువాత ఎంతలా ఎదురు చూస్తారన్నది సర్వులకు విదితమే. శృంగారము ఓక కారణమయితే ఈ క్రతువు తరువాత మాత్రమే వారిని దంపతులుగా పిలువటానికి నిజమయిన అర్హత సంపాదిస్తామని. సాధారణ భాషలో కార్యమని,అక్కరని వాడుక. షోడశ జాతసంస్కరాలలో మొదటిది అయిన దీనిని ఇక్కడ గర్భాధానమని,పునహఃసంధానమని పిలుస్తారు.కాని ఎక్కువగా శొభనమని వాడుక. కారణము. శొభ అనే మాటకు కొరీక,వెలుగు,వస్త్రాభరణ భూషితముతో వచ్చు కాంతి(శబ్దరత్నాకరము) అని అర్థాలు.ఈ మూడు అర్థాలు ఈ సంధర్భానికి చక్కగా సరిపొతాయి.అనగా జీవితానికి వెలుగు, తద్వార సంతానమును ప్రసాదించు కార్యము కాబట్టి శోభనమని వాడుక.


ఇది గృహాన్నిబట్టీ,కులాన్నిబట్టీ,ప్రాంతాలని బట్టి అనేకా ఆచారాలుగా,చివరకు వేడుకగా మారిపొయింది. వీటి గురించి తెలుసుకునేముందు గర్భాధానము యొక్క పూర్వా పరాలు తెలుసుకుందాము.
         
మానవుని జీవితము సంస్కారములకు క్షేత్రము.అందు సంతానమును కనుట ప్రాధాన్యము. పూర్వము సంతానమే వాళ్ళ సిరి సంపద.ధర్మశాస్త్రములు సంతానముకనుట పరమ పవిత్రమని పేర్కొన్నవి.ఈ గర్భధారణ ద్వార పురుషుడు, స్త్రీ యందు తన బీజమును వుంచుచున్నాడుకనుక ఇది గర్భాధానమయినది.ఈ సంస్కారము సమంత్రకముగా జరుగనిచో అశ్వలాయనస్మృతి ప్రాయశ్చిత్తము విధించినది.


తల్లి తండ్రుల మనోప్రవృత్తులను అనుసరించి సంతానముయొక్క మనస్సు,శరీరము ఏర్పడుచున్నవి. కామ,వీర,దైవీ లాంటి వివిధ భావాలలో ఎవరు ఏ భావముతో కలిస్తే అదే భావములో సంతానము కలుగుతారు.(మహభారతములో పాండురాజు,ధృతరాష్ట్ర,విదుర జననము).
కనుకనే గర్భాధాన సమయమున పతి తాను ప్రజాపతి అంశకలవానిగాను,భార్యను వసుమతి రూపమని భావించి కలియవలేనని ప్రాచీనుల అభిప్రాయము.

   స్త్రీ శారీరకముగా సమర్థురాలైనప్పుడు ఋతుస్నాత అయిన 5 రోజు రాత్రి నుండి 16 రోజు వరకు అని మనఃస్మృతి చెబుతుంది.మాసమున కొన్ని దినాలు సంగమమునకు నిషిద్ధము.సంక్రమణ దినాలు, పండుగలు,పర్వదీనాలు,పితృకార్య ముందురొజు, ఆరొజు,అష్టమి,చతుర్దశి,పౌర్ణమి,అమావాస్య,ఏకాదశీ,త్రయోదశి లు తిథులలో. శని,ఆది,మంగళ వారాలలొ, భరణి,కృత్తిక,ఆర్ధ్ర,మఘ,పుబ్బ,విశాఖ,జ్యేష్ట,మూల,పూర్వాషాడ,పూర్వాభాద్ర నక్షత్రాలలో వర్జితమని శూద్రకమలాకరము.
ఈ శొభన లగ్నానికి గురు,శుక్ర శుభదృష్టి అవసరము.

  ఇక వేడుకలకు వద్దాము. వేడుక అంటే ముచ్చటగా జరుపుకునే మన గృహకార్యక్రమము.

 గత కాలములో బాల్యవివాహాల వలన అమ్మాయి రజస్వల అయిన తరువాత మంచి మూహుర్తము చూసి మరి జరిపేవారు.అందువలన వివాహానికి ఈ కార్యక్రమానికి చాలా వ్యవధి వుండేది.ఇంతటి ప్రక్రియలో ఎప్పుడు వచ్చి చేరినదో తెలియదు కాని వివాహమయిన 3రొజులలో అని, 16 రోజులపండుగలోపని ఈ కార్యక్రమము జరిపే పద్ధతి ఎక్కువ అయినది .దానికి తోడు ఆగలేని కుర్రజంటలు, బిజీ జీవితాలు.

ఆరోజున "అల్లుడుగారిని పిలుస్తున్నాము" వచ్చి దంపతులను ఆశ్వీరదించి, "దంపత తాంబూలాలు "అందుకొవాలని తమకు హితులయిన బంధు మిత్రులను పిలుస్తారు.

     అమ్మాయికి తెల్లని చీర ఈ చీరకు సాధారణముగా ఒక్క నల్లని చుక్కకూడాలేకుండా ఎంపిక చేస్తారు.
పాతరొజులలో అల్లుడు అలకపానుపు అని డబ్బు దండుకునేవారు.
ఇక ఇంతటి కార్యక్రమానికి వేదిక అయిన పడకకు పూలతో ఆలంకరణ చేసి జంటను పంపుతారు. నేడు  ఫ్లొరిష్ట్ లు రూ40,000/- నుంచి రూ2,50,000/- వరకు చార్జ్ చేస్తున్నారు.

ఈ పడకపై రాత్రికి పానుపు వేసి వచ్చిన దంపతులకు 5,9 తాంబూలాలు ఇప్పిస్తారు.        
సాధారణముగా ఎవరొ ముసలమ్మలు అమ్మాయికు అబ్బాయి చెప్పినట్లు విను అని రహస్యముగా బొధ చేసెవారు. అబ్బాయికి అయితే మిత్రులో,వరసయిన బావలో సరసము జాగ్రత్త అని హెచ్చరికలు జారిచేస్తారు.

అమ్మాయి కట్నం గా కొంగుకు బంగారము కట్టే సాంప్రదాయము ఇంకావున్నది.
ఇక గదిలో అనేకరకాల స్వీట్స్,పాలు గురించి చెప్పవలసిన పని లేదు.
ఇలా అన్ని ముచ్చట్లు ముగిసి మూహూర్తసమయానికి ఆజంటను గదిలో వదిలి ఇవతలకు వస్తారు. ఇక ఆజంట ఎమి చేస్తారంటారా  ష్..ష్..గప్...చుప్.

ఇవి కాకుండా పాతరొజులలొ కొన్ని చిలిపి ముచ్చట్లు,వింత అలవాట్లు వున్నాయి.
పాతతరములో జంటలు బాగా లెత జంటలు. ఇటువంటి జంటలు పార్వతి పరమేశ్వరులని, వారు జరిపే సంసారం, సృష్టి కార్యముగా భావించి చాలామంది ముసలివారు రహస్యముగా చూడటానికి ఉత్సాహము చూపేవారు. 
కొంతమంది దీనికి వెరే అర్థము చెపుతున్నారు జంటలో ఎవరికన్నా సిగ్గు,బిడియాలతొ చేరిక కాక దాంపత్యము విఫలము కాకూడదని అలా చేస్తారు అంటారు. ఎవరి ఇష్టము వారిది.

ఇది కాకుండా ఇంకొ అల్లరి. కొంతమంది కొంటె మరదళ్ళు పడకకు రహస్యముగా గజ్జేలు కడతారు, చిన్నపిల్లలను గదిలో దాచి సమయానికి పిలుస్తారు,ఇంకొంతమంది బావగారిని అల్లరి పెట్టటానికి తలుపు తీసేవరకు దబ దబా తలుపులు తట్టి, తలుపు తీసిన తరువాత మరదలు కట్నము దండుకుంటారు.

ఇంతటి ప్రాశస్థ్యము గల శోభనము నేడు ఎదొ ఒక తంతులా ముగిస్తున్నారు.
మరి ఇటువంటి కార్యక్రమాన్ని హోటల్ గదుల్లాంటి అంక చండాలమయిన చొట్ల కనిసము సంప్రొక్షణ అయిన లేకుండా ఫ్యాషన్ గురించి జరిపితే వాళ్ళ దాంపత్యాలు ఏవిధముగా సరిగా వుంటాయి. 
ఇటువంటి క్రతువులు సరిగా జరగకపొతే దాని విషపరిణామాలు : సంతానలేమి,దాంపత్యములో కలతలు, ఇంకా ఇక్కడ ప్రస్థావించలేని అనేక అపభ్రంశాలు కలుగుతున్నాయి. 
నేడు కొంతమంది ముదుర్లు హాడావుడి పడి (వివాహానికి)ముందే తొందరపడి ఎలాపడితే అలా ఎక్కడ పడితే అక్కడ ముగించుతున్నారు. వారిని ఆ దేవుడేకాపాడాలి.





5, మే 2012, శనివారం

గ్రామీణ పిల్లల ఆటలు - మీరు ఆడినవి ఎన్ని?


వేసవి మహోత్సవాల గురించి పొస్ట్ వ్రాస్తుంటే అసలు నేను ఎన్ని ఆటలు ఆడానో పరిశీలీంచుదామని ఒక పట్టి తయారు చేసా.నాలా మీకు కూడా ఉత్సాహము ఉంటుందని పేర్లుమాత్రము పొస్ట్ లొ తెలిపినాను.
ఆటలు శారీరకవ్యాయామానికే కాదు మానసిక వ్యాయామానికి పిల్లలందరిలో సంఘీభావానికి,నాయకత్వలక్షణాలకు,ఒక పని ఎలా చేయాలి దానికి కావలసిన ఓపిక ఇలా ఎన్నో నేర్పుతుంది.అలా చిన్నప్పుడు ఆడుకున్న ఆటల లిస్ట్. 

1)దాకలబూచి దండాకొర్  2)వీరీవీరీ గుమ్మడిపండు  3) బొంగరాలు 4)తొక్కుడుబిళ్ళ 5)రైలు ఆట  6)స్కిప్పింగ్ 7)బంతి ఆట 8)బంతి ఆట కుండపెంకులతో 9)రింగు ఆట 10)చుక్ చుక్ పుల్లా 11)కబాడ్డి  12) వంగుడు దూకుడు 13) కర్రా బిళ్ళా 14) కర్రా ఆట హాకిలా ఆడతారు 15)అష్టా చేమ్మా 16) లైను ఆట  17) పులి మేక 18)పాము పటము 19)రాములవారి ఉరేగింపు 20)ఓప్పుల కుప్ప 21) వామన గుంటలు 22) అచ్చం కాయలు 23)చుక్కల ఆట 24) పదాలు వెతుకుట 25)గోలీలు 26)కాగితంతో పడవల్లాంటి  ఆకారాలు 27)బయస్కొప్ 28)దారం తో చిక్కుముళ్ళ ఆట 29)సినిమాలు ప్రదర్శన 30)కొబ్బరి ఆకు తో అమ్మాయి లాంటి బొమ్మలు 31)కొబ్బరి ఈనేలు పైకి పంపే ఆట 32)తాటికాయ బండ్లు 33)అగ్గి పెట్టేల సేకరణ 34)చారు ఆట 35)సైకిల్ టైరు,రిమ్ములతొ పరుగు 36)గాలిఫటాలు 37)కూల్ డ్రింకు మూతకు హోల్స్ వేసి దానిలో దారము పంపి ఆడే ఆట  

    ఇన్ని ఆటలు వివిధ వయస్సు లొ ఆడాము. కొన్ని ఆడపిల్లల ఆటలు చిన్నప్పుడుగావున్నప్పుడు వారితో కలసి.తరువాత మా జట్టువారితోనే ఆటలు. 
మీరు గమనించారోలేదో ఈ ఆటలన్ని దాదాపు ప్రక్రతిలొనే ఆడేది , ఆటకు కావలసిన వనరులు కూడా సహజ వనరులే.ఇక ఆర్థికంగా వ్యయమంటే దాదాపు శూన్యము కావలసింది బుద్దిబలము,దేహశ్రమ మాత్రమే.అందుకే ఏన్నితిన్నా ఏమితిన్నా అరుగుదల.  

కానీ నేటి పిల్లలకు కంప్యూటర్ ఆటలు లేకపొతే క్రికేట్.ఈ నాటి ఆటలు దాదపు ఇంటర్ యాక్టివ్ గా వుంటున్నాయి కాని దేహశ్రమ లేదు.
ఇన్ని ఆటలు పల్లెటూరిలో కూడా నాగరికత ప్రభావానికి లొను అయ్యాయి. నర్సరి నుంచే రాంకుల యావ.విద్యలో వ్యాపార ధొరణి,మా అబ్బాయి కొండ యేక్కాలనే పేరాశలు మధ్య ఈ ఆటలన్ని నిర్విర్యము ఆయిపోయాయి. కొన్ని ఆటలు కాలగర్భములో కలసిపొయాయి.ఈనాడు ఈఆటలు ఆడటము నామోషి.ప్రతీది వ్యాపరమయమయిన నేడు ఆటలు ఇందుకు అతీతముకాదు.క్రికెట్,చదరంగము,టెన్నిస్, లాంటీవి నేర్చుకొని తొందరగా కొట్లు సంపాదించాలనే ఆత్రము తప్ప ఇంకొటి కానరాదు.కారణము జివీతాల్లొకి చొచ్చుకొనివచ్చిన టివీ.ఇది ప్రజల ఆలొచన,ఆలవాట్లు,ఆహరము పై వీపరీతప్రభావము చూపుతుంది.     

4, మే 2012, శుక్రవారం

వేసవి కాల మహొత్సవాలు - ఇంటింటి సందళ్ళు - ఆవకాయ.


వేసవి కాల ఇంటింటి వేడుకలలో ఆవకాయది ఒక ముఖ్యఘట్టము.

మామిడే ఓక అద్భుతము ఆయితే మనవారి ఆవకాయ అంతకన్నా మహాద్భుతము.ఏర్రరని రంగు, టపక్ మనే పులుపు, స్ స్ మనేకారముతో నొరువూరటము వెరసి  మొత్తము కలిస్తే ఆవకాయ.  
మన తెలుగువారికి ఎన్ని కూరలు  వున్నా ఆవకాయ లేకపొతే ముద్ద దిగదు.అంతేందుకు 10 రోజులు బయట అలా ప్రయాణాలు చేసివచ్చినతరువాత వేడివేడి అన్నములో ఆవకాయ కలిపి దానికి ఇంత నెయ్యి కలిపి తింటే చవి చచ్చివున్న నాలుక పాముకన్నా వేగముగా కదులుతుంది.అంతటిది ఆవకాయ మహత్యము. మరి ఇంటీల్లపాదికి సం. పొడుగునా ఊరగాయకావాలంటే ఇల్లాళ్ళకు ఎంతశ్రమ ఎంతకష్టము.అంతటి కష్టాన్ని మనమాత్రుదేవతలు  ఇష్టంగా చేసి అహావొహో అని అంటున్న కుటుంబసభ్యుల మాటల్లో తమ కష్టాన్ని మరచిపొతారు.

అసలు ఆవకాయ పెట్టాలంటే క్రత్తికకార్తే రావలనేది మావాళ్ళ ఊవాచ.  తోటల వద్ద మంచికాయలు ఎంచి తేచ్చి వాటికి వున్న సొన,జిగురు అవీ కడీగి వాటిని ఆరబెట్టాలి.

మాగాయ అయితే ముందు మామిడికాయ చెక్కుతీయాలి.పీలర్ తో అలా తోలు వలచి ముక్కలు తరగటమే. ఇప్పుడంటే పీలర్ లు వచ్చాయికాని పాతకాలములో అయితే ఆల్చిప్పలను అరగదీసి పీలర్స్ గా వుపయోగించటమే. ఈ ఆల్చిప్పలను జాగ్రత్తగా దాచి వుంచేవారు.
ఈ తరిగిన ముక్కలు,టెంకేలు  అన్నింటిని కలిపి ఊప్పులో 3 రోజులు ఉరబెట్టాలి.ఆ తరువాత  ముక్కలను పలుచని నూలు వస్త్రములో మూటలాకట్టి దానిపై బరువు వుంచి క్రింద బేసిన్ లాంటిది ఎర్పాటు చేస్తే వూట క్రిందకు దిగుతుంది. అలా సేకరిచిన మొత్తము వూటను ఒక పాత కుండలో భద్రపరచాలి.ఈ ముక్కలను ఎండలొ పెట్టి ఎండపెట్టాలి. వాటీలొ వున్న తేమపొయి గలగల మనేవరకు ఎండాలి.ఇలా ఎండిన ముక్కలను మామిడి వొరుగులు  అంటారు. ఈ మామిడి వొరుగులకు కారము,నూనే కలిపి ఇంగువ తాలింపు పేడితే మాగాయ సిద్ధము.
ఈ మామిడి వొరుగులు కొన్ని తీసి భద్రపర్చితే మామిడికాయ రానికాలాల్లొ పప్పులాంటి కూరల్లొ, టేంకెలయితే మజ్జిగన్నానికి అధరవుగా ఉపయోగిస్తారు.
    ఇక ముఖ్యమయిది ఆవకాయ.దీనిలొ కష్టమయినపని కాయను, టేంకతొసహా అలా మధ్యకు కొయటము.టెంకపైవున్న పెచ్చు గట్టిగావుండి బాగా ఇబ్బంది పెట్టినా మన వాళ్ళప్రయత్నము ముందు అది ఎంత.ఇలా తరిగిన ముక్కలొని జీడి తీసి మనకు అనువుగా చిన్నముక్కలుగా కొట్టాలి.ఇలా సేకరించిన ముక్కలకు ఆవపిండి,కారం,ఊప్పు,నూనే కలిపితే 3 రొజులకు ఆవకాయ సిద్ధము.


చాలమంది ఆవకాయేకాక నువ్వుకాయ,పెసరావకాయ,మెంతికాయ,చిన్నముక్కల ఆవకాయ,ఉల్లి ఆవకాయల్లాంటీ రకాలు కూడ పెడతారు.

ఈ ఆవకాయేలే కాక ఇదే వేసవిలొ వడియాల్లాంటి ఉపచయాలు కూడ ఇప్పుడే అవకాశము.





3, మే 2012, గురువారం

దశావతారాలు ఏన్ని? వాటి దశావతారాలు అన్నపేరుకు కారణము!


మనిషి తన కర్మఫలాన్నిబట్టి జన్మపరంపర జరుగుతుంది.ఈ జన్మపరంపరలో ఎవరైన సమాజములో వున్న అశాంతిని రూపుమాపి శాంతి సమత్వాలు  స్థాపించాడో వారే అవతారపురుషులు.వారిని ఆధారముగావున్నవే అవతారకథలు.
ఈ అవతారకథల  వర్ణనచేసేది శ్రీమద్భాగవతము. మరి ఇందు అప్పటివరకు ప్రకటితమయిన మత్స్య,కూర్మ,వరాహ,నారసింహ,వామన,పరుశురామ,శ్రీరామ,శ్రీక్రిష్ణ అవతారాలు మొత్తము 8 రాబొయేది కల్క్యావతార ప్రస్తావనతో 9 అయినవి.  మరి 10 అవతారం?
 ఈ 10 అవతారముగా  వైష్ణవులు బలరాముని ,మిగతావారు బుద్ధుని అవతారమూర్తిగా పిలుస్తారు. దీనితో 10 కాబట్టి దశావతారాలు అని పరిగణన.

మరి ఇది సరి అయినదా? బలరామా అవతరాములో సమాజముకు ఎమి జరిగిందని అవతార పట్టాభిషేకము. అది వారి సాంప్రదాయము కాబట్టి మనము ఏమి చేయలేము.
మరి బుద్ధుడు అన్నిటిని వ్యతిరెకించినవాడు.మరి వీరికి ఏందుకు అవతార పట్టాభిషేకము.    
      అంటే పురాణకాలానికి దశావతారాలు అన్న గణనలేదు కాని తరువాత మన పూర్వికులు వారి పరిశీలనతో దశావతారాలని వాడుకలోకితెచ్చారు.
బహుశా ఈ రెండు కారణాలు ఆయి వుండవచ్చు.
అందు మొదటిది జీవ పరిణామ సిద్ధాంతాన్ని మనము ఇక్కడ అన్వయిస్తే అంటే సృష్టిలో జీవము ఏర్పడినది నీటిలో అనగా మత్స్య అవతారము. ఆతరువాత ఉభచరము ఇలా  అన్ని అవతారాలకు  సరిపొల్చారని భావించవచ్చు.

రెండొవది నా ఆలొచన ఇందు "ద" అనే అక్షరము దమనత్వాని ప్రతిఫలిస్తే, "శ" అనే అక్షరము శమించాటాన్ని,పరిమార్ఛటాన్ని సూచిస్తుంది.అనగా సమాజములొని రాక్షసత్వాన్ని రూపుమాపి సమత్వాన్ని స్థాపన .   
 కాబట్టి మన పూర్వికులు భాగవతములొ వున్న 9 కి బుద్ధుడిని జొడించి మొత్తము 10 కి సరి చేసి దశావతారాలు అన్నారు.

ఇది మన పూర్వుల ఆలొచనల సారము.    




*********************************************************************************
తాజా అప్ టూ డేట్

 మానవుడు సకల బాధలకు కారణమయిన కొరిక (అనగా సాధారణ మానవుడి లొని దమనత్వాని) . మరి ఇంతటి దానిని జయించి బుద్ధుడుగా సర్వులచే ప్రస్తుతింపపడ్డాడు.
ఇక కల్కి అవతారములొకి వస్తే "శంబల" నుంచి వస్తాడని ఐతిహ్యము. ఇది ఎక్కడది. శంబల అంటే కూడా ఇదే పాపాన్ని ఎవరు అడ్డుకుంటారో అక్కడివాని నివాసమని.అక్కడవున్నవారే కల్కి అవతారమని. మన పూర్వులు కొన్ని సూచన గా మనకు వదిలారు. కాని మనము వాటిని సరిగా ఆర్థము చేసుకొలేక రకరకాలా ప్రక్షిప్తాలు.రకరకాల కథలు.
ఓక్క సారి అలా పరిశీలించండి చాలు.    

2, మే 2012, బుధవారం

వేసవి కాల మహొత్సవాలు - పిల్లల సందళ్ళు



ఈ వేసవికాలం వచ్చిందంటే చాలు వాతావరణములొ మార్పులు.పగటి నిడివి పెరగటము.వ్యక్తుల చైతన్యశీలనత పెరగటము.అలా సమాజము మొత్తము సందడిగా మారుతుంది.
పిల్లలు మాత్రము అన్ని కాలాల కన్నా వేసవికాలం గురించి ఏక్కువ ఎదురుచూస్తారు.ఫైనల్ పరీక్షలయ్యి మీరు పాస్ అయ్యారని స్కూల్లొ మాష్టారు చెప్పగానే,అమ్మా నేను పాస్ అయ్యానో అంటు ఒకటే పరుగు ఇంటికి.దారిలో ఆనందము పట్టలేక ఒకరి మీద ఒకరు ఇంకుచల్లుకొవటము.ఇన్ని సంబరాలమధ్య వేసవి సెలవలపై ప్రణాళిక .సాధారణముగా మొదటిది ప్రముఖమయినది అమ్మమ్మగారీంటికి ప్రయాణము.పరీక్షలయ్యేరొజుకు తాతయ్యకాని,మామయ్యకాని సిద్ధము.అమ్మతో సహా పిల్లలందరు అమ్మమ్మదగ్గరకు ప్రయాణము.ఇక అమ్మమ్మ దగ్గర మనము యువరాజులము,యువరాణులము బొలేడు ముద్దు మురిపాలు.ఇల్లాళ్ళు మాత్రము అమ్మా!వాళ్ళను గారాబము చేయకే,నీ ముద్దుతో తరువాత నన్ను ఇబ్బంది పెడతారు అన్న మందలింపు.అమ్మమ్మమాత్రము , నాన్న అమ్మను ఇబ్బంది పేట్టకే అని వొట్టొట్టి అనునయంపు.అసలు మనము వచ్చేసరికి ఇక్కడ బొలెడురకాలు సిద్ధము.    కొద్దిగా పెద్దపిల్లలు ఆయితే చెట్ల నీడన ఆడుకొవటము.సీమతుమ్మకాయలు,ముంజలు తీసుకొనిరావాటానికీ  చెట్లవెంటా,తోపులవెంటా పొయి సాధించుకొచ్చి తిన్న వాటి రుచి.  
         మధ్యాహ్న ఎండత్రీవ్రతకు బయట తిరుగుట నిషిద్దము ఆయితేనేమి,ఇంట్లో ఆడుకునే ఆటలకు కొదవలేదు.పాముపటము,అష్టాచేమ్మా,దాయము,పులిమేక,చదరంగము,క్యారము లాంటివి అందరు ఆడతారు.అచ్చకాయలు,వామనగుంటలు లాంటివి ఆడపిల్లలకు ప్రత్యేకము.
ఇన్ని కార్యక్రమాల మధ్య సైకిల్ నేర్చుకునేకార్యక్రమము కూడా ఇప్పుడే ప్రారంభము.ఈ నేర్చుకునే కార్యక్రమములో మొకాలికి దెబ్బలు ఆయినా ఎలగొలా నేర్చుకొని కొత్తసైకిల్ మీద బడికి వెళ్ళలనే శపధాలు.వీలు ఆయితే సాయంకాలాలు షటిల్ ఆడటము.

అచ్చగా ఆటపాటలే కాక ప్రాథమిక,మధ్యమిక లాంటి హింది పరిక్షలకు తయారుకావటము.కొంతమంది టైపుకు వెళ్ళటము.
ఈ వేసవిలొనే గ్రామదేవతల ఉత్సవాలు,కళ్యాణాలు,రధొత్సవాలు వీటీల్లొ పాల్గొనటము ఒక సంబరము,ఒక ఉత్సాహము.ఈ ఉత్సవాల్లో  నాటకాలు,హరికథలు,బుర్రకథలు,16మి.మి.సినిమాలు ఇన్ని కళారూపాలు చూడటము ఒక అనుభూతి.   
మరి ఈనాటి పిల్లలకు అమ్మమ్మగారిల్లు ఒక్కటే మిగిలింది. మిగతావన్ని టీవి,కంప్యూటర్లే సర్వము.వీలుంటే అప్పుడప్పుడు ప్రకృతిని పరిచయముచేయండి.    

1, మే 2012, మంగళవారం

మామిడి ని ఙ్ఞానఫలము అని దేనికంటారు? వివరణ


ప్రకృతి ఇచ్చిన వరాలలొ మామిడి పండు ఒక విశిష్టస్థానము.మామిడి మన జీవితాల్లొ అనేకవీధాలుగా పెనవేసుకొన్నది.మామిడీఅకులేని శుభకార్యము,పండుగను వూహించలేము.

ఇంతటి విశిష్టమయిన మామిడికాయ పిందేగా వున్నప్పుడు వగరుగా,కాయగా వున్నప్పుడు పుల్లగా,పండుగా మారిన తరువాత అమ్రుతమయిన  తీపిగా. బహుశా ఈ మామిడి ఒక్కటే విభిన్నదశలలో తనరూపాన్ని,లక్షణాన్ని,రుచిని మార్చుకొనేది.
  
మరీ ఙ్ఞానముకూడా అంతే ప్రారంభదశలొ సాధనకు పడ్డకష్టము వలన ఙ్ఞానము ఇంత శ్రమతోకూడినదా అని అనిపిస్తుంది. మరి ఇది  వగరుని ప్రతిబింబిస్తుంది.

అదే సాధన కొంతదారి లొ పడ్డాక కొన్ని అనుభవాలు పొందేసరికి, ఆహా!నాకు కూడా ఏవొ తెలుస్తున్నాయి, ఎమిటి ఈ అనుభవాలు ఇంత బాగున్నయి అనే తలంపు. మరి ఇది పులుపు కదా!

అదే సాధన ఫలించి దర్శనము జరిగి తత్ ప్రభావముచే 'మౌనమే' శరణ్యమనే స్థితి.మరి ఇదేగదా తీపి.

అందుకే మామిడిపండుని ఙ్ఞానఫలమని పెద్దల ఉవాచ.

కంచి ఏకామ్రేశ్వరుడి సన్నిధిలోని మామిడిచెట్టుకువున్న పవిత్రత.

పళని గుడి వద్దవున్న కుడ్యచిత్రాలలొ నారదుడు శివునకు ఙ్ఞానఫలము రూపములొ మామిడిని ప్రసాదించటము మనము గమనింపతగినవి.