17, నవంబర్ 2023, శుక్రవారం

మెరుగు చెంగట యున్న మేఘంబు అర్ధ విశేషాలు

మెఱుఁగు చెంగట నున్న మేఘంబు కైవడి

నువిద చెంగటనుండ నొప్పువాఁడు,

చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమునఁ జిఱునవ్వు మొలచువాఁడు,

వల్లీయుతతమాల వసుమతీజముభంగి బలువిల్లు మూఁపునఁ బరఁగువాఁడు,

నీలనగాగ్ర సన్నిహితభానునిభంగి ఘనకిరీటము దలఁ గల్గువాఁడు,

పుండరీకయుగముఁబోలు కన్నులవాఁడు,

వెడఁదయురమువాఁడు, విపులభద్ర మూర్తివాఁడు రాజముఖ్యుఁ డొక్కరుఁ డదె కన్నుఁగవకు నెదురఁ గానఁబడియె.’

++++

పలికెడిది భాగవతమఁట,పలికించెడివాఁడు రామభద్రుండఁట, నేఁబలికిన భవహర మగునఁట,పలికెద వేఱొండుగాథఁ బలుకఁగనేలా!

ఈ రెండు పద్యాలు పోతన భాగవతం లోని....ప్రధమ స్కంధం లోనివే.

పోతన భాగవతం...రచనా నేపథ్యం, రచన వ్యాసాంగ ప్రారంభంనకు గల కారణాలు తన రచనలోని పొందుపరిచారు.

కారణం పోతన గారి కన్నా ముందు పోతన భాగవతం ఆంధ్రీకరించే సాహసం ఎవ్వరూ తీసుకోలేదని చరిత్ర తెలియ చేస్తున్నది....అందులోను ఆనాటి రచనా వ్యవస్థ రాజాశ్రయం లోనే వుండేవి....

నన్నయ్య గారు ఆదికవి గా మన్నన పొందినను వారు కూడా రాజాశ్రీతులే నన్నయ్య గారు రాజరాజనరేంద్రుడు ఆస్థాన కవి అని జగమేరిగిన సత్యం...అంత వరకూ ఎందుకు పోతన గారి సమకాలికుడు స్వయంగా బంధువు అయిన శ్రీనాథుడు రెడ్డిరాజుల ప్రాపకం..కాని పోతన గారు తన భాగవత రచన శ్రీరాముని కే అంకితం అన్నాడు...

ఇలా చాలా చాలా మధన పడినారు..

ఒక ఆదివారం గోదావరి నది స్నానం చేసినారు... ఆరోజు సోమోపరాగం...మీరు ఏమిటో అని భావన చేయవద్దు చంద్రగ్రహణం ని ఆవిధంగా పిలుస్తారు...

గ్రహణం విడిచిన తరువాత... స్నానానంతరం పోతన తన ఇష్ట దేవత ఆరాధన మరియి మంత్ర పఠనం, పునఃశ్చరణలో వుంటే శ్రీరామ చంద్రుడు దర్శనం ఇచ్చారు...

ఆ పద్యము " మెరుగు చెంగట" అనే సీస పద్యం లో వివరించారు.

సీస పద్య లక్షణం ప్రకారం మొదటి నాలుగు పాదాలు సీస ఛందస్సు లోను తదనంతరం అనుసరణ పద్యం వీరు కందపద్యం గా రచన చేశారు .

పోతన గారి రచనలో ఎక్కువ భాగం ఆటవెలది, కందపద్యం కారణం ఇవి జన బాహుళ్యానికి దగ్గరగా వుంటాయి...సాధారణ ఛందస్సు లో తేలికగా వుంటాయి చాలా పద్యాలు ప్రజలు సులభంగా ముఖతా ధారణ కలిగి వుంటారు..ఇందుకు ఉదాహరణ "చేతులారంగ శివుని పూజింపడేని", "అందు కలడని, ఇందు కలడని సందేహం వలదు " లాంటివి మనం గమనించవచ్చు.

పోతన గారి వివరణ భలే గమ్మత్తుగా

భలే ఆసక్తిగా అలా అని సత్యదూరం గా వుండదు మన అనుభవం లో వుండే విధంగా వుంటుంది... అందుకే...పాఠకుడు ముందు దృశ్యం సాక్షాత్కరిస్తుంది...దీనితో పాఠకుడు తనదైన కల్పనా శక్తి అనుకోండి భక్తి ప్రపత్తులతో అనుకోండి ఎలాగైనను ఆ ఘట్టం లో తాను అక్కడే వుండి ఆ దృశ్యం స్వయంగా చూస్తున్నారు అనే అనుభూతి కలిగిస్తుంది అనటంలో సందేహం లేదు....

ఇక అర్ధం వివరించే ప్రయత్నం చేస్తాను..

"మెరుపుతో కూడిన మేఘఛాయతో వుండి ఒక స్త్రీ తో కూడిన వాడు"

ఇది మొదటి పాదం అర్ధం...

మనకు ఆకాశంలో మేఘం కనపడటం వేరు మెరుపుతో కూడిన మేఘం ప్రకాశవంతంగా మనస్సుకు హత్తుకునేలా మరోసారి చూడాలి అనే విధంగా వుంటుంది...

కాని కొద్దిగా ఈ అర్ధం మార్చి చూడండి...

సీతమ్మ వారు మెరుపు వంటి మేని ఛాయ తో స్వామి వారు మేఘఛాయతో....అయ్యవారి ప్రక్కనే అమ్మవారు వుంటారు కదా...

మానవులు సహజంగా మాతృస్తన్యం మాతృగర్భ వాసన వీడలేరు వీడకూడదు వీడరాదు. ఇది పోతన గారిలో కూడా అందుకే అమ్మవారితో కూడిన అయ్యవారు అనే విధంగా...

తరువాత పాదం..

'చంద్రమండల సుధా సారంబు '

చంద్రుడు మనః కారకుడు...మానవుల చిత్త ప్రవృత్తులపై ప్రభావం చూపువాడు...అందుకే చంద్రుని వెన్నెల శీతలం గా హాయి కొలుపు విధంగా వుంటుంది...ఇవి మన స్వయానుభవాలే. అందులోను పౌర్ణమి నాడు పూర్ణ చంద్రుడు ఎంత మనోహరంగా ఎంత ఆహ్లాదంగా వుంటారో మనకు ఎరుక....సహజంగానే మనం రాముల వారిని రామచంద్రుడు అని అంటాం...అటువంటి రాముల వారు పూర్ణ చంద్రుని వెలుగు

అంతటి అమృతం జాలు వారునట్టి చిరునవ్వుతో స్వామి వారు వున్నారంట....

తరువాత పాదం...

"వల్లీయుతతమాల వసుమతీజం భంగి"

తీగలతో కూడిన తమాల వృక్షం లాగా ఎత్తుగా వున్న రాముల వారి భుజం పైన విల్లు ఆయన ఆయుధం ధరించిన విధంగా కాదు అంటూ అది అతి సహజంగా భూమి నుంచి ఉద్భవించిన లత లాగా శోభనిస్తున్నాయి అట.

అంటే అతి సహజంగా విల్లు అనేది రామునిలో భాగంగా మనకు ఉదహరిస్తున్నారు...విల్లుతో కూడిన రాముడు అంటే అర్ధం...ధర్మపరిపాలన కోసం అని.... దుష్టశిక్షణ శిష్టరక్షణ తన అవతార ఉద్దేశ్యం అని మనం తెలుసుకోవాలి... కావాలంటే గమనించండి దశావతారాలు అన్నీ మనం దర్శించిన ఆయా ఆవతార ఉద్దేశ్యం మనకు స్పష్టంగా గోచరిస్తుంది.

తరువాత పాదం...

" నీలనగాగ్ర సన్నిహిత భానుని"

శ్రీరాములు వారు ఆజానుబాహుడు...అందులోను వారు నీల మేఘ శ్యాములు వారి శిరస్సు పై కిరీటం సూర్యునిలా ప్రకాశిస్తూ వున్నది

ఇంత వరకు సీస పద్యం... తదనంతరం అనుసరణ పద్యం.

"పుండరీక యుగం బోలు కన్నుల వాడు"

పుండరీకం అనే పదానికి విశేష అర్ధాలు చాలా వున్ననూ ఇచ్చట తెల్ల తామర అనే అర్ధం లో ప్రయోగించారు.

తెల్లని కనుదోయి ప్రకాశవంతంగా నిర్మలంగా వున్నాయి.

సాధారణంగా కవులు దేవతా, స్త్రీ వర్ణనలో కన్నులను పద్మాలతో పోలిక చేస్తారు. కారణం ఇవి సున్నితంగా, లాలిత్యం తో మనోహరంగా ఆకర్షణ తో పాటు వాటి జనన ప్రదేశం ఎంత దుర్భరంగా వున్ననూ పద్మాల సహజ లక్షణమైన నిర్మలత్వం వెలువరిస్తాయి.

అంతే కాదు ఇక్కడ పుండరీకం అనే పదం ఉపయోగం ఇంకొకటి వున్నది.

అది భక్త సులభుడు అనే కోణంలో.

మనం గోవింద నామాలలో పుండరీక వరద గోవింద అంటాం.

తరువాత పాదం...

"వెడద యురము వాడు, విపుల భద్ర

మూర్తి వాడు..."

విశాలమైన వక్ష స్ధలంతో నమ్మదగిన వాడుగా అని అర్ధం...

విశాలమైన వక్షం అనేది దేహ పరిణామం తో చూడాలా కాదు...

ఆపన్నులను కాపాడాటంలో ముందు నుండే వాడు, దయార్ద్ర హృదయం కలవాడు, వీరత్వం కలిగిన వాడు , మిత్రులను, కష్టాల్లో వున్నవారు,ఆత్మీయులను అనురాగం తో అక్కున చేర్చుకుని హత్తుకునే వాడు లాంటి అర్ధాలు కూడా ఇమిడి వున్నాయి....ఇన్ని కారణాలతో విపుల భద్ర మూర్తి గా వున్నాడు అంట...

విపుల భద్ర మూర్తి అంటే నమ్మతగిన వాడు అనే కాదు...

విపుల అంటే అమరకోశం ప్రకారం భూమి, విస్తారమైన భూమి అని అర్థం.

కాని మనం ఇచ్చట....

మానవుడు కర్మ బద్ధుడై జీవనం వలన సంచిత ప్రారబ్ధం లతో అనేకానేక జన్మలు కలిగి వుంటున్నాడు...

మరి ఈ సంచిత ప్రారబ్ధం ను నివారించి

జన్మరాహిత్యం అయిన మోక్షం కలగటానికి ఎవరిని ఆశ్రయం చేయాలి... రాముని ఆశ్రయం చేయాలి...ఆయనే భద్రం నమ్మకం... అందుకే విపుల భద్ర మూర్తి వాడు అనే ప్రయోగం.

తరువాత పాదం...

"రాజముఖ్యుండోకరు

డదే కనుగవకు ఎదురు కానబడియే"

అంటే...రాజుల లోని ముఖ్య వ్యక్తి తన కన్నుల ముందు కనపడినారు అని తెలుపు తున్నారు...

మరి అంతరార్ధం ఏమిటో....

రాజు అంటే మీకు తెలిసినదే...రాజు పాలకుడు గాను పాలితులుగా ప్రజలు వుంటారు...

మనకు గత కాలంలో రాజు అనే ఆయన దైవాంశ సంభూతుడు అనే నమ్మకం వున్నది.

కాని ఇక్కడ వున్న రాజు అయోధ్య రాజుగారు... ఆయనే స్వయం విష్ణుః శ్రీరామ చంద్రుడు... అయోధ్య రాజ సారధ్యం లో సకల భూమండలం వున్నది...మరి పాలితులు ప్రజలు , మరియు ఆయన భక్తులు....

అంటే దేవతా స్వరూపాలు లో ముఖ్యమైనది శ్రీరామ చంద్రుడు అని ఆయన ఉద్దేశ్యం...

"కను గవకు ఎదురు కాని బడియే"

ఇందులో విశేషం కను గవ....

అంటే కన్నులు అని అర్ధం...కాని మనం మరికొంత తెలుసు కొందాం...

కన్నులను "కిటికి" లతో పోలిక వున్నది.

'కిట కిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు మూసినా చప్పుడు కావు'

అని మనం చిన్నప్పుడు పొడుపు కధలు చదువుకున్నాం....దాని విడుపు ఏమిటో అంటే కళ్ళు అని చెప్పి సంబర పడే వారం.

కిటికి కి మరో పేరు గవాక్షం....

మరి దీని కర్తవ్యం ఏమిటో గమనిస్తే...

ఇంటి గదిలో వుండి బాహ్య దృశ్యం దర్శించుటకు అనువుగా వుండునది.

అంటే నీవు వున్న ప్రదేశం వాతావరణం వేరు గవాక్షం గుండా నీకు గోచార దృశ్యం వేరు ...ఈ రెండింటికి విభజన గవాక్షం...

అలాగే గవ్వ అంటే మీకు తెలుసు...

గవ్వ అనేది సముద్ర జీవి తన రక్షణ కొరకు నిర్మించుకునే ఒకానోక కవచం...

మరి సముద్రం, జీవికి మధ్య వుండేది గవ్వ... ఇంత వరకూ సరిపోతుంది అని నా భావన....

ఇక ఇప్పుడు కనుగవ అనే పదం...

పోతన గారికి రాముల వారు ఎప్పుడూ దర్శనం ఇచ్చారు అంటే...పోతన గారు యోగ ధ్యానం లో వున్న సమయంలో ఆయన మనో నేత్రం పై సాక్షాత్కరించారు అని మనం అర్ధం చేసుకోవాలీ....

రామ సాక్షాత్కారం అంటే సశరీర సాక్షాత్కారం అని మీరు ఎన్నడూ భావన చేయరాదు.

అలాగైతే కను దోయి అనే పద ప్రయోగం వుండేది....

పోతన గారి లాంటి వారికి ఇటువంటి వాటిపై అవగాహన వున్నది.

కారణం త్రేతా యుగం నాటి రాముడు,

కలి యుగం నాటి పోతన గారికి సశరీరం అంటే అభూత కల్పన అవుతుంది అని తెలుసు.

అదియునూ కాక దేవతా దర్శనాలు ఎప్పుడూ స్వఫ్న సాక్షాత్కారం, యోగ, ధ్యాన సాక్షాత్కారం అని మనం గమనించాలి....

ఇది ఇంత వరకూ మొదటి పద్య వివరణ....

రెండోవ పద్యం... "పలికేడేది భాగవతం"

తరువాయి భాగం లో...నేను క్లుప్తంగా రాయాలని భావన చేస్తాను...కాని వివరణ సమయంలో స్వామి వారు మరి కొంత స్ఫురణ కు తెచ్చి ఇంకొంత వివరం తెలుపమని ఆదేశంతో...దాని అంతరార్థం...మరి కొంత అర్ధ వివరణ చేరి విస్తారం అవుతుంది....

మిత్రులు అన్యధా భావించక...మన్నించండి.

అలాగే ఈ రచన పై భూషణలు అన్నీయునూ శ్రీరామ చంద్రుడు వి...మీరు చదివి శ్రీరామ రామ రామ అని ఒక్క సారి అంటే ఆయన ప్రసన్నుడై మీకు ఆయన ప్రపన్నత లభిస్తుంది...

ఇక దూషణలు అన్నీయునూ నావే...

మీరు నిరభ్యంతరంగా... నిర్మొహమాటంగా ఈ రచనలోని తప్పులు తెలియచేసిన సరిదిద్దుకుంటాను...

ఆలపాటి రమేష్ బాబు

శ్రీ సంతోషి సాయి బుక్ డిపో

విజయవాడ...

94401 72262.

తదనంతర భాగం కోసం మెసేజ్ పెట్టండి.

పలికేడిది భాగవతం అర్ధ విశేషాలు...

పలికెడిది భాగవతమఁట,పలికించెడివాఁడు రామభద్రుండఁట, నేఁబలికిన భవహర మగునఁట,పలికెద వేఱొండుగాథఁ బలుకఁగనేలా!

ఈ పద్యం చాలా ప్రాముఖ్యత కలది...

చాలా చాలా సందర్భాల్లో ఈ పద్య ప్రస్తావన చేశారు.

ఎందుకంటే....ఈ పద్య రచనా చమత్కారం అటువంటిది....

పోతన వంటి భక్తి విశ్వాసాలు గల వారి కలం నుంచి జాలువారిన ఆణిముత్యం.

సహజంగా మానవులు.... ఏ విషయం ప్రస్తావనకు తెచ్చిననూ ప్రధమ పురుషులో చెపుతారు... అనగా నేను చేశాను నా వలన జరిగినది...అని స్వ కేంద్రం గా ప్రస్తావన చేస్తారు...

కాని పోతన గారు ఉత్తమ పురుష తో చెపుతున్నారు.... అనగా వారు తెలిపారు వారు చేయించారు...వారు లేనిదే నేను లేను అనే భావం మనకు స్పష్టంగా తెలియచేస్తున్నది...

మనలో చాలామంది ఈ పద్య పఠన విధానం తెలియదు...కాని సహస్రవాధాని మాడుగుల నాగఫణి శర్మ గారు ఒకానోక అవధాన ప్రక్రియ లో ఈ పద్యం ఎలా చదవాలో తెలిపితే గమనించి ఆశ్చర్యం పొందటం నా వంతు అయిపోయింది...

మొదటి సాధారణంగా అందరు భావన చేసే విధానం లో...

"పలికెడెది భాగవతమట"

గమనించండి ఇక్కడ 'అట'...అనే శబ్ద విశేషం సహజంగా మనం ఏ ఏ సమయాల్లో ఉపయోగం అంటే...

అస్పష్ట విషయ ప్రస్తావన లో ఉపయోగం అనగా.. అక్కడ మనుషులు వున్నారంట, ఆ పని అవుతుందట, ఇలా అనేకానేక అస్పష్ట క్రియా రూపక శబ్ద విశేషం గా వాడతాం..దీనితో వక్త భాధ్యత తీరుతుంది కాని శ్రోత స్థితి నమ్మక అపనమ్మకాల మధ్య త్రిశంకు స్వర్గంలా వుంటుంది...

కాని ఆ విధంగా కాక ఈ టకార శబ్దవిశేషాన్ని SUFFIX గా కాక Prefix గా ప్రయోగించి చూడండి అప్పుడు ఈ విధంగా మారుతుంది అచ్చట మనుషులు వున్నారు, అటులే ఆపని అవుతుంది గా మారుతుంది...

కనుక మీకు పద్య అర్ధ విశేషం తెలిపే ముందు ఈ పద్యం యొక్క పది విచ్ఛేదన, విరామ క్రమం తెలుపుతాను...

పలికెడెది భాగవతం,

అట పలికించేడివాడు రామభద్రుడు,

అట నే పలికిన భవహరమగును,

అట పలికేద వేరోండు గాథ

బలుకగనేలా...

గమనించారా విరామ చిహ్నం మార్పుతో పద్య గమనం మొత్తం మారిపోయి పాఠకుడికి స్పష్టం గా దర్శనం అవుతుంది....

ఇప్పటి వరకు మనం పద్య గమనం తెలుసుకున్నాం ఇప్పుడు అర్ధ విశేషాలు తెలుసుకుందాం...

ఎలాగు నేను మిత్రులకు పద్యానికి ప్రతిపదార్ధ రూపం, వచన అర్ధ రూపం కాకుండా అంతర్గత భావ అర్ధ విశేష విశ్లేషణ విధానం లో ముందుకు వెళుతున్నాం కాబట్టి...

పోతన గారు భాగవతం రాసినది.. కీర్తి, కనకం కోసం కాదు "భవ హరం" .

అదే విషయం అనేక మార్లు ప్రస్తావించారు...మరి దానిపైన ఒక పద్యం రాసినారు " ఇమ్మనుజ రాజేశ్వరులు"...

మరి భవం అంటే....

మానవుడి పుట్టు రోగం...

ఇది సంచిత ప్రారబ్ధం...గత జన్మ కర్మ యావత్తు మోసుకుంటూ వచ్చాం...

మరలా ఈ జన్మ లో చేయి, జరుగు క్రియలు వలన జనించు కర్మ ఫలం ఇక్కడే అనుభవిస్తున్నామా లేదే ఆగామిత కర్మ ఫలం గా వచ్చే జన్మకి మోసుకుని పోతున్నాం...

మరి ఇది పూర్తిగా పరిహారం అయి మోక్ష స్థితి కలగాలి అంటే ఏమి చేయాలి, ఎవరిని ఆశ్రయం చేయాలి...అందుకే రాముడు అని అనకుండా రాముభద్రుడు అనే పద విశేషం...అనగా రాముడు తగిన వాడు, భద్రమైన వాడు, నమ్మ తగిన వాడు...రామ ఆశ్రయం, రామ నామ ధ్యానం తో మనం మనయొక్క భవ హరం చేసుకో గలం...

మరి అంతటి రామభద్రడే...

భాగవతం రాయమని స్పష్టం గా తెలుపుతూ...ఇది రామ ఆజ్ఞ, ఇది రాముని పలుకు , ఇది రాముని వాక్కు కనుక భాగవతం రాస్తున్నాను...

వేరే వేరే కధలు, వేరే వారి కధలు నేను పలుకనేల...( ఆ రోజుల్లో వీరి బంధువు అయిన శ్రీనాథుడు కాశీ ఖండం, శృంగార నైషధం వ్రాసి ఖ్యాతిలో వున్నారు )

మరి ఇది ఆయన కోసమా కాదు మన కోసం మన అందరి కోసం...

జననమరణ చక్ర విచ్ఛేదన సుదర్శన చక్రధారి ఈ కోదండ రాముడు అంతటి రాముని పలుకు అయిన భాగవతం మన భవ హరం కూడా అవుతుంది...

ఇది పద్య అర్ధ విశేషం...

(పండితార్ధాలు తెలపాలి అంటే ఇంకను చాలా వున్నాయి...కాని నేటి సమాజ నడవడి కి కొంత లలితంగా తెలిపితే నే బాబోయ్ ఆంటున్నారు)

సకలం సర్వం శ్రీరామ జయం...

సర్వులకు శ్రీరామ జయం...

తమరు చదివి భాగున్నది అని భావన చేస్తే... శ్రీరామ రామ రామ అని ఒకసారి పలకండి...

తప్పులన్నియూనూ నావే....కనుక తమరు తెలియ చేసిన సరిదిద్దుకుంటాను...

మీ

ఆత్మీయ మిత్రడు/ సహోదరుడు

ఆలపాటి రమేష్ బాబు...

శ్రీ సంతోషి సాయి బుక్ డిపో

విజయవాడ....

9440172262

13, మార్చి 2023, సోమవారం

సిగ్గు పూబంతి... సిరివెన్నెల పదప్రయోగాలు

సిగ్గు పూబంతి ఇసిరే సీత మా లచ్చి
మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి (2)
సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా
రాముని సిత్తంలో కాముడు సింతలు రేపంగా

విరజాజి పూల బంతి అర చేత మోయలేని
సుకుమారి ఈ సిన్నదేనా శివుని విల్లు మోసిన జాణ ఈ సిన్నదేనా
ఔరా అని రామయ కన్నులు మేలమాడి నవ్విన సిన్నెలు
సూసి అలకలొచ్చిన కలికి ఏసినది కులుకుల మెలికి

సిరసొంచి కూరుసున్న గురిసూసి సేరుతున్న(2)
సిలకమ్మ కొన సూపు సౌరు బొండు మల్లె చెండు జోరు
సేరే ఆ సూపుల తళుకు ముసురుతున్న రామయ్య రూపు(2)
మెరిసే నల్ల మబ్బైనాది వలపు జల్లు వరదైనాది.
పై గీతం....స్వయంకృషి సినిమాలో విశ్వనాథ్ దర్శకత్వంలో సిరివెన్నెల గారు వ్రాయగా బాలుగారు , జానకి గారు పాడినారు...సంగీతం రమేష్ నాయిడు.
గత కొద్ది కాలంగా ఈ పాటలోని సాహిత్యం నన్ను ఆకట్టుకున్నది..అంతకన్నా ముందు ఈ పాటలోని పద ప్రయోగాలు గురించి చెప్పాలని భావించాను. నేను పెద్ద పండితుడిని కాకపోయిననూ ఏదో నాలుగు అక్షరాలు భగవత్ కృపతో వ్రాస్తున్నాను...
భారతీయ సమాజవ్యవస్థ ఇంత బలంగా వున్నదంటే దానికి కారణం కుటుంబ వ్యవస్థ బలంగా వుండటమే.
పూర్వకాలంలో అష్టావర్షత్ భవేత్ కన్యా అన్న ప్రమాణానుసారం వధువుకి 8సంలలోపు వివాహం చేసేవారు....ఈ వివాహం తరువాత అనేక రకాల కుటుంబ వేడుకలు ప్రతి ఒక్కరు నిర్వహిస్తారు కారణం వధువుకి వరునకు సాన్నిహిత్యం ఎర్పరచటమనే ప్రక్రియలో భాగంగా దీని వలన ఒకరిపై ఒకరికి ఆకర్షణ, అనురాగం ఏర్పడి వారి భవిష్యత్  సజావుగా వుంటుంది.
ఈ కుటుంబ వేడుకలలో ముఖ్యమైనది పానుపు లేక చెండ్లాట అని పిలుస్తారు.ఈ వేడుకలో వధూవరులను ఓక పానుపుపై ఎదురు ఎదురు కూర్చోనబెట్టి...ఏవో కొన్ని ఆటలతో పాటు...ఓక పూల మాలను బంతిలాగా చేసి వధువరులను ఆడుకోవడానికి అందిస్తారు...ఇరుపక్షాల బంధువర్గాలు వధువరులను సపోర్ట్ చేస్తూ ఆట ఆడించుతారు...ఇందులో ఎవ్వరు ఓడి పోరు...గెలిచేది వధూవరుల మధ్య ఆకర్షణ.
ఇక పాట విషయానికి వద్దాం....
మన  స్త్రీల పాటల సాహిత్యం మొత్తం
వధూవరులను శ్రీరామ చంద్రునిగా , సీతమ్మ తల్లిగా భావన చేస్తూ పాటలు పాడతారు....ఈ పాటకూడా అటువంటిదే....
ముందు చూడండి ప్రారంభమే...
"సిగ్గు పూబంతి ఇసిరే సీత మాలచ్చి..."
అమ్మవారు బిడియంతో సిగ్గుతో మనోహరంగా రామునిపై పూలబంతి విసిరారు అంట....
అది లా మొగ్గ సింగారం
" ఇరిసే సుదతి మినాచ్చి..."
అమ్మవారు కన్య కాబట్టి ఆమేను మొగ్గగా భావన...ఆమే అలంకరణ పువ్వు విచ్చుకునబోయేటప్పుడు వున్నంత మనోహరంగా వుండటంతో పాటు ఆమే మనోహరమైన పలువరుసతో అందంగా నవ్వటంతో పాటు...ఆమే రెప్పవాల్చకుండా రామునే చూస్తున్నారు..అని తెలుపుతున్నారు...
చూడండి  ఈ వాక్యంలో సుదతి ప్రయోగం , మీనాక్షి ప్రయోగం విశిష్టమైనవి....
భార్య మనోహరంగా నగుమోముతో వుంటే భర్త చాలా జయించిన వాడులా
ఆనందపడతాడు. అలాగే మీనాక్షి అన్న పదం చూడండి...ఏమి ఆడవారి కన్నులు చేప కన్నులేనా వేరే ప్రయోగం చేయవచ్చుగా....
చేపకు శరీరంలో రెండుప్రక్కలా రెండు కనులుంటాయి...అవి భిన్న దృశ్యాలను చూపుతాయి...(ఈనాటికి ఫిష్ విజన్ గురించి పలురకాల చర్చలు)...
ఒకటి పుట్టింట వారి దృశ్యమైతే రెండోవది అత్త ఇంటివారి దృశ్యం... రెండిటిని కలగలిపి తనదైన దృశ్యం అనగా....ఇరుకుటుంబాల మధ్యవున్న సాధ్యాసాధ్యాలు మరియి తన భర్త వ్యవహరదక్షత మరియి సంతానం యొక్క కోరికలు తో ఆమే ఒడుపుగా తనదైన ముద్రవేస్తుంది...ఇంత చేసి చేప నీటి నుంచి తీసివేస్తే ఇబ్బంది పడుతుంది స్త్రీ కూడా తన సంసార సాగరం నుంచి దూరంగా వుండటమో లేక ఇంకొక ఇబ్బంది వస్తే ఆమే కూడా విలవిల లాడిపోతుంది....
అమ్మవారి సిగ్గు , నవ్వు మొదలైన వాటితో రాములవారిపై మన్మధ బాణాలు తగిలినవంట...
తరువాత చూడండి కవి తన ప్రయోగం...
"విరజాజి పూల బంతి అర చేత మోయలేని
సుకుమారి ఈ సిన్నదేనా శివుని విల్లు మోసిన జాణ ఈ సిన్నదేనా"
విరజాజి పూల బంతి అమ్మవారు మోయలేకుండా వున్నారట...
ఇది సీతమ్మ సౌకుమార్యం తెలుపుతున్నారు....విరజాజి పూలబంతి...విరజాజి మొగ్గ చిన్నగా వుండి చాలా బరువుతక్కువగా వుంటుంది.... ఆ విరజాజి పూలబంతి కూడ మోయలేనంత సుకుమారమా అన్నట్లుగా వున్నారట సీతమ్మ తల్లి...అందుకనే మన జానపద కధలలో రాకుమారి ని ఏడుమల్లేల ఎత్తు అని వర్ణన చేసేవాళ్ళు....(నేను కూడా నా భార్య ను వివాహం అయిన కొత్తలో ఏడుమల్లేల సుకుమారి అని ఆటపట్టించే వాడిని)....
మరి ఇంత సుకుమారి అయినా సీతమ్మ ఎంతో బరువైన శివధనస్సుని అలవోకగా ప్రక్కకు జరిపినది ఈ సుకుమారి చిన్నదేనా...అంత పెద్ద కార్యం చేసిననూ తనకూ ఏమి తెలియనట్టు నవ్వుతూ సుకుమారంగా వున్నదా...ఏమి ఈ జాణ తనం....
అమ్మవారిపై జాణ అనే పద ప్రయోగం పెద్ద సాహసం అయితే కవి సమర్ధన చేసుకోవటం ఎలాగంటే శివుని విల్లుని సోదాహరణంగా తీసుకోవటంతో సరిపోయింది.
సాధారణ గృహకృత్యాలలో సతమతమైన గృహస్థు సంతానం ఏవో కొత్త కోరికలు , నూతన భాధ్యత నిర్వాహణకు బెంబేలు పడుతుంటే స్త్రీ తనదైన ఆచరణాత్మక ఆలోచన తన పొదుపు నుంచి భర్తను కాపాడికూడా...ఏమి తెలవన్నట్టుగా వుంటారు....అదే ఇది..
ఇక తరువాత వాక్యాలు కి వెళదాం.....
"ఔరా అని రామయ కన్నులు మేలమాడి నవ్విన సిన్నెలు
సూసి అలకలొచ్చిన కలికి ఏసినది కులుకుల మెలికి...."
సీతమ్మ వారి సౌకుమార్యం చూసి రాములవారు ఆశ్చర్యం తో భలే భలే అన్నట్టుగా సీతమ్మవారికన్నులలో కొంటేగా చూశారట...
మరి చూశారా మేలమాడి అనే పద ప్రయోగం...సాధారణంగా వధూవరుల మధ్య కాని బావమరదల మధ్యకాని ఓక విధమైన మనోహరమైన శృంగార వెటకారం వేళాకోళం వుంటుంది... కాని ఇదే వరుస అయినవారి మధ్యమాత్రమే సన్నిహితత్వం తో కూడిన హస్యసంభాషణను మేలమాడటం అంటారు.
దీనితో సీతమ్మ వారు రాముల వారి భావం గ్రహించినదై కొంత అలకతో కూడిన సిగ్గుతో నవ్వినారట....
మరి తరువాత చరణాలు కి వెళదామా.....
"సిరసొంచి కూరుసున్న గురిసూసి సేరుతున్న(2)
సిలకమ్మ కొన సూపు సౌరు బొండు మల్లె చెండు జోరు"
ఇంత చేసిన సీతమ్మ వారు ముగ్ధమనోహరంగా తలవంచి కూర్చుని...తన కొన చూపుతో రాములవారిని అందంగా చూస్తున్నదట...అది ఎలా బొండుమల్లే చెండు జోరు....ఆమేను ఏమో విరజాజి గా వర్ణించుతూ....కాని ఆమే చూపులను బొండుమల్లేలుతో వర్ణించటం గమ్మత్తు... బొండుమల్లేలు సౌరభం గుబాళింపు వధూవరుల మధ్య ఎనలేని సాన్నిహిత్యం కలుగచేసి ఓకరిపై ఓకరికి ఆకర్షణ బలపడేవిధంగా వుంటుంది... అందుకే ఆ పద ప్రయోగం....
మరి సౌరు అన్న పదానికి అర్ధం అందంగా నవ్వటం అని...వధువు తన మనోహరమైన నవ్వుతో సిగ్గుతోను వరుని మదిలో స్థానం అనే భావనలో ప్రయోగం....
మరి తరువాత చరణాలు కూడా చూద్దాం.....
"సేరే ఆ సూపుల తళుకు ముసురుతున్న రామయ్య రూపు(2)
మెరిసే నల్ల మబ్బైనాది వలపు జల్లు వరదైనాది."
పంట పండాలి అంటే వర్షం అవసరం...ఆ వర్షం నల్లమబ్బుల రూపంలో వస్తుంది...
మరి సీతమ్మ వారు మనోహరమైన సిగ్గు నవ్వులతో రాముని వారు ప్రేమాస్పదుడై అమ్మవారిపై వర్షపు మబ్బులా తన ప్రేమ ఆప్యాయత ఆనే వర్షం వరద వచ్చేంతగా కురిపించారట...
ఈ వాక్యాలు లో తళుకు, నల్లమబ్బు ,వరదైనాది పద ప్రయోగాలు విశిష్టత కలిగినాయి....తళుకు అనేది స్త్రీ తన అందచందాలు ప్రవర్తనతో భర్తను ఆకట్టుకుంటదని.....
నల్లమబ్బు....నల్లమబ్బు లో మాత్రమే వర్షపు నీరు దాగి వుంటుంది అని తన భార్య పై పురుషునకు అదేవిధమైన ప్రేమ కలిగివుంటుంది అని....
ఇంతటి అనురాగ పూరితమైన సంసారంలో వలపు వరదలా వుంటుంది అనేది కవి భావన...
మరి ఇంతటి గొప్ప సాహిత్యం... దాని వెనుక పరామార్ధం...ఎంతమంది వధూవరులు ఆచరణో....అసలు వారికి తెలుసా...ఏమో....తెలిసినది ఓకటే ఈగోలు , ప్యాకేజిల మధ్య చిక్కుకుపోతున్నారు....
మీ అభిప్రాయం తెలపండి
ఆలపాటి రమేష్ బాబు
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో
విజయవాడ.
9440172262 వాట్సప్...., టెలిగ్రాం...
rameshsssbd@gmail.com.
సకలం సర్వం...
శ్రీరామ జయం.

9, మార్చి 2023, గురువారం

సంపుటీకరణ - మంత్ర వివరణ

సంపుటికరణ...
బహుశా ఈ పదం చాలా మంది సాధారణ ప్రజలకు కొత్త. కాని అధ్యాత్మికత రంగంలో శ్రద్ధ వున్నవారికి ఇది తెలుసు, మరీయు బీజాక్షరాలు అన్నీయును పరమేశ్వర ప్రోక్తం అన్నది గమనార్హం. మరి ఈ బీజా ఆక్షరకూర్పు మంత్రం అన్నది కూడా మీకు తెలుసు.
సహజంగా మానవుడు అనేక రకాల కామ్యంలు గురించి మంత్ర సాధన చేస్తాడు. అవి అతని జీవన కాలంలో ఇంక చెప్పాలంటే త్వరగా సిద్ధించితే ఫలితంను పరమేశ్వరాను గ్రహంగా భావించి సంతోషించి ఆనందపడతాడు. కాని కొంతమందికి అది జీవనకాలంలో సాధ్యపడదు. ఎందుకు ఎలా అనేదానికి పరిష్కారం చిక్కదు.
ఇది ఈనాటి జీవన విధానంలో కాదు పూర్వం
మహర్షుల కాలంలో కూడా వున్నదే..అందుకు ఋషులు పరమేశ్వరుని ద్వారా సందేహ నివృత్తి కై పరమేశ్వర మంత్రం సాధనలో కల అవరోధాలను , సాధనలో ఫలితాలలో కల ఆలస్యాలు వలన మేము ఈ జన్మలో సంకల్ప సిద్ధి లేక ..కొండకచో ఆయష్షు తీరి మరుజన్మ ఎత్త వలసి వస్తున్నది...అప్పుడు కూడా సంచిత ప్రారబ్దకర్మలు వలన అనేకానేక ఇబ్బందులు వీటీని దాటగలటానికి తరుణోపాయం తెలియచేయగలరు అని అడగటంతో..ఆయన వారికి ఈ సంపుటికరణ ను సూచించారు.
అసలు సంపుటికరణ అంటే ఏమిటి.. కూర్పు లేదా జోడింపు. అనగా మన కామ్యసిద్ధిగా జప , పారాయణలో వున్న మంత్ర , స్తోత్రాలకి ఇంకోక వేగ వంతమైన మంత్రం జోడించి జప , హోమ , తర్పణాదులు చేయాలి. స్తోత్రాలకి అయితే పారాయణ మాత్రం సరిపోతుంది. అనగా మన గృహిణులు లలిత పారాయణ చేస్తారు..అందులో వున్న ఓక్కో శ్లోకం కొన్ని నామాలా కూర్పు గా వుంటుంది. మీరు సంకల్ప కార్యసిద్ధి త్వరగా కావాలంటే ఈ స్తోత్రాలకి మరో నామం కాని శ్లోకం కాని సంపుటి చేయాలి...
ఇది ఎలాగంటే లలితలో ప్రారంభ శ్లోకం అయిన
శ్రీమాత శ్రీమహరాజ్ఞి శ్లోకం చదివి తదుపరి మీరు సంపుటి చేయవలసిన శ్లోకం పఠించాలి.
ఇలా అన్నీ శ్లోకాలకి ముందు పారాయణ శ్లోకం తదుపరి సంపుటి శ్లోకం చదివాలి ఇందువలన మీ సంకల్ప సిద్ధి నందు వేగం కలుగుతుంది.
సాధారణ శ్లోకం మీరు ఓక్కసారి పారాయణ చేస్తే సంపుటీ శ్లోకం బహుమార్లు పారాయణ చేస్తారు. అందువలన ఈ సంపుటి శ్లోకం మీ సంకల్పంనకు ప్రచోదనం లా పని చేస్తుంది.
సాధారణ పరిభాషలో వేగంగా వెళ్ళు కారుకి ఇంకొంత వేగంగా వెళ్ళు శక్తిని జోడింపు.
ఇది ఓక తాంత్రిక పద్ధతి. సాధారణంగా తాంత్రిక పద్ధతి వామాచారంలో గమనిస్తాం. మరి ఈ వామాచారం అంటే ఏమిటి...
సాధరణంగా మనం చేయి పూజలు పురాణోక్త , వేదోక్తంగా వుంటాయి వీటిలో వాడు వస్తువులు కూడా పండ్లు , పూలు లాంటివే . కాని వామాచారంలో మద్య , మాంసాలు లాంటి మరికొన్ని ఉపయోగం చేస్తారు. మనం పూజించి దేవతా రూపాలని బట్టి ఈ వస్తు వినియోగం వుంటుంది. అనగా శాంతరూపాలకి ఓక విధంగా , అదే దేవత తామస రూపాలకి మరో విధంగా వుంటుంది. ఇది ఎలాగంటే లలిత , రాజరాజేశ్వరి శాంత రూపాలైతే తామస రూపాలైన కాళి ,(కాళిలో 24రూపాలు),భైరవి ,చండి లాంటివన్నమాట..అంత మాత్రం చేత భయపడవలసిన పనిలేదు. అమ్మ సదా అమ్మే...చాలామంది మూఢనమ్మకాలతో అమ్మో ఆరూపం చెడు ఈ రూపం చేటు అనే వాఖ్యానాలు చేస్తారు...కాని జగన్మాత ఏ రూపంలో వున్నను తన సహజ లక్షణమైన కరుణను విడవదు...ఇది తెలిసిన వారికి కాళి రూపం ముగ్దమనోహరంగా దర్శనం...అందుకే రామక్రిష్ణ పరమహంస కాళిరూపంలో మమేకం అయి సదా ఆమే ధ్యానంలో వుండేవారు.
అసలు వామాచారంనకు ఆ పేరు రావటంనకు గల కారణం...అర్ధనారీశ్వర రూపంలో గల వామభాగం నందు అమ్మ వుండటమే. మనం ఈశ్వరుని ధ్యానిస్తే సరిపోతుందా...ఆయన వరం ఇవ్వటానికి అమ్మ ప్రోద్బలం వుండాలిగా అందుకే సంపుటిలో అమ్మవారి నామం జోడింపుతో అమ్మ వాడు నా బిడ్డ వాడి సంకల్పం ఏమి చేశారు అని ఈశ్వరుని కోరి సిద్ధింప చేస్తుంది. కావలంటే గమనించండి మన ఇళ్ళల్లో పిల్లలు తండ్రికి చెప్పినా చేయని పనిని తల్లిద్వారా అడిగి చేయించుకుంటారు. ఆకార్య సాధనలో భర్తతో విముఖత అయినా లక్ష్యపెట్టదు. ఆమేకి కావలసినది తన బిడ్డ మనోరధం తీర్చటం. సాధారణ గృహిణిలే ఇలా వుంటే జగద్ధాత్రి ఆ పరమేశ్వరి ఏరూపంలో వున్న తన బిడ్డ సంకల్పం మరచిపోతుందా...ఇది ఇంకనూ సూక్షంగా చెప్పాలంటే శిశువు స్తన్యం గురించి రోదన చేసే సమయంలో దూరంగా తల్లి తండ్రి వున్నను ప్రకృతిలోని సూక్ష్మ ప్రకంపనల వలన తల్లికే ముందు తెలుస్తుంది. శిశు రోదన వలన స్తన్యం  ఉబికి వక్షం భారమవుతుంది. అందుకే తల్లులు శిశువు రోదన ప్రారంభం కాగానే స్తన్యం ఇవ్వటానికి తపన పడతారు. ఇది మరీ ఏక్కవగా ఆవు, దూడలలో మనకు తెలుస్తుంది.
నేను సంపుటి గురించి తెలుపుతూ ఇవి అన్ని తెలపటం వేరు కాదు...మీరు భయపడవలసిన పనిలేదని తెలపటం.
ఈ సంపుటిలో కొన్ని సార్లు పాశుపతం కూడా సంపుటిస్తారు. అసలు సంపుటి శ్లోకం , మంత్రం ఎలా ఎన్నుకోవాలి. మీ నామ నక్షత్రాలకి , దశ నాధులకి , సంకల్ప కార్య సాధనకి గల అధిష్టాన దేవతను బట్టీ ఎన్నుకోవాలి. ఇది వ్యక్తిని బట్టి , సందర్భాన్ని బట్టి మార్పు వుంటుంది. కనుక మీ సంకల్ప సిద్ధికై తగు శ్లోకంతో సంపుటికరించి లబ్దిపొందండి.
సర్వులకి శ్రీరామ జయం.
ఆలపాటి రమేష్ బాబు
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో
విజయవాడ
94401 72262
పై వ్యాసంలోని సందేహలకి సంప్రదించండి.

5, మార్చి 2023, ఆదివారం

వాలి సంహారం అంతర్గత రహస్యాలు

రాముడు - పరిశీలన - సీరిస్ 4
************************
వాలి సంహరం.
రామాయణం తో పరిచయం వున్న ప్రతి ఓక్కరికి తెలిసే పాత్రలు.వాలి,సుగ్రీవులు.
మన తెలుగు నాట సతతంకీచులాడుకునే అన్నదమ్ములను నర్మగర్భంగా..ఆ.... వారి మధ్య  వాలి సుగ్రీవుల సంబంధం అని ఉదహరిస్తారు. ఆ శ్లేష...తెలిసిన వారికి మాత్రం అర్ధం అవుతుంది... ధనం గురించో , కుటుంబ స్త్రీల గురించో వారిలో వైరుద్ధ్యాలున్నాయని....
పౌరాణికంగా ఆంజనేయుని విశిష్టత ముందు వాలిప్రభ మనకు అంతగా పరిచయం లేదు...
కాని వాలి మహ వీరుడు...కాకపోతే స్త్రీ వ్యామోహి...
వాలి ఇంద్రుని కుమారుడు. వాలి తండ్రి ఋక్షరజుడు...(కొంతమంది వృక్షజుడు అంటారు..అంటే చెట్లమీద పుట్టినవి...అని.. చెట్లమీద ఏమి వుంటాయి..పక్షులు , కోతులు)
ఇతను వానర రాజు...ఇతను ఓకరోజు పొరపాటున ఓక కొలనులో పడి...అప్సరస గా మారిపోతాడు...ఈ అప్సర సౌందర్యం చూసిన ఇంద్రుడు మోహించి కామించి...ఆమేను చెర పట్టుతాడు...ఈ హడావుడి ఇలాగుంటే ఇదే అప్సరను బ్రహ్మదేవుడు చూసి కామించి మోహించి..తాను కూడా ఆమేతో పొందుకోరతాడు..(.వీళ్ళద్దరు ఆమేతో సంగమం నేను కొద్దిగా శ్లేషగా వివరిస్తున్నాను...మీరు అర్ధం చేసుకోండి). ఈ అప్సర వాలభాగం నుంచి ఇంద్రుడు సంగమించి ఆప్రదేశంలో తన వీర్యనిక్షిప్తం...కంఠభాగంలో బ్రహ్మ సంగమించి... తన వీర్యనిక్షిప్తం.... అందువల్లనే...ఇంద్రాంశతో...వాలి..బ్రహ్మంశతో సుగ్రీవజననం. ఇద్దరూ మహవీరులే. ఇంద్రుడు
తార అనే అప్సరసను వాలికి ఇచ్చి భార్యను చేస్తాడు,  అలాగే విపరీతమైన మహిమగల ఓక హరం ఇస్తాడు.
కాకపోతే మొదటి నుంచి సోదరుల మధ్య స్త్రీ పర వైషమ్యం వున్నది. అది తార , వాలి భార్య కావటంతో కొంత ముదిరి పాకాన పడింది... ఇరువురి మధ్య ప్రచ్ఛన వైరం....
దీనితో బ్రహ్మదేవుని గురించి వాలి తపస్సు చేసి...లౌక్యంగా ఓక వరం కోరతాడు..యుద్ధంలో తన ప్రత్యర్ధి నుండి తనకు  సగం బలం సంక్రమించాలని కోరతాడు...దానితో బ్రహ్మ ఆ వరం ఇస్తాడు. బ్రహ్మ నాలుగు తలకాయలు వున్నను తేడా పడి...తపస్సుకు వరం కాబట్టి ఇస్తాడు. వాలి యొక్క శత్రవు సుగ్రీవుడు తన కుమారుడు (అంశ)అన్న విషయం మరచి పోతాడు. (కొన్ని వాటిల్లో వాలికి వరం బ్రహ్మ ఇచ్చారని మరికొన్నింటీల్లో ఇంద్రుడు ఇచ్చారని వున్నది...మొత్తానికి వరం వున్నది )(అందుకే మనవాళ్ళు అంటారు బ్రహ్మ నాలుగుతలలులో ఓకటి అవునంటది ఇంకోటి కాదంటది మరోకటి లేదంటది ఆతరువాతది చూద్దాం అంటుంది అంటారు)... దీనితో వాలి ,  సుగ్రీవుని లక్ష్య పెట్టని రీతిలో కిష్కింధను పాలిస్తుంటాడు.
ఇంతలో దుందుభి అనే రాక్షసుడు వాడి వీరత్వాన్ని పరిశీలించుకోవటానికి వరణుడు , సముద్రుడు లను యుద్ధానికి ఆహ్వానిస్తారు.
దానితో వారిద్దరు తమ వల్లకాదు ..నీ వీరత్వం మొత్తం.. వాలి వద్ద ప్రదర్శించు అంటారు. దానితో వాడు దున్నపోతు రూపం ధరించి వాలిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు. కాని వాలి అనునయంగా వద్దులే అంటాడు..కాని దుందుభి.. వాలి వీరత్వాన్ని కించపరిచే మాటలు పలుకుతాడు...దానితో  వాలి దుందుభి తో యుద్ధానికి దిగి వాడితో పోరాటంలో భాగంగా వాడి కొమ్ములు పట్టుకుని గిరగిరా తిప్పి విసరివేస్తాడు..వాడేమో ఋష్యమూక పర్వతంపైన  వున్న మతంగమహర్షి ఆశ్రమంలో  పడి రక్తం కక్కుతూ మరణిస్తాడు. దీనితో మతంగమహర్షి.. ఆశ్రమప్రాంతం కలుషితమైనదన్న ఆగ్రహంతో వాలిని ఋష్యమూక పర్వతంపై అడుగు పెట్టితే నీ తల వేయి ముక్కలవుతుంది శాపం పెట్టుతాడు...ఈ విషయం తెలిసిన వాలి ఋష్యమూక పర్వతాన్ని వదిలి మిగిలిన ప్రాంతాల్లో సంచారం.
ఇది ఇలావుంటే వాలికి రావణునితో విపరీతమైన మైత్రి ఏర్పడుతుంది . ఇదో విచిత్ర సంబంధం. రావణునికి విపరీతమైన అహం..తాను వీరాధివీరుడననని...దానితో ఓకసారి కార్తవీర్యార్జునుడిపై యుద్ధానికి సిద్ధపడతాడు. కార్తవీర్యార్జునుడు తన సహస్రబాహువులచే రావణుని బంధించితే రావణునికి ఊపిరందక గిలగిలాడిపోతు శరణుజోచ్చి అగ్నిసాక్షిగా మైత్రి చేసుకుంటాడు.
అయిననూ బుద్ధి రాక మరోక్క సారి వాలిపై యుద్ధానికి వస్తాడు. ఆసమయంలో వాలి సంధ్యావందనంనకు సముద్రతీరానికి వస్తాడు..ఆ సమయంలో రావణుని కవ్వింపు... దానితో వాలి రావణుని క్రిమి కీటకంతో సమానంగా భావించి ఓక్కసారిగా రావణుని చంకన పెట్టుకుని ఆకాశపయనం...
వాలి ప్రతిరోజు తన సంధ్యావందనం లో భాగంగా...సప్తసముద్రాలలో సూర్యుడు ఏ సముద్రం వద్ద ఉదయించుతాడో...అంతకన్నా ముందు వెళ్ళి పూజాదికాలు చేసేంత వేగం.
ఇలా సప్తసముద్రాలను రెండు ఘడియలలో చుట్టి వచ్చేంత వేగం. ఇలా రావణుడు వాలి చంకలో బందిగా చాలా రోజులు వుంటాడు.ఇదే సమయంలో వాలి ప్రవర్తన వలన వాలికి గల స్త్రీ వ్యామోహం తెలుసుకున్న వాడై. రావణుడు ఎలాగోలా అగ్నిసాక్షిగా మైత్రి. ఈ మైత్రికి ఓక ఓప్పందం ఇస్తాడు రావణుడు.లంకలోని సమస్తానికి తన భార్యలతో  సహ..తనతో పాటు అనుభవించే సహ హక్కులు ఇస్తాడు. కాని వాలి పట్టించుకోక ఓక నెల వుండి వస్తాడు.
దుందుభి కొడుకు మాయావి అనేవాడు వచ్చి వాలిని కవ్విస్తాడు..దానితో వాలి వాడి వెంటపడతాడు...ముందు మాయావి తరువాత వాలి...వీరి వెనుక సుగ్రీవుడు..
మాయావి ఓక గుహలో ప్రవేశిస్తాడు...వాడి వెంట వాలి...సుగ్రీవుడు తన అన్నగారి కోసం బయటనే ఆగి ఎదురు చూస్తుంటాడు...ఓక నెలరోజుల తరువాత గుహనుంచి అరుపులు కేకలుతో పాటు రక్తం బయటకు వస్తుంది...అది తన అన్నగారిదేనన్న భావనతో సుగ్రీవుడు లోపల వున్న మాయావి మరలా బయటకి రాకూడదని ఓక పెద్ద బండరాయి ని గుహకి అడ్డుగా పెట్టి తిరిగి రాజ్యానికి వెళ్ళి..మంత్రుల సలహపై రాజ్యపాలన చేస్తుంటాడు...కాని వాలి లోపల మాయావిని సంహరించటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది... బయటకు వచ్చిన వాలికి..అది సుగ్రీవరాజ్యం అని తెలుస్తుంది. దానితో తమ్మునితో యుద్ధంచేసి తమ్ముని ఓడించి...రాజ్య బహిష్కరణతో పాటు...తమ్ముని భార్య రుమ ని స్వాధిన పరుచుకొని...సుగ్రీవుడు తన రాజ్యంలో వుంటే మరణశిక్ష అనే ఆదేశం...దానితో సుగ్రీవుడు తన మంత్రులు అయిన హనుమ , జాంబవంతుడు , సుశేషణుడు మొదలగు వారితో ఋష్యమూక పర్వతంపైన నివాసం...మంచి కాలం కోసం ఎదురు చూపులు...
ఇటువంటి నేపథ్యంలో సీతాపహరణం...ఆమేని అన్వేషిస్తూ రామలక్ష్మణుల వెదుకులాటలో జటాయువు ని కలుస్తారు. ఇతను పక్షిరాజు.ఇతను దశరధుని మిత్రుడు. రామభక్తుడు. కధా కాలానికి వృద్ధుడైనాడు.ఇతను గరుత్మంతుని సోదరుని కుమారుడు. ఇతను మొదటిసారిగా రామునికి సీతాపహరణం జరిగినది రావణుని వలన అని తెలియచెప్పి ...తాను సీతాపహరణాన్ని ఎలా ఎదుర్కోన్నది...వీటితోపాటు రావణుని తాలూకు అన్నీ వివరాలు తెలిపి...వాడిని ఎదుర్కోవటంలో భాగంగా తగిలిన గాయాలతో పాటు ఋష్యమూకపర్వతం పైన తగిన జాడలు కాని తగు సహయం కాని లభిస్తుంది ఆని తెలిపి ప్రాణత్యాగం చేస్తాడు. దీనితో రాముడు ఎంతో బాధతో జటాయువు కి అగ్నిసంస్కారం జరిపి ఉత్తమగతులు కల్పించుతాడు. (గమనించారో లేదో రాముడు పక్షి కి కూడా అగ్ని సంస్కారం చేస్తాడు. కాని నేటి కాలంలో స్వంత తల్లి తండ్రులకి చేయాలంటే నీవంటే నీవు అనుకుంటూ ఆస్థులు లెక్క తేలేంత వరకు విభేదాలు... మరి ఈ కోవిడ్ రోజుల్లో ఈ గోల మొత్తం మునిసిపాలిటీ వాళ్ళు చేస్తుండటంతో మన సన్నాసులు విపరీతమైన నటన ప్రదర్శన . నేటికి ఆవుకి మాత్రమే అగ్ని సంస్కారం కొంతమంది చేస్తున్నారు)
తదనంతరం రామలక్షణులు ఋష్యమూక పర్వతం వద్దకు వస్తారు...అక్కడ వున్న హనుమని మొదట గుర్తించి హనుమని ఆలింగనం చేసుకుని సుగ్రీవునితో పరిచయం.సుగ్రీవునికి అనుమానం వీరు వాలి పంపిన చారులని...వీరి ఉభయులు మధ్య పరిచయాలు కష్టసుఖాలను పంచుకున్న తరువాత ఇద్దరునూ ఓకే విధమైన కష్టాలలో వున్నారని...కాకపోతే రాముడు సుగ్రీవుల మధ్య వానర మానవ బేధం తప్ప అంతా ఓక్కటే.దీనితో ఇద్దరు ఓకరికొకరు సహయం చేసుకోవాలనే నిశ్చయంకి వస్తారు. అయిననూ సుగ్రీవునకు ఇంకనూ శంక..వాలి వధ..రాముని వల్లన అవుతుందా...దానిని లౌక్యం గా అడుగుతాడు...మీ అన్న ఎంత విశేష ప్రజ్ఞ , వీరత్వం కొద్దిగా తెలుపుదూ అంటే...ఓక ప్రదేశంలో వున్న 7సాల వృక్షాలను చూపి మా అన్న వీటిన్నంటిని కలిపి ఓక్క సారిగా పెకలించ గలడు అన్నాడు. దీనితో రాముడు తన బాణం సంధించి వదులుతాడు...ఆవిఅన్నీ...ఓక్కసారిగా నేలకూలుతాయి...దీనితో సుగ్రీవుడు స్థిమితపడి రామునిపై సంపూర్ణ విశ్వాసం ప్రకటించగా...అగ్నిసాక్షిగా వీరిద్దరి మధ్య స్నేహ సంబంధం ఏర్పడుతుంది. రాముడు సుగ్రీవునికి రాజ్యం , అతని భార్య లభ్యతలో సహయం చేయాలని...అలాగే సుగ్రీవుడు సీతాన్వేషణకి అవసరమైన సహయం చేయాలని.
దీనితో సుగ్రీవుడు రాముడు వెన్ను వున్నాడన్న ధైర్యం తో వాలిని ద్వందయుద్ధానికి ఆహ్వానిస్తాడు...అసలే తమ్మడంటే పడని వాలి కోపంతో యుద్ధం చేస్తాడు...ఇరువురు ఏక సమయంలో జన్మించిన నందున ఏకరూపంలో వుంటారు రాముడు కొద్దిగా గందరగోళం పడి తన బాణ ప్రయోగం చేయడు. దానితో వాలి సుగ్రీవుని తీవ్రంగా గాయపరచి ఓడించుతాడు. వాలి వెళ్ళగానే సుగ్రీవుడు రామునితో నీవున్నావన్న నమ్మకంతో కదా నేను యుద్ధం సిద్ధం అయినది...ఇలా జరిగింది ఏమిటి అని వాపోతాడు...దానికి రాముడు... మీ ఇరువురూ ఓకే విధంగానే వున్నారు...నేను ఆనవాలు కట్టలేక పోయాను అంటూ మీ అన్ననూ మరలా యుద్ధానికి పిలువు..ఈసారి నిన్ను గుర్తింపు కి వీలుగా ఈ పూలమాల ధరించు అని సూచనతో...అదే విధంగా చేసి..అన్న అయిన వాలిని మరలా యుద్ధానికి ఆహ్వానిస్తాడు...వాలి సిద్ధపడతాడు...కాని తార వారించుతుంది..ఇంత అర్ధరాత్రి పూట యుద్ధ ఆహ్వానం అంటే ఎదో అనుమానంగా వున్నది...అందునా మన చారుల వార్త ప్రకారం సుగ్రీవునకు రాముడనే వానితో స్నేహం ఏర్పడినది...అతను మహ ప్రజ్ఞ కలవాడు అని తెలిసినది....కాని వాలి ఆవేశంలో ఈమాటలు లక్ష్య పెట్టక...వీడికి ఈసారి మరణమే శరణ్యం లాగున్నది...అని యుద్ధానికి బయలుదేరతాడు.
వాలి సుగ్రీవుని యుద్ధంలో సమయంచూసి రాముడు చెట్టు చాటునుంచి వాలిపైకి తన బాణం ప్రయోగిస్తాడు...దానితో వాలి నేలకూలతాడు....వాలి వలవలా ఏడుస్తూ రాముని అనేక ప్రశ్నలు సంధిస్తాడు...
రామా వానరాన్ని...నీకు ఆహరంగా పనికిరాను...నీ భక్తుడనే...వీరుడవే..చాటునుంచి కొడతవా...ఇది న్యాయమా...అంటాడు...పోని సీత గురించి అంటావా...ఆవిషయం నీవు  తెలిపితే చాలు..నేను రావణుని ఆజ్ఞాపించితే చాలునే రావణుడే స్వయంగా సీతను తిరిగి తీసుకుని రాగలడే..
దీనికి రాముడు సమాధానంగా...
వాలి...నీవు నా భక్తుడవు అన్నమాట నిజమే..ఈ విషయంలో నీపట్ల ప్రపన్నత వున్ననూ..ఇది నీ తప్పులను కాయదు...పుత్ర సమానుడైన తమ్ముని భార్యను చెరపట్టటం..నీ అహంకారపూరిత ప్రవర్తన...వానరుల పట్ల నీ ప్రవర్తన నీవు జ్ఞప్తీకీ తెచ్చుకో..అందునా మేము క్షత్రియులము వేట మా నైజం...నీవా వానరానివి,జంతు సమానుడివి కాబట్టి వేటాడాను...పోని నేను నిన్ను ఎదుర్కోవాలంటే నీ వరం వల్లన అది సాధ్యపడదు...ఇది మా మహరాజ్యం..ప్రస్తుతం రాజప్రతినిధిగా ఈ ప్రాంతంలో వున్నా...రాజప్రతినిధికి వున్న దండనాధికారం గురించి నీకు తెలియనది కాదు...అయిననూ నీ పశ్చాత్తాపం వలన నీ ప్రాణం నిలబడక పోయినూ నీకు సద్గతి వున్నది...నీ అంతిమ కోర్కేను అమలు పరచటం నా కనిస ధర్మం...
అనగా..వాలి..రామచంద్రా..బుద్ధికర్మాను సారణి అన్న విధంగా ప్రవర్తించా..ఈనాడు ఆలోచిస్తే తెలుస్తుంది.. కాని నా బాధ ఈనాడు... అంగదుని గురించే...దీనితో రాముడు అంగదుని బాధ్యత తనదని చెప్పి...అంగదుడు యువరాజుగానే వుంటాడు అన్న మాటతో వాలి సంతృప్తిగా మరణిస్తాడు...
ఇది మొత్తం పౌరాణిక కధ...
వాల్మీకి వారి నామధారణలోనే వారి బుద్ధులు తెలిపినాడు.. వాలం అంటే తోక..ఓక విధంగా అది వాడి ఆధినంలో వుండదు అని భావన..అనగా వాలి ఇష్టానుసారం ప్రవర్తన అని సూచన..సుగ్రీవుడు.. అనగా మంచి వారిలో కొమ్ము లాంటి వాడు..అనగా నమ్మ దగిన వాడు..అందునా సుగ్రీవుడు బ్రహ్మ అంశ , హనుమంతుడు శివాంశ వీరిద్దరూ కలసి నారాయణాంశకై ఎదురు చూపు...ఇక  త్రిమూర్తులు చేరికతో తదుపరి జగన్మాత సీతమ్మ రక్షణ...రావణ పతనంనకు ఇది సూచన.
రావణుడు , వాలి మధ్య ఉమ్మడిస్నేహకారణం స్త్రీ వ్యామోహం. వాలి చనిపోయే ముందు నీ భక్తుడను అంటాడు..మరి అంతటి వినయవిధేయతలు వున్నవాడు...సీతాపహరణ విషయం వాడికి తెలసి ఉదాసీనత తో వూరకున్నాడు...ఈ విషయం రామునికి తెలియదా..అంటే వాడి ఉద్దేశ్యం  మంచా చెడా... వాలి మాటతో రావణుడు సీతను తిరిగి తెస్తే...రాముని వ్యక్తిత్వ ,క్షాత్ర హీనత అవుతుంది.
ఇక సుగ్రీవ స్నేహనికి రాజకీయ కారణం..నిర్వాహణ కారణం ..సూత్రబద్ధ ధర్మ కారణ హేతువులు వున్నాయి.
కిష్కింధలోని వానరులు , సుగ్రీవుడు సర్వులు వాలి భాధితులే...వాడి అహంకార పూరిత ప్రవర్తనకి విసిగి వేసారి పోయారు...పోని ఎదురుతిరిగే అవకాశం కూడా లేదు వాడి వరం వల్లన ఇది మనకు సుగ్రీవుని భార్య రుమని తన స్వాధీనం లో వుంచుకోవటమే..ఆమే ఏమి చేయలేదు..హితులు సన్నిహితులు ఏమి చేయలేక బయటకు రావటమే సూచన. దీనితో వాళ్ళను వాలి నుంచి ఎవరు కాపాడుతారో అన్వేషణ...ద్వంద యుద్ధంతో పనికి రాదు..అస్త్రనిపుణుడే కావాలి...వానరుల హస్తనిర్మాణం విలువిద్యకు సరికాదు...ఓకవేళ ఎవరైనా వున్ననూ వారు నిపుణులు కాదు...దాదాపు వానరులు అందరూ ద్వంద యుద్ధంలో గాని , భుజ బలం వల్లకాని , గద , పరిఘ , బరిశ లాంటి ఆయిధప్రయోగం..అవి వాలి వద్ద పనికి రావు..కారణం అవి ముఖతా ప్రయోగం...కాని శర అస్త్ర ప్రయోగం అలాకాదు దూరం నుంచి అవకాశం... అందుకే సుగ్రీవుడు రాముని విలువిద్యా నైపుణ్యం పరిక్షించుతాడు..దానితో సుగ్రీవునికి నమ్మకం కుదురుతుంది. వానరులకి వాలి పీడ పోయిన తరువాత అంత ఉత్సాహంగా కోట్లాదిమంది రామదండుగా కదులుతారు.
రాముని కారణాలు రాముని కున్నాయి...
ముందు రాముడు ఎంత వీరుడైననూ రావణుని వంటి వాడి మీద దండయాత్రకు తాను ఒక్కడే చాలడు..ఈ విషయం పై పూర్తి అవగాహన వున్నది. అందుకే తోడ్పాటు కావాలి. ఎవరన్నా రాజసహయాం అడిగితే ఇతని క్షాత్రంనకు అవమానం..అలా జరిగితే రాముని వ్యక్తిత్వం వీరత్వం బలహీనపడుతుంది...పోని అటువంటి వాడు దొరికినా రాముడు అతనితో స్నేహనికి ఆరాజు యొక్క అంతఃపురానికి వెళ్ళాలి..అప్పుడు తన తండ్రికి ఇచ్చిన మాటకి వాగ్దాన భంగం జరుగుతుంది... అరణ్యవాసం పదనాలుగు సంవత్సరాల కాలంలో ఏ రాజ్యవాసం చేయరాదు.. అందువల్ల తప్పని సరిగా అరణ్యవాసులతోనే స్నేహం..వారి సైనికులతోనే దాడి చేయాలి. రామునికి వానరుల సహయాం కావలని జటాయువు తో మాట్లాడిన తరువాత అవగాహన కి వస్తుంది.. మరి దగ్గరలో అందుకు తగ్గ వానర రాజ్యం..కిష్కింద మాత్రమే...పోని వెనుకకు పోయి తనకు తెలిసిన వానర రాజ్యాల సహయం తీసుకోవాలన్నా సమయాతీతం..అప్పటికే అరణ్యవాసంలో పదిసంవత్సరాల కాలం అయిపోయింది...వెనుకకూ పోయేది ఎప్పడు అందుకు తగ్గ వానరులను వెదికి వాళ్ళను కూడగట్టి తీసుకుని రావాలి అంటే పూర్తి సమయాతీతం..సమయంలో అయోధ్య కి తిరిగి వెళ్ళక పోతే భరతుని ప్రాణత్యాగం అనే మాట ఇన్ని పరిధిల మధ్య సుగ్రీవ స్నేహం చేయాలి, అందునా వానరులు , వానరప్రముఖులు సుగ్రీవునితో...ఇదే కాకుండా భార్యా వియోగం , రాజ్య పాలనలో ఇద్దరిది సరిసమాన బాధ...ఓకరు పాలనలో వున్న వారికి రాజ్యం పోయింది.. రెండోవ వారికి రేపు రాజ్యపట్టాభిషేకం అనగా అరణ్యవాసం...ఓక బాధితుడు రెండోవ బాధితుడి దుఃఖం , అవసరం గుర్తించ కలడు...
అలాగే కాకుండా శత్రవు మిత్రడు కూడా శత్రువు తో సమానం అన్న రాజనీతి .
ఇది పూర్తిగా దైవ ప్రణాళిక.
ఇది రాముని రాజ , క్షాత్ర ,వీర ,వ్యక్తిత్వ ధర్మం.
ఇన్ని విధాల ఆలోచన చేసి మాత్రమే వాలిని సంహరించాడు.
సకలం సర్వం శ్రీరామ జయం.
సర్వం శ్రీరామ ప్రసాదమే...
మిత్రులకు , విమర్శకులకు  స్వాగతం.
ఆలపాటి రమేష్ బాబు
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో
విజయవాడ
94401 72262
మీకు తప్పు అని తలచిన విషయం వాట్సప్ చేయండి...పరిశీలించి సరిదిద్దుకుంటాను.
ఇది నా ఘనత కాదు పూర్తిగా రామునిదే...ఆయన ఆశీస్సులు లేకుండా ఇది సాధ్యం కాదు...
కనుక సర్వం శ్రీరామ జయం.



4, మార్చి 2023, శనివారం

సీతా కళ్యాణ వైభోగమే - కీర్తన అర్ధం విశేషాలు

శంకరాభరణము - ఖండలఘువు

పల్లవి
సీతా కళ్యాణ వైభోగమే
రామ కళ్యాణ వైభోగమే | | సీతా | |

అనుపల్లవి
పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర
రవిసోమ వరనేత్ర రమణీయ గాత్ర | | సీతా | |

చరణము 1
భక్తజన పరిపాల భరిత శరజాల
భుక్తి ముక్తిద లీల భూదేవ పాల | | సీతా |
చరణము 2
పామరా సురభీమ పరిపూర్ణ కామ
శ్యామ జగదభిరామ సాకేతధామ | | సీతా | |
చరణము 3
సర్వలోకాధార సమరైకధీర
గర్వమానసదూర కనకాగధీర | | సీతా | |
చరణము 4
నిగమాగమ విహార నిరుపమ శరీర
నగధ రాగ విదార నత లోకాధార | | సీతా | |
చరణము 5
పరమేశనుత గీత భవజలధి పోత
తరణికుల సంజాత త్యాగరాజనుత | | సీతా.
"సీతా కళ్యాణ వైభోగమే" ఈ కీర్తన ప్రముఖ వాగ్గేయకారులు త్యాగరాజు స్వామి వారిచే సృజించ బడినది.
ఈ కీర్తన శంకరాభరణం రాగంలో, ఖండలఘువు తాళంలో స్వర పరచినారు.
ఈ కీర్తన ఎంతో ప్రాముఖ్యత కలది...
పూర్వం దక్షిణాదిన ప్రతి పెళ్ళి నందు ఈ కీర్తన తప్పనిసరి , కాని నేటి కాలమాన ప్రభావం వలన ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఆ సాంప్రదాయ ఆచారం తగ్గి పోయింది...కాని నేటికి తమిళ, మళయాళ ప్రాంతాల్లో ఈ సాంప్రదాయం కొనసాగుతోంది....దానికి అభినందించాలో... తెలుగు కీర్తన తెలుగు భాషా ప్రాంతాలలో కనుమరుగు అవుతున్నందుకు బాధ పడాలో తెలియని సందిగ్దావస్థ లో వున్నాం.
త్యాగయ్య గారు తెలుగు వారు , వారి కీర్తన సాహిత్యం అంతయునూ తెలుగులో వున్ననూ...తమిళ నాట తెలుగు మాతృభాష కాని వారు కూడా త్యాగరాజ కీర్తనలు విద్వాంసులుగా పాడుట వలన చాలా కీర్తనలలో అక్షర దోషాలు వున్నాయి...ఈ కీర్తన కూడా నేను శోధన చేయగా 5,6 వెర్షన్ దొరికినాయి. నేను దాదాపు 30 మంది ఔత్సాహికులు నుంచి ప్రముఖులు వరకూ పాడిన విధానం మరియి నా స్వబుద్ధి ఉపయోగించి శ్రీరాముల వారి కరుణతో మీ ముందుకు ....ఈ కీర్తన లోని అర్ధ విశేషాలు తెలియ చేయ ప్రయత్నం.
మాములు వచన సాహిత్యము కి పరిమితి వుండదు...కాని పద్యం నందు  మరి ముఖ్యంగా కీర్తన యందు పూర్తిగా  చాలా పరిధి లో సృజన చేయాలి.
రాగం, తాళం,చందస్సు, వృత్తం లాంటివి అన్నియునూ పరిధి నిర్దేశం . అయిననూ త్యాగయ్య గారు రామకరుణా కటాక్షములు, నారదలు వారి ఆశీస్సులు లతో లభించిన "స్వరార్ణవం" సంగీత గ్రంధం సహాయంతో అనేక విశిష్ట కీర్తనలు రచన చేశారు.
ఈ కీర్తన స్వరూపాన్ని పరిశీలన చేస్తే అనుపల్లవి, పల్లవి, 5 చరణాలు గా వున్నది. అనుపల్లవి నందు ఆంజనేయ ప్రస్తావన, ఆఖరి చరణం నందు పరమేశ్వర ప్రస్తావన వుంటుంది గమనించండి.
ఇది ఎందుకో గమనించండి...
మన పౌరాణిక కధలు, గాధలు, వ్రతాలలో ప్రారంభ సమయంలో నైమిశారణ్యంలో శౌనకాది ప్రముఖ మునుల మధ్యన, లేక ఫలానా దేవతా ఉవాచ అంటూ ప్రారంభం కాని అవే ముగింపు సమయంలో ఫలిత నిర్ణయ సమయంలో
ఈ వ్రతం, నామం పఠించిన, పారాయణ చేసిన , లేక వ్రతం శ్రద్ధగా నిర్వర్తించితే ఫలానా దేవి దేవతా స్వరూపం ఈ విధమైన ఫలితం అని నిర్దేశించుతారు గమనించండి. అదే సాంప్రదాయం, అదే ఆచరణ ఈ కీర్తన యందు కూడా త్యాగరాజ స్వామి వారు పాటించారు.
దీనికి కారణం మీరు చేయి ఈ క్రియ ఫలానా దేవతా స్వరూపం వారిది అని మనకు తెలియ చేయటం.
ఇక ఈ కీర్తన సమయం త్యాగయ్య గారి ఏకైక కుమార్తె సీతామహాలక్ష్మి వివాహ సందర్భంగా అని నా అభిప్రాయం.
ప్రతి తండ్రి తన కుమార్తె వివాహం చేయాలని కలలు కంటాడు .తను అల్లారుముద్దుగా పెంచుకున్న తన లావణ్యరాశి, బంగారు బొమ్మ, సాక్షాత్తు తన ఇంటి మహాలక్ష్మి గా భావించే కన్యకు ఎటువంటి వరుడు లభిస్తాడో అని సర్వులు భావిస్తారు. ఆ కన్య వివాహ సమయంలో వరుని యొక్క వంశ, రూప, గుణాలను పరిశీలించి ప్రస్తుతిస్తుంటారు . అందుకే కాబోలు త్యాగయ్య గారు వరుని గుణ గణాలు శ్రీరాముని పరంగా చూపుతూ అదే సమయంలో శ్రీరాముని ఆధ్యాత్మికంగా కీర్తీంచారు. మనము శ్రీరామ కీర్తన గా భావన లేక వర ఎంపిక లక్షణ కీర్తన అంటే వారి వారి భావజాలం పరంగా భావన చేయండి.
పల్లవి
" సీతా కళ్యాణ వైభోగమే
రామ కళ్యాణ వైభోగమే"
చూడండి గమ్మత్తు... కీర్తన ఏమో రామ ప్రస్తుతి, కాని కీర్తన ఆరంభం మాత్రం సీతతో... ఎందుకంటే మనం సమాజం మాతృ స్వామ్యయ వ్యవస్థ నుంచి పితృ స్వామ్యం కి మారినది  అన్న విషయం మనం గుర్తించాలి , అయినా వివాహ విషయంలో స్త్రీ కి వున్న ప్రాధాన్యత పురుషునకు కొంత తక్కువ. అమ్మాయి వివాహం అంటే అందరూ కదలి వస్తారు తమ వంతు పాత్ర నిర్వర్తించుతారు.

ఇది మన సాంప్రదాయం... స్త్రీ చేరిక తరువాత మాత్రమే పురుషుడు వ్యక్తుడుగా , కుటుంబ జీవన అర్హుడుగా సమాజంలో గుర్తింపు , తద్వారా సమాజం నకు ఇంకొక చైతన్య వంతమైన చేరిక కలుగుతుంది. దీనికి రాముడు కూడా బద్ధుడే...
"సీతా కళ్యాణ వైభోగమే" అన్న పల్లవిలో సీతారాముల కళ్యాణ విశిష్టత ను "వైభోగమే" అన్న పదం ద్వారా మనకు సూచన చేస్తున్నారు.
భోగము, విభవం, వైభోగం మూడునూ సమరూప పద ప్రయోగాలుగా భావిస్తారు  కాని ఇవి మూడునూ వేరు వేరు సందర్భాలలో ఉపయోగిస్తారు.
భోగము అన్నది ఐహిక సుఖ, లేక ఆహర నివేదన సమయాలలో మాత్రమే వినియోగం.
వైభవం అన్నది ఐశ్వర్య జీవన ప్రదర్శన సమయాల్లో ప్రయోగం.
వైభోగం అన్నది మాత్రము దైవకృప మరియి దైవసంబంధ సామూహిక ఘట్టాలలో ప్రయోగం...
మరి వైభోగం ఆయా దేవతా రూపాలకా...
కాదు కానేరదు... ఆయా దేవి దేవతా రూపాల కళ్యాణ దృశ్యదర్శనం మనకు యోగం. సాక్షాత్తు లక్షీ, నారాయణ రూపాలైన సీతారాముల కళ్యాణ దర్శనం మనకున్న యోగంలలో ఒక గొప్ప యోగం. అందుకే త్యాగయ్య గారు
"సీతా కళ్యాణ వైభోగమే
రామ కళ్యాణ వైభోగమే"
అని ప్రారంభించారు.
అనుపల్లవి
"పవనిజస్తుతి పాత్ర పావన చరిత్ర
రవి సోమ వర నేత్ర రమణీయ గాత్ర"
సాధారణంగా కీర్తన సాహిత్యం లో మనం పల్లవి మాత్రం గమనిస్తాం. కాని ఈ కీర్తన లో అనుపల్లవి కూడా కలదు.
ఈ అనుపల్లవి లో శ్రీరాముని యొక్క విశేషతను ఒక దైవ రూపం ద్వారా ప్రారంభించారు. పవనిజ అనగ వాయు పుత్రుడు అయిన ఆంజనేయుడు అని సర్వ విదితిమే. ఆంజనేయుడు , శ్రీరాముని పవిత్ర చరిత్రను స్తుతి చేస్తున్నారు.
హనుమది  అచంచలమైన రామభక్తి అని మనకు తెలిసినదే.
ఈ సమయంలో మనం హనుమ రామ భక్తుడు ఎందుకు అనేది కొంత వరకు తెలుసుకుందాం....
మనం ఆంజనేయుని ఈ విధంగా ప్రార్ధన చేస్తాం " మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధీమతాన్వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామ దూతం శిరసా నమామి"
ఆంజనేయుడు శివ అంశ. విశేష ప్రజ్ఞ కలవాడు. నవ వ్యాకరణ పండితుడు, సూర్యుని వద్ద విద్యని అభ్యసించినవాడు. సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు. సర్వ ప్రాణకోటికి చైతన్యం ప్రసాదించు వాడు. సూర్యుడు ఆత్మరూపానికి గుర్తు. మరి అంతటి సూర్యుని వద్ద విద్య నేర్వటం అంటే ఆత్మ నిగ్రహ శక్తి కలిగి వుండటం.
వాల్మీకి వారు ఈ విషయంను రామ, హనుమ ప్రధమ సమాగమ ఘట్టం అయిన కిష్కింధ కాండ , 3 సర్గ యందు విశేషంగా వివరించారు.
రాముడు ధర్మ రూపం.  ధర్మం అన్నిటి కన్నా గొప్పది. కనుక హనుమ, శ్రీరామ భక్తుడు అవటంలో అసంబద్ధం ఏమి లేదు.
తరువాత పాదం
"రవి సోమ వర నేత్ర రమణీయ గాత్ర"
శ్రీరాముని కన్నులు ఈ విధంగా వున్నాయట...ఒక కన్ను దగ్ధాయమానంగా ప్రకాశించు సూర్యునిలాగా, రెండోవ కన్ను చల్లని హాయి కొలుపు చంద్ర కాంతిలా...
మనం ఈ ఉపమానం చదువుతాము కాని ఇలా ఎందుకు అని మనం ప్రశ్నించుకుంటే......
మనం ఎవరినైనా దర్శనం చేసినప్పుడు మొట్ట మొదట మనకు అప్రయత్నంగా వారి ముఖ కవళికలు లోని కన్నులు వారికి మన పట్ల గల భావం కాని వారి స్థితిని కాని ప్రస్ఫుటంగా తెలియ చేస్తాయి. తద్వారా వారు ఆనంద, దుఖః, వైరాగ్య, సంతాప, సంతోష, సందిగ్ధత లాంటి అనేకానేక వ్యక్తి అవస్థలు మనం గుర్తు పట్టగలం.
కాని ఇక్కడ మనం తెలుసుకోవాలి అనుకుంటున్నది శ్రీరాముని గురించి...
అయన ఇటువంటి అవస్థలన్నింటికి అతీతుడు....వారి కన్నులు సదా ప్రకాశవంతంగా, ఆత్మనిగ్రహంతోను, గంభీరంగా ఎంతో సుదూరంగా వున్న విషయం అయననూ గ్రహించే విధంగా, సర్వ జనులకు ఆకర్షణీయంగా వుంటూ ప్రశాంతత, ఆదరణీయ దృష్టితో, తనను అర్ధించే వారి పట్ల ప్రసన్నత కలిగి వుంటాడని.... తద్వారా సర్వులకు భరోసా నమ్మకం ఉపశమనం కేవల వీక్షణ ద్వారా లభిస్తుంది.
అందుకే త్యాగయ్య గారు సోమ వర నేత్ర..సోమ అంటే చంద్రుడు. చంద్ర  కాంతి వంటి శీతలత్వం మరియి హాయి కలుగ చేయు కలడని, వర అనగా మనకు ఒక భరోసా, ఒక నమ్మిక ఏర్పరచ  గల పరమపురుషుడని వారి భావన.
ఇటువంటి పరమ పురుష చరిత్ర ఏ విధంగా వున్నదో అంటే రమణీయంగా ప్రజలు గాత్రం చేస్తున్నారట.
రామచరిత్ర మాత్రమే రమణీయం ఎందుకైనది....అంటే అనేకానేక కారణాలు...ఎందుకు మీ చరిత్ర, నా చరిత్ర లాంటివి కావు అవి స్వొత్కర్ష మరియి సుత్తి అవుతాయి రెండోవ సారికే మనకు మనకే బోర్ అనుకుంటాం కాని రాముడు త్రేతాయుగ నాటి అవతార పురుషుడు నేడు కలియుగంలో వున్నాం ..అయిననూ  అనేక విశేషాలు కలవి కాబట్టి యుగాలు మారినా నేటికి ఆరాధ్యుడు...అదియును గాక రామ చరిత్ర ఎన్ని సార్లు విన్నను ,దర్శించిననూ ఏమిటో అక్షణం లో కొత్తగా ఇంకొక విషయం తెలుసుకొని ఆశ్చర్యం చెందుతాం...అరే ఈ విషయం మనకు ఇంతకు ముందు తెలియదే అని ఆశ్చర్యం చెందుతాం...
ఈ సమయంలో అప్రస్తుతం అయిననూ  ఇహలోక సంబంధ విషయం కొంత ప్రస్తావన...
మనం అందరం గమనిస్తూ వుంటాం...మనం ఇండ్ల లోని కుటుంబ స్త్రీ లు, బాలికలు, యువతులు రక రకాల అలంకరణలతో ఎప్పటి కప్పుడు నిత్యనూతనంగా...రోజు చూసే మన బంగారు తల్లి  కూడా ఎప్పటి కప్పుడు కొత్తగా నిత్య నూతనంగా...  గౌను లో  ఒకలా, సల్వార్ లో మరోలా, పట్టు పావడా పరికిణి లలో మరోలా, చీరలో, పూల జడ తో, ఇలా అనేకానేక అలంకరణలతో ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా దర్శనం ఇచ్చి మనకు ఆనందం కలిగిస్తారు....
మరి రామ చరిత ఎన్ని సార్లు విన్నను మరలా మరలా విని ప్రస్తుతించ గలం కాబట్టే రామ చరిత్ర రమణీయం అయినది.
చరణం1
"భక్తజన పరిపాల భరిత శరజాల
భుక్తి ముక్తిద లీల భూదేవ పాల"
ఈ చరణంలో శ్రీరాముడు తన ఆశ్రీతులకు, భక్తులకు, బ్రాహ్మణులకు, సాత్వికులకు  ఏవిధైమన రక్షణ కల్పిస్తున్నారో మనకు తెలియ చేస్తున్నారు.
శ్రీరాముడు అయోధ్యకు మహారాజు మరియు జగత్ ప్రభువు అన్న కోణంలో వివరించు కుందాము...
ఈ చరణంలో శ్రీరాముని రాజసం,క్షాత్రం ను తెలుపుతున్నారు.
రాజు యొక్క అధికారం రాజ్యపాలన.
రాజ్యపాలన అంటే అధికార దర్పం,అధికార ప్రదర్శన కాదు కానేరదు
అధికారమంటే ప్రజలను రక్షించటం, కాపాడటం,శిక్షించడం..
ఈ విషయం లో వాల్మీకి వారే రామాయణ రచన లోనే అద్భుతమైన కౌశలం చూపారు.. శ్రీరాముడు బాల్యం తదుపరి యౌవ్వన ప్రారంభం, అంతేకాదు రావణ సంహరనకు ప్రాతిపదిక మరియు ,రాముని యొక్క క్షాత్రాన్ని అనన్యమైన రీతిలో మనకు రామాయణం లో చూపదలచి విశ్వామిత్ర పాత్ర ప్రవేశం ద్వారా జరిపించారు. విశ్వామిత్రుడు రాముని
యాగ సంరక్షణార్థం తన వెంట తీసుకుని వెళ్ళి ప్రజా కంటకంగా వున్న తాటకి సంహారం. యాగ విధ్వంసం చేయుచున్న మారీచ సుభాహులలో, సుబాహు సంహారం, మారీచుడు పలాయనం రాముని యొక్క వీరత్వ క్షాత్ర లక్షణం ప్రదర్శన...
రాముడు భక్తితో తనను ఆశ్రయించిన వారి యొక్క కార్య నిమిత్తం తన తూణిరం నుంచి శర పరంపరతో సదా సిద్ధమే... భక్తితో అంటే.... నమ్మకం, విశ్వాసం, ఆర్తి తో కూడిన హృదయ నివేదన భక్తి....
సరే రాజ ధర్మం అయిన క్షాత్రం , వీరత్వం తో పాటు పాలన...భుక్తి ముక్తిద లీల భూదేవ పాల...
ఈ చరణం గురించి త్యాగయ్య గారిని ఎంత ప్రశంసించననూ తక్కువే...
తన ఆశ్రయించిన భూదేవులు అనగా బ్రాహ్మణులు కి...భుక్తి...అనగా సాత్వికులకు అవసరమైన నిత్యకర్మానుష్ఠానం, యజ్ఞ యాగాదులకి అవసరమైన ధన, కనక, వస్తు ,వాహన,సంభారాలు అన్నింటిని సమకూర్చే వాడు.
సరే రాజ ధర్మం లో అవి రెండును సహజమే కదా అనుకుందాం...మరి "ముక్తి"...
ముక్తి మాములుగా క్షేత్రాలలో దొరకు పంట...కాదే...
అసలు ముక్తి అంటే...
మానవుడు పునరపి జననం పునరపి మరణం అన్నారు... ఆత్మ తన ప్రార్బద కర్మలను బట్టి జన్మ తీసుకోవటం..ఈ జన్మ కర్మలను బట్టి ఇంకొక జన్మ తీసుకునే జనన మరణ చక్రం లోని  వారికి శ్రీరాముడు జన్మరాహిత్య స్థితిని ప్రసాదించటమే ముక్తి....ఇది భగవత్ కృప వలన మాత్రమే సాధ్యం.
మరి 'లీల' అంటే....
సాధారణ మానవుడు చేయి క్రియలు, చర్యలు అన్నియినూ భౌతికమైనవి కనుక ఇవి జీవన క్రియలు గా అభివర్ణిస్తారు. కాని అధి మానవుడైన దైవ రూపం చేయి అధి భౌతిక చర్య లీల గా పిలుస్తారు.
మరి రామాయణం లో రాములువారు తాను అవతార పురుషుడు అనే ప్రకటనే లేదు మరి ఇక లీలలు ఏమిటండి...
లీలలు అంటే శ్రీక్రిష్ణులవారివే కదా!...
రామాయణంలో కూడా వున్నదా అంటే వున్నది అండి అది " అహల్య శాప విమోచనం"...
యాగ సంరక్షణ తరువాత విశ్వామిత్రుడు తో కలిసి శ్రీరాముడు ప్రయాణిస్తున్న సందర్భం లో గౌతమ ముని ఆశ్రమం లో రాయిగావున్న అహల్య శ్రీరామ పాద స్పర్శ చే మరలా స్త్రీ గా మారుటే అహల్య శాప విమోచనం.
అహల్య శాప సమయం కి శ్రీరాముని వలన శాప విమోచనం కి మధ్యలో కాలవ్యవధి చాలా వున్నది...ఈ మధ్యలో జరగని శాపవిమోచనం ఆ సమయంలో
జరగడమే లీల అని నా అభిప్రాయం.
మీరు శ్రద్ధగా గమనిస్తే... సీతా స్వయంవరం ముందు వచ్చు ఘట్టాలు అన్నీ శ్రీరాముడు వరుడు గా కాబోతున్నారని వాల్మీకి సూచన ప్రాయంగా తెలిపినారు.
సీత అయోనిజ...భూమి నందు జనకునికి లభించిన పుత్రిక....భూమి నందు అంటే... సహజంగానే మనం మన తల్లి తండ్రుల వారసత్వ లక్షణాలు కలిగి వుంటాము. మరి సీత భూదేవి ద్వారా అంటే భూమాతకి కలిగిన సహనం, ఓర్పు, సచ్ఛీలత,శీలం అన్నవి ఆమేకు సహజ సిద్ధంగా వున్నవి...మరి ఆమెను పొందవలనంటే శ్రీరాముడు ఎంతటి వాడు గా వుండాలి....
రామాయణం లో ఇంతవరకూ సీత ప్రస్తావన వుండదు...కాని వాల్మీకి రచన నైపుణ్యం అదే.. రాబోవు సన్నివేశాలకు ముందుగానే ఇక్కడే ప్రస్తావన చేస్తూ మనకు సూచనలు ఇస్తుంటాడు...
రాముని యొక్క వీర, ధీర, క్షాత్రం తోపాటు పరస్త్రీ లో పట్ల మాతృభావం కలిగినవాడు అన్న కోణం కూడా అహల్య శాపవిమోచనం ద్వారా తెలియ చేస్తూ మనల్ని శ్రీరాముడు వరుడు కాబోతున్నాడు అని సమాయత్తం చేస్తున్నాడు...
మరి ఈనాటి కాలం కి మనం ఏ విధంగా అన్వయం చేసుకోవాలి...
వర ఎంపిక నందు వధువు తల్లి తండ్రులు చూడ వలసినది ఏమిటి..
వరుని రూప, గుణాలతో  వ్యక్తిత్వ, సౌశీల్యం, కుటుంబ జీవనంలో తమ కుమార్తె ను ఏ విధంగా సంరక్షించ గలడు అన్నది, మరియు తన వంతు బాధ్యత ఏ విధంగా నిర్వర్తించ గలడు అన్నది చూడాలి... కాని నేటి వాతావరణం తత్ భిన్నంగా వున్నది.
మన వివాహ మంత్రముల లోనే ధర్మేచ ,అర్ధేచ,కామేచ, మోక్షేచ నాతిచరామి అని వర ప్రమాణం వున్నది...
కాని నేటి సమాజం లో 'అర్ధం ' ఒక్కటి పట్టుకుని మిగతావన్ని వదిలివేసినారు...
కాబట్టి  సమాజం లో ఇన్ని విపర్యాలు చోటు చేసుకున్నవి.
2 చరణం
" పామర సుర భీమ పరిపూర్ణ కామ
శ్యామ జగదభిరామ సాకేత ధామ"
సాకేతం అంటే అయోధ్య నగరం .
సాకేతం అంటే అర్ధం స్వర్గానికి దగ్గరగా...
అనగా ఆనాటి సాధారణ ప్రజలు కూడా ఎటువంటి అండ లేని వారు అయిననూ
అనగా విద్య, ధన, వర్ణ, వర్గం,లేని దుర్బల పామర ప్రజలు కూడా మా దేవుడు శ్రీరాముడు వారి అండ మాకు బలం , రక్షణ అని విశ్వసించే వారు వారి ధర్మ బద్ధ మనో కామనలు అన్నీయునూ పూర్తి చేయగలిగేవారు. అందుకనే రాముడు జగదభిరాముడైనాడు.
3 చరణం
"సర్వలోకాధార సమరైక ధీర
గర్వ మానసదూర కనకాగధీర"
సర్వలోకాలను రక్షించుట కొరకు యుద్ధం చేయగల ధైర్య వంతుడు...లోక  చలనం దేనిమీద... ధర్మం అనే నియతి పైన...
మరి ఆ ధర్మమే సరిగ్గా లేని నాడు
ధర్మ బద్ధుడైన శ్రీరామడు యుద్ధం చేయగల ధీరుడు.
అలాగే తన వెంట ఎంత సంపద వున్ననూ...ఆయన స్థితప్రజ్ఞత తో వుంటారు...
ఈ చరణంలో క్లుప్తంగా ఒక చిన్న పదం
కనకగాధీర ‌‌....చూడండి...
ఈ పదం యొక్క అర్ధం...కనకం అంటే బంగారం...అంటే లక్ష్మి...అంటే అష్టలక్ష్మీ స్వరూపాలు....అంటే రాజ్యలక్ష్మి తో కలిపి కూడా అని...ఇంకొక అర్ధం ఇల్లాలు అని కూడా మనం అన్వయం చేసుకోవాలి...
సీత సాక్షాత్ లక్ష్మీ స్వరూపం...శ్రీరాముని ఇల్లాలు...మరి అంతటి సిరి కల లక్ష్మీ వున్నదని శ్రీరాముడు అహంతో వున్నాడా లేదే స్థితప్రజ్ఞత వున్నారు...
అటు వంటి గర్వం తో వ్యవహరించే వారిని ఇతను చేరనీయడు...
అనగా వరుడు డబ్బు వ్యామోహంలో భార్యను నిర్లక్ష్యం చేయు వాడు కాదు...
తన జీవన సమరంలో స్థితప్రజ్ఞత తో వుండి తన వద్ద డబ్బు, అందమైన భార్య వున్నది, ఆమే తో వచ్చు సిరి సంపదలకు ఆశపడి గర్వంతో వ్యవహరించు వాడు కారాదు...తన జీవన పోరాటంలో తన కుటుంబ సభ్యులందరికి ఆధార భూతుడై వుండగలవాడుగా భావించాలి...
ఆ విధంగా నేడు వధు, వరులు వున్నారా అంటే... శూన్యం అనే సమాధానం...
సమాజం...ఉమ్మడి కుటుంబం నుంచి వ్యష్ఠి కుటుంబానికి అక్కడ నుంచి నేను , నా భర్త మాత్రమే అన్న కోణంలోకి పయనం...దీని వలన వచ్చు సాధక బాధకాలు అనేకం...
మనిషి సంఘజీవి, కుటుంబ జీవి...అలా కాకుండా నలుగురుతో కలవని పంచుకోని జీవనం ఏకాంత వాసం...అది ఘోరం దుర్భరం..
ఇది నేటి కాలపు తల్లిదండ్రులు గమనించుకోవాలి.
చరణం 4
" నిగమాగమ విహర నిరుపమ శరీర
నగద రాగ విదార నత లోకా ధారా "
ఈ చరణంలో తన అభిరుచి...తన కీర్తనలు అన్నీయునూ రాముని రూపం గానే అన్న భావన...
శ్రీరాముడు వేదాంత వేద్యుడు...వేదం ప్రకారం నడుచు కొను స్వభావం కలవాడు... నిగమం అంటే వేదాలు...ఆగమం అంటే వివిధ రీతులలో దేవతలను పూజ చేయు విధానం అని అర్ధం...
అంటే సర్వ వేదాలు, సకల శాస్త్రాలు, అన్నీ రకాల పూజలు ఎవరిని పూజ చేస్తున్నాయి... నిరుపమానమైన శరీరం  కల శ్రీరాముని....
ఉపమానం అంటే పోలిక, సామిప్యం అని అర్థం...అదే నిరుపమాన అంటే వర్ణనలకు కూడా అందనంత ప్రకాశవంతమైన ...
రూపం అంటే కొంత పరిధి పరిమితి కలదని కాని శ్రీరాముని యొక్క సుగుణ రూపంనకు పరిమితులు నిర్దేశించటం సాధ్యం కాదు....
మరి  చూడండి అన్నీ కీర్తనలు, రాగాలు ఎవరిని పాడుతున్నాయి అంటే శ్రీరాముని...
నగధరుడు అంటే విష్ణువు...
కృష్ణావతారం లో గోవర్ధన ఘట్టం వలన ఈ నామధేయం.
5 చరణం
" పరమేశ నుత గీత భవ జలధి పోత
తరణికుల సంజాత త్యాగరాజ నుత"
చూడండి అనుపల్లవి ప్రారంభం...పవనిజ అంటూ...
ఈ చరణం ప్రారంభం పరమేశ నుత అంటూ...
ఒక దైవాంశ ప్రారంభం..ఇంకొక దైవం కాలరూపుడైన పరమేశ్వరునితో కీర్తన ముగించటం..ఒక విశిష్ట సాంప్రదాయం.
పరమేశ్వరుడు సమస్త మానవాళి కి...ఇహ లోక సంబంధమైన సమస్త విచారము లోను దాటటానికి ప్రసాదించిన మహామంత్రం
" శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే"
ఈ మహామంత్రం ను పార్వతి దేవి కోరిక పై సాక్షాత్తు పరమేశ్వరుడు తల్లి గర్భం ద్వార జన్మించిన సకల జీవ రాశి మీ ఇహ జీవన సాధక బాధలు దాటి తరించ గల తారక మంత్రము...
శ్రీరామ నామము.
ఇది త్యాగరాజ కీర్తన పై నాకు భగవదనుగ్రహం గా లభించిన బుద్ధితో మీకు తెలుప బడిన కొన్ని విశేషాలు...
ఈ కీర్తన ను నా మాతృచ్ఛాయ పరదేవతా ప్రసాదంగా భావించే నా బంగారు తల్లి వివాహ సమయంలో ఆలపించాలని భావన చేశాను....
కాని రకరకాల కారణాంతరాల వలన అది సాధ్య పడలేదు...కాని నాటి నుండి
నా మనస్సులో దాగి నేటికి శ్రీరామ కరుణచే రూపాంతరం చెంది ఈ విధంగా..స్వామి పాద పద్మాలకు...
స్వామి వారి కరుణ సంపూర్తిగా నా బంగారు తల్లికి లభించాలని కోరుకుంటున్నా...
అలాగే ఈ కీర్తన ఉపసంహరం చేసే ముందు...మరి కొన్ని...
సీతారాములు...ఇరువురా ఒక్కరా అంటే
చాలామంది , అదియునూ రామతత్వం పూర్తిగా తెలిసిన వారు చెప్పే మాట...
వారు ఇరువురూ ఎన్నడు వేరు వేరు కాదు..
ఇరువురునూ ద్విదేహలలో వున్న ఏక ఆత్మ స్వరూపులే అని, సీతారాములు ఇరువురునూ బింబ, ప్రతిబింబాలని...అంటే ఒకరిని దర్శనం చేస్తే రెండోవ వారు ప్రతిఫలిస్తారు...
శ్రీరామ దర్శనం అయితే మనకు అప్రయత్నంగా సీతామాత దర్శనం అయినట్లే....
మీరు గమనించితే శిల్ప శాస్త్రం, చిత్ర లేఖనంలో సీతారామస్వరూపాలు రెండుగా వున్ననూ...రెండురూపాలు ఒకే విధమైన పోలికలు, మొక్కట్లు తో వుంటాయి... కాకపోతే ఒకటి పురుష స్వరూపం...రెండవది స్త్రీ స్వరూపం...
అంతటి ఘనమైన వారు కాబట్టి యుగయుగాలుగా దాంపత్య జీవనం అంటే సీతారాములదే...
మరి ఈనాటి వధు, వరులు ఏంపికలో ఎవరిని, ఏ విధమైన వారిని ఆదర్శంగా తీసుకోవాలో వారు నిర్ణయం...
సర్వం సకలం జయం కలగాలని...
శ్రీరామ జయం.
ఈ కీర్తన పై ఎవరికైనా సందేహం వున్నా నాకు ఫోన్ చేయవచ్చు
సద్విమర్శ సదా ప్రీతి పాత్రమే...
ఆలపాటి రమేష్ బాబు
శ్రీ సంతోషి సాయి బుక్ డిప్
విజయవాడ -1
94401 72262.
























26, ఫిబ్రవరి 2023, ఆదివారం

బ్రోచేవారు ఎవరు రా నిను వినా రఘువరా కీర్తన విశేషాలు

బ్రోచేవారెవరురా

పల్లవి:

బ్రోచేవారెవరురా
నిను విన ,నిను విన
రఘువరా, రఘువరా
నను బ్రోచేవారెవరురా
నిను విన రఘువరా
నీ చరణాం భుజములునే
నీ చరణాం భుజములునే
విడజాల కరుణాలవాల
బ్రోచేవారెవరురా ఆ ఆ

చరణం1:

ఓ చతురా ననాది వందిత నీకు పరాకేలనయ్య
ఓ చతురా ననాది వందిత నీకు పరాకేలనయ్య
ఓ చతురా ననాది వందిత నీకు పరాకేలనయ్య
నీ చరితము పొగడలేని నా చింత తీర్చి వరములీచ్చి వేగమే
నీ చరితము పొగడలేని నా చింత తీర్చి వరములీచ్చి వేగమే
సా సనిదపద నిస నినిదదపమ
పాదమ గా మా పదాని సనిదపమ నీదాపమ
గమపద మగరిస సమా గమపద మాపదని
ససరిని నినిసదా దదనిపాద మపదని
సానిదప మగమనిదని పదమాపదని
సమా గరిస రిసానిదప సనిదపమ గామపదని
బ్రోచేవారెవరురా ఆ ఆ

చరణం2:
సీతాపతే నాపై నీకభిమానము లేదా
సీతాపతే నాపై నీకభిమానము లేదా
వాతాత్మజార్చిత పాద నా మొరలను వినరాదా
భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా
భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా
భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా
నా పాతకమెల్ల పొగొట్టి గట్టిగ నా చేయి పట్టి విడువక
సా సనిదపద నిస నినిదదపమ
పాదమ గా మా పాదాని సనిదపమ నీదపమ
గమపద మగరిస సమా గమపద మాపదని
ససరిని నినిసదా దదనిపాద మపదని
ససరిని నినిసదా దదనిపాద మపదని
సమా గరిస రిసానిదప సనిదపమ గామపదని
బ్రోచేవారెవరురా ఆ ఆ
K . విశ్వనాధ్ గారి స్వర్గ ప్రవేశం...
ఈ సమయంలో వారికి నివాళిగా మరియి నా ఆత్మ నివేదన ను వ్రాయాలి అనిపించి పరిశీలించగా శంకరాభరణం చిత్రంలో ఈ కీర్తనను ఎంచుకున్నాను...
దానికి కూడా కారణం వున్నది...
నేను వ్యక్తిగతంగా సంగీత పాండితీ ప్రకర్ష మరియి సాహితి విద్వత్ వున్న వాడిని కాదు... ఈ రెండింటిలో అభినివేశం వున్నవాడిని మాత్రమే...
ఈ కీర్తన రచించిన వారు మైసూర్ వాసుదేవా చార్య. చాలామంది ఈ కీర్తన ను త్యాగరాజు గారిది అని భావన చేస్తారు. త్యాగయ్య గారిది బ్రోచేవారు అనే కీర్తన వున్నది కాని అది వేరు ఇది వేరు.
మైసూర్ వాసుదేవాచార్య గారు 28/05/1865 నా కర్ణాటకలో జన్మించారు. వీరు 200 పైగా కీర్తన లు రచించినారు. ఇందులో సింహభాగం తెలుగు లోను అందులోను శ్రీరామునిపై...అనేక కీర్తనలు ప్రాచుర్యం పొందినాయి.
వీరి కీర్తనలో వాసుదేవ అన్న పదం మనం గమనించవచ్చు...వీరు అనేక తిల్లానలు, జావళీలు రచించినారు
వీరు కృతి మంజరి అనే పుస్తకం వ్రాసినారు. వీరికి భారత ప్రభుత్వం వారు పద్మభూషణ్ బిరుదుతో సత్కరించారు. వీరు 17/05/1961 న స్వర్గ ప్రవేశం.
ఇక కీర్తన విశేషాలు...ఈ కీర్తన ఖమాస్ రాగంలో,  ఆది తాళం లో...
కీర్తన విశ్లేషణ లోకి....
బ్రోచేవారు ఎవరు రా....అంటే బ్రోవటం అంటే ఏమిటి మనం ప్రశ్నించుకుంటే...జన్మించిన ప్రతివ్యక్తి ఖచ్చితంగా తన తన ప్రార్బద కర్మలను బట్టి అనేకానేక కర్మ ఫలితాలను అనుభవిస్తారు. ఇవి హితమా అహితమా అంటే రెండునూ..‌కాని కొన్ని సమస్యలు జీవిని చుట్టుముట్టి అతను వాటిని దాటలేని పరిస్థితి... పూర్తిగా అంతర్మధనం తో బాధ పడుతుంటారు...ఆ సమయంలో ఏ దైవం అయితే ఈ విపత్కర పరిస్థితిని దాటించుతారో వారే బ్రోచేవారు...
ఇది ఐహికం...
కాని జీవుడు అనేకానేక జన్మజన్మల రాహిత్యం పొందటం తారకం అంటారు...కాని తారకం నకు ఏ దేవి దేవతలు ఉపాసన మరియి నామస్మరణ చేస్తారో వారే బ్రోచేవారు....
అందుకనే బ్రోచేవారు ఎవరు రా నిను వినా రఘువరా....నాయనా శ్రీరామ చంద్ర ప్రభు రఘువంశంలో ఉత్తముడా!
నీవు తప్ప నన్ను వేరెవరు బ్రోచగలరు.
నాయనా! శ్రీరామ నీ పాదములు నేను విడవలేను...నీ కరుణ నా ప్రసరించవా ! ఇంత వరకూపల్లవి...తదనంతరం చరణం...
ఓం చతురా ననాది వందిత నీకు పరాకేలనయ్యా!....
నాయనా! శ్రీరామ చంద్ర,  బ్రహ్మ మొదలగు సర్వ దేవతలు నిన్ను పూజించుతారు...మరి నీవు నామీద ఎందుకు నాయనా పరాకు...
పరాకు...ఇదో గమ్మత్తు పదం...పరాకు అంటే...మనం ఏ కార్యక్రమం అయినా చేయాలని సంకల్పం వుంటుంది కాని పూర్తి చేయటానికి ఆలశ్యం, ఏవో మనం సృష్టించుకున్న అవాంతరాలు వలన ఆ పని లక్ష్య సిద్ధి కాదు...దీనినే పరాకు అంటారు ...లేక పోతే వాయిదా .
అలాగే చాలా కీర్తన లలో బ్రహ్మ నిన్ను కొలువగా,నీ పాదం పూజించగా అని వాగ్గేయకారులు రచించారు..  ఏమి మిగతా దేవతలు లేరా...అక్కడే ఒక రహస్యం మనం గమనించాలి...
బ్రహ్మ విష్ణు కుమారుడు...అనేదాని ఆధారంగా మనం కొంత చర్చ చేద్దాం...
బ్రహ్మ అంటే చతుర్ముఖుడేనా...బ్రహ్మం అనగా అంతటా నిండి వున్న శక్తి...అణువు నుంచి బ్రహ్మాండం వరకూ వున్న అనేకానేక జీవ రాశులు స్థావర జంగమాది క్రిమి కీటకాలు, తమ వునికిని వ్యక్త పరిచేవి, వ్యక్త పరచనవి, వీటి అన్నీంటా దాగి వున్న చైతన్య శక్తే బ్రహ్మం.
మరి విష్ణువు అనగా సర్వ వ్యాపకుడు అనే వరకు క్లుప్తంగా తీసుకుందాం.
మరి బ్రహ్మ ఉద్భవ స్థానం. విష్ణువు యొక్క నాభి...సర్వ వ్యాపకుడు అయిన
విష్ణువు కేంద్ర స్థానం నుంచి ఉద్భవించిన శక్తి అని...
తరువాత పాదం కొద్దిగా జాగ్రత్తగా గమనిస్తే...
నీ చరితము పొగడలేని నా చింత తీర్చి వరములీచ్చి వేగమే...
నాయినా ! శ్రీరామ...నేను నీ ఘనమైన కీర్తిని పోగడలేను...మరలా చింత అన్న పదం... చింత అంటే మనకున్న సమస్య నిద్రలో కూడా విడవక వేధించటం. మన మాట, ఆలోచన సవ్యంగా సక్రమముగా కాని కార్యం పైన లగ్నం చేసి బాధ పడటమే చింత.
నాయనా శ్రీరామ నీ కరుణ కృప వలన నీవు త్వరగా ఇచ్చే వరం తోనే నా చింత తీరగలదు.
తరువాత వున్న స్వరాలు మొత్తం ఖమాస్ రాగ ఆరోహణ అవరోహణ రాగాలాపన...
తదనంతరం...
రెండోవ చరణం....
సీతాపతీ నాపై నీకభిమానము లేదా
సీతాపతే నాపై నీకభిమానము లేదా
వాతాత్మజార్చిత పాద నా మొరలను వినరాదా
భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా
భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా
నా పాతకమెల్ల పొగొట్టి గట్టిగ నా చేయి పట్టి విడువక....
ఒక్కసారి పై చరణము మరలా మరలా చదవండి...
కీర్తన కారులు ఈ చరణ ప్రారంభాన్నీ సీతాపతే అన్నీ పదంతో ప్రారంభించారు....
సీతా రాములు దంపతులు అన్నది జగద్విదితం...సీత సాధ్వి శిరోమణి, సౌశీల్యం, అనేకానేక సుగుణ రాశి...అంతటి జగన్మాత కూడా రాముని వరించినది అంటే రామునిలో మనం చూడవలసినది శివధనుర్భంగ వీరత్వమే కాదు, ఆయన లోని రామోవిగ్రహన్ ధర్మః అన్న లక్షణాలు కలవని...
మరి మనం రాముని పొందవలనంటే అంతటి లక్షణాలు మనం అలవర్చుకోవాలి....
సీతా రామ చంద్ర! నా పైన అభిమానం చూపు.....
నీ పాదములు సదా పూజించు ఆంజనేయుడు గా నా మొర వినవా....
తరువాత చరణము ఇంకనూ గమ్మత్తు....
"భాసురముగా కరిరాజును బ్రోచిన వాసు దేవుడవు నీవు కదా
నా పాతకమెల్ల పోగొట్టి గట్టిగా నా చేయి విడువక....
ఈ రెండు పాదములలో శ్రీరామ నామ మహిమ మొత్తం పూర్తిగాను... భాగవతం లో గజేంద్ర మోక్షం ఘట్టం మనకు అవగాహన కి వస్తుంది...
అసలు ఈనాటి కాలం లో భాసురముగా
అన్న పదానికి అర్థం అవగాహన లేదు...
కొంత తెలియ చేయి ప్రయత్నం...
సంస్కృతం నందు భ అన్న అక్షరానికి అర్ధం...వెలుగు, ఆకాశం ...
ఆకాశం అనగా అనంతమైన వెలుగు, అనంతమైన ప్రయాణం, స్వర్గం, భగవంతుని ఆవాసం...ఇలా అనేకానేకాలుగా మనం భావన చేయాలి...
భాసురం అనగా దివ్యమైన, ప్రకాశవంతం అని కూడా అర్ధాలున్నాయి.
మరి ఇంకో పదం వాసుదేవుడు
అన్న పదం విష్ణువు యొక్క సహస్ర నామాలలో ఒకటి గా భావిస్తారు. ఈ వాసుదేవ అన్న పదం విష్ణు సహస్రనామ లలో 3 సార్లు పునరుక్తి....కాని ఆది శంకరుల వారి భాష్యం లో 3 వేరు వేరు అర్ధాలు తెలిపినారు.
సర్వ జగత్తును  వసనం , ఆవాసం, ఆచ్ఛాదన చేసిన పరమస్వరూపం....
ఈ సమయంలో మనకు కీర్తన కారుడు... కరిరాజు గురించి తెలుపుతున్నారు....
నిజంగా భాగవతం లో గజేంద్ర మోక్షము ఒక అత్యద్భుతమైన ఘట్టం...ఈ ఘట్టం గురించి మనం తెలుసుకోవలసిన ది..
గజేంద్రుడు అనగా వేరు ఎవరో కాదు...మీరు , నేను , ప్రతి ఒక్కరూ ప్రతిఫలిస్తారు...మనిషిలో అహం అధికాధికంగా ఏనుగు పరిమాణంలో వుంటే...అతని ప్రవర్తన ఏ విధంగా వుంటుంది....దాని ప్రభావం వలన
అతను కాలమహిమ వలన మడుగులో చిక్కి...మొసలి వంటి కష్టాలు కి చిక్కితే....ఎంత పోరాటం సలిపిననూ....నిరుపయోగంగా..నిష్ఫలం...మరి మనలోని అహం తుడచివేసి... భగవంతుని పాదపద్మములకు..లావోక్కింతయి.. ధైర్యం విలోలంబ అయ్యే...ఠావుల్ తప్పే గుండేల్.....కానరావే వరదా భధ్రాత్మకా...అని శరణు వేడితే..అప్పుడు... భగవంతుడు..అల వైకుంఠ పురిలో...వున్న వాడైననూ...సిరికిం చెప్పడు శంఖుచక్ర యుగళం సందోయడు...అన్నరీతిలో వేగంగావచ్చి అనుగ్రహం...దానినే భాసురముగా కరిరాజును బ్రోచిన...అని మనకు తెలిపినారు...

తరువాత పాదం గమనించండి...
నా పాతకమెల్ల పోగొట్టి గట్టిగా నా చేయి పట్టి విడువక...
మానవుడు కర్మ బద్ధ జీవి కదా..ఈ కర్మల వలన లభించు పాప పుణ్యాలు...జన్మపరంపర వరకు వుంటాయి...వాటినే మనం ప్రారబ్ద కర్మలు అంటాం కదా...మరి పూర్వ జన్మల యందు తెలిసి తెలియక చేసిన పాప కర్మలు జన్మపరంపర ను వెంటాడి...అధోగతి పాలు అవటమే...పాతకం...కనుక భగవత్ సాక్షాత్కారం, భగవన్నామ స్మరణ అనే చేయి పట్టుకుని విడువక వుంటే పాతకం నిర్మూలనం....
కనుక శ్రీరామ నామం సదా సర్వదా పవిత్రం....మానవ జన్మ ఉద్ధరణకు బ్రోవు నామం శ్రీరామ నామం...
ఈ వ్యాసం పై మీ అభిప్రాయం నిర్మొహమాటంగా తెలిపిన....సవరణ వున్నా సవరించు కుంటాను...
సకలం సర్వం శ్రీరామ జయం...
ఆలపాటి రమేష్ బాబు....
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో
విజయవాడ...
94401 72262
సూచన...
నా వ్యాస పరంపర కావలెను అన్న వారు నాకు తెలిపిన...మరికొన్ని పంప గలను...







24, జులై 2022, ఆదివారం

అదివో చూడరో అందరూ మొక్కరో .. అన్నమాచార్య కీర్తన .. విశ్లేషణ.

 

అదివో చూడరో అందరు మొక్కరో
గుదిగొను బ్రహ్మము కోనేటిదరిని

రవిమండలమున రంజిల్లు తేజము
దివి చంద్రునిలోని తేజము
భువిననలంబున బొడమిన తేజము
వివిధంబులైన విశ్వతేజము

క్షీరంబుధిలో చెలగు సాకారము
సారె వైకుంఠపు సాకారము
యీరీతి యోగీంద్రులెంచు సాకారము
సారెకు జగముల సాకారము

పొలసినయాగంబులలో ఫలమును
పలుతపములలో ఫలమును
తలచిన తలపుల దానఫలంబును
బలిమి శ్రీవేంకటపతియే ఫలము
************************
ఈ కీర్తన పదకవితా పితామహుడు అయిన తాళ్ళపాక అన్నమాచార్యులు వారిది.
ఈ కీర్తన తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్ట్ లోనిది.దీని వరుస నెంబరు 498. వాల్యుం నంబరు2,
అన్నమయ్య రాగి రేకు నెంబరు 197.
రాగం పాడి.
ఈ రాగం పాడి మేళకర్త రాగం అయినా మాయామాళవగౌళ 15వ జన్యురాగం.
ఈ కీర్తన వినవలసినది గాయని
శ్రీమతి శోభారాజ్ గారి గళంలోనే...ఈ కీర్తన ఆలాపన తదనంతరం పాడి రాగంలో ఈ కీర్తన పాడిన విధానం మీలో అంతర్గతంగా వున్న అధ్యాత్మిక తృష్ణని ఒక్క సారి మేలుకోలుపుతుంది...
చాలామంది అదివో అల్లదివో మరియు అదిగో చూడరో రెండూ ఒక్కటే అనే భావనలో వుంటారు‌.
కాని ఇవి రెండునూ వేరు వేరు...
ప్రారంభం చరణాలలో సమరూపకత్వం వున్ననూ...ఇవి రెండునూ శ్రీ వేంకటేశ్వరుని దివ్యత్వాన్ని వేరు వేరు మార్గాల్లో స్తుతిస్తాయి...
ప్రస్తుతం నేను వివరణ ఇవ్వబోయే  అదిగో చూడరో కీర్తన శ్రీవేంకటేశ్వరుని విరాట్ రూపం వర్ణన.
సహజంగా మనవారికి భాగవతంలోని పోతన గారి ఇంతింతై వటుడింతై పద్యం గుర్తుకు వస్తుంది..కాని అన్నమయ్య గారు ఇదే వర్ణనని  రాగం, తాళంతో మంచి భావంతో కీర్తన పద్ధతిలో తెలియచేశారు...
ఇక కీర్తన విషయానికి వస్తే నాలుగు భాగాలుగా వున్నది...
పల్లవి ప్రకటన గాను ,
తదనంతర మూడు చరణాలు
వివరణ ,నిరూపణ మరియి ఫలితంగా భావించాలి...
మొదటి భాగమైన ప్రకటన విషయానికి వస్తే ఈ విధంగా
" అదివో చూడరో అందరు మొక్కరో
గుదిగొను బ్రహ్మము కోనేటిదరిని"
మనం కనుగొన్న విషయం సత్యం అయితే కాలాలకు అతీతంగా సర్వకాల సర్వాస్థలయందు పరిక్షలకు నిలువగలది అయితే విశ్వాసంగా రండి చూడండి లేదంటే ఆచరణ చేసి చూడండి మీకు కూడా ఇదే అనుభవం కలుగుతుంది అనే విశ్వాసం ప్రకటిస్తాం.
ఇదే విషయాన్ని శ్రీవేంకటేశ్వరుని పట్ల గల తన అచంచల భక్తి విశ్వాసాలును ప్రకటన రూపకంగా చాటుతున్నాడు.
ఈ పల్లవిలోని మొదటి పాదం అర్ధం అందరికి తెలిసినదే...రెండోవ పాదం లోని "గుదిగొని బ్రహ్మము"
ఈ రెండు పదాలు చిన్నవిగా వున్ననూ మహోన్నత భావం దాగివున్నది.
గుదిగొని అంటే వేరు వేరుగా వున్నా అంశాలను ఒక్కటిగా కూర్పు స్ఫుష్టత నివ్వటం, ఆకారంని సాకారం చేయిటను గుదిగుచ్చుట అంటారు.
పూలని గుదిగుచ్చి దండలా, భావజాలంను గుదిగుచ్చి పుస్తకంలా అనేవి ఉదాహరణ.
మరి ఇక్కడ గుదిగుచ్చినది ఏమిటో..అది బ్రహ్మము...
బ్రహ్మము అంటే చతుర్ముఖ రూపమా...కాదు
బ్రహ్మము సాకారా , నిరాకార స్వరూపము లందు , సకల సర్వాస్థలందు,సకల జీవ, అజీవ ప్రాణికోటి యందు సకల వస్తు సంచారంనందు..పంచభూతములు యందు, అణువు నుంచి విశ్వం వరకూ వ్యాపించి వున్న తత్వం బ్రహ్మము అంటారు.
కంటికి దృశ్యమానంగా వుండక, కాని తన అనుభవాన్ని వ్యక్త పరిచేది బ్రహ్మము...
అలాగే సాకారా రూపంగా దర్శనమిస్తూ..ఆ దృశ్యాన్ని శబ్దం , రూపం, వర్ణనలు లొంగని దానినే బ్రహ్మము..అంటారు...
ఏమిటి పై రెండు వాక్యాలు పరస్పర విరుద్ధంగా వున్ననూ అది నిజం.
ఇది మీకు తెలియ చేయటానికి నేను తెలిపిన అతి సాధారణ వర్ణనలు.
(యోగ సాధకులకు , ధ్యాన సాధకులకు ఈ విషయమై అవగాహన వుంటుంది గమనించండి)
మరి ఇంతటి సాకారం బ్రహ్మము ఎక్కడ వ్యక్తం అంటే కోనేటి దరిన...
కనుక అన్నమయ్య తన భావాన్ని , అనుభవాన్ని తన కీర్తన ద్వారా స్పష్టంగా  ప్రకటన చేయుచున్నాడు...
శ్రీ వేంకటేశ్వరుడు ఆది మధ్యాంత రహిత బ్రహ్మ రూపుడని...
ఆయననూ సేవించమని...
మనకు తెలుపుతున్నారు.
మరి తరువాత భాగం అయిన
మొదటి చరణం అనగా కీర్తన విశ్లేషణ లోని వివరణ భాగం తెలుసుకుందాం.

"రవిమండలమున రంజిల్లు తేజము
దివి చంద్రునిలోని తేజము
భువిననలంబున బొడమిన తేజము
వివిధంబులైన విశ్వతేజము "
ఒక్కసారి మిత్రులు పై నాలుగు పాదములు మరోక్కసారి పరిశీలన చేయండి....విశ్వం గురించి పూర్తిగా...శ్రీ వేంకటేశ్వరుని విరాట్ రూపం వర్ణన మనకు పరిచయం...
"రవి మండలమున రంజిల్లు తేజము"
మన బాల్యం లో సోషల్ పాఠాలు చదువుకున్నాం. సౌరకుటుంబం అంటే... సూర్యుడు మరియు  మిగిలిన అన్నీ గ్రహములు కలిపి సౌరకుటుంబం అన్నారు.
సూర్యుడు కేంద్రంగా వుండి మిగిలిన గ్రహములు అన్నీయునూ సూర్యుని చుట్టూ తిరుగుతవి కాబట్టి రవిమండలము అన్నాడు.
అనగా సూర్యుడు తేజా శక్తి , గ్రహములు చలన శక్తి మధ్య వున్న ఆకర్షణ శక్తి వలన సౌరమండలం ఆవిధంగా నిలిపి వుంచింది శ్రీవేంకటేశ్వరుని అని తెలుపుతున్నారు.
(మరి ఈ సౌర కుటుంబం గురించి అన్నమయ్య గారు కోపర్నికస్ సిద్ధాంతాలు చదువుకోలేదు అంతకన్నా ప్రాచీనుడైన మన ఆర్యభట్టు లు గారు, భాస్కరచార్యులు తెలుసు)
తరువాత చరణం గురించి...
"దివి చంద్రునిలోని తేజం"
భూమి , దాని ఉపగ్రహం అయిన చంద్రుడు మాత్రమే మనకు సాకార అనుభవం...వీటి చలన శీలత...వీటి వలన ఏర్పడే కాలం, తిధి, ఋతు మొదలగు అన్నీయునూ శ్రీవేంకటేశ్వరునిదే అని మనకు ఎరుక పరుస్తున్నారు.
ఇక మూడవ పాదము
"భువిననలంబున బొడమిన తేజం"
ఈ పాదం గురించి విస్తృతంగా వివరించవలసిననూ మీకు క్లుప్తంగా పరిచయం చేస్తాను.
భువి అనగా భూమి అని విదితమే.
అనలము అంటే అగ్నీ... ఒక శక్తి...
భూమి , భూకేంద్రకంగా వున్న దాని గురుత్వాకర్షణ శక్తి .దీని వలన చలన గ్రహము అయిననూ సర్వమూ స్థిరముగా వుండుట.
దీనినే అగ్నితత్వంగా భువిననలంబున అని వర్ణన...
మరి అన్ని సార్లు సాకారమవుతుందా అంటే అందుకే బొడమిన తేజం అన్నారు.
ప్రకృతి యొక్క అనంతశక్తి పంచభూతాలు గా, మహసముద్రాలుగా, బడబానలం,
పిడుగుపాట్లు, వర్షాలు ఇవి అన్నీ అగ్నీ రూపక తేజాలు....ఇవి ఆయా సమయాల్లో మాత్రమే తమ లో దాగిన అనంత శక్తి ప్రదర్శన...
మనం ప్రమాదం, విపత్కరం అని భావించిననూ శ్రీవేంకటేశ్వరుని విరాట్ రూపం యొక్క భాగంగా గ్రహించాలి.
మరి నాలుగవ పాదం
"వివిధంబులైన విశ్వం తేజం"
పైన మూడు పాదాల్లో ఒక్క కుటుంబమే కాని ఈ నాలుగొవ పాదములో ఈ విరాట్ పురుషుని విశ్వశక్తి లో ఇటువంటి సౌర కుటుంబం అనంతం....
చూశారా అన్నమయ్య ఎంత అలవోకగా నాలుగు పాదములలో ఒక చరణములో  విశ్వరూపుని విరాట్ తత్వం మనకు తెలియ చేశారు.
ఇంతవరకూ మనము  అన్నమయ్య కీర్తనలోని ప్రకటన , వివరణ గురించి తెలుసుకున్నాము... తదనంతర భాగం అయిన అధ్యాత్మీక స్వరూప సాకార నిరూపణ గురించి...
రెండోవ చరణం...మూడవ భాగం అయిన సాకార నిరూపణకు
"క్షీరంబుధిలో చెలగు సాకారము
సారె వైకుంఠపు సాకారము ఈరీతి యోగీంద్రులెంచు సాకారము
సారెకు జగముల సాకారము"
మరి ఈ విరాట్ పురుషుడు ఎవరు అనేది మనకు స్పష్టంగా తెలియ చేయిచున్నాడు...
పాలకడలిపై శేషశయనంగా విరాజమానము అగు వైకుంఠ వాసుడగు శ్రీమన్నారాయణుడు ఈవిరాట్ పురుషుడు.
ఈయన సమస్త జగదాధిపతిగా , యోగింద్రుల మనః కర్తగా , యాగాదులు తోపాటు తపః ఫలితమున వారికి లభించు సాకారం దర్శనం...సకల జగత్తు తహ తహలాడు సాకార దర్శనం అయిన వైకుంఠ వాసుని దివ్యదర్శనం.
మరి ఈ చరణంలో నిరూపణ అంటే విరాట్ పురుషుడే ... వైకుంఠ వాసుడు...ఆయనే..శ్రీ వేంకటేశ్వర స్వామి వారు...ఈయనే కోనేటి దరిన వున్న గోవిందుడు.
ఇప్పుడు మనం చివరి భాగం అయిన ఫలితం గురించి తెలుసుకుందాం.
"పొలసినయాగంబులలో ఫలమును
పలుతపములలో ఫలమును
తలచిన తలపుల దానఫలంబును
బలిమి శ్రీవేంకటపతియే ఫలము"
అనేక యాగ ,తపః , జపం, హోమం, దాన ఫలితం వలన సిద్ధించే సాకార బ్రహ్మము యొక్క దర్శనం ..మీరు నామః స్మరణతో..
మనః వాచా కర్మలతో శ్రీవేంకటేశ్వర డే నాకు రక్ష అని నమ్మి...
అన్యధా పాదశరణం ...రక్ష రక్ష శ్రీ వేంకటేశ్వర...మీరే నా పెన్నిధి భావించి ఆ స్వామిని ఆశ్రయించితే...నీకు సకల విధ ఫలితము అనుగ్రహించి...మీకు కైవల్యం ప్రసాదించు తారని...ఈ కీర్తన భావం....
చూశారా కీర్తన చిన్నదిగా వున్ననూ భావన ఎంత సమగ్రముగా వున్నదో...
కనుక మనమందరం సదా వేంకటేశం స్మరామి స్మరామి...
గోవింద గోవింద....
ఈ వ్యాసంకు కర్త, కర్మ , క్రియ అంతా ఆ గోవిందుడే...ఇచ్చిన శక్తి...ఆయన పాదపద్మముల సాక్షిగా ఇది ఆయన మాట...
స్వత్కృష గా భావించకుండా..నా అనుభవం ఇది...
గత 3 రోజులుగా వివిధ సందర్భాలలో శోభారాజ్ గారి ఆలాపన ..కీర్తన పల్లవి..ఒకటికి రెండుసార్లు గుర్తుకు రావటం...వినటం జరిగింది...అది మెలుకువ తో వున్నప్పుడే కాక నిద్రలో కూడా కలలో ఈ కీర్తన ఆలాపన కలలో కూడా కనపడింది... స్వామి వారి చరణాలు ఫోటో నాకు దర్శనం...దానితో స్వామి వారు...ఈ నాలుగు మాటలు వ్రాయమనే ఆనతిగా భావించి...ఈ వివరణ సిద్ధం చేశాను.
నేను సహజంగా ఒక్కసారే వ్రాస్తాను...వ్రాయటం... దిద్దుబాటు..లాంటివి వుండదు..
స్వామి పాదరక్షగా భావిస్తూ...ఆయన నా మనః ఫలకం పై ఉదయించే అక్షరాలు టైపు చేయటం ...
కనుక మీ అభినందనలు అన్నీ...
ఆ విరాట్ పురుషుని పాద పద్మములకే....
ఈ వ్యాసం వ్రాయగలిగాను అంటే...
మా నాన్నగారు కీ.శే. శ్రీ ఆలపాటి పాండురంగారావు గారు నాకు ప్రసాదించిన అక్షర బిక్ష...
వారి పాద పద్మములు నేను సదా శరణు.
గోవింద..గోవింద..గోవింద...
ఆలపాటి రమేష్ బాబు
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో...
విజయవాడ.
94401 72262.





14, జులై 2021, బుధవారం

ఆముక్తమూల్యద

ఆముక్తమాల్యద
అముక్తమాల్యద అనే తెలుగు పద్య కావ్యం రచించిన వారు సాహితి సమరాంగణ సార్వభౌముడు , ఆంధ్రభోజుడు అయిన శ్రీకృష్ణదేవరాయలు వారు.
శ్రీకృష్ణదేవరాయలు జన్మతః తుళు ప్రాంతంలో కన్నడిగుడైననూ మన తెలుగు వారు ఆయననూ స్వంతం చేసుకున్నంతగా మరి,  ఏ ఇతర రాజుని చేసుకోలేదు...ఆయన జీవితం జీవనం అనేకానేక కాల్పనిక మహమహిమాన్విత ఘట్టాలతో కూడి వుంటుంది.
ఆయన రాజ్యవిస్తరణ , పరిపాలన దక్షత , కార్యశూరత్వ కారణంగా విజయనగరసామాజ్యం అరేబియా మహసముద్ర తీరం నుంచి అనగా మంగళూరు , గోవా,  కర్నాటక ,తమిళనాడులో చాలాభాగం నుంచి ఉత్తరాది న కటకం వరకు అనగా నేటి ఒడియాలోని కటక్ వరకూ విస్తరించినది. ఇది ఓక పార్శ్వం అయితే వీరిలో ఇంకొక కోణం వీరు బహుభాషా కోవిదులు , సాహితి అభిమానులు. అందువల్లనే వీరి నిండు పేరలోగం (ఇది అచ్చ తెలుగు పదం దీని అర్ధం సకల విభాగాలతో నిండి వున్న రాజసభ) ని భువనవిజయం అని పిలిచేవారు...ఈ భువనవిజయంలో సాహిత్యం పాలు ఎక్కువగా వుండేది కారణం వీరి సభలో వున్న అష్టదిగ్గజ కవులను వీరు ఆదరించారు. అల్లసాని పెద్దన , నందితిమ్మన , మాదయగారి మల్లన , తెనాలి రామక్రిష్ణుడు , ధూర్జటి , రామరాజభూషణుడు , అయ్యలరాజు రామభద్రుడు ఇలా అనేక మంది కవులను వీరి కొలువులో వున్నారు. వీరే కాదు అపర శంకరులని పిలిచే అప్పయ్య దీక్షితులు కూడాను.
శ్రీకృష్ణదేవరాయలు వైష్ణవులు .అయననూ వీరు నంది తిమ్మన , ధూర్జటి లాంటి శైవులను ఆదరించాడు. తెనాలి రామక్రిష్ణుడు వ్రాసిన ఉద్భటరాద్యుని చరిత్ర అనే కావ్యంని కూడా ఆదరించారు. ఇది శైవ కావ్యం. అలాగే వీరు హంపిలోని విరుపాక్షుని కూడా కొలచారు. కాని వీరి ఆరాధ్య దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారు.
ఇక వీరు తెలుగులో వ్రాసిన ప్రభంద కావ్యం ఆముక్తమాల్యద అనే గ్రంధం.
ప్రబంధం అంటే చిక్కటి వర్ణనలతో కూడినది అని అర్ధం. అలాగే ప్రబంధానికి 18 రకాల లక్షణాలు వుండాలి. ఇన్ని వున్నవి కాబట్టే ఇది ప్రబంధం కాగలిగినది.
శ్రీకృష్ణదేవరాయలు వైష్ణవ భక్తుడు కనుక విష్ణు భక్తుల కధలు వ్రాసినాడు .
శ్రీకృష్ణదేవరాయలు గజపతులతో యుద్ధ యాత్రలో భాగంగా విజయవాడ సమిపంలో క్రిష్ణా నదితీరములో గల శ్రీకాకుళ ఆంధ్ర మహవిష్ణువుని దర్శించిన సమయంలో ఆయన రాయలవారికి స్వష్నములో తన కధ వ్రాయమని ఆదేశించారని వాడుక. ఈ దేవాలయం నేటికిని ప్రతివారు దర్శించవచ్చు.
ఆముక్తమూల్యద అనేది గోదాదేవికధ. దీనినే విష్ణుచిత్తీయం గా కూడా వాడుక.
ఆముక్తమాల్యద నాయక గోదాదేవి.
ఆముక్తమూల్యద అంటే ధరించి విడిచిన పూలమాలను సమర్పణ చేయునది అని అర్ధం. అందుకనే గోదాదేవి ని తమిళంలో చూడి కొడుత్త నాచ్చియార్ అంటారు.
ఇక కధ ఏమిటో క్లుప్తంగా చూద్దాం.
విష్ణుచిత్తుడు శ్రీవల్లిపుత్తూరులోని మన్నారు స్వామి ఆర్చకుడు. పన్నిద్దరు ఆళ్వార్ లలో ఓకడు. ఆళ్వార్ లు వైష్ణవ భక్తాగ్రేసులు. వీరికి తులసి వనంలో ఓక బాలిక లభిస్తుంది ఆమేకు గోదాదేవి అనేపేరుతో పెంచుకుంటాడు. ఆమే యుక్తవయస్సుకు వస్తూంది , గోదాదేవి స్వామి వారికోసం సిద్ధం చేసిన పూలమాలలను తాను ధరించి చూసి మురిసిపోయి మరలా అవే మాలలను స్వామికి సమర్పణ చేసేది.
గోదాదేవి భూదేవి అంశ. ఈమే గత జన్మలో తాను కృష్ణుని పట్ట మహిషిలలో ఓకరుగా స్పురణకి వస్తుంది. దానితో విష్ణువు నందు విపరీతమైన అనురాగ పూరితంగా వుంటుంది. ఆమే ఆప్రాంతంనకు సమీపంలోని శ్రీరంగంలోని శ్రీరంగేశుని తన భర్తగా భావించి శ్రీరంగం తరలి వెళ్ళి స్వామి వారి ఆనుగ్రహ పాత్రురాలై స్వామి వారిలో ఐక్యం అవుతుంది. గోదా శ్రీరంగేశుల కళ్యాణం వరకూ ఈ ఆముక్తమూల్యద కావ్యం వుంటుంది.
రాయలు వారు ఎంతో నేర్పుతో ఈ కావ్యంనకు "ఆముక్తమూల్యద" అనే పేరు పెట్టినారు . నాయక లక్షణం , కావ్య స్వభావం దీనిలోనే అన్యాపదేశంగా చెప్పారు.
ముక్తం అనగా స్వీకరణ , ఆముక్తం అనగా తిరిగి ఇచ్చుట , మాల్యద అనగా పూలమాల ధరించుట. కనుక ధరించిన పూల మాల తిరిగి ఇచ్చుట.
గోదా దేవి భూదేవి అంశ అని ఉదహరించారు అని మీకు ఇంతకు ముందే తెలిపినాను. భూమికి గల విశేష లక్షణాలు సహనశీలత తో పాటు తనలో నిక్షిప్తం చేసిన ప్రతి విత్తనం నకు పలు రెట్లు ఫలసాయ రూపంలో తిరిగి ఇస్తుంది.
శ్రీమన్నారాయుణ అంశలో భాగమైన సూర్యుడు స్థిరముగా తన ఉష్ణ ప్రభావం చేత భూమిపై అనంతమైన వెలుగు , వేడిని ప్రసాదించు తున్నాడు. భూమి  స్ధిరంగా గల సూర్యుని చుట్టు గల భ్రమణ పరిభ్రమణాలతో పాటు సంవత్సరం నకు రెండుసార్లు తన భ్రమణ దిశను మార్పులు అనే విశేషాంశల వలన మనకు ఋతువులు , కాలాలు ఏర్పడి సాధారణ వ్యక్తుల జీవనం జరుగుతున్నాయు. భూమిలో వివిధ రకాల పంటలు పండుతున్నాయు. గోదాదేవి భూదేవి అంశ గనుక వనంలో ప్రకృతి సిద్ధంగా తనకు లభించిన పూలను పూలమాలలను తాను ధరించి మరలా స్వామి కి ఇవ్వటంలోని అంతరార్ధం తనకు లభించిన ప్రేమ భావనను స్వీకరించుట. వధువు మెడపై పూలమాల వేయుట ద్వారా వరుడు వధూ స్వీకారం , వధువు పూలమాలను స్వీకరించి ధరించుతూ వరునకు పూలమాల వేయుట ద్వారా వర స్వీకారం జరుగుతుంది తద్వారా వారు జీవన గమనం సాగిస్తారు. కాని గోదాదేవి భూ అంశ కనుక శ్రీమన్నారాయణుని కృపచే లభించిన పూలమాల రూప ప్రేమను స్వీకరించి మరలా తనకు గల భూ అంశ అయిన విశేషాంశ అయిన పలురెట్లు గుణింపు చెసి ఇచ్చె గుణమైన దాని వలన ఆప్రేమను పలురెట్లుగా స్వామి కి తిరిగి సమర్పించినదని దీని భావం. అందువల్లనే గోదాదేవి అచంచలమైన భక్తి ప్రేమలతో శ్రీరంగేశుని భర్తగా పొందినది.
సూర్యుని వలన ఋతువులు ఏర్పడుతాయని తమకు తెలిసినదే కదా...
గోదాదేవి భూ అంశ , శ్రీమన్నారాయణుడు సూర్య అంశ వీరి ఇరువురి మధ్యగల ప్రేమోత్పన్నం  ఋతువులు.. ఈ ఋతువర్ణనం ఆముక్తమూల్యద కావ్యంలో బహు విశేషంగా వుంటుంది.
అసలే రాయలు వారు అల్లసాని వారి కృతి అయిన మనుచరిత్ర కు కృతిపతి...మరి ఆయన ప్రభావం వీరిపై లేకుండా వుంటుందా...అయునా వీరి శైలి వీరిదే....
ఆముక్తమూల్యద ఏడు ఆశ్వాసములు గల కావ్యం.
అది ఈ విధముగా వుంటుంది.
గ్రంథస్త విషయ క్రమము
1 ఆశ్వాసము (ఆ) - విలుబుత్తూరు వర్ణనము, భాగవతులు, విష్ణుచిత్తుడు గురుంచి వర్ణన.
2 ఆ. -  మధురాపుర వర్ణనము, మత్స్యధ్వజుడు గురుంచి, గ్రీష్మఋతు వర్ణన.
3 ఆ. - విష్ణుచిత్తవాదము, ఖాండిక్యకేశిధ్వజసంవాదము.
4 ఆ. -  విష్ణుచిత్తుని విజయము, విష్ణుచిత్తునకు భగవంతుడు సాక్షాత్కరించుట, విష్ణుచిత్తుని స్వపుర ప్రవేశము, యమునాచార్య చరిత్రము, వర్షాకాలము, శరదృతువర్ణనము, యామున ప్రభువు, యామున ప్రభురాజనీతి.

5 ఆ. - గోదాదేవి, వసంతఋతువర్ణనము.

6 ఆ. - మాలదాసరి.
7 ఆ. - బ్రహ్మరాక్షస వృత్తాంతము, గోదాదేవి శ్రీరంగమున రంగనాధుని సేవించుట, గోదాదేవీ రంగనాధుల వివాహము.
గోదా పరిణయ కధతో పాటు ఉప కధలుగా ఖాండిఖ్య కేశి ధ్వజుని కధ , మాల దాసరి కధ. ఇందు మాల దాసరి కధ ప్రశంశ పూర్వకమైన కధ. నిర్మల భక్తికి సోదాహరణ. ఈ మాల దాసరి కధ విషయమై ఈనాటికి చర్చలు ఆగలేదంటే అతిశయోక్తి కాదు.
వైష్ణవుడైన రాయలు వారు తనకావ్యమైన ఆముక్తమూల్యద ను విష్ణుభక్తుల కధగా వర్ణించటానికే ఇష్టపడ్డారు. అందుకే చూడండి గోదాదేవి తండ్రిపేరు విష్ణుచిత్తుడు. విష్ణువును మనస్సు నందు నిలిపినవాడు అని దీని అర్ధం. వీరినే తమిళంలో తొండరప్పొడి ఆళ్వార్ అని పిలుస్తారు.
అలాగే ఈ కావ్యంలోని ఖాండిఖ్య కేశిధ్వజుల గురించి కొంత పరిశీలన చేద్దాం.

పూర్వం ఇద్దరు రాజులు యుద్ధానికి దిగారు. ఓడిన రాజు తన రాజ్యాన్ని వీడి, అడవుల్లోకి పారిపోయాడు. అక్కడే ఆధ్యాత్మిక చింతనతో కాలం గడుపుతున్నాడు.
గెలిచిన రాజు ఆ ఉత్సాహంతో యజ్ఞం తలపెట్టాడు. అనుకోకుండా, అక్కడ యాగధేనువు మరణించింది. అది అశుభ సూచన. యజ్ఞాన్ని ఎలా పూర్తిచేయాలో తెలియక ఆ రాజు తికమక పడ్డాడు.
నగర పురోహితుల్ని సంప్రతిస్తే- ఆ ధర్మసూక్ష్మం తెలిసినవాడు ఓడిపోయిన రాజేనని తేలింది. ధర్మసంకటం నుంచి గట్టెక్కించగలవాడు ఆయనేనని నిశ్చయమైంది.

గెలిచిన రాజు ఏమాత్రం సందేహించకుండా ఓడిన రాజు వద్దకు వెళ్లి, యజ్ఞాన్ని పరిపూర్తి చేయాలని అర్థించాడు. ఆయనా ఏ శషభిషలకూ తావు లేకుండా ధర్మనిర్ణయం కోసం ముందుకొచ్చాడు. శత్రువుకు సహకరించాడు.
ఆ ఇద్దరు రాజులూ ఆర్షధర్మ నిర్వహణ విషయంలో అహంకారాల్ని త్యజించారు.
వారి కథే- శ్రీకృష్ణదేవరాయల ‘ఆముక్తమాల్యద’లోని ‘ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం’ సారాంశం. సమాజం అనే ధర్మసౌధం పటిష్ఠంగా నిలిచేందుకు భారతీయ ప్రాచీన సాహిత్యం ఎంతగా తోడ్పడిందో
ఈ ఉదాహరణ చూస్తే ఇట్టే అర్థమవుతుంది.
ఈ కథలో ఓడిన రాజు ఖాండిక్యుడు; గెలిచినవాడు కేశిధ్వజుడు.
కథ చివర గొప్ప మలుపు ఒకటుంది.

తన యజ్ఞ సంపూర్తికి సహకరించిన ఖాండిక్యుడికి గురుదక్షిణగా ఏది కావాలన్నా ఇస్తానని కేశిధ్వజుడు ప్రకటిస్తాడు. అది సంప్రదాయం. ఓడిన రాజుకు ఓర్మి ఎంత ప్రధానమో- గెలిచిన రాజుకు సంయమనం, ధర్మ సంప్రదాయ పరిరక్షణ అంతే అవసరం.
ఈ అవకాశాన్ని చేజిక్కించుకున్న ఖాండిక్యుడు తాను కోల్పోయిన రాజ్యం తిరిగి గురుదక్షిణగా కావాలన్నా ఇచ్చేయడానికి కేశిధ్వజుడు సిద్ధపడతాడు.
ఇక్కడే ఓ చిత్రం చోటుచేసుకుంటుంది.
రాజ్యసంపద అయాచితంగా వచ్చిపడుతున్నా ఖాండిక్యుడు కాదంటాడు! తనకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించాలని, అదే కేశిధ్వజుడి నుంచి తాను కోరుకునే గురుదక్షిణ అని ప్రకటిస్తాడు.

ఖాండిక్యుడి నిర్ణయం కేశిధ్వజుణ్ని విస్మయానికి గురిచేస్తుంది.
ఆయన ఆలోచన ఏమిటో తెలుసుకోవాలని అనిపిస్తుంది. అప్పుడు ఖాండిక్యుడు అంటాడు- ‘రాజ్యభోగాలు కేవలం భౌతిక సంపదలు. వాటిని కష్టంతో, శారీరక శ్రమతో సాధించుకోవాలి. అంతేగాని, అవి అయాచితంగా లభించాలని కోరుకోకూడదు. కష్టపడి సాధిస్తేనే, వాటి విలువ తెలుస్తుంది. నా కంటే బలవంతుడి చేతిలో ఓడిపోయాను. అందులో సిగ్గు పడాల్సింది ఏముంటుంది? తిరిగి పుంజుకొని ధర్మమార్గంలో, క్షాత్రంతో నా రాజ్యాన్ని నేను తిరిగి చేజిక్కించుకోవాలి.
అది ఒప్పుతుంది గాని, దొడ్డిదారిన పొందితే పాపమవుతుంది’ అని బదులిస్తాడు ఖాండిక్యుడు!

ఇలాంటి కథల్ని పిల్లలకు పాఠ్యాంశాలుగా నిర్ణయిస్తే, వారి బాల్యాన్ని అవి ధార్మిక పథంలోకి నడిపిస్తాయి. వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయి. ఉచితాల కోసం తాపత్రయపడకుండా ఆపుతాయి. ఉచితానుచిత జ్ఞానాన్ని వారికి అలవరుస్తాయి.

ఆముక్తమాల్యదలోని ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం- ఆ కావ్యానికి గుండెకాయ వంటిదని ప్రశస్తి రావడానికి ముఖ్య కారణాలేమిటి? ఆ కథలోని ధార్మిక నేపథ్యం, ప్రబోధ గుణం.
గెలుపు ఓటముల విషయంలో, కర్తవ్య నిర్వహణలో, అయాచిత అవకాశాల తిరస్కరణలో ప్రతిఫలించిన ధర్మస్వరూపమే- భారతీయతకు వన్నెలద్దుతూ వచ్చింది.

లోకంలో ఇలాంటి కథలు ఒళ్లు మరిపించడమే కాదు,
కళ్లు తెరుచుకొనేలా చేస్తాయి. దీనికి మన ప్రాచీన సాహిత్యమే గొప్ప ఆదరువు.
రాయలు వారి కావ్యం పై వ్యాఖ్యలు చేసే స్థాయి కాకపోయినా ఈ నాటి ప్రజలకు, యువతకు కొంత అయునా ఆముక్తమూల్యద గురించి తెలపాలనేది నా ప్రయత్నం.
ఇంతేకాక ఆధ్యాత్మిక కోణంలో గోదాదేవి భూఅంశ గా ఉదహరించారు...అనగా పాంచభౌతిక శరిరాలతో జన్మించిన ప్రతి ఓక్కరు భూ అంశయే గదా...కాని సాధారణ మానవులు విషయ లంపటులై, సాంసారిక , వస్తు వ్యామోహలు దుర్గుణ పీడితులై జనన మరణ చక్రంలోనే ఇమిడి పోతున్నారు...కాని భగవత్ కృప వలన లభించిన ఈ జన్మలో ప్రేమ అనురాగం నమ్మకం అనే పూలదండను సేకరించి , స్వీకరించి , ధరించి వాటి మధురిమను భగవంతునికి అందించే ప్రయత్నం మరలా స్వామికి ధరింపచేయటం...తద్వారా ముక్తి...గోదా కళ్యాణం అంటే సాధారణ వివాహమా కాదే...భగవంతుడు భక్తుడు ఆత్మీయ కలయుక , ముక్తి సంగమమే కళ్యాణం...సాధారణ మనుజుడు సర్వజీవుల పట్ల దయ ప్రేమ తో పాటు ఆ నారాయణుని దర్శించాలనే అంతర్లీన అభిలాష....
నా ప్రయత్నం నచ్చిన తెలుపగలరు.
కృతజ్ఞతతో
మీ
ఆలపాటి రమేష్ బాబు.
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో
విజయవాడ.
9440172262.






30, జూన్ 2021, బుధవారం

మధురాపురి సదన విశేషార్ధములు

మధురాపురి సదన
మృదువదన మధుసూదన…
ఇహ స్వాగతం కృష్ణా… శరణాగతం కృష్ణా

మధురాపురి సదన
మృదువదన మధుసూదన…
ఇహ స్వాగతం కృష్ణా… శరణాగతం కృష్ణా

మధురాపురి సదన
మృదువదన మధుసూదన…
ఇహ స్వాగతం కృష్ణా… శరణాగతం కృష్ణా

మధురాపురి సదన
మృదు వదన మధుసూదన…
ఇహ స్వాగతం కృష్ణా… కృష్ణా… ఆ ఆ

ముష్టికాసూర చాణూర మల్ల
మల్లవిశారథ మధుసూదన…
ముష్టికాసూర చాణూర మల్ల
మల్లవిశారథ మధుసూదన…

ముష్టికాసూర చాణూర మల్ల
మల్లవిశారథ కువలయపీడన…

మర్దన కాళింగ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ దేవ…
మర్దన కాళింగ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ దేవ…

శిష్ట జనపాల సంకల్పకల్ప… కల్పశతకోటి అసమపరాభవ
శిష్ట జనపాల సంకల్పకల్ప… కల్పశతకోటి అసమపరాభవ

ధీర మునిజన విహర మదన సుకుమార దైత్య సంహార దేవా…
ధీర మునిజన విహర మదన సుకుమార దైత్య సంహార దేవా…

మధుర మధురరతి సాహస సాహస
వ్రజ యువతీజనమానసపూజిత…
మధుర మధురరతి సాహస సాహస
వ్రజ యువతీజనమానసపూజిత…

స ద ప గ రి… పగరిసదస
స రి గ ప ద స ద ప గ రి పగరిసదస…

స స రి రి గ గ పద స స
ద ప ప గ రి రి
ప గ రి స ద స…

సరిగ రిగప గపదస ద ప గ రి పగరిసదస…

తత్తిక్ తకజను, తత్తిక్ తకజను
తక్ తకజను తోం…
స ద ప గ రి
ప గ రి స ద స…
తత్తిక్ తకజను, తత్తిక్ తకజను
తక్ తకజను తోం…
స ద ప గ రి
ప గ రి స ద స…

తకతరి కుకుతన కిట తకధీం… ||8||

కృష్ణా… ఆ ఆ ఆ
**************
బహుశా ఈ కీర్తన విన్న ఈనాటి యువతరానికి పవన్ కళ్యాణ్ సినిమా లో పాట గా జ్ఞాపకం వుంటుంది... కాని అది మనసునుంచి చెరిపి...
ఓక్కసారి ఈ క్రింద విశేషాలు చదవండి...
ఈ కీర్తన రచించిన వారు ఊతుకాడు వెంకట సుబ్బయ్యర్. వీరి జీవన కాలం 1700 - 1765 వరకు. వీరు సంస్కృతంలో అసమాన పండితులు....వీరు సంస్కృతంలో , మరాఠి (ఆనాటి ఆప్రాంత రాజ భాష) , మాతృభాష తమిళంలో ఎన్నో కీర్తనలు రచించారు...ప్రస్తుతం వీటిల్లో ఓక 500 కీర్తనలు లభ్యం.
వీరు వీరి గురువు గారి వద్ద పూర్తిగా సంగీతం నేర్చుకున్న తరువాత... నాయన నాకు తెలిసిన సంగీతం అంతా నీకు నేర్పినాను అని తెలుపగా... వీరు తదనంతర గురువు కృష్ణం వందే జగద్గురుం అన్న నానుడితో కృష్ణుని గురువుగా స్వీకరించి అనేక కీర్తనలను కృష్ణుని పై రచన చేశారు.
వీరి కీర్తన " అలై పాయిదే కన్నా ఆనంద మోహన అలై పాయిదే కన్నా" కానడ రాగంలో స్వర పరిచిన ఈ తమిళ కీర్తన జగద్విదితం...ప్రతి తమిళుడు ఈ కీర్తన ను వారి పిల్లల బాల్య వేడుకలలో పాడతారు...
ఇక ప్రస్తుత కీర్తన మోహనరాగంలో సంస్కృతంలోనిది...
ఈ కీ‌ర్తన స్వభావం పల్లవి , అనుపల్లవి (సినిమాలో ఇవ్వలేదు నిడివి పెరుగుతుంది మరియి కొన్ని క్లిష్ట పదాలు మరియి సినిమా స్వభావం నకు సరిపోక) , చరణం , థిల్లాన చివరకూ మరలా పల్లవితో ముగుస్తుంది....
ఇక కీర్తన విశేషానికి వస్తే
ఈ కీర్తన స్వభావం... కష్టంలో సమస్యలలో వున్న వారిని కాపాడటానికి క్రిష్ణుడు ఏ విధంగా వస్తారో వివరణ. కంసుని పాలనలో కష్టాలు పడుతున్న ప్రజలు కృష్ణనికి స్వాగతం పలకటం ఈ కీర్తన లో కనపడుతుంది... మధుర ప్రజలకు గోకులంలో కృష్ణుని లీలా వైభవాలు , పూతన , శకటాసుర , తృణావర్త మొదలగు రాక్షస నిర్మూలన కాళింగ నర్తన , గోవర్ధన ధారణ , గో , గోపాలక , గోపికా జన రక్షణ గురించి తెలుసుకున్న ప్రజలు కృష్ణుని స్వాగత వర్ణన ఈ కీర్తన లో మనం గమనించ వచ్చు.
అసలు ఈ కీర్తన ఎత్తుగడే ఓక గమ్మత్తు...మధురాపురి సదన...ఈ పదం వరకు అర్ధం మధురకు వేంచేస్తున్న క్రిష్ణా నీకు స్వాగతం...అని...కాని ఛాయమాత్రంగా అనాటి ప్రజల దుస్థితి ని ఆ మొదటి పదంలోనే సూచించారు...
మధుర అంటే తేనే...తేనే తీపిదనం , ఔషధగుణాలు కాని ఇదే తేనేలో ఈగ పడితే దానికి విషంగా మారుతుంది.ఇది నాటి ప్రజల స్థితి...కంసుని మధాంధ నిర్భంధ క్రూర పరిపాలన తట్టుకోలేక విలపిస్తున్నవాళ్ళు..మరి గమ్మత్తు చూడండి క్రిష్ణుడు మధురలోనే జననం కాని కొద్ది క్షణాలు కూడా గడవకుండానే వసుదేవుడు యమున ద్వారా గోకులంకి యశోద వద్దకు.. ఇక అక్కడ స్వామి వారి లీలా వైభవం ...ఓహ్  ఆనాటి  గోకులం వారికి ఎన్నో ప్రాకృత జన్మ సౌభాగ్యం... ఆయనతో కలసి జీవించి ఆడి పాడి మమేకం అయుపోయారు...క్రిష్ణుడు ,వారు వేరు కాదు ఏకీకృత స్వరూపం అన్న విధంగా తాదాత్మ్యం చెందినారు...
మరి జన్మతః క్రిష్ణుడు మధుర వాసి...
‌అందులోను దేవకి వసుదేవులు కారాగారంలో...కనుకనే మధుర పునరాగమనం...
‌చూడండి కాల ప్రభావం...భగవంతుడైననా కాల ప్రభావం తప్పించుకోలేక పోయాడు...నిర్ణిత కాల వ్యవధి బయట
గడిపి సమయ పరిపక్వం అయున తరువాత అవతార లక్ష్యం అయిన కంస నిర్మూలన నిమిత్తం పునరాగమనం...
మరి ఆయన మధుర కు వేంచేసే సమయంలో ఎలా వున్నా‌రు..చూడండి
మృదువదన మధుసూదన...
ఎంతటి భారమైన కర్మ నిమిత్తం వస్తున్ననూ ప్రశాంత వదనం తో వున్నారట...మరి తదనంతర పదం మధుసూదన..
మధు , కైటభులు అనే రాక్షసులను సంహరించారు..అది ఈ సమయంలో ప్రస్తావన...కాని మధుర ప్రజలు అన్యాపదేశంగా కంసనిర్మూలన చేయు స్వామి అని వేడుకోవటం.
అసలు కీలకం అంతా ఏత్తుగడ పదం లోనే వున్నది.
మధు ..దీని మీద కొంత స్వేచ్ఛా వివరణ.
సహజంగా మనం మన మిత్రులను మీ జీవనం ఎలా సాగుతోంది అని ప్రశ్నించితే...వారు బాగుంది.. మధురంగా సాగుతుంది ఆని జనాతిక సమాధానం ఇస్తారు. ఇది సాధారణ జనులకు శాంత స్వభావులకు.
మరి దమన గుణమే ప్రాకృతిక జీవనం కలిగిన మానవులకు , రాక్షస స్వభావులకు,అధికారయుతులకు , ఈ మధురం ఉన్మత్తత ,అహంకారం , కండకావరం ఇత్యాది గుణాలు అలవడుతాయి...కారణం వాళ్ళకు ఏది కావాలంటే అది మాట మాత్రం లభిస్తాయి...దానితో ప్రతిది చులకన గా మారిపోతుంది...వీరి పాలనలో వున్న సాధు జనావళి బాధలు పడుతారు.
తేనె ను మనం మధు అని వాడుక.
మరి ఇదే మధుని భల్లూకాలు త్రావి ఉన్మత్తతో ప్రవర్తించుతాయి. ఈ విషయం రామాయణం వాల్మీకి లో చక్కగా వివరుంచుతాడు. మరి మీకు భల్లూకం అంటే అవగాహన వున్నది వాటి తాలూకు ప్రవర్తన పై అవగాహన వున్నది కదా...
ఇక తదనంతర పదాలు పరిశీలించండి కీర్తనలో...కంసుని కన్నా ముందు ఎవరిని ఏదుర్కోవాలో తెలుపుతున్నారు.
ముష్టికాసురుడు , చాణూరుడు.
ముష్టికుడు పిడిగుద్దులతో ప్రత్యర్దిపై దాడి చేసి సంహరించుతాడు . చాణూరుడు భీతిగొలిపే శరీరంతో విపరీతమైన శక్తితో ప్రత్యర్దిపై దాడి...ఓక విధంగా చెప్పాలి అంటే ప్రత్యర్ధిని పిప్పి చేస్తాడు. చమనం అంటే నములుట...కాని వీడు శక్తితో యుక్తితో పిప్పి చేస్తాడు కాబట్టి వీడికి చాణూరుడు అనే పేరు...వీరిద్దరిని క్రిష్ణుడు సంహరించుతాడు.
కువలయపీడన...కువలయం కంసుని భద్రగజం...కాని ఇది మదగజం...దీని
వలన అందరూ ఇబ్బంది ...కంసునకు వినోదం. ఏనుగుకు చిక్కిన ప్రజలను తన తొండంతో గిరగిరా త్రిప్పి నేలకేసి కొట్టి చంపుతుంది .దీనిని కూడా క్రిష్ణుడు ముష్టిఘూతాలతో లొంగదీసు కుంటాడు...
తదుపరి చరణం
మర్దన కాళింగ నర్తన...ఇది భగవస్తుతి...నాయనా క్రిష్ణ! విషం చిమ్మే కాళీయుని మదమణచి గోకులాన్ని రక్షించావు..స్వజనం పైనే విషం చిమ్ముతున్న కంసుని మదమణచవా దేవా..మరి కంసుడు స్వజనం స్వబంధువర్గం...తండ్రిని , సోదరిని బావని
ఖైదు చేశాడు...
తదుపరి చరణం...మకుటాయమాన  చరణం అసలు అద్భుత చరణం...
ఓకసారి పరిశీలించుదాము..
ఈ చరణానికి లోని పదప్రయోగానికి ఊతుకాడు వెంకటకవి గారికి సాష్టాంగ దండ ప్రమాణాలు...
"శిష్టజనపాల సంకల్ప కల్ప కల్ప శతకోటి అసమపరాభవ"
సహజంగా కల్ప అనే శబ్దం మూడు సార్లు పునరుక్తం అవుతుంది...మొదటది సంకల్ప, కల్ప , కల్ప శతకోటి ..
ఈ మూడు శబ్దాలకి వేరు వేరు అర్ధం.. కాని ఓకే శబ్దంతో గుదిగుచ్చాడు...
మొదటి శబ్దమైన  సంకల్ప కి అర్ధం సాధారణమైనదే సంకల్పం అనగా డిటర్మినేషన్...( తెలుగు పదానికి ఇంగ్లీషు అర్ధం)
రెండోవ శబ్దం కల్ప...దీని అర్ధం క్రియ , ఓక కార్యము , ఓక పోరాటం
మూడవ కల్ప కి అర్ధం...కాల గణన , సంఖ్యా గణన...కల్పం అనగా..బ్రహ్మకు ఓక పగలు కాలం అనగా 432 కోట్ల మానవ సంవత్సరాలు...
ఇప్పుడు మీరు పూర్తి వివరణ తెలుసుకొందురు...
భగవంతుడు భక్తులను , సాధుజన రక్షణ సంకల్పుడైతే తనపోరాటం కల్ప పరిధి అయునా చేస్తాడు అని తెలుపుతున్నాడు..అయుతే ఈ బ్రహ్మ కల్పాలు , పోరాటాలు ఏన్నో తెలుసా శతకోటి అనగా వందకోట్లు ..
అనగా  భక్త జన రక్షణకు అన్నీ కాలాలో , అన్నీ మార్గాలలో , అన్నీ విధాలుగా సిద్ధమై వుంటాడు అని  తెలపటమే...
తరువాత రెండు చరణాలు భగవస్తుతి...
మిత్రులు చదివిన తరువాత తమరి రిప్లై లని మరువక తెలపండి...
ఆలపాటి రమేష్ బాబు.
9440172262.