26, ఫిబ్రవరి 2023, ఆదివారం

బ్రోచేవారు ఎవరు రా నిను వినా రఘువరా కీర్తన విశేషాలు

బ్రోచేవారెవరురా

పల్లవి:

బ్రోచేవారెవరురా
నిను విన ,నిను విన
రఘువరా, రఘువరా
నను బ్రోచేవారెవరురా
నిను విన రఘువరా
నీ చరణాం భుజములునే
నీ చరణాం భుజములునే
విడజాల కరుణాలవాల
బ్రోచేవారెవరురా ఆ ఆ

చరణం1:

ఓ చతురా ననాది వందిత నీకు పరాకేలనయ్య
ఓ చతురా ననాది వందిత నీకు పరాకేలనయ్య
ఓ చతురా ననాది వందిత నీకు పరాకేలనయ్య
నీ చరితము పొగడలేని నా చింత తీర్చి వరములీచ్చి వేగమే
నీ చరితము పొగడలేని నా చింత తీర్చి వరములీచ్చి వేగమే
సా సనిదపద నిస నినిదదపమ
పాదమ గా మా పదాని సనిదపమ నీదాపమ
గమపద మగరిస సమా గమపద మాపదని
ససరిని నినిసదా దదనిపాద మపదని
సానిదప మగమనిదని పదమాపదని
సమా గరిస రిసానిదప సనిదపమ గామపదని
బ్రోచేవారెవరురా ఆ ఆ

చరణం2:
సీతాపతే నాపై నీకభిమానము లేదా
సీతాపతే నాపై నీకభిమానము లేదా
వాతాత్మజార్చిత పాద నా మొరలను వినరాదా
భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా
భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా
భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా
నా పాతకమెల్ల పొగొట్టి గట్టిగ నా చేయి పట్టి విడువక
సా సనిదపద నిస నినిదదపమ
పాదమ గా మా పాదాని సనిదపమ నీదపమ
గమపద మగరిస సమా గమపద మాపదని
ససరిని నినిసదా దదనిపాద మపదని
ససరిని నినిసదా దదనిపాద మపదని
సమా గరిస రిసానిదప సనిదపమ గామపదని
బ్రోచేవారెవరురా ఆ ఆ
K . విశ్వనాధ్ గారి స్వర్గ ప్రవేశం...
ఈ సమయంలో వారికి నివాళిగా మరియి నా ఆత్మ నివేదన ను వ్రాయాలి అనిపించి పరిశీలించగా శంకరాభరణం చిత్రంలో ఈ కీర్తనను ఎంచుకున్నాను...
దానికి కూడా కారణం వున్నది...
నేను వ్యక్తిగతంగా సంగీత పాండితీ ప్రకర్ష మరియి సాహితి విద్వత్ వున్న వాడిని కాదు... ఈ రెండింటిలో అభినివేశం వున్నవాడిని మాత్రమే...
ఈ కీర్తన రచించిన వారు మైసూర్ వాసుదేవా చార్య. చాలామంది ఈ కీర్తన ను త్యాగరాజు గారిది అని భావన చేస్తారు. త్యాగయ్య గారిది బ్రోచేవారు అనే కీర్తన వున్నది కాని అది వేరు ఇది వేరు.
మైసూర్ వాసుదేవాచార్య గారు 28/05/1865 నా కర్ణాటకలో జన్మించారు. వీరు 200 పైగా కీర్తన లు రచించినారు. ఇందులో సింహభాగం తెలుగు లోను అందులోను శ్రీరామునిపై...అనేక కీర్తనలు ప్రాచుర్యం పొందినాయి.
వీరి కీర్తనలో వాసుదేవ అన్న పదం మనం గమనించవచ్చు...వీరు అనేక తిల్లానలు, జావళీలు రచించినారు
వీరు కృతి మంజరి అనే పుస్తకం వ్రాసినారు. వీరికి భారత ప్రభుత్వం వారు పద్మభూషణ్ బిరుదుతో సత్కరించారు. వీరు 17/05/1961 న స్వర్గ ప్రవేశం.
ఇక కీర్తన విశేషాలు...ఈ కీర్తన ఖమాస్ రాగంలో,  ఆది తాళం లో...
కీర్తన విశ్లేషణ లోకి....
బ్రోచేవారు ఎవరు రా....అంటే బ్రోవటం అంటే ఏమిటి మనం ప్రశ్నించుకుంటే...జన్మించిన ప్రతివ్యక్తి ఖచ్చితంగా తన తన ప్రార్బద కర్మలను బట్టి అనేకానేక కర్మ ఫలితాలను అనుభవిస్తారు. ఇవి హితమా అహితమా అంటే రెండునూ..‌కాని కొన్ని సమస్యలు జీవిని చుట్టుముట్టి అతను వాటిని దాటలేని పరిస్థితి... పూర్తిగా అంతర్మధనం తో బాధ పడుతుంటారు...ఆ సమయంలో ఏ దైవం అయితే ఈ విపత్కర పరిస్థితిని దాటించుతారో వారే బ్రోచేవారు...
ఇది ఐహికం...
కాని జీవుడు అనేకానేక జన్మజన్మల రాహిత్యం పొందటం తారకం అంటారు...కాని తారకం నకు ఏ దేవి దేవతలు ఉపాసన మరియి నామస్మరణ చేస్తారో వారే బ్రోచేవారు....
అందుకనే బ్రోచేవారు ఎవరు రా నిను వినా రఘువరా....నాయనా శ్రీరామ చంద్ర ప్రభు రఘువంశంలో ఉత్తముడా!
నీవు తప్ప నన్ను వేరెవరు బ్రోచగలరు.
నాయనా! శ్రీరామ నీ పాదములు నేను విడవలేను...నీ కరుణ నా ప్రసరించవా ! ఇంత వరకూపల్లవి...తదనంతరం చరణం...
ఓం చతురా ననాది వందిత నీకు పరాకేలనయ్యా!....
నాయనా! శ్రీరామ చంద్ర,  బ్రహ్మ మొదలగు సర్వ దేవతలు నిన్ను పూజించుతారు...మరి నీవు నామీద ఎందుకు నాయనా పరాకు...
పరాకు...ఇదో గమ్మత్తు పదం...పరాకు అంటే...మనం ఏ కార్యక్రమం అయినా చేయాలని సంకల్పం వుంటుంది కాని పూర్తి చేయటానికి ఆలశ్యం, ఏవో మనం సృష్టించుకున్న అవాంతరాలు వలన ఆ పని లక్ష్య సిద్ధి కాదు...దీనినే పరాకు అంటారు ...లేక పోతే వాయిదా .
అలాగే చాలా కీర్తన లలో బ్రహ్మ నిన్ను కొలువగా,నీ పాదం పూజించగా అని వాగ్గేయకారులు రచించారు..  ఏమి మిగతా దేవతలు లేరా...అక్కడే ఒక రహస్యం మనం గమనించాలి...
బ్రహ్మ విష్ణు కుమారుడు...అనేదాని ఆధారంగా మనం కొంత చర్చ చేద్దాం...
బ్రహ్మ అంటే చతుర్ముఖుడేనా...బ్రహ్మం అనగా అంతటా నిండి వున్న శక్తి...అణువు నుంచి బ్రహ్మాండం వరకూ వున్న అనేకానేక జీవ రాశులు స్థావర జంగమాది క్రిమి కీటకాలు, తమ వునికిని వ్యక్త పరిచేవి, వ్యక్త పరచనవి, వీటి అన్నీంటా దాగి వున్న చైతన్య శక్తే బ్రహ్మం.
మరి విష్ణువు అనగా సర్వ వ్యాపకుడు అనే వరకు క్లుప్తంగా తీసుకుందాం.
మరి బ్రహ్మ ఉద్భవ స్థానం. విష్ణువు యొక్క నాభి...సర్వ వ్యాపకుడు అయిన
విష్ణువు కేంద్ర స్థానం నుంచి ఉద్భవించిన శక్తి అని...
తరువాత పాదం కొద్దిగా జాగ్రత్తగా గమనిస్తే...
నీ చరితము పొగడలేని నా చింత తీర్చి వరములీచ్చి వేగమే...
నాయినా ! శ్రీరామ...నేను నీ ఘనమైన కీర్తిని పోగడలేను...మరలా చింత అన్న పదం... చింత అంటే మనకున్న సమస్య నిద్రలో కూడా విడవక వేధించటం. మన మాట, ఆలోచన సవ్యంగా సక్రమముగా కాని కార్యం పైన లగ్నం చేసి బాధ పడటమే చింత.
నాయనా శ్రీరామ నీ కరుణ కృప వలన నీవు త్వరగా ఇచ్చే వరం తోనే నా చింత తీరగలదు.
తరువాత వున్న స్వరాలు మొత్తం ఖమాస్ రాగ ఆరోహణ అవరోహణ రాగాలాపన...
తదనంతరం...
రెండోవ చరణం....
సీతాపతీ నాపై నీకభిమానము లేదా
సీతాపతే నాపై నీకభిమానము లేదా
వాతాత్మజార్చిత పాద నా మొరలను వినరాదా
భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా
భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా
నా పాతకమెల్ల పొగొట్టి గట్టిగ నా చేయి పట్టి విడువక....
ఒక్కసారి పై చరణము మరలా మరలా చదవండి...
కీర్తన కారులు ఈ చరణ ప్రారంభాన్నీ సీతాపతే అన్నీ పదంతో ప్రారంభించారు....
సీతా రాములు దంపతులు అన్నది జగద్విదితం...సీత సాధ్వి శిరోమణి, సౌశీల్యం, అనేకానేక సుగుణ రాశి...అంతటి జగన్మాత కూడా రాముని వరించినది అంటే రామునిలో మనం చూడవలసినది శివధనుర్భంగ వీరత్వమే కాదు, ఆయన లోని రామోవిగ్రహన్ ధర్మః అన్న లక్షణాలు కలవని...
మరి మనం రాముని పొందవలనంటే అంతటి లక్షణాలు మనం అలవర్చుకోవాలి....
సీతా రామ చంద్ర! నా పైన అభిమానం చూపు.....
నీ పాదములు సదా పూజించు ఆంజనేయుడు గా నా మొర వినవా....
తరువాత చరణము ఇంకనూ గమ్మత్తు....
"భాసురముగా కరిరాజును బ్రోచిన వాసు దేవుడవు నీవు కదా
నా పాతకమెల్ల పోగొట్టి గట్టిగా నా చేయి విడువక....
ఈ రెండు పాదములలో శ్రీరామ నామ మహిమ మొత్తం పూర్తిగాను... భాగవతం లో గజేంద్ర మోక్షం ఘట్టం మనకు అవగాహన కి వస్తుంది...
అసలు ఈనాటి కాలం లో భాసురముగా
అన్న పదానికి అర్థం అవగాహన లేదు...
కొంత తెలియ చేయి ప్రయత్నం...
సంస్కృతం నందు భ అన్న అక్షరానికి అర్ధం...వెలుగు, ఆకాశం ...
ఆకాశం అనగా అనంతమైన వెలుగు, అనంతమైన ప్రయాణం, స్వర్గం, భగవంతుని ఆవాసం...ఇలా అనేకానేకాలుగా మనం భావన చేయాలి...
భాసురం అనగా దివ్యమైన, ప్రకాశవంతం అని కూడా అర్ధాలున్నాయి.
మరి ఇంకో పదం వాసుదేవుడు
అన్న పదం విష్ణువు యొక్క సహస్ర నామాలలో ఒకటి గా భావిస్తారు. ఈ వాసుదేవ అన్న పదం విష్ణు సహస్రనామ లలో 3 సార్లు పునరుక్తి....కాని ఆది శంకరుల వారి భాష్యం లో 3 వేరు వేరు అర్ధాలు తెలిపినారు.
సర్వ జగత్తును  వసనం , ఆవాసం, ఆచ్ఛాదన చేసిన పరమస్వరూపం....
ఈ సమయంలో మనకు కీర్తన కారుడు... కరిరాజు గురించి తెలుపుతున్నారు....
నిజంగా భాగవతం లో గజేంద్ర మోక్షము ఒక అత్యద్భుతమైన ఘట్టం...ఈ ఘట్టం గురించి మనం తెలుసుకోవలసిన ది..
గజేంద్రుడు అనగా వేరు ఎవరో కాదు...మీరు , నేను , ప్రతి ఒక్కరూ ప్రతిఫలిస్తారు...మనిషిలో అహం అధికాధికంగా ఏనుగు పరిమాణంలో వుంటే...అతని ప్రవర్తన ఏ విధంగా వుంటుంది....దాని ప్రభావం వలన
అతను కాలమహిమ వలన మడుగులో చిక్కి...మొసలి వంటి కష్టాలు కి చిక్కితే....ఎంత పోరాటం సలిపిననూ....నిరుపయోగంగా..నిష్ఫలం...మరి మనలోని అహం తుడచివేసి... భగవంతుని పాదపద్మములకు..లావోక్కింతయి.. ధైర్యం విలోలంబ అయ్యే...ఠావుల్ తప్పే గుండేల్.....కానరావే వరదా భధ్రాత్మకా...అని శరణు వేడితే..అప్పుడు... భగవంతుడు..అల వైకుంఠ పురిలో...వున్న వాడైననూ...సిరికిం చెప్పడు శంఖుచక్ర యుగళం సందోయడు...అన్నరీతిలో వేగంగావచ్చి అనుగ్రహం...దానినే భాసురముగా కరిరాజును బ్రోచిన...అని మనకు తెలిపినారు...

తరువాత పాదం గమనించండి...
నా పాతకమెల్ల పోగొట్టి గట్టిగా నా చేయి పట్టి విడువక...
మానవుడు కర్మ బద్ధ జీవి కదా..ఈ కర్మల వలన లభించు పాప పుణ్యాలు...జన్మపరంపర వరకు వుంటాయి...వాటినే మనం ప్రారబ్ద కర్మలు అంటాం కదా...మరి పూర్వ జన్మల యందు తెలిసి తెలియక చేసిన పాప కర్మలు జన్మపరంపర ను వెంటాడి...అధోగతి పాలు అవటమే...పాతకం...కనుక భగవత్ సాక్షాత్కారం, భగవన్నామ స్మరణ అనే చేయి పట్టుకుని విడువక వుంటే పాతకం నిర్మూలనం....
కనుక శ్రీరామ నామం సదా సర్వదా పవిత్రం....మానవ జన్మ ఉద్ధరణకు బ్రోవు నామం శ్రీరామ నామం...
ఈ వ్యాసం పై మీ అభిప్రాయం నిర్మొహమాటంగా తెలిపిన....సవరణ వున్నా సవరించు కుంటాను...
సకలం సర్వం శ్రీరామ జయం...
ఆలపాటి రమేష్ బాబు....
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో
విజయవాడ...
94401 72262
సూచన...
నా వ్యాస పరంపర కావలెను అన్న వారు నాకు తెలిపిన...మరికొన్ని పంప గలను...







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.