4, ఆగస్టు 2020, మంగళవారం

లోకఃసమస్తా సుఖినో భవంతు

లోకఃసమస్తా సుఖినో భవంతు.
*********************************
లోకః సమస్తా సుఖినోభవంతు. ఈ వాక్యం మనలో చాలా మంది అనేకసార్లు విని , చదవి వుంటారు. కాని దీని విశేషం తెలుపుటతో పాటు
వర్తమాన కాల అన్వయం చేసి మన భరతజాతి గొప్పదనాన్ని పునఃశ్చరణ చేయిటయే ఈ వ్యాస ముఖ్యోద్దేశ్యం.
మన భరతజాతి లో హైందవం అనేది నేడు మతము అయినా ఇది ఓ జీవనమార్గం అనేది సత్యం.
మనం తెలుసుకో కోరే వాక్యం స్వస్తి వచనాలలో ఓ భాగంగా వున్నది. ఈ స్వస్తి వాక్యాలు మనం విశేషకార్యక్రమాలు నిర్వహించినప్పడు ఆకార్యక్రమం చివరలో బ్రహ్మగారు ఈ క్రింది మంత్రాలతో దీవిస్తారు అవి...

*******
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం!

న్యాయేన మార్గేణ మహీం మహీశాః!!

గోబ్రాహ్మణ్యేభ శ్శుభ మస్తు నిత్యం!

లోకాస్సమస్తా స్సుఖినోభవంతు !!

కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యస్యాలినీ!
దేశోయం క్షోభ రహితో బ్రాహ్మణా స్సంతు నిర్భయాః!!
అపుత్రాః పుత్రిణస్సంత్తు,పుత్రిణస్సంత్తు పౌత్రిణః!
అధనా స్సధనా స్సంతు జీవంతు శరదాం శతం!!
యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే!
వృతనాళౌ సమభవత్ తత్తే భవతు మంగళం!!
ఋతవ స్సాగరా ద్వీపా వేదా లోకా దిశశ్చతే!
మంగళాని మహారాహో దిశంతు తవ సర్వదా!!

పై శ్లోకాలు కి అర్ధం
శుభం కలుగుగాక! ప్రజలకి, న్యాయమార్గంలో వుండి ఈ భూమిని ప్రజలను ,రక్షించు ప్రభువులకి.
గోవులు  , బ్రాహ్మణులకు సదా శుభం కలుగుగాక.
లోకములో అందరు శుభముగా వుందురుగాక.
అన్నీకాలములలోను భూమిపైన వర్షాలు కురిసి పంటలు పచ్చగా పండుగాక.
దేశాలు అన్నీ ఈతి భాధలు కరువు కాటకాలు లేకుండా వుండుగాక , బ్రాహ్మణులు వారి సంతానం వారి గురుకులాలు శుభంగా వుండుగాక.
పుత్రులు లేని వారికి పుత్రులు , పుత్రులు వున్నవారు పౌత్రులు ప్రపౌత్రులతో శుభంగా వుండుగాక.
ధనంలేని వారు ధనం కలిగి , ధనం కలిగిన వారు పాడి పంటలతో చల్లగా వందసంవత్సరాలు జీవింతురుగాక.
మాకు జయం కలిగించు ఇంద్రాది దేవతలకి శుభం.
ఈ జీవనచక్రమార్గం నుంచి ఆత్మదర్శనం కావించే భగవంతునికి శుభం.
సకల సమాయాలలో సకల దిక్కులలో శుభం కలుగుగాక.
చూశారా వేల సంవత్సరాలుగా ఈ వేదభూమిలో ప్రతి ఓక్కరి మనుగడ ప్రతి జీవ జాలం మనుగడే మన కాంక్ష ఆకాంక్ష...ఈ పద్ధతే మన జీవన విధానం.
కాని వర్తమానం లో ఈ భూగోళం పై జరుగుతున్న విధానం ఏమిటి... మేము మాత్రమే బాగుండాలి అన్న అహంకార పూరిత విధానం ప్రదర్శించిన ప్రతి సమయంలో కాలపురుషుడు ప్రకృతి రూపంలో ఈ వైపరిత్యం ను సమం చేసే వెళుతున్నారు...కాలపురుషుడు తన పాఠాలు నిర్దయగా చెప్పుకుంటూ వెళుతున్నా మూర్ఖ పద్ధతిలో వున్న అనేక దేశాలకి వర్తమాన వైరస్ ఓక దండనే...ఈ వైరస్ ప్రారంభ దేశం నుంచి గమనించండి...వాళ్ళు నిజం చెప్పటానికి సిద్ధంగా లేరు కాని..ఆ దేశంలో అనేక వేల మరణాలు...మరి అగ్ర రాజ్యంలో మరణాలు లెక్క కొనసాగుతుంది...మతవాదంతో , కుట్రలు కుహకాలతో నిండిన ఇటలి పీనుగల పోగు...మరి కొన్ని దేశాలది అదే పరిస్థితి... అంత ఎందుకు మన ప్రక్కనే వుండే పాకిస్థాన్ పరిస్థితి ఏమిటి వున్నవాడు ఎవరో చచ్చేవారు ఎవరో తెలియని దిక్కుమోక్కులేని స్థితి....
ఇలా గమనించండి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే భారతదేశం బాగానే వున్నది. మేమే బాగుండాలి అన్న ప్రతి ఓక్క దేశంనకు ఈ కరోనా వైరస్ శిక్ష గా తన భాధ్యత నేరవేర్చాడు కాలపురుషుడు.

"లోకః సమస్తా సుఖినో భవంతు"
" మన సంకల్పం ఓకటై వుండుగాక
మన భావం ఓకటై వుండుగాక
మన చింతన ఓకటై వుండుగాక
మన మధ్య అద్భుతమైన సామరస్యం నెలకొనుగాక"
(అధర్వ  - 6 - 64 - 4)
ఓం శాంతి శాంతి శాంతిః.
శ్రీరామ జయం.
ఆలపాటి రమేష్ బాబు
విజయవాడ
94401 72262..




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.