4, ఆగస్టు 2020, మంగళవారం

రామో విగ్రహన్ ధర్మః

రామో విగ్రహన్ ధర్మః
ఈ వాక్యం రాముని ధర్మనిరతిని సూచిస్తూ పలువురు ప్రస్తావిస్తారు. అయితే రామాయణం లో ఈ వాక్యాన్ని వాల్మీకి గారు మారీచునితో అనిపిస్తాడు. వినటానికి మనకు గమ్మత్తుగా వున్నది. మారీచుడు ఏమిటి రాముని అంతలా విగ్రహన్ ధర్మః అనే అంతగా...వివరాలు లోకి వెళితే ...మారీచుడు రావణాసురిని వద్ధ ముఖ్యుడు. ఏంత అంటే రావణాసురిని అంతరింగక వర్గంలోని ముఖ్యుడు రావణాసురిని బంధువు. తాటకి కుమారుడు. తాటకి రావణాసురిని అమ్మమ్మ. అంటే మారీచుడు రావణాసురుని మేనమామ. ఇది వారి  సంబంధం. ఇంత విశ్వసనీయత వారి మధ్య వున్నది.
రావణుడు మారీచుని సీతాపహరణంనకు ఆజ్ఞాపించాడు. ఆ సమయంలో మారీచునకు అంతకు క్రితమే విశ్వామిత్రులతో యాగసంరక్షణార్ధం వచ్చిన రాముని చేతిలో తనతల్లి మరణం , తనసోదరుడు సుబాహు మరణం ఇత్యాదులవలన మరియు సహజ సిద్ధమైన తన రాక్షసమాయలతో ప్రజలద్వారా చారుల ద్వారా ఇలే అనేక విధాలుగా రామచంద్రుని ధర్మనిరతి ఆయన వీరత్వం కర్తవ్యపరాయణత్వం రాముని బాణం యొక్క వాడి వేడి తెలిసిన వాడగుటచేత రావణాసురునికి సీతాపహరణం కూడదు అని హితవు చెప్పే సమయంలో రావణాసురిని ఉద్దేశించి  ఉద్దశేంచి " రామో విగ్రహన్ ధర్మః" అని ప్రస్తావిస్తాడు. రావణా విను రాముడు మామూలు వాడు కాదు ధర్మం పోత పోసి సశరీరంగా నడయాడే స్వరూపం అటువంటి ధర్మశిఖతో ప్రజ్వరిల్లే రాముని ధర్మపత్నిని అపహరించమంటున్నావు నీవు శలభంలా మాడిపోతావు అంతేకాదు నీవు , నీతో అనుసరించిన నేను , మేము కడకు ఈ రాక్షసజాతి వినాశనమునకు ,లంకకు మంగళకరము కాదు అని పలువిధాలా బ్రతిమలాడుతాడు కాని వినడు చివరకు విధిలేని పరిస్థితి లో బంగారు జింక వేషం ధరించి వెళ్ళి రామబాణం తగిలి మరణిస్తాడు కాని రాక్షస బుద్ధిగా చనిపోయో సమయంలో హలక్ష్మణా అనే ఆర్తనాదాలు చేసి చనిపోతాడు.తదుపరీ సీతాపహరణం , ఆతదుపరి రావణసంహరం . ఇది అంతా రాముని ధర్మనిరతిని తెలుసుకోవటమో. అందుకే రామో విగ్రహన్ ధర్మః.
అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
శ్రీరామ జయం.
ఆలపాటి రమేష్ బాబు
విజయవాడ.
94401 72262.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.