5, మార్చి 2023, ఆదివారం

వాలి సంహారం అంతర్గత రహస్యాలు

రాముడు - పరిశీలన - సీరిస్ 4
************************
వాలి సంహరం.
రామాయణం తో పరిచయం వున్న ప్రతి ఓక్కరికి తెలిసే పాత్రలు.వాలి,సుగ్రీవులు.
మన తెలుగు నాట సతతంకీచులాడుకునే అన్నదమ్ములను నర్మగర్భంగా..ఆ.... వారి మధ్య  వాలి సుగ్రీవుల సంబంధం అని ఉదహరిస్తారు. ఆ శ్లేష...తెలిసిన వారికి మాత్రం అర్ధం అవుతుంది... ధనం గురించో , కుటుంబ స్త్రీల గురించో వారిలో వైరుద్ధ్యాలున్నాయని....
పౌరాణికంగా ఆంజనేయుని విశిష్టత ముందు వాలిప్రభ మనకు అంతగా పరిచయం లేదు...
కాని వాలి మహ వీరుడు...కాకపోతే స్త్రీ వ్యామోహి...
వాలి ఇంద్రుని కుమారుడు. వాలి తండ్రి ఋక్షరజుడు...(కొంతమంది వృక్షజుడు అంటారు..అంటే చెట్లమీద పుట్టినవి...అని.. చెట్లమీద ఏమి వుంటాయి..పక్షులు , కోతులు)
ఇతను వానర రాజు...ఇతను ఓకరోజు పొరపాటున ఓక కొలనులో పడి...అప్సరస గా మారిపోతాడు...ఈ అప్సర సౌందర్యం చూసిన ఇంద్రుడు మోహించి కామించి...ఆమేను చెర పట్టుతాడు...ఈ హడావుడి ఇలాగుంటే ఇదే అప్సరను బ్రహ్మదేవుడు చూసి కామించి మోహించి..తాను కూడా ఆమేతో పొందుకోరతాడు..(.వీళ్ళద్దరు ఆమేతో సంగమం నేను కొద్దిగా శ్లేషగా వివరిస్తున్నాను...మీరు అర్ధం చేసుకోండి). ఈ అప్సర వాలభాగం నుంచి ఇంద్రుడు సంగమించి ఆప్రదేశంలో తన వీర్యనిక్షిప్తం...కంఠభాగంలో బ్రహ్మ సంగమించి... తన వీర్యనిక్షిప్తం.... అందువల్లనే...ఇంద్రాంశతో...వాలి..బ్రహ్మంశతో సుగ్రీవజననం. ఇద్దరూ మహవీరులే. ఇంద్రుడు
తార అనే అప్సరసను వాలికి ఇచ్చి భార్యను చేస్తాడు,  అలాగే విపరీతమైన మహిమగల ఓక హరం ఇస్తాడు.
కాకపోతే మొదటి నుంచి సోదరుల మధ్య స్త్రీ పర వైషమ్యం వున్నది. అది తార , వాలి భార్య కావటంతో కొంత ముదిరి పాకాన పడింది... ఇరువురి మధ్య ప్రచ్ఛన వైరం....
దీనితో బ్రహ్మదేవుని గురించి వాలి తపస్సు చేసి...లౌక్యంగా ఓక వరం కోరతాడు..యుద్ధంలో తన ప్రత్యర్ధి నుండి తనకు  సగం బలం సంక్రమించాలని కోరతాడు...దానితో బ్రహ్మ ఆ వరం ఇస్తాడు. బ్రహ్మ నాలుగు తలకాయలు వున్నను తేడా పడి...తపస్సుకు వరం కాబట్టి ఇస్తాడు. వాలి యొక్క శత్రవు సుగ్రీవుడు తన కుమారుడు (అంశ)అన్న విషయం మరచి పోతాడు. (కొన్ని వాటిల్లో వాలికి వరం బ్రహ్మ ఇచ్చారని మరికొన్నింటీల్లో ఇంద్రుడు ఇచ్చారని వున్నది...మొత్తానికి వరం వున్నది )(అందుకే మనవాళ్ళు అంటారు బ్రహ్మ నాలుగుతలలులో ఓకటి అవునంటది ఇంకోటి కాదంటది మరోకటి లేదంటది ఆతరువాతది చూద్దాం అంటుంది అంటారు)... దీనితో వాలి ,  సుగ్రీవుని లక్ష్య పెట్టని రీతిలో కిష్కింధను పాలిస్తుంటాడు.
ఇంతలో దుందుభి అనే రాక్షసుడు వాడి వీరత్వాన్ని పరిశీలించుకోవటానికి వరణుడు , సముద్రుడు లను యుద్ధానికి ఆహ్వానిస్తారు.
దానితో వారిద్దరు తమ వల్లకాదు ..నీ వీరత్వం మొత్తం.. వాలి వద్ద ప్రదర్శించు అంటారు. దానితో వాడు దున్నపోతు రూపం ధరించి వాలిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు. కాని వాలి అనునయంగా వద్దులే అంటాడు..కాని దుందుభి.. వాలి వీరత్వాన్ని కించపరిచే మాటలు పలుకుతాడు...దానితో  వాలి దుందుభి తో యుద్ధానికి దిగి వాడితో పోరాటంలో భాగంగా వాడి కొమ్ములు పట్టుకుని గిరగిరా తిప్పి విసరివేస్తాడు..వాడేమో ఋష్యమూక పర్వతంపైన  వున్న మతంగమహర్షి ఆశ్రమంలో  పడి రక్తం కక్కుతూ మరణిస్తాడు. దీనితో మతంగమహర్షి.. ఆశ్రమప్రాంతం కలుషితమైనదన్న ఆగ్రహంతో వాలిని ఋష్యమూక పర్వతంపై అడుగు పెట్టితే నీ తల వేయి ముక్కలవుతుంది శాపం పెట్టుతాడు...ఈ విషయం తెలిసిన వాలి ఋష్యమూక పర్వతాన్ని వదిలి మిగిలిన ప్రాంతాల్లో సంచారం.
ఇది ఇలావుంటే వాలికి రావణునితో విపరీతమైన మైత్రి ఏర్పడుతుంది . ఇదో విచిత్ర సంబంధం. రావణునికి విపరీతమైన అహం..తాను వీరాధివీరుడననని...దానితో ఓకసారి కార్తవీర్యార్జునుడిపై యుద్ధానికి సిద్ధపడతాడు. కార్తవీర్యార్జునుడు తన సహస్రబాహువులచే రావణుని బంధించితే రావణునికి ఊపిరందక గిలగిలాడిపోతు శరణుజోచ్చి అగ్నిసాక్షిగా మైత్రి చేసుకుంటాడు.
అయిననూ బుద్ధి రాక మరోక్క సారి వాలిపై యుద్ధానికి వస్తాడు. ఆసమయంలో వాలి సంధ్యావందనంనకు సముద్రతీరానికి వస్తాడు..ఆ సమయంలో రావణుని కవ్వింపు... దానితో వాలి రావణుని క్రిమి కీటకంతో సమానంగా భావించి ఓక్కసారిగా రావణుని చంకన పెట్టుకుని ఆకాశపయనం...
వాలి ప్రతిరోజు తన సంధ్యావందనం లో భాగంగా...సప్తసముద్రాలలో సూర్యుడు ఏ సముద్రం వద్ద ఉదయించుతాడో...అంతకన్నా ముందు వెళ్ళి పూజాదికాలు చేసేంత వేగం.
ఇలా సప్తసముద్రాలను రెండు ఘడియలలో చుట్టి వచ్చేంత వేగం. ఇలా రావణుడు వాలి చంకలో బందిగా చాలా రోజులు వుంటాడు.ఇదే సమయంలో వాలి ప్రవర్తన వలన వాలికి గల స్త్రీ వ్యామోహం తెలుసుకున్న వాడై. రావణుడు ఎలాగోలా అగ్నిసాక్షిగా మైత్రి. ఈ మైత్రికి ఓక ఓప్పందం ఇస్తాడు రావణుడు.లంకలోని సమస్తానికి తన భార్యలతో  సహ..తనతో పాటు అనుభవించే సహ హక్కులు ఇస్తాడు. కాని వాలి పట్టించుకోక ఓక నెల వుండి వస్తాడు.
దుందుభి కొడుకు మాయావి అనేవాడు వచ్చి వాలిని కవ్విస్తాడు..దానితో వాలి వాడి వెంటపడతాడు...ముందు మాయావి తరువాత వాలి...వీరి వెనుక సుగ్రీవుడు..
మాయావి ఓక గుహలో ప్రవేశిస్తాడు...వాడి వెంట వాలి...సుగ్రీవుడు తన అన్నగారి కోసం బయటనే ఆగి ఎదురు చూస్తుంటాడు...ఓక నెలరోజుల తరువాత గుహనుంచి అరుపులు కేకలుతో పాటు రక్తం బయటకు వస్తుంది...అది తన అన్నగారిదేనన్న భావనతో సుగ్రీవుడు లోపల వున్న మాయావి మరలా బయటకి రాకూడదని ఓక పెద్ద బండరాయి ని గుహకి అడ్డుగా పెట్టి తిరిగి రాజ్యానికి వెళ్ళి..మంత్రుల సలహపై రాజ్యపాలన చేస్తుంటాడు...కాని వాలి లోపల మాయావిని సంహరించటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది... బయటకు వచ్చిన వాలికి..అది సుగ్రీవరాజ్యం అని తెలుస్తుంది. దానితో తమ్మునితో యుద్ధంచేసి తమ్ముని ఓడించి...రాజ్య బహిష్కరణతో పాటు...తమ్ముని భార్య రుమ ని స్వాధిన పరుచుకొని...సుగ్రీవుడు తన రాజ్యంలో వుంటే మరణశిక్ష అనే ఆదేశం...దానితో సుగ్రీవుడు తన మంత్రులు అయిన హనుమ , జాంబవంతుడు , సుశేషణుడు మొదలగు వారితో ఋష్యమూక పర్వతంపైన నివాసం...మంచి కాలం కోసం ఎదురు చూపులు...
ఇటువంటి నేపథ్యంలో సీతాపహరణం...ఆమేని అన్వేషిస్తూ రామలక్ష్మణుల వెదుకులాటలో జటాయువు ని కలుస్తారు. ఇతను పక్షిరాజు.ఇతను దశరధుని మిత్రుడు. రామభక్తుడు. కధా కాలానికి వృద్ధుడైనాడు.ఇతను గరుత్మంతుని సోదరుని కుమారుడు. ఇతను మొదటిసారిగా రామునికి సీతాపహరణం జరిగినది రావణుని వలన అని తెలియచెప్పి ...తాను సీతాపహరణాన్ని ఎలా ఎదుర్కోన్నది...వీటితోపాటు రావణుని తాలూకు అన్నీ వివరాలు తెలిపి...వాడిని ఎదుర్కోవటంలో భాగంగా తగిలిన గాయాలతో పాటు ఋష్యమూకపర్వతం పైన తగిన జాడలు కాని తగు సహయం కాని లభిస్తుంది ఆని తెలిపి ప్రాణత్యాగం చేస్తాడు. దీనితో రాముడు ఎంతో బాధతో జటాయువు కి అగ్నిసంస్కారం జరిపి ఉత్తమగతులు కల్పించుతాడు. (గమనించారో లేదో రాముడు పక్షి కి కూడా అగ్ని సంస్కారం చేస్తాడు. కాని నేటి కాలంలో స్వంత తల్లి తండ్రులకి చేయాలంటే నీవంటే నీవు అనుకుంటూ ఆస్థులు లెక్క తేలేంత వరకు విభేదాలు... మరి ఈ కోవిడ్ రోజుల్లో ఈ గోల మొత్తం మునిసిపాలిటీ వాళ్ళు చేస్తుండటంతో మన సన్నాసులు విపరీతమైన నటన ప్రదర్శన . నేటికి ఆవుకి మాత్రమే అగ్ని సంస్కారం కొంతమంది చేస్తున్నారు)
తదనంతరం రామలక్షణులు ఋష్యమూక పర్వతం వద్దకు వస్తారు...అక్కడ వున్న హనుమని మొదట గుర్తించి హనుమని ఆలింగనం చేసుకుని సుగ్రీవునితో పరిచయం.సుగ్రీవునికి అనుమానం వీరు వాలి పంపిన చారులని...వీరి ఉభయులు మధ్య పరిచయాలు కష్టసుఖాలను పంచుకున్న తరువాత ఇద్దరునూ ఓకే విధమైన కష్టాలలో వున్నారని...కాకపోతే రాముడు సుగ్రీవుల మధ్య వానర మానవ బేధం తప్ప అంతా ఓక్కటే.దీనితో ఇద్దరు ఓకరికొకరు సహయం చేసుకోవాలనే నిశ్చయంకి వస్తారు. అయిననూ సుగ్రీవునకు ఇంకనూ శంక..వాలి వధ..రాముని వల్లన అవుతుందా...దానిని లౌక్యం గా అడుగుతాడు...మీ అన్న ఎంత విశేష ప్రజ్ఞ , వీరత్వం కొద్దిగా తెలుపుదూ అంటే...ఓక ప్రదేశంలో వున్న 7సాల వృక్షాలను చూపి మా అన్న వీటిన్నంటిని కలిపి ఓక్క సారిగా పెకలించ గలడు అన్నాడు. దీనితో రాముడు తన బాణం సంధించి వదులుతాడు...ఆవిఅన్నీ...ఓక్కసారిగా నేలకూలుతాయి...దీనితో సుగ్రీవుడు స్థిమితపడి రామునిపై సంపూర్ణ విశ్వాసం ప్రకటించగా...అగ్నిసాక్షిగా వీరిద్దరి మధ్య స్నేహ సంబంధం ఏర్పడుతుంది. రాముడు సుగ్రీవునికి రాజ్యం , అతని భార్య లభ్యతలో సహయం చేయాలని...అలాగే సుగ్రీవుడు సీతాన్వేషణకి అవసరమైన సహయం చేయాలని.
దీనితో సుగ్రీవుడు రాముడు వెన్ను వున్నాడన్న ధైర్యం తో వాలిని ద్వందయుద్ధానికి ఆహ్వానిస్తాడు...అసలే తమ్మడంటే పడని వాలి కోపంతో యుద్ధం చేస్తాడు...ఇరువురు ఏక సమయంలో జన్మించిన నందున ఏకరూపంలో వుంటారు రాముడు కొద్దిగా గందరగోళం పడి తన బాణ ప్రయోగం చేయడు. దానితో వాలి సుగ్రీవుని తీవ్రంగా గాయపరచి ఓడించుతాడు. వాలి వెళ్ళగానే సుగ్రీవుడు రామునితో నీవున్నావన్న నమ్మకంతో కదా నేను యుద్ధం సిద్ధం అయినది...ఇలా జరిగింది ఏమిటి అని వాపోతాడు...దానికి రాముడు... మీ ఇరువురూ ఓకే విధంగానే వున్నారు...నేను ఆనవాలు కట్టలేక పోయాను అంటూ మీ అన్ననూ మరలా యుద్ధానికి పిలువు..ఈసారి నిన్ను గుర్తింపు కి వీలుగా ఈ పూలమాల ధరించు అని సూచనతో...అదే విధంగా చేసి..అన్న అయిన వాలిని మరలా యుద్ధానికి ఆహ్వానిస్తాడు...వాలి సిద్ధపడతాడు...కాని తార వారించుతుంది..ఇంత అర్ధరాత్రి పూట యుద్ధ ఆహ్వానం అంటే ఎదో అనుమానంగా వున్నది...అందునా మన చారుల వార్త ప్రకారం సుగ్రీవునకు రాముడనే వానితో స్నేహం ఏర్పడినది...అతను మహ ప్రజ్ఞ కలవాడు అని తెలిసినది....కాని వాలి ఆవేశంలో ఈమాటలు లక్ష్య పెట్టక...వీడికి ఈసారి మరణమే శరణ్యం లాగున్నది...అని యుద్ధానికి బయలుదేరతాడు.
వాలి సుగ్రీవుని యుద్ధంలో సమయంచూసి రాముడు చెట్టు చాటునుంచి వాలిపైకి తన బాణం ప్రయోగిస్తాడు...దానితో వాలి నేలకూలతాడు....వాలి వలవలా ఏడుస్తూ రాముని అనేక ప్రశ్నలు సంధిస్తాడు...
రామా వానరాన్ని...నీకు ఆహరంగా పనికిరాను...నీ భక్తుడనే...వీరుడవే..చాటునుంచి కొడతవా...ఇది న్యాయమా...అంటాడు...పోని సీత గురించి అంటావా...ఆవిషయం నీవు  తెలిపితే చాలు..నేను రావణుని ఆజ్ఞాపించితే చాలునే రావణుడే స్వయంగా సీతను తిరిగి తీసుకుని రాగలడే..
దీనికి రాముడు సమాధానంగా...
వాలి...నీవు నా భక్తుడవు అన్నమాట నిజమే..ఈ విషయంలో నీపట్ల ప్రపన్నత వున్ననూ..ఇది నీ తప్పులను కాయదు...పుత్ర సమానుడైన తమ్ముని భార్యను చెరపట్టటం..నీ అహంకారపూరిత ప్రవర్తన...వానరుల పట్ల నీ ప్రవర్తన నీవు జ్ఞప్తీకీ తెచ్చుకో..అందునా మేము క్షత్రియులము వేట మా నైజం...నీవా వానరానివి,జంతు సమానుడివి కాబట్టి వేటాడాను...పోని నేను నిన్ను ఎదుర్కోవాలంటే నీ వరం వల్లన అది సాధ్యపడదు...ఇది మా మహరాజ్యం..ప్రస్తుతం రాజప్రతినిధిగా ఈ ప్రాంతంలో వున్నా...రాజప్రతినిధికి వున్న దండనాధికారం గురించి నీకు తెలియనది కాదు...అయిననూ నీ పశ్చాత్తాపం వలన నీ ప్రాణం నిలబడక పోయినూ నీకు సద్గతి వున్నది...నీ అంతిమ కోర్కేను అమలు పరచటం నా కనిస ధర్మం...
అనగా..వాలి..రామచంద్రా..బుద్ధికర్మాను సారణి అన్న విధంగా ప్రవర్తించా..ఈనాడు ఆలోచిస్తే తెలుస్తుంది.. కాని నా బాధ ఈనాడు... అంగదుని గురించే...దీనితో రాముడు అంగదుని బాధ్యత తనదని చెప్పి...అంగదుడు యువరాజుగానే వుంటాడు అన్న మాటతో వాలి సంతృప్తిగా మరణిస్తాడు...
ఇది మొత్తం పౌరాణిక కధ...
వాల్మీకి వారి నామధారణలోనే వారి బుద్ధులు తెలిపినాడు.. వాలం అంటే తోక..ఓక విధంగా అది వాడి ఆధినంలో వుండదు అని భావన..అనగా వాలి ఇష్టానుసారం ప్రవర్తన అని సూచన..సుగ్రీవుడు.. అనగా మంచి వారిలో కొమ్ము లాంటి వాడు..అనగా నమ్మ దగిన వాడు..అందునా సుగ్రీవుడు బ్రహ్మ అంశ , హనుమంతుడు శివాంశ వీరిద్దరూ కలసి నారాయణాంశకై ఎదురు చూపు...ఇక  త్రిమూర్తులు చేరికతో తదుపరి జగన్మాత సీతమ్మ రక్షణ...రావణ పతనంనకు ఇది సూచన.
రావణుడు , వాలి మధ్య ఉమ్మడిస్నేహకారణం స్త్రీ వ్యామోహం. వాలి చనిపోయే ముందు నీ భక్తుడను అంటాడు..మరి అంతటి వినయవిధేయతలు వున్నవాడు...సీతాపహరణ విషయం వాడికి తెలసి ఉదాసీనత తో వూరకున్నాడు...ఈ విషయం రామునికి తెలియదా..అంటే వాడి ఉద్దేశ్యం  మంచా చెడా... వాలి మాటతో రావణుడు సీతను తిరిగి తెస్తే...రాముని వ్యక్తిత్వ ,క్షాత్ర హీనత అవుతుంది.
ఇక సుగ్రీవ స్నేహనికి రాజకీయ కారణం..నిర్వాహణ కారణం ..సూత్రబద్ధ ధర్మ కారణ హేతువులు వున్నాయి.
కిష్కింధలోని వానరులు , సుగ్రీవుడు సర్వులు వాలి భాధితులే...వాడి అహంకార పూరిత ప్రవర్తనకి విసిగి వేసారి పోయారు...పోని ఎదురుతిరిగే అవకాశం కూడా లేదు వాడి వరం వల్లన ఇది మనకు సుగ్రీవుని భార్య రుమని తన స్వాధీనం లో వుంచుకోవటమే..ఆమే ఏమి చేయలేదు..హితులు సన్నిహితులు ఏమి చేయలేక బయటకు రావటమే సూచన. దీనితో వాళ్ళను వాలి నుంచి ఎవరు కాపాడుతారో అన్వేషణ...ద్వంద యుద్ధంతో పనికి రాదు..అస్త్రనిపుణుడే కావాలి...వానరుల హస్తనిర్మాణం విలువిద్యకు సరికాదు...ఓకవేళ ఎవరైనా వున్ననూ వారు నిపుణులు కాదు...దాదాపు వానరులు అందరూ ద్వంద యుద్ధంలో గాని , భుజ బలం వల్లకాని , గద , పరిఘ , బరిశ లాంటి ఆయిధప్రయోగం..అవి వాలి వద్ద పనికి రావు..కారణం అవి ముఖతా ప్రయోగం...కాని శర అస్త్ర ప్రయోగం అలాకాదు దూరం నుంచి అవకాశం... అందుకే సుగ్రీవుడు రాముని విలువిద్యా నైపుణ్యం పరిక్షించుతాడు..దానితో సుగ్రీవునికి నమ్మకం కుదురుతుంది. వానరులకి వాలి పీడ పోయిన తరువాత అంత ఉత్సాహంగా కోట్లాదిమంది రామదండుగా కదులుతారు.
రాముని కారణాలు రాముని కున్నాయి...
ముందు రాముడు ఎంత వీరుడైననూ రావణుని వంటి వాడి మీద దండయాత్రకు తాను ఒక్కడే చాలడు..ఈ విషయం పై పూర్తి అవగాహన వున్నది. అందుకే తోడ్పాటు కావాలి. ఎవరన్నా రాజసహయాం అడిగితే ఇతని క్షాత్రంనకు అవమానం..అలా జరిగితే రాముని వ్యక్తిత్వం వీరత్వం బలహీనపడుతుంది...పోని అటువంటి వాడు దొరికినా రాముడు అతనితో స్నేహనికి ఆరాజు యొక్క అంతఃపురానికి వెళ్ళాలి..అప్పుడు తన తండ్రికి ఇచ్చిన మాటకి వాగ్దాన భంగం జరుగుతుంది... అరణ్యవాసం పదనాలుగు సంవత్సరాల కాలంలో ఏ రాజ్యవాసం చేయరాదు.. అందువల్ల తప్పని సరిగా అరణ్యవాసులతోనే స్నేహం..వారి సైనికులతోనే దాడి చేయాలి. రామునికి వానరుల సహయాం కావలని జటాయువు తో మాట్లాడిన తరువాత అవగాహన కి వస్తుంది.. మరి దగ్గరలో అందుకు తగ్గ వానర రాజ్యం..కిష్కింద మాత్రమే...పోని వెనుకకు పోయి తనకు తెలిసిన వానర రాజ్యాల సహయం తీసుకోవాలన్నా సమయాతీతం..అప్పటికే అరణ్యవాసంలో పదిసంవత్సరాల కాలం అయిపోయింది...వెనుకకూ పోయేది ఎప్పడు అందుకు తగ్గ వానరులను వెదికి వాళ్ళను కూడగట్టి తీసుకుని రావాలి అంటే పూర్తి సమయాతీతం..సమయంలో అయోధ్య కి తిరిగి వెళ్ళక పోతే భరతుని ప్రాణత్యాగం అనే మాట ఇన్ని పరిధిల మధ్య సుగ్రీవ స్నేహం చేయాలి, అందునా వానరులు , వానరప్రముఖులు సుగ్రీవునితో...ఇదే కాకుండా భార్యా వియోగం , రాజ్య పాలనలో ఇద్దరిది సరిసమాన బాధ...ఓకరు పాలనలో వున్న వారికి రాజ్యం పోయింది.. రెండోవ వారికి రేపు రాజ్యపట్టాభిషేకం అనగా అరణ్యవాసం...ఓక బాధితుడు రెండోవ బాధితుడి దుఃఖం , అవసరం గుర్తించ కలడు...
అలాగే కాకుండా శత్రవు మిత్రడు కూడా శత్రువు తో సమానం అన్న రాజనీతి .
ఇది పూర్తిగా దైవ ప్రణాళిక.
ఇది రాముని రాజ , క్షాత్ర ,వీర ,వ్యక్తిత్వ ధర్మం.
ఇన్ని విధాల ఆలోచన చేసి మాత్రమే వాలిని సంహరించాడు.
సకలం సర్వం శ్రీరామ జయం.
సర్వం శ్రీరామ ప్రసాదమే...
మిత్రులకు , విమర్శకులకు  స్వాగతం.
ఆలపాటి రమేష్ బాబు
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో
విజయవాడ
94401 72262
మీకు తప్పు అని తలచిన విషయం వాట్సప్ చేయండి...పరిశీలించి సరిదిద్దుకుంటాను.
ఇది నా ఘనత కాదు పూర్తిగా రామునిదే...ఆయన ఆశీస్సులు లేకుండా ఇది సాధ్యం కాదు...
కనుక సర్వం శ్రీరామ జయం.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.