ఒక అందాల అద్బుతం, ఒక వసంత సమీరం, మెరిసే మెరుపు, అనంత ఆత్మీయత, ఒక అల్లరి, ఒక పెంకి, కొద్దిగా కోపం, ఇంకొద్దిగా అలక, అందరికన్నా చిన్నది, అన్నిటా తానే, ఒక అనంత శక్తీ రూపం, అమ్మకు బొమ్మ, అన్నయ్యకు ముద్దుల చెల్లి ,నాన్నకు "అమ్మ"........అమ్మ అంటే నిజంగా అమ్మ
26, ఏప్రిల్ 2025, శనివారం
మనవడు ఊరు వెళ్ళితే
23, ఏప్రిల్ 2025, బుధవారం
జోల పాటలు 2
22, ఏప్రిల్ 2025, మంగళవారం
జోల పాటలు -1 me
20, ఏప్రిల్ 2025, ఆదివారం
జోల పాటలు
4, ఆగస్టు 2024, ఆదివారం
శ్రీ కృష్ణాష్టకం విశేషార్ధం
17, నవంబర్ 2023, శుక్రవారం
మెరుగు చెంగట యున్న మేఘంబు అర్ధ విశేషాలు
మెఱుఁగు చెంగట నున్న మేఘంబు కైవడి
నువిద చెంగటనుండ నొప్పువాఁడు,
చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమునఁ జిఱునవ్వు మొలచువాఁడు,
వల్లీయుతతమాల వసుమతీజముభంగి బలువిల్లు మూఁపునఁ బరఁగువాఁడు,
నీలనగాగ్ర సన్నిహితభానునిభంగి ఘనకిరీటము దలఁ గల్గువాఁడు,
పుండరీకయుగముఁబోలు కన్నులవాఁడు,
వెడఁదయురమువాఁడు, విపులభద్ర మూర్తివాఁడు రాజముఖ్యుఁ డొక్కరుఁ డదె కన్నుఁగవకు నెదురఁ గానఁబడియె.’
++++
పలికెడిది భాగవతమఁట,పలికించెడివాఁడు రామభద్రుండఁట, నేఁబలికిన భవహర మగునఁట,పలికెద వేఱొండుగాథఁ బలుకఁగనేలా!
ఈ రెండు పద్యాలు పోతన భాగవతం లోని....ప్రధమ స్కంధం లోనివే.
పోతన భాగవతం...రచనా నేపథ్యం, రచన వ్యాసాంగ ప్రారంభంనకు గల కారణాలు తన రచనలోని పొందుపరిచారు.
కారణం పోతన గారి కన్నా ముందు పోతన భాగవతం ఆంధ్రీకరించే సాహసం ఎవ్వరూ తీసుకోలేదని చరిత్ర తెలియ చేస్తున్నది....అందులోను ఆనాటి రచనా వ్యవస్థ రాజాశ్రయం లోనే వుండేవి....
నన్నయ్య గారు ఆదికవి గా మన్నన పొందినను వారు కూడా రాజాశ్రీతులే నన్నయ్య గారు రాజరాజనరేంద్రుడు ఆస్థాన కవి అని జగమేరిగిన సత్యం...అంత వరకూ ఎందుకు పోతన గారి సమకాలికుడు స్వయంగా బంధువు అయిన శ్రీనాథుడు రెడ్డిరాజుల ప్రాపకం..కాని పోతన గారు తన భాగవత రచన శ్రీరాముని కే అంకితం అన్నాడు...
ఇలా చాలా చాలా మధన పడినారు..
ఒక ఆదివారం గోదావరి నది స్నానం చేసినారు... ఆరోజు సోమోపరాగం...మీరు ఏమిటో అని భావన చేయవద్దు చంద్రగ్రహణం ని ఆవిధంగా పిలుస్తారు...
గ్రహణం విడిచిన తరువాత... స్నానానంతరం పోతన తన ఇష్ట దేవత ఆరాధన మరియి మంత్ర పఠనం, పునఃశ్చరణలో వుంటే శ్రీరామ చంద్రుడు దర్శనం ఇచ్చారు...
ఆ పద్యము " మెరుగు చెంగట" అనే సీస పద్యం లో వివరించారు.
సీస పద్య లక్షణం ప్రకారం మొదటి నాలుగు పాదాలు సీస ఛందస్సు లోను తదనంతరం అనుసరణ పద్యం వీరు కందపద్యం గా రచన చేశారు .
పోతన గారి రచనలో ఎక్కువ భాగం ఆటవెలది, కందపద్యం కారణం ఇవి జన బాహుళ్యానికి దగ్గరగా వుంటాయి...సాధారణ ఛందస్సు లో తేలికగా వుంటాయి చాలా పద్యాలు ప్రజలు సులభంగా ముఖతా ధారణ కలిగి వుంటారు..ఇందుకు ఉదాహరణ "చేతులారంగ శివుని పూజింపడేని", "అందు కలడని, ఇందు కలడని సందేహం వలదు " లాంటివి మనం గమనించవచ్చు.
పోతన గారి వివరణ భలే గమ్మత్తుగా
భలే ఆసక్తిగా అలా అని సత్యదూరం గా వుండదు మన అనుభవం లో వుండే విధంగా వుంటుంది... అందుకే...పాఠకుడు ముందు దృశ్యం సాక్షాత్కరిస్తుంది...దీనితో పాఠకుడు తనదైన కల్పనా శక్తి అనుకోండి భక్తి ప్రపత్తులతో అనుకోండి ఎలాగైనను ఆ ఘట్టం లో తాను అక్కడే వుండి ఆ దృశ్యం స్వయంగా చూస్తున్నారు అనే అనుభూతి కలిగిస్తుంది అనటంలో సందేహం లేదు....
ఇక అర్ధం వివరించే ప్రయత్నం చేస్తాను..
"మెరుపుతో కూడిన మేఘఛాయతో వుండి ఒక స్త్రీ తో కూడిన వాడు"
ఇది మొదటి పాదం అర్ధం...
మనకు ఆకాశంలో మేఘం కనపడటం వేరు మెరుపుతో కూడిన మేఘం ప్రకాశవంతంగా మనస్సుకు హత్తుకునేలా మరోసారి చూడాలి అనే విధంగా వుంటుంది...
కాని కొద్దిగా ఈ అర్ధం మార్చి చూడండి...
సీతమ్మ వారు మెరుపు వంటి మేని ఛాయ తో స్వామి వారు మేఘఛాయతో....అయ్యవారి ప్రక్కనే అమ్మవారు వుంటారు కదా...
మానవులు సహజంగా మాతృస్తన్యం మాతృగర్భ వాసన వీడలేరు వీడకూడదు వీడరాదు. ఇది పోతన గారిలో కూడా అందుకే అమ్మవారితో కూడిన అయ్యవారు అనే విధంగా...
తరువాత పాదం..
'చంద్రమండల సుధా సారంబు '
చంద్రుడు మనః కారకుడు...మానవుల చిత్త ప్రవృత్తులపై ప్రభావం చూపువాడు...అందుకే చంద్రుని వెన్నెల శీతలం గా హాయి కొలుపు విధంగా వుంటుంది...ఇవి మన స్వయానుభవాలే. అందులోను పౌర్ణమి నాడు పూర్ణ చంద్రుడు ఎంత మనోహరంగా ఎంత ఆహ్లాదంగా వుంటారో మనకు ఎరుక....సహజంగానే మనం రాముల వారిని రామచంద్రుడు అని అంటాం...అటువంటి రాముల వారు పూర్ణ చంద్రుని వెలుగు
అంతటి అమృతం జాలు వారునట్టి చిరునవ్వుతో స్వామి వారు వున్నారంట....
తరువాత పాదం...
"వల్లీయుతతమాల వసుమతీజం భంగి"
తీగలతో కూడిన తమాల వృక్షం లాగా ఎత్తుగా వున్న రాముల వారి భుజం పైన విల్లు ఆయన ఆయుధం ధరించిన విధంగా కాదు అంటూ అది అతి సహజంగా భూమి నుంచి ఉద్భవించిన లత లాగా శోభనిస్తున్నాయి అట.
అంటే అతి సహజంగా విల్లు అనేది రామునిలో భాగంగా మనకు ఉదహరిస్తున్నారు...విల్లుతో కూడిన రాముడు అంటే అర్ధం...ధర్మపరిపాలన కోసం అని.... దుష్టశిక్షణ శిష్టరక్షణ తన అవతార ఉద్దేశ్యం అని మనం తెలుసుకోవాలి... కావాలంటే గమనించండి దశావతారాలు అన్నీ మనం దర్శించిన ఆయా ఆవతార ఉద్దేశ్యం మనకు స్పష్టంగా గోచరిస్తుంది.
తరువాత పాదం...
" నీలనగాగ్ర సన్నిహిత భానుని"
శ్రీరాములు వారు ఆజానుబాహుడు...అందులోను వారు నీల మేఘ శ్యాములు వారి శిరస్సు పై కిరీటం సూర్యునిలా ప్రకాశిస్తూ వున్నది
ఇంత వరకు సీస పద్యం... తదనంతరం అనుసరణ పద్యం.
"పుండరీక యుగం బోలు కన్నుల వాడు"
పుండరీకం అనే పదానికి విశేష అర్ధాలు చాలా వున్ననూ ఇచ్చట తెల్ల తామర అనే అర్ధం లో ప్రయోగించారు.
తెల్లని కనుదోయి ప్రకాశవంతంగా నిర్మలంగా వున్నాయి.
సాధారణంగా కవులు దేవతా, స్త్రీ వర్ణనలో కన్నులను పద్మాలతో పోలిక చేస్తారు. కారణం ఇవి సున్నితంగా, లాలిత్యం తో మనోహరంగా ఆకర్షణ తో పాటు వాటి జనన ప్రదేశం ఎంత దుర్భరంగా వున్ననూ పద్మాల సహజ లక్షణమైన నిర్మలత్వం వెలువరిస్తాయి.
అంతే కాదు ఇక్కడ పుండరీకం అనే పదం ఉపయోగం ఇంకొకటి వున్నది.
అది భక్త సులభుడు అనే కోణంలో.
మనం గోవింద నామాలలో పుండరీక వరద గోవింద అంటాం.
తరువాత పాదం...
"వెడద యురము వాడు, విపుల భద్ర
మూర్తి వాడు..."
విశాలమైన వక్ష స్ధలంతో నమ్మదగిన వాడుగా అని అర్ధం...
విశాలమైన వక్షం అనేది దేహ పరిణామం తో చూడాలా కాదు...
ఆపన్నులను కాపాడాటంలో ముందు నుండే వాడు, దయార్ద్ర హృదయం కలవాడు, వీరత్వం కలిగిన వాడు , మిత్రులను, కష్టాల్లో వున్నవారు,ఆత్మీయులను అనురాగం తో అక్కున చేర్చుకుని హత్తుకునే వాడు లాంటి అర్ధాలు కూడా ఇమిడి వున్నాయి....ఇన్ని కారణాలతో విపుల భద్ర మూర్తి గా వున్నాడు అంట...
విపుల భద్ర మూర్తి అంటే నమ్మతగిన వాడు అనే కాదు...
విపుల అంటే అమరకోశం ప్రకారం భూమి, విస్తారమైన భూమి అని అర్థం.
కాని మనం ఇచ్చట....
మానవుడు కర్మ బద్ధుడై జీవనం వలన సంచిత ప్రారబ్ధం లతో అనేకానేక జన్మలు కలిగి వుంటున్నాడు...
మరి ఈ సంచిత ప్రారబ్ధం ను నివారించి
జన్మరాహిత్యం అయిన మోక్షం కలగటానికి ఎవరిని ఆశ్రయం చేయాలి... రాముని ఆశ్రయం చేయాలి...ఆయనే భద్రం నమ్మకం... అందుకే విపుల భద్ర మూర్తి వాడు అనే ప్రయోగం.
తరువాత పాదం...
"రాజముఖ్యుండోకరు
డదే కనుగవకు ఎదురు కానబడియే"
అంటే...రాజుల లోని ముఖ్య వ్యక్తి తన కన్నుల ముందు కనపడినారు అని తెలుపు తున్నారు...
మరి అంతరార్ధం ఏమిటో....
రాజు అంటే మీకు తెలిసినదే...రాజు పాలకుడు గాను పాలితులుగా ప్రజలు వుంటారు...
మనకు గత కాలంలో రాజు అనే ఆయన దైవాంశ సంభూతుడు అనే నమ్మకం వున్నది.
కాని ఇక్కడ వున్న రాజు అయోధ్య రాజుగారు... ఆయనే స్వయం విష్ణుః శ్రీరామ చంద్రుడు... అయోధ్య రాజ సారధ్యం లో సకల భూమండలం వున్నది...మరి పాలితులు ప్రజలు , మరియు ఆయన భక్తులు....
అంటే దేవతా స్వరూపాలు లో ముఖ్యమైనది శ్రీరామ చంద్రుడు అని ఆయన ఉద్దేశ్యం...
"కను గవకు ఎదురు కాని బడియే"
ఇందులో విశేషం కను గవ....
అంటే కన్నులు అని అర్ధం...కాని మనం మరికొంత తెలుసు కొందాం...
కన్నులను "కిటికి" లతో పోలిక వున్నది.
'కిట కిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు మూసినా చప్పుడు కావు'
అని మనం చిన్నప్పుడు పొడుపు కధలు చదువుకున్నాం....దాని విడుపు ఏమిటో అంటే కళ్ళు అని చెప్పి సంబర పడే వారం.
కిటికి కి మరో పేరు గవాక్షం....
మరి దీని కర్తవ్యం ఏమిటో గమనిస్తే...
ఇంటి గదిలో వుండి బాహ్య దృశ్యం దర్శించుటకు అనువుగా వుండునది.
అంటే నీవు వున్న ప్రదేశం వాతావరణం వేరు గవాక్షం గుండా నీకు గోచార దృశ్యం వేరు ...ఈ రెండింటికి విభజన గవాక్షం...
అలాగే గవ్వ అంటే మీకు తెలుసు...
గవ్వ అనేది సముద్ర జీవి తన రక్షణ కొరకు నిర్మించుకునే ఒకానోక కవచం...
మరి సముద్రం, జీవికి మధ్య వుండేది గవ్వ... ఇంత వరకూ సరిపోతుంది అని నా భావన....
ఇక ఇప్పుడు కనుగవ అనే పదం...
పోతన గారికి రాముల వారు ఎప్పుడూ దర్శనం ఇచ్చారు అంటే...పోతన గారు యోగ ధ్యానం లో వున్న సమయంలో ఆయన మనో నేత్రం పై సాక్షాత్కరించారు అని మనం అర్ధం చేసుకోవాలీ....
రామ సాక్షాత్కారం అంటే సశరీర సాక్షాత్కారం అని మీరు ఎన్నడూ భావన చేయరాదు.
అలాగైతే కను దోయి అనే పద ప్రయోగం వుండేది....
పోతన గారి లాంటి వారికి ఇటువంటి వాటిపై అవగాహన వున్నది.
కారణం త్రేతా యుగం నాటి రాముడు,
కలి యుగం నాటి పోతన గారికి సశరీరం అంటే అభూత కల్పన అవుతుంది అని తెలుసు.
అదియునూ కాక దేవతా దర్శనాలు ఎప్పుడూ స్వఫ్న సాక్షాత్కారం, యోగ, ధ్యాన సాక్షాత్కారం అని మనం గమనించాలి....
ఇది ఇంత వరకూ మొదటి పద్య వివరణ....
రెండోవ పద్యం... "పలికేడేది భాగవతం"
తరువాయి భాగం లో...నేను క్లుప్తంగా రాయాలని భావన చేస్తాను...కాని వివరణ సమయంలో స్వామి వారు మరి కొంత స్ఫురణ కు తెచ్చి ఇంకొంత వివరం తెలుపమని ఆదేశంతో...దాని అంతరార్థం...మరి కొంత అర్ధ వివరణ చేరి విస్తారం అవుతుంది....
మిత్రులు అన్యధా భావించక...మన్నించండి.
అలాగే ఈ రచన పై భూషణలు అన్నీయునూ శ్రీరామ చంద్రుడు వి...మీరు చదివి శ్రీరామ రామ రామ అని ఒక్క సారి అంటే ఆయన ప్రసన్నుడై మీకు ఆయన ప్రపన్నత లభిస్తుంది...
ఇక దూషణలు అన్నీయునూ నావే...
మీరు నిరభ్యంతరంగా... నిర్మొహమాటంగా ఈ రచనలోని తప్పులు తెలియచేసిన సరిదిద్దుకుంటాను...
ఆలపాటి రమేష్ బాబు
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో
విజయవాడ...
94401 72262.
తదనంతర భాగం కోసం మెసేజ్ పెట్టండి.
పలికేడిది భాగవతం అర్ధ విశేషాలు...
పలికెడిది భాగవతమఁట,పలికించెడివాఁడు రామభద్రుండఁట, నేఁబలికిన భవహర మగునఁట,పలికెద వేఱొండుగాథఁ బలుకఁగనేలా!
ఈ పద్యం చాలా ప్రాముఖ్యత కలది...
చాలా చాలా సందర్భాల్లో ఈ పద్య ప్రస్తావన చేశారు.
ఎందుకంటే....ఈ పద్య రచనా చమత్కారం అటువంటిది....
పోతన వంటి భక్తి విశ్వాసాలు గల వారి కలం నుంచి జాలువారిన ఆణిముత్యం.
సహజంగా మానవులు.... ఏ విషయం ప్రస్తావనకు తెచ్చిననూ ప్రధమ పురుషులో చెపుతారు... అనగా నేను చేశాను నా వలన జరిగినది...అని స్వ కేంద్రం గా ప్రస్తావన చేస్తారు...
కాని పోతన గారు ఉత్తమ పురుష తో చెపుతున్నారు.... అనగా వారు తెలిపారు వారు చేయించారు...వారు లేనిదే నేను లేను అనే భావం మనకు స్పష్టంగా తెలియచేస్తున్నది...
మనలో చాలామంది ఈ పద్య పఠన విధానం తెలియదు...కాని సహస్రవాధాని మాడుగుల నాగఫణి శర్మ గారు ఒకానోక అవధాన ప్రక్రియ లో ఈ పద్యం ఎలా చదవాలో తెలిపితే గమనించి ఆశ్చర్యం పొందటం నా వంతు అయిపోయింది...
మొదటి సాధారణంగా అందరు భావన చేసే విధానం లో...
"పలికెడెది భాగవతమట"
గమనించండి ఇక్కడ 'అట'...అనే శబ్ద విశేషం సహజంగా మనం ఏ ఏ సమయాల్లో ఉపయోగం అంటే...
అస్పష్ట విషయ ప్రస్తావన లో ఉపయోగం అనగా.. అక్కడ మనుషులు వున్నారంట, ఆ పని అవుతుందట, ఇలా అనేకానేక అస్పష్ట క్రియా రూపక శబ్ద విశేషం గా వాడతాం..దీనితో వక్త భాధ్యత తీరుతుంది కాని శ్రోత స్థితి నమ్మక అపనమ్మకాల మధ్య త్రిశంకు స్వర్గంలా వుంటుంది...
కాని ఆ విధంగా కాక ఈ టకార శబ్దవిశేషాన్ని SUFFIX గా కాక Prefix గా ప్రయోగించి చూడండి అప్పుడు ఈ విధంగా మారుతుంది అచ్చట మనుషులు వున్నారు, అటులే ఆపని అవుతుంది గా మారుతుంది...
కనుక మీకు పద్య అర్ధ విశేషం తెలిపే ముందు ఈ పద్యం యొక్క పది విచ్ఛేదన, విరామ క్రమం తెలుపుతాను...
పలికెడెది భాగవతం,
అట పలికించేడివాడు రామభద్రుడు,
అట నే పలికిన భవహరమగును,
అట పలికేద వేరోండు గాథ
బలుకగనేలా...
గమనించారా విరామ చిహ్నం మార్పుతో పద్య గమనం మొత్తం మారిపోయి పాఠకుడికి స్పష్టం గా దర్శనం అవుతుంది....
ఇప్పటి వరకు మనం పద్య గమనం తెలుసుకున్నాం ఇప్పుడు అర్ధ విశేషాలు తెలుసుకుందాం...
ఎలాగు నేను మిత్రులకు పద్యానికి ప్రతిపదార్ధ రూపం, వచన అర్ధ రూపం కాకుండా అంతర్గత భావ అర్ధ విశేష విశ్లేషణ విధానం లో ముందుకు వెళుతున్నాం కాబట్టి...
పోతన గారు భాగవతం రాసినది.. కీర్తి, కనకం కోసం కాదు "భవ హరం" .
అదే విషయం అనేక మార్లు ప్రస్తావించారు...మరి దానిపైన ఒక పద్యం రాసినారు " ఇమ్మనుజ రాజేశ్వరులు"...
మరి భవం అంటే....
మానవుడి పుట్టు రోగం...
ఇది సంచిత ప్రారబ్ధం...గత జన్మ కర్మ యావత్తు మోసుకుంటూ వచ్చాం...
మరలా ఈ జన్మ లో చేయి, జరుగు క్రియలు వలన జనించు కర్మ ఫలం ఇక్కడే అనుభవిస్తున్నామా లేదే ఆగామిత కర్మ ఫలం గా వచ్చే జన్మకి మోసుకుని పోతున్నాం...
మరి ఇది పూర్తిగా పరిహారం అయి మోక్ష స్థితి కలగాలి అంటే ఏమి చేయాలి, ఎవరిని ఆశ్రయం చేయాలి...అందుకే రాముడు అని అనకుండా రాముభద్రుడు అనే పద విశేషం...అనగా రాముడు తగిన వాడు, భద్రమైన వాడు, నమ్మ తగిన వాడు...రామ ఆశ్రయం, రామ నామ ధ్యానం తో మనం మనయొక్క భవ హరం చేసుకో గలం...
మరి అంతటి రామభద్రడే...
భాగవతం రాయమని స్పష్టం గా తెలుపుతూ...ఇది రామ ఆజ్ఞ, ఇది రాముని పలుకు , ఇది రాముని వాక్కు కనుక భాగవతం రాస్తున్నాను...
వేరే వేరే కధలు, వేరే వారి కధలు నేను పలుకనేల...( ఆ రోజుల్లో వీరి బంధువు అయిన శ్రీనాథుడు కాశీ ఖండం, శృంగార నైషధం వ్రాసి ఖ్యాతిలో వున్నారు )
మరి ఇది ఆయన కోసమా కాదు మన కోసం మన అందరి కోసం...
జననమరణ చక్ర విచ్ఛేదన సుదర్శన చక్రధారి ఈ కోదండ రాముడు అంతటి రాముని పలుకు అయిన భాగవతం మన భవ హరం కూడా అవుతుంది...
ఇది పద్య అర్ధ విశేషం...
(పండితార్ధాలు తెలపాలి అంటే ఇంకను చాలా వున్నాయి...కాని నేటి సమాజ నడవడి కి కొంత లలితంగా తెలిపితే నే బాబోయ్ ఆంటున్నారు)
సకలం సర్వం శ్రీరామ జయం...
సర్వులకు శ్రీరామ జయం...
తమరు చదివి భాగున్నది అని భావన చేస్తే... శ్రీరామ రామ రామ అని ఒకసారి పలకండి...
తప్పులన్నియూనూ నావే....కనుక తమరు తెలియ చేసిన సరిదిద్దుకుంటాను...
మీ
ఆత్మీయ మిత్రడు/ సహోదరుడు
ఆలపాటి రమేష్ బాబు...
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో
విజయవాడ....
9440172262
13, మార్చి 2023, సోమవారం
సిగ్గు పూబంతి... సిరివెన్నెల పదప్రయోగాలు
సిగ్గు పూబంతి ఇసిరే సీత మా లచ్చి
మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి (2)
సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా
రాముని సిత్తంలో కాముడు సింతలు రేపంగా
విరజాజి పూల బంతి అర చేత మోయలేని
సుకుమారి ఈ సిన్నదేనా శివుని విల్లు మోసిన జాణ ఈ సిన్నదేనా
ఔరా అని రామయ కన్నులు మేలమాడి నవ్విన సిన్నెలు
సూసి అలకలొచ్చిన కలికి ఏసినది కులుకుల మెలికి
సిరసొంచి కూరుసున్న గురిసూసి సేరుతున్న(2)
సిలకమ్మ కొన సూపు సౌరు బొండు మల్లె చెండు జోరు
సేరే ఆ సూపుల తళుకు ముసురుతున్న రామయ్య రూపు(2)
మెరిసే నల్ల మబ్బైనాది వలపు జల్లు వరదైనాది.
పై గీతం....స్వయంకృషి సినిమాలో విశ్వనాథ్ దర్శకత్వంలో సిరివెన్నెల గారు వ్రాయగా బాలుగారు , జానకి గారు పాడినారు...సంగీతం రమేష్ నాయిడు.
గత కొద్ది కాలంగా ఈ పాటలోని సాహిత్యం నన్ను ఆకట్టుకున్నది..అంతకన్నా ముందు ఈ పాటలోని పద ప్రయోగాలు గురించి చెప్పాలని భావించాను. నేను పెద్ద పండితుడిని కాకపోయిననూ ఏదో నాలుగు అక్షరాలు భగవత్ కృపతో వ్రాస్తున్నాను...
భారతీయ సమాజవ్యవస్థ ఇంత బలంగా వున్నదంటే దానికి కారణం కుటుంబ వ్యవస్థ బలంగా వుండటమే.
పూర్వకాలంలో అష్టావర్షత్ భవేత్ కన్యా అన్న ప్రమాణానుసారం వధువుకి 8సంలలోపు వివాహం చేసేవారు....ఈ వివాహం తరువాత అనేక రకాల కుటుంబ వేడుకలు ప్రతి ఒక్కరు నిర్వహిస్తారు కారణం వధువుకి వరునకు సాన్నిహిత్యం ఎర్పరచటమనే ప్రక్రియలో భాగంగా దీని వలన ఒకరిపై ఒకరికి ఆకర్షణ, అనురాగం ఏర్పడి వారి భవిష్యత్ సజావుగా వుంటుంది.
ఈ కుటుంబ వేడుకలలో ముఖ్యమైనది పానుపు లేక చెండ్లాట అని పిలుస్తారు.ఈ వేడుకలో వధూవరులను ఓక పానుపుపై ఎదురు ఎదురు కూర్చోనబెట్టి...ఏవో కొన్ని ఆటలతో పాటు...ఓక పూల మాలను బంతిలాగా చేసి వధువరులను ఆడుకోవడానికి అందిస్తారు...ఇరుపక్షాల బంధువర్గాలు వధువరులను సపోర్ట్ చేస్తూ ఆట ఆడించుతారు...ఇందులో ఎవ్వరు ఓడి పోరు...గెలిచేది వధూవరుల మధ్య ఆకర్షణ.
ఇక పాట విషయానికి వద్దాం....
మన స్త్రీల పాటల సాహిత్యం మొత్తం
వధూవరులను శ్రీరామ చంద్రునిగా , సీతమ్మ తల్లిగా భావన చేస్తూ పాటలు పాడతారు....ఈ పాటకూడా అటువంటిదే....
ముందు చూడండి ప్రారంభమే...
"సిగ్గు పూబంతి ఇసిరే సీత మాలచ్చి..."
అమ్మవారు బిడియంతో సిగ్గుతో మనోహరంగా రామునిపై పూలబంతి విసిరారు అంట....
అది ఎలా మొగ్గ సింగారం
" ఇరిసే సుదతి మినాచ్చి..."
అమ్మవారు కన్య కాబట్టి ఆమేను మొగ్గగా భావన...ఆమే అలంకరణ పువ్వు విచ్చుకునబోయేటప్పుడు వున్నంత మనోహరంగా వుండటంతో పాటు ఆమే మనోహరమైన పలువరుసతో అందంగా నవ్వటంతో పాటు...ఆమే రెప్పవాల్చకుండా రామునే చూస్తున్నారు..అని తెలుపుతున్నారు...
చూడండి ఈ వాక్యంలో సుదతి ప్రయోగం , మీనాక్షి ప్రయోగం విశిష్టమైనవి....
భార్య మనోహరంగా నగుమోముతో వుంటే భర్త చాలా జయించిన వాడులా
ఆనందపడతాడు. అలాగే మీనాక్షి అన్న పదం చూడండి...ఏమి ఆడవారి కన్నులు చేప కన్నులేనా వేరే ప్రయోగం చేయవచ్చుగా....
చేపకు శరీరంలో రెండుప్రక్కలా రెండు కనులుంటాయి...అవి భిన్న దృశ్యాలను చూపుతాయి...(ఈనాటికి ఫిష్ విజన్ గురించి పలురకాల చర్చలు)...
ఒకటి పుట్టింట వారి దృశ్యమైతే రెండోవది అత్త ఇంటివారి దృశ్యం... రెండిటిని కలగలిపి తనదైన దృశ్యం అనగా....ఇరుకుటుంబాల మధ్యవున్న సాధ్యాసాధ్యాలు మరియి తన భర్త వ్యవహరదక్షత మరియి సంతానం యొక్క కోరికలు తో ఆమే ఒడుపుగా తనదైన ముద్రవేస్తుంది...ఇంత చేసి చేప నీటి నుంచి తీసివేస్తే ఇబ్బంది పడుతుంది స్త్రీ కూడా తన సంసార సాగరం నుంచి దూరంగా వుండటమో లేక ఇంకొక ఇబ్బంది వస్తే ఆమే కూడా విలవిల లాడిపోతుంది....
అమ్మవారి సిగ్గు , నవ్వు మొదలైన వాటితో రాములవారిపై మన్మధ బాణాలు తగిలినవంట...
తరువాత చూడండి కవి తన ప్రయోగం...
"విరజాజి పూల బంతి అర చేత మోయలేని
సుకుమారి ఈ సిన్నదేనా శివుని విల్లు మోసిన జాణ ఈ సిన్నదేనా"
విరజాజి పూల బంతి అమ్మవారు మోయలేకుండా వున్నారట...
ఇది సీతమ్మ సౌకుమార్యం తెలుపుతున్నారు....విరజాజి పూలబంతి...విరజాజి మొగ్గ చిన్నగా వుండి చాలా బరువుతక్కువగా వుంటుంది.... ఆ విరజాజి పూలబంతి కూడ మోయలేనంత సుకుమారమా అన్నట్లుగా వున్నారట సీతమ్మ తల్లి...అందుకనే మన జానపద కధలలో రాకుమారి ని ఏడుమల్లేల ఎత్తు అని వర్ణన చేసేవాళ్ళు....(నేను కూడా నా భార్య ను వివాహం అయిన కొత్తలో ఏడుమల్లేల సుకుమారి అని ఆటపట్టించే వాడిని)....
మరి ఇంత సుకుమారి అయినా సీతమ్మ ఎంతో బరువైన శివధనస్సుని అలవోకగా ప్రక్కకు జరిపినది ఈ సుకుమారి చిన్నదేనా...అంత పెద్ద కార్యం చేసిననూ తనకూ ఏమి తెలియనట్టు నవ్వుతూ సుకుమారంగా వున్నదా...ఏమి ఈ జాణ తనం....
అమ్మవారిపై జాణ అనే పద ప్రయోగం పెద్ద సాహసం అయితే కవి సమర్ధన చేసుకోవటం ఎలాగంటే శివుని విల్లుని సోదాహరణంగా తీసుకోవటంతో సరిపోయింది.
సాధారణ గృహకృత్యాలలో సతమతమైన గృహస్థు సంతానం ఏవో కొత్త కోరికలు , నూతన భాధ్యత నిర్వాహణకు బెంబేలు పడుతుంటే స్త్రీ తనదైన ఆచరణాత్మక ఆలోచన తన పొదుపు నుంచి భర్తను కాపాడికూడా...ఏమి తెలవన్నట్టుగా వుంటారు....అదే ఇది..
ఇక తరువాత వాక్యాలు కి వెళదాం.....
"ఔరా అని రామయ కన్నులు మేలమాడి నవ్విన సిన్నెలు
సూసి అలకలొచ్చిన కలికి ఏసినది కులుకుల మెలికి...."
సీతమ్మ వారి సౌకుమార్యం చూసి రాములవారు ఆశ్చర్యం తో భలే భలే అన్నట్టుగా సీతమ్మవారికన్నులలో కొంటేగా చూశారట...
మరి చూశారా మేలమాడి అనే పద ప్రయోగం...సాధారణంగా వధూవరుల మధ్య కాని బావమరదల మధ్యకాని ఓక విధమైన మనోహరమైన శృంగార వెటకారం వేళాకోళం వుంటుంది... కాని ఇదే వరుస అయినవారి మధ్యమాత్రమే సన్నిహితత్వం తో కూడిన హస్యసంభాషణను మేలమాడటం అంటారు.
దీనితో సీతమ్మ వారు రాముల వారి భావం గ్రహించినదై కొంత అలకతో కూడిన సిగ్గుతో నవ్వినారట....
మరి తరువాత చరణాలు కి వెళదామా.....
"సిరసొంచి కూరుసున్న గురిసూసి సేరుతున్న(2)
సిలకమ్మ కొన సూపు సౌరు బొండు మల్లె చెండు జోరు"
ఇంత చేసిన సీతమ్మ వారు ముగ్ధమనోహరంగా తలవంచి కూర్చుని...తన కొన చూపుతో రాములవారిని అందంగా చూస్తున్నదట...అది ఎలా బొండుమల్లే చెండు జోరు....ఆమేను ఏమో విరజాజి గా వర్ణించుతూ....కాని ఆమే చూపులను బొండుమల్లేలుతో వర్ణించటం గమ్మత్తు... బొండుమల్లేలు సౌరభం గుబాళింపు వధూవరుల మధ్య ఎనలేని సాన్నిహిత్యం కలుగచేసి ఓకరిపై ఓకరికి ఆకర్షణ బలపడేవిధంగా వుంటుంది... అందుకే ఆ పద ప్రయోగం....
మరి సౌరు అన్న పదానికి అర్ధం అందంగా నవ్వటం అని...వధువు తన మనోహరమైన నవ్వుతో సిగ్గుతోను వరుని మదిలో స్థానం అనే భావనలో ప్రయోగం....
మరి తరువాత చరణాలు కూడా చూద్దాం.....
"సేరే ఆ సూపుల తళుకు ముసురుతున్న రామయ్య రూపు(2)
మెరిసే నల్ల మబ్బైనాది వలపు జల్లు వరదైనాది."
పంట పండాలి అంటే వర్షం అవసరం...ఆ వర్షం నల్లమబ్బుల రూపంలో వస్తుంది...
మరి సీతమ్మ వారు మనోహరమైన సిగ్గు నవ్వులతో రాముని వారు ప్రేమాస్పదుడై అమ్మవారిపై వర్షపు మబ్బులా తన ప్రేమ ఆప్యాయత ఆనే వర్షం వరద వచ్చేంతగా కురిపించారట...
ఈ వాక్యాలు లో తళుకు, నల్లమబ్బు ,వరదైనాది పద ప్రయోగాలు విశిష్టత కలిగినాయి....తళుకు అనేది స్త్రీ తన అందచందాలు ప్రవర్తనతో భర్తను ఆకట్టుకుంటదని.....
నల్లమబ్బు....నల్లమబ్బు లో మాత్రమే వర్షపు నీరు దాగి వుంటుంది అని తన భార్య పై పురుషునకు అదేవిధమైన ప్రేమ కలిగివుంటుంది అని....
ఇంతటి అనురాగ పూరితమైన సంసారంలో వలపు వరదలా వుంటుంది అనేది కవి భావన...
మరి ఇంతటి గొప్ప సాహిత్యం... దాని వెనుక పరామార్ధం...ఎంతమంది వధూవరులు ఆచరణో....అసలు వారికి తెలుసా...ఏమో....తెలిసినది ఓకటే ఈగోలు , ప్యాకేజిల మధ్య చిక్కుకుపోతున్నారు....
మీ అభిప్రాయం తెలపండి
ఆలపాటి రమేష్ బాబు
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో
విజయవాడ.
9440172262 వాట్సప్...., టెలిగ్రాం...
rameshsssbd@gmail.com.
సకలం సర్వం...
శ్రీరామ జయం.
9, మార్చి 2023, గురువారం
సంపుటీకరణ - మంత్ర వివరణ
సంపుటికరణ...
బహుశా ఈ పదం చాలా మంది సాధారణ ప్రజలకు కొత్త. కాని అధ్యాత్మికత రంగంలో శ్రద్ధ వున్నవారికి ఇది తెలుసు, మరీయు బీజాక్షరాలు అన్నీయును పరమేశ్వర ప్రోక్తం అన్నది గమనార్హం. మరి ఈ బీజా ఆక్షరకూర్పు మంత్రం అన్నది కూడా మీకు తెలుసు.
సహజంగా మానవుడు అనేక రకాల కామ్యంలు గురించి మంత్ర సాధన చేస్తాడు. అవి అతని జీవన కాలంలో ఇంక చెప్పాలంటే త్వరగా సిద్ధించితే ఫలితంను పరమేశ్వరాను గ్రహంగా భావించి సంతోషించి ఆనందపడతాడు. కాని కొంతమందికి అది జీవనకాలంలో సాధ్యపడదు. ఎందుకు ఎలా అనేదానికి పరిష్కారం చిక్కదు.
ఇది ఈనాటి జీవన విధానంలో కాదు పూర్వం
మహర్షుల కాలంలో కూడా వున్నదే..అందుకు ఋషులు పరమేశ్వరుని ద్వారా సందేహ నివృత్తి కై పరమేశ్వర మంత్రం సాధనలో కల అవరోధాలను , సాధనలో ఫలితాలలో కల ఆలస్యాలు వలన మేము ఈ జన్మలో సంకల్ప సిద్ధి లేక ..కొండకచో ఆయష్షు తీరి మరుజన్మ ఎత్త వలసి వస్తున్నది...అప్పుడు కూడా సంచిత ప్రారబ్దకర్మలు వలన అనేకానేక ఇబ్బందులు వీటీని దాటగలటానికి తరుణోపాయం తెలియచేయగలరు అని అడగటంతో..ఆయన వారికి ఈ సంపుటికరణ ను సూచించారు.
అసలు సంపుటికరణ అంటే ఏమిటి.. కూర్పు లేదా జోడింపు. అనగా మన కామ్యసిద్ధిగా జప , పారాయణలో వున్న మంత్ర , స్తోత్రాలకి ఇంకోక వేగ వంతమైన మంత్రం జోడించి జప , హోమ , తర్పణాదులు చేయాలి. స్తోత్రాలకి అయితే పారాయణ మాత్రం సరిపోతుంది. అనగా మన గృహిణులు లలిత పారాయణ చేస్తారు..అందులో వున్న ఓక్కో శ్లోకం కొన్ని నామాలా కూర్పు గా వుంటుంది. మీరు సంకల్ప కార్యసిద్ధి త్వరగా కావాలంటే ఈ స్తోత్రాలకి మరో నామం కాని శ్లోకం కాని సంపుటి చేయాలి...
ఇది ఎలాగంటే లలితలో ప్రారంభ శ్లోకం అయిన
శ్రీమాత శ్రీమహరాజ్ఞి శ్లోకం చదివి తదుపరి మీరు సంపుటి చేయవలసిన శ్లోకం పఠించాలి.
ఇలా అన్నీ శ్లోకాలకి ముందు పారాయణ శ్లోకం తదుపరి సంపుటి శ్లోకం చదివాలి ఇందువలన మీ సంకల్ప సిద్ధి నందు వేగం కలుగుతుంది.
సాధారణ శ్లోకం మీరు ఓక్కసారి పారాయణ చేస్తే సంపుటీ శ్లోకం బహుమార్లు పారాయణ చేస్తారు. అందువలన ఈ సంపుటి శ్లోకం మీ సంకల్పంనకు ప్రచోదనం లా పని చేస్తుంది.
సాధారణ పరిభాషలో వేగంగా వెళ్ళు కారుకి ఇంకొంత వేగంగా వెళ్ళు శక్తిని జోడింపు.
ఇది ఓక తాంత్రిక పద్ధతి. సాధారణంగా తాంత్రిక పద్ధతి వామాచారంలో గమనిస్తాం. మరి ఈ వామాచారం అంటే ఏమిటి...
సాధరణంగా మనం చేయి పూజలు పురాణోక్త , వేదోక్తంగా వుంటాయి వీటిలో వాడు వస్తువులు కూడా పండ్లు , పూలు లాంటివే . కాని వామాచారంలో మద్య , మాంసాలు లాంటి మరికొన్ని ఉపయోగం చేస్తారు. మనం పూజించి దేవతా రూపాలని బట్టి ఈ వస్తు వినియోగం వుంటుంది. అనగా శాంతరూపాలకి ఓక విధంగా , అదే దేవత తామస రూపాలకి మరో విధంగా వుంటుంది. ఇది ఎలాగంటే లలిత , రాజరాజేశ్వరి శాంత రూపాలైతే తామస రూపాలైన కాళి ,(కాళిలో 24రూపాలు),భైరవి ,చండి లాంటివన్నమాట..అంత మాత్రం చేత భయపడవలసిన పనిలేదు. అమ్మ సదా అమ్మే...చాలామంది మూఢనమ్మకాలతో అమ్మో ఆరూపం చెడు ఈ రూపం చేటు అనే వాఖ్యానాలు చేస్తారు...కాని జగన్మాత ఏ రూపంలో వున్నను తన సహజ లక్షణమైన కరుణను విడవదు...ఇది తెలిసిన వారికి కాళి రూపం ముగ్దమనోహరంగా దర్శనం...అందుకే రామక్రిష్ణ పరమహంస కాళిరూపంలో మమేకం అయి సదా ఆమే ధ్యానంలో వుండేవారు.
అసలు వామాచారంనకు ఆ పేరు రావటంనకు గల కారణం...అర్ధనారీశ్వర రూపంలో గల వామభాగం నందు అమ్మ వుండటమే. మనం ఈశ్వరుని ధ్యానిస్తే సరిపోతుందా...ఆయన వరం ఇవ్వటానికి అమ్మ ప్రోద్బలం వుండాలిగా అందుకే సంపుటిలో అమ్మవారి నామం జోడింపుతో అమ్మ వాడు నా బిడ్డ వాడి సంకల్పం ఏమి చేశారు అని ఈశ్వరుని కోరి సిద్ధింప చేస్తుంది. కావలంటే గమనించండి మన ఇళ్ళల్లో పిల్లలు తండ్రికి చెప్పినా చేయని పనిని తల్లిద్వారా అడిగి చేయించుకుంటారు. ఆకార్య సాధనలో భర్తతో విముఖత అయినా లక్ష్యపెట్టదు. ఆమేకి కావలసినది తన బిడ్డ మనోరధం తీర్చటం. సాధారణ గృహిణిలే ఇలా వుంటే జగద్ధాత్రి ఆ పరమేశ్వరి ఏరూపంలో వున్న తన బిడ్డ సంకల్పం మరచిపోతుందా...ఇది ఇంకనూ సూక్షంగా చెప్పాలంటే శిశువు స్తన్యం గురించి రోదన చేసే సమయంలో దూరంగా తల్లి తండ్రి వున్నను ప్రకృతిలోని సూక్ష్మ ప్రకంపనల వలన తల్లికే ముందు తెలుస్తుంది. శిశు రోదన వలన స్తన్యం ఉబికి వక్షం భారమవుతుంది. అందుకే తల్లులు శిశువు రోదన ప్రారంభం కాగానే స్తన్యం ఇవ్వటానికి తపన పడతారు. ఇది మరీ ఏక్కవగా ఆవు, దూడలలో మనకు తెలుస్తుంది.
నేను సంపుటి గురించి తెలుపుతూ ఇవి అన్ని తెలపటం వేరు కాదు...మీరు భయపడవలసిన పనిలేదని తెలపటం.
ఈ సంపుటిలో కొన్ని సార్లు పాశుపతం కూడా సంపుటిస్తారు. అసలు సంపుటి శ్లోకం , మంత్రం ఎలా ఎన్నుకోవాలి. మీ నామ నక్షత్రాలకి , దశ నాధులకి , సంకల్ప కార్య సాధనకి గల అధిష్టాన దేవతను బట్టీ ఎన్నుకోవాలి. ఇది వ్యక్తిని బట్టి , సందర్భాన్ని బట్టి మార్పు వుంటుంది. కనుక మీ సంకల్ప సిద్ధికై తగు శ్లోకంతో సంపుటికరించి లబ్దిపొందండి.
సర్వులకి శ్రీరామ జయం.
ఆలపాటి రమేష్ బాబు
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో
విజయవాడ
94401 72262
పై వ్యాసంలోని సందేహలకి సంప్రదించండి.
5, మార్చి 2023, ఆదివారం
వాలి సంహారం అంతర్గత రహస్యాలు
రాముడు - పరిశీలన - సీరిస్ 4
************************
వాలి సంహరం.
రామాయణం తో పరిచయం వున్న ప్రతి ఓక్కరికి తెలిసే పాత్రలు.వాలి,సుగ్రీవులు.
మన తెలుగు నాట సతతంకీచులాడుకునే అన్నదమ్ములను నర్మగర్భంగా..ఆ.... వారి మధ్య వాలి సుగ్రీవుల సంబంధం అని ఉదహరిస్తారు. ఆ శ్లేష...తెలిసిన వారికి మాత్రం అర్ధం అవుతుంది... ధనం గురించో , కుటుంబ స్త్రీల గురించో వారిలో వైరుద్ధ్యాలున్నాయని....
పౌరాణికంగా ఆంజనేయుని విశిష్టత ముందు వాలిప్రభ మనకు అంతగా పరిచయం లేదు...
కాని వాలి మహ వీరుడు...కాకపోతే స్త్రీ వ్యామోహి...
వాలి ఇంద్రుని కుమారుడు. వాలి తండ్రి ఋక్షరజుడు...(కొంతమంది వృక్షజుడు అంటారు..అంటే చెట్లమీద పుట్టినవి...అని.. చెట్లమీద ఏమి వుంటాయి..పక్షులు , కోతులు)
ఇతను వానర రాజు...ఇతను ఓకరోజు పొరపాటున ఓక కొలనులో పడి...అప్సరస గా మారిపోతాడు...ఈ అప్సర సౌందర్యం చూసిన ఇంద్రుడు మోహించి కామించి...ఆమేను చెర పట్టుతాడు...ఈ హడావుడి ఇలాగుంటే ఇదే అప్సరను బ్రహ్మదేవుడు చూసి కామించి మోహించి..తాను కూడా ఆమేతో పొందుకోరతాడు..(.వీళ్ళద్దరు ఆమేతో సంగమం నేను కొద్దిగా శ్లేషగా వివరిస్తున్నాను...మీరు అర్ధం చేసుకోండి). ఈ అప్సర వాలభాగం నుంచి ఇంద్రుడు సంగమించి ఆప్రదేశంలో తన వీర్యనిక్షిప్తం...కంఠభాగంలో బ్రహ్మ సంగమించి... తన వీర్యనిక్షిప్తం.... అందువల్లనే...ఇంద్రాంశతో...వాలి..బ్రహ్మంశతో సుగ్రీవజననం. ఇద్దరూ మహవీరులే. ఇంద్రుడు
తార అనే అప్సరసను వాలికి ఇచ్చి భార్యను చేస్తాడు, అలాగే విపరీతమైన మహిమగల ఓక హరం ఇస్తాడు.
కాకపోతే మొదటి నుంచి సోదరుల మధ్య స్త్రీ పర వైషమ్యం వున్నది. అది తార , వాలి భార్య కావటంతో కొంత ముదిరి పాకాన పడింది... ఇరువురి మధ్య ప్రచ్ఛన వైరం....
దీనితో బ్రహ్మదేవుని గురించి వాలి తపస్సు చేసి...లౌక్యంగా ఓక వరం కోరతాడు..యుద్ధంలో తన ప్రత్యర్ధి నుండి తనకు సగం బలం సంక్రమించాలని కోరతాడు...దానితో బ్రహ్మ ఆ వరం ఇస్తాడు. బ్రహ్మ నాలుగు తలకాయలు వున్నను తేడా పడి...తపస్సుకు వరం కాబట్టి ఇస్తాడు. వాలి యొక్క శత్రవు సుగ్రీవుడు తన కుమారుడు (అంశ)అన్న విషయం మరచి పోతాడు. (కొన్ని వాటిల్లో వాలికి వరం బ్రహ్మ ఇచ్చారని మరికొన్నింటీల్లో ఇంద్రుడు ఇచ్చారని వున్నది...మొత్తానికి వరం వున్నది )(అందుకే మనవాళ్ళు అంటారు బ్రహ్మ నాలుగుతలలులో ఓకటి అవునంటది ఇంకోటి కాదంటది మరోకటి లేదంటది ఆతరువాతది చూద్దాం అంటుంది అంటారు)... దీనితో వాలి , సుగ్రీవుని లక్ష్య పెట్టని రీతిలో కిష్కింధను పాలిస్తుంటాడు.
ఇంతలో దుందుభి అనే రాక్షసుడు వాడి వీరత్వాన్ని పరిశీలించుకోవటానికి వరణుడు , సముద్రుడు లను యుద్ధానికి ఆహ్వానిస్తారు.
దానితో వారిద్దరు తమ వల్లకాదు ..నీ వీరత్వం మొత్తం.. వాలి వద్ద ప్రదర్శించు అంటారు. దానితో వాడు దున్నపోతు రూపం ధరించి వాలిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు. కాని వాలి అనునయంగా వద్దులే అంటాడు..కాని దుందుభి.. వాలి వీరత్వాన్ని కించపరిచే మాటలు పలుకుతాడు...దానితో వాలి దుందుభి తో యుద్ధానికి దిగి వాడితో పోరాటంలో భాగంగా వాడి కొమ్ములు పట్టుకుని గిరగిరా తిప్పి విసరివేస్తాడు..వాడేమో ఋష్యమూక పర్వతంపైన వున్న మతంగమహర్షి ఆశ్రమంలో పడి రక్తం కక్కుతూ మరణిస్తాడు. దీనితో మతంగమహర్షి.. ఆశ్రమప్రాంతం కలుషితమైనదన్న ఆగ్రహంతో వాలిని ఋష్యమూక పర్వతంపై అడుగు పెట్టితే నీ తల వేయి ముక్కలవుతుంది శాపం పెట్టుతాడు...ఈ విషయం తెలిసిన వాలి ఋష్యమూక పర్వతాన్ని వదిలి మిగిలిన ప్రాంతాల్లో సంచారం.
ఇది ఇలావుంటే వాలికి రావణునితో విపరీతమైన మైత్రి ఏర్పడుతుంది . ఇదో విచిత్ర సంబంధం. రావణునికి విపరీతమైన అహం..తాను వీరాధివీరుడననని...దానితో ఓకసారి కార్తవీర్యార్జునుడిపై యుద్ధానికి సిద్ధపడతాడు. కార్తవీర్యార్జునుడు తన సహస్రబాహువులచే రావణుని బంధించితే రావణునికి ఊపిరందక గిలగిలాడిపోతు శరణుజోచ్చి అగ్నిసాక్షిగా మైత్రి చేసుకుంటాడు.
అయిననూ బుద్ధి రాక మరోక్క సారి వాలిపై యుద్ధానికి వస్తాడు. ఆసమయంలో వాలి సంధ్యావందనంనకు సముద్రతీరానికి వస్తాడు..ఆ సమయంలో రావణుని కవ్వింపు... దానితో వాలి రావణుని క్రిమి కీటకంతో సమానంగా భావించి ఓక్కసారిగా రావణుని చంకన పెట్టుకుని ఆకాశపయనం...
వాలి ప్రతిరోజు తన సంధ్యావందనం లో భాగంగా...సప్తసముద్రాలలో సూర్యుడు ఏ సముద్రం వద్ద ఉదయించుతాడో...అంతకన్నా ముందు వెళ్ళి పూజాదికాలు చేసేంత వేగం.
ఇలా సప్తసముద్రాలను రెండు ఘడియలలో చుట్టి వచ్చేంత వేగం. ఇలా రావణుడు వాలి చంకలో బందిగా చాలా రోజులు వుంటాడు.ఇదే సమయంలో వాలి ప్రవర్తన వలన వాలికి గల స్త్రీ వ్యామోహం తెలుసుకున్న వాడై. రావణుడు ఎలాగోలా అగ్నిసాక్షిగా మైత్రి. ఈ మైత్రికి ఓక ఓప్పందం ఇస్తాడు రావణుడు.లంకలోని సమస్తానికి తన భార్యలతో సహ..తనతో పాటు అనుభవించే సహ హక్కులు ఇస్తాడు. కాని వాలి పట్టించుకోక ఓక నెల వుండి వస్తాడు.
దుందుభి కొడుకు మాయావి అనేవాడు వచ్చి వాలిని కవ్విస్తాడు..దానితో వాలి వాడి వెంటపడతాడు...ముందు మాయావి తరువాత వాలి...వీరి వెనుక సుగ్రీవుడు..
మాయావి ఓక గుహలో ప్రవేశిస్తాడు...వాడి వెంట వాలి...సుగ్రీవుడు తన అన్నగారి కోసం బయటనే ఆగి ఎదురు చూస్తుంటాడు...ఓక నెలరోజుల తరువాత గుహనుంచి అరుపులు కేకలుతో పాటు రక్తం బయటకు వస్తుంది...అది తన అన్నగారిదేనన్న భావనతో సుగ్రీవుడు లోపల వున్న మాయావి మరలా బయటకి రాకూడదని ఓక పెద్ద బండరాయి ని గుహకి అడ్డుగా పెట్టి తిరిగి రాజ్యానికి వెళ్ళి..మంత్రుల సలహపై రాజ్యపాలన చేస్తుంటాడు...కాని వాలి లోపల మాయావిని సంహరించటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది... బయటకు వచ్చిన వాలికి..అది సుగ్రీవరాజ్యం అని తెలుస్తుంది. దానితో తమ్మునితో యుద్ధంచేసి తమ్ముని ఓడించి...రాజ్య బహిష్కరణతో పాటు...తమ్ముని భార్య రుమ ని స్వాధిన పరుచుకొని...సుగ్రీవుడు తన రాజ్యంలో వుంటే మరణశిక్ష అనే ఆదేశం...దానితో సుగ్రీవుడు తన మంత్రులు అయిన హనుమ , జాంబవంతుడు , సుశేషణుడు మొదలగు వారితో ఋష్యమూక పర్వతంపైన నివాసం...మంచి కాలం కోసం ఎదురు చూపులు...
ఇటువంటి నేపథ్యంలో సీతాపహరణం...ఆమేని అన్వేషిస్తూ రామలక్ష్మణుల వెదుకులాటలో జటాయువు ని కలుస్తారు. ఇతను పక్షిరాజు.ఇతను దశరధుని మిత్రుడు. రామభక్తుడు. కధా కాలానికి వృద్ధుడైనాడు.ఇతను గరుత్మంతుని సోదరుని కుమారుడు. ఇతను మొదటిసారిగా రామునికి సీతాపహరణం జరిగినది రావణుని వలన అని తెలియచెప్పి ...తాను సీతాపహరణాన్ని ఎలా ఎదుర్కోన్నది...వీటితోపాటు రావణుని తాలూకు అన్నీ వివరాలు తెలిపి...వాడిని ఎదుర్కోవటంలో భాగంగా తగిలిన గాయాలతో పాటు ఋష్యమూకపర్వతం పైన తగిన జాడలు కాని తగు సహయం కాని లభిస్తుంది ఆని తెలిపి ప్రాణత్యాగం చేస్తాడు. దీనితో రాముడు ఎంతో బాధతో జటాయువు కి అగ్నిసంస్కారం జరిపి ఉత్తమగతులు కల్పించుతాడు. (గమనించారో లేదో రాముడు పక్షి కి కూడా అగ్ని సంస్కారం చేస్తాడు. కాని నేటి కాలంలో స్వంత తల్లి తండ్రులకి చేయాలంటే నీవంటే నీవు అనుకుంటూ ఆస్థులు లెక్క తేలేంత వరకు విభేదాలు... మరి ఈ కోవిడ్ రోజుల్లో ఈ గోల మొత్తం మునిసిపాలిటీ వాళ్ళు చేస్తుండటంతో మన సన్నాసులు విపరీతమైన నటన ప్రదర్శన . నేటికి ఆవుకి మాత్రమే అగ్ని సంస్కారం కొంతమంది చేస్తున్నారు)
తదనంతరం రామలక్షణులు ఋష్యమూక పర్వతం వద్దకు వస్తారు...అక్కడ వున్న హనుమని మొదట గుర్తించి హనుమని ఆలింగనం చేసుకుని సుగ్రీవునితో పరిచయం.సుగ్రీవునికి అనుమానం వీరు వాలి పంపిన చారులని...వీరి ఉభయులు మధ్య పరిచయాలు కష్టసుఖాలను పంచుకున్న తరువాత ఇద్దరునూ ఓకే విధమైన కష్టాలలో వున్నారని...కాకపోతే రాముడు సుగ్రీవుల మధ్య వానర మానవ బేధం తప్ప అంతా ఓక్కటే.దీనితో ఇద్దరు ఓకరికొకరు సహయం చేసుకోవాలనే నిశ్చయంకి వస్తారు. అయిననూ సుగ్రీవునకు ఇంకనూ శంక..వాలి వధ..రాముని వల్లన అవుతుందా...దానిని లౌక్యం గా అడుగుతాడు...మీ అన్న ఎంత విశేష ప్రజ్ఞ , వీరత్వం కొద్దిగా తెలుపుదూ అంటే...ఓక ప్రదేశంలో వున్న 7సాల వృక్షాలను చూపి మా అన్న వీటిన్నంటిని కలిపి ఓక్క సారిగా పెకలించ గలడు అన్నాడు. దీనితో రాముడు తన బాణం సంధించి వదులుతాడు...ఆవిఅన్నీ...ఓక్కసారిగా నేలకూలుతాయి...దీనితో సుగ్రీవుడు స్థిమితపడి రామునిపై సంపూర్ణ విశ్వాసం ప్రకటించగా...అగ్నిసాక్షిగా వీరిద్దరి మధ్య స్నేహ సంబంధం ఏర్పడుతుంది. రాముడు సుగ్రీవునికి రాజ్యం , అతని భార్య లభ్యతలో సహయం చేయాలని...అలాగే సుగ్రీవుడు సీతాన్వేషణకి అవసరమైన సహయం చేయాలని.
దీనితో సుగ్రీవుడు రాముడు వెన్ను వున్నాడన్న ధైర్యం తో వాలిని ద్వందయుద్ధానికి ఆహ్వానిస్తాడు...అసలే తమ్మడంటే పడని వాలి కోపంతో యుద్ధం చేస్తాడు...ఇరువురు ఏక సమయంలో జన్మించిన నందున ఏకరూపంలో వుంటారు రాముడు కొద్దిగా గందరగోళం పడి తన బాణ ప్రయోగం చేయడు. దానితో వాలి సుగ్రీవుని తీవ్రంగా గాయపరచి ఓడించుతాడు. వాలి వెళ్ళగానే సుగ్రీవుడు రామునితో నీవున్నావన్న నమ్మకంతో కదా నేను యుద్ధం సిద్ధం అయినది...ఇలా జరిగింది ఏమిటి అని వాపోతాడు...దానికి రాముడు... మీ ఇరువురూ ఓకే విధంగానే వున్నారు...నేను ఆనవాలు కట్టలేక పోయాను అంటూ మీ అన్ననూ మరలా యుద్ధానికి పిలువు..ఈసారి నిన్ను గుర్తింపు కి వీలుగా ఈ పూలమాల ధరించు అని సూచనతో...అదే విధంగా చేసి..అన్న అయిన వాలిని మరలా యుద్ధానికి ఆహ్వానిస్తాడు...వాలి సిద్ధపడతాడు...కాని తార వారించుతుంది..ఇంత అర్ధరాత్రి పూట యుద్ధ ఆహ్వానం అంటే ఎదో అనుమానంగా వున్నది...అందునా మన చారుల వార్త ప్రకారం సుగ్రీవునకు రాముడనే వానితో స్నేహం ఏర్పడినది...అతను మహ ప్రజ్ఞ కలవాడు అని తెలిసినది....కాని వాలి ఆవేశంలో ఈమాటలు లక్ష్య పెట్టక...వీడికి ఈసారి మరణమే శరణ్యం లాగున్నది...అని యుద్ధానికి బయలుదేరతాడు.
వాలి సుగ్రీవుని యుద్ధంలో సమయంచూసి రాముడు చెట్టు చాటునుంచి వాలిపైకి తన బాణం ప్రయోగిస్తాడు...దానితో వాలి నేలకూలతాడు....వాలి వలవలా ఏడుస్తూ రాముని అనేక ప్రశ్నలు సంధిస్తాడు...
రామా వానరాన్ని...నీకు ఆహరంగా పనికిరాను...నీ భక్తుడనే...వీరుడవే..చాటునుంచి కొడతవా...ఇది న్యాయమా...అంటాడు...పోని సీత గురించి అంటావా...ఆవిషయం నీవు తెలిపితే చాలు..నేను రావణుని ఆజ్ఞాపించితే చాలునే రావణుడే స్వయంగా సీతను తిరిగి తీసుకుని రాగలడే..
దీనికి రాముడు సమాధానంగా...
వాలి...నీవు నా భక్తుడవు అన్నమాట నిజమే..ఈ విషయంలో నీపట్ల ప్రపన్నత వున్ననూ..ఇది నీ తప్పులను కాయదు...పుత్ర సమానుడైన తమ్ముని భార్యను చెరపట్టటం..నీ అహంకారపూరిత ప్రవర్తన...వానరుల పట్ల నీ ప్రవర్తన నీవు జ్ఞప్తీకీ తెచ్చుకో..అందునా మేము క్షత్రియులము వేట మా నైజం...నీవా వానరానివి,జంతు సమానుడివి కాబట్టి వేటాడాను...పోని నేను నిన్ను ఎదుర్కోవాలంటే నీ వరం వల్లన అది సాధ్యపడదు...ఇది మా మహరాజ్యం..ప్రస్తుతం రాజప్రతినిధిగా ఈ ప్రాంతంలో వున్నా...రాజప్రతినిధికి వున్న దండనాధికారం గురించి నీకు తెలియనది కాదు...అయిననూ నీ పశ్చాత్తాపం వలన నీ ప్రాణం నిలబడక పోయినూ నీకు సద్గతి వున్నది...నీ అంతిమ కోర్కేను అమలు పరచటం నా కనిస ధర్మం...
అనగా..వాలి..రామచంద్రా..బుద్ధికర్మాను సారణి అన్న విధంగా ప్రవర్తించా..ఈనాడు ఆలోచిస్తే తెలుస్తుంది.. కాని నా బాధ ఈనాడు... అంగదుని గురించే...దీనితో రాముడు అంగదుని బాధ్యత తనదని చెప్పి...అంగదుడు యువరాజుగానే వుంటాడు అన్న మాటతో వాలి సంతృప్తిగా మరణిస్తాడు...
ఇది మొత్తం పౌరాణిక కధ...
వాల్మీకి వారి నామధారణలోనే వారి బుద్ధులు తెలిపినాడు.. వాలం అంటే తోక..ఓక విధంగా అది వాడి ఆధినంలో వుండదు అని భావన..అనగా వాలి ఇష్టానుసారం ప్రవర్తన అని సూచన..సుగ్రీవుడు.. అనగా మంచి వారిలో కొమ్ము లాంటి వాడు..అనగా నమ్మ దగిన వాడు..అందునా సుగ్రీవుడు బ్రహ్మ అంశ , హనుమంతుడు శివాంశ వీరిద్దరూ కలసి నారాయణాంశకై ఎదురు చూపు...ఇక త్రిమూర్తులు చేరికతో తదుపరి జగన్మాత సీతమ్మ రక్షణ...రావణ పతనంనకు ఇది సూచన.
రావణుడు , వాలి మధ్య ఉమ్మడిస్నేహకారణం స్త్రీ వ్యామోహం. వాలి చనిపోయే ముందు నీ భక్తుడను అంటాడు..మరి అంతటి వినయవిధేయతలు వున్నవాడు...సీతాపహరణ విషయం వాడికి తెలసి ఉదాసీనత తో వూరకున్నాడు...ఈ విషయం రామునికి తెలియదా..అంటే వాడి ఉద్దేశ్యం మంచా చెడా... వాలి మాటతో రావణుడు సీతను తిరిగి తెస్తే...రాముని వ్యక్తిత్వ ,క్షాత్ర హీనత అవుతుంది.
ఇక సుగ్రీవ స్నేహనికి రాజకీయ కారణం..నిర్వాహణ కారణం ..సూత్రబద్ధ ధర్మ కారణ హేతువులు వున్నాయి.
కిష్కింధలోని వానరులు , సుగ్రీవుడు సర్వులు వాలి భాధితులే...వాడి అహంకార పూరిత ప్రవర్తనకి విసిగి వేసారి పోయారు...పోని ఎదురుతిరిగే అవకాశం కూడా లేదు వాడి వరం వల్లన ఇది మనకు సుగ్రీవుని భార్య రుమని తన స్వాధీనం లో వుంచుకోవటమే..ఆమే ఏమి చేయలేదు..హితులు సన్నిహితులు ఏమి చేయలేక బయటకు రావటమే సూచన. దీనితో వాళ్ళను వాలి నుంచి ఎవరు కాపాడుతారో అన్వేషణ...ద్వంద యుద్ధంతో పనికి రాదు..అస్త్రనిపుణుడే కావాలి...వానరుల హస్తనిర్మాణం విలువిద్యకు సరికాదు...ఓకవేళ ఎవరైనా వున్ననూ వారు నిపుణులు కాదు...దాదాపు వానరులు అందరూ ద్వంద యుద్ధంలో గాని , భుజ బలం వల్లకాని , గద , పరిఘ , బరిశ లాంటి ఆయిధప్రయోగం..అవి వాలి వద్ద పనికి రావు..కారణం అవి ముఖతా ప్రయోగం...కాని శర అస్త్ర ప్రయోగం అలాకాదు దూరం నుంచి అవకాశం... అందుకే సుగ్రీవుడు రాముని విలువిద్యా నైపుణ్యం పరిక్షించుతాడు..దానితో సుగ్రీవునికి నమ్మకం కుదురుతుంది. వానరులకి వాలి పీడ పోయిన తరువాత అంత ఉత్సాహంగా కోట్లాదిమంది రామదండుగా కదులుతారు.
రాముని కారణాలు రాముని కున్నాయి...
ముందు రాముడు ఎంత వీరుడైననూ రావణుని వంటి వాడి మీద దండయాత్రకు తాను ఒక్కడే చాలడు..ఈ విషయం పై పూర్తి అవగాహన వున్నది. అందుకే తోడ్పాటు కావాలి. ఎవరన్నా రాజసహయాం అడిగితే ఇతని క్షాత్రంనకు అవమానం..అలా జరిగితే రాముని వ్యక్తిత్వం వీరత్వం బలహీనపడుతుంది...పోని అటువంటి వాడు దొరికినా రాముడు అతనితో స్నేహనికి ఆరాజు యొక్క అంతఃపురానికి వెళ్ళాలి..అప్పుడు తన తండ్రికి ఇచ్చిన మాటకి వాగ్దాన భంగం జరుగుతుంది... అరణ్యవాసం పదనాలుగు సంవత్సరాల కాలంలో ఏ రాజ్యవాసం చేయరాదు.. అందువల్ల తప్పని సరిగా అరణ్యవాసులతోనే స్నేహం..వారి సైనికులతోనే దాడి చేయాలి. రామునికి వానరుల సహయాం కావలని జటాయువు తో మాట్లాడిన తరువాత అవగాహన కి వస్తుంది.. మరి దగ్గరలో అందుకు తగ్గ వానర రాజ్యం..కిష్కింద మాత్రమే...పోని వెనుకకు పోయి తనకు తెలిసిన వానర రాజ్యాల సహయం తీసుకోవాలన్నా సమయాతీతం..అప్పటికే అరణ్యవాసంలో పదిసంవత్సరాల కాలం అయిపోయింది...వెనుకకూ పోయేది ఎప్పడు అందుకు తగ్గ వానరులను వెదికి వాళ్ళను కూడగట్టి తీసుకుని రావాలి అంటే పూర్తి సమయాతీతం..సమయంలో అయోధ్య కి తిరిగి వెళ్ళక పోతే భరతుని ప్రాణత్యాగం అనే మాట ఇన్ని పరిధిల మధ్య సుగ్రీవ స్నేహం చేయాలి, అందునా వానరులు , వానరప్రముఖులు సుగ్రీవునితో...ఇదే కాకుండా భార్యా వియోగం , రాజ్య పాలనలో ఇద్దరిది సరిసమాన బాధ...ఓకరు పాలనలో వున్న వారికి రాజ్యం పోయింది.. రెండోవ వారికి రేపు రాజ్యపట్టాభిషేకం అనగా అరణ్యవాసం...ఓక బాధితుడు రెండోవ బాధితుడి దుఃఖం , అవసరం గుర్తించ కలడు...
అలాగే కాకుండా శత్రవు మిత్రడు కూడా శత్రువు తో సమానం అన్న రాజనీతి .
ఇది పూర్తిగా దైవ ప్రణాళిక.
ఇది రాముని రాజ , క్షాత్ర ,వీర ,వ్యక్తిత్వ ధర్మం.
ఇన్ని విధాల ఆలోచన చేసి మాత్రమే వాలిని సంహరించాడు.
సకలం సర్వం శ్రీరామ జయం.
సర్వం శ్రీరామ ప్రసాదమే...
మిత్రులకు , విమర్శకులకు స్వాగతం.
ఆలపాటి రమేష్ బాబు
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో
విజయవాడ
94401 72262
మీకు తప్పు అని తలచిన విషయం వాట్సప్ చేయండి...పరిశీలించి సరిదిద్దుకుంటాను.
ఇది నా ఘనత కాదు పూర్తిగా రామునిదే...ఆయన ఆశీస్సులు లేకుండా ఇది సాధ్యం కాదు...
కనుక సర్వం శ్రీరామ జయం.