13, ఏప్రిల్ 2012, శుక్రవారం

గజేంద్రమోక్షము - మానవజీవితమునకు సంబంధము.

 



 


       

బమ్మెరపొతనామాత్యుని మహభాగవత పద్యకావ్యము తెలుగువారికి ఒకమరుపురాని కానుక.ఆందులొ ప్రతిపద్యము ఒక ఆణిముత్యము మరిముఖ్యంగా "గజేంద్రమోక్షం" ఘట్టములొని ప్రతిపద్యము చదివి పదసౌందర్యం,అర్థసౌందర్యం స్వయంగా అనుభవించాలిసిందేకాని ఎంతరాసిన,ఎంతచెప్పినా తీరదు."గజేంద్రమోక్షం"ను కష్టాల్లొ వున్నవారినిపారాయణ చేయమని చెపుతారు.చాలమంది పారాయణ ఆనగానే ఒక కథలా ఆలా కానిస్తారు కాని దాని ఆంత రార్థాన్ని ఆకళింపు చేసుకొనరు.

  "గజేంద్రమోక్షం"ఘట్టము తాలుకు స్థూలంగా కథ ఇది గజేంద్రుడు తన రాణులతొ,పరివారము తొ వనములొ వుంటాడు.ఆలావనసంచారములొ ఒకనాడు ఒకనీటిమడుగుకు వెళతాడు ఆందులొని మకరము గజేంద్రుని పట్టిబంధిస్తుంది.సాధారణంగా ఎనుగు బలమైనదె సింహము కూడా సందేహించేంత కాని మొసలికి ఆకరిరాజుని కూడా బంధించేంత స్థానబలము,పట్టు ఇకనే "కరి,మకరి కి చిక్కి".... పొరాటము ఇలా 1000సం పొరాటము ఈపొరులొ గజేంద్రుని పరివారము,రాణులు,సొదరసమూహాలు,సంతానము ఆన్ని......చివరకు తన ఆరాట పొరాటము మకరముతొకాదని మనస్సుచెపుతుంది.ఆంతే త్రికరణ శుద్ధిగా "లావొక్కింతయు" ఆంటాడు  ఆంతే ఆ శ్రీహరికూడా "సిరింకిచెప్పడు" ఆన్నరీతిలొ ప్రత్యక్షమై  మకరిని సంహరించి గజేంద్రుని సంరక్షిస్తాడు.            

భాగవతగాధలన్ని మానవజీవితాన్ని పట్టిచూపుతుంటాయి.మానవుడు సకలసంపదలతొ వున్నాను ఆనుకొంటాడు కాని వీటితొ భొగలాలసకు ఆనేక మదాలకు బానిస అవుతాడు.ధనమదం,అధికారమదము,స్థానమదం,బలమదము,వర్గమదము,వచొమదము ఇలా గురి అవుతారు.ఆంతే గజేంద్రునిలా నాకు యేమి అనే ఆంతులేనిస్వేచ్చాప్రవ్రుతి.దీనితొ పాపకర్మల ప్రభావంతొ పాపం గూడుకట్టుకొంటుంది.పాటక జనం ఆంతువుంటారుచూడండి పాపంపండాలి ఆంతే కాలమనే మడుగులొ ప్రవేశం. అవకాశంకొసంచూస్తున్న కాలపురుష స్వరూప మకరము ఠప్పున దాడిచేసి వాడినీఅలా పట్టివుంచుతుంది.ఆంతే మనము ఈనాటిదాక ఎమిగొప్పనిభావించామో ఆవీఅన్ని ఒక్కొక్కటి దూరంకావటం,దిక్కుతొచక గతజలసేతుబంధనములా ఆనాడు విచారిస్తే ఆయ్యో అంతపాపం చేసినామా అనేచింత పడి ఆదేవదేవుని త్రికరణశుద్ధిగా చేతులెత్తి "నీవేతప్ప ఇహపరంబు " ఎరుగా ఆనాలి.అప్పటిదాక అయ్యవారుకూడా వినొదము చూస్తుంటారు.ఈవిషయన్ని పొతనగారు మనకు అన్యాపదేశంగా తెలిపినారు.ప్రక్రుతి పురుషుడైన నారాయణుడు  ఆదిలక్ష్మితొ చదరంగము ఆడుతుంటాడని.ఆంటేమనతాలుకు పాపపుణ్యాలపై ఆయిన లీలామానుష వినొదము చూస్తున్నాడని.ఆప్పుడు మనము వివేచనతొ నాయినా నీవేతప్ప నాకు ఇంకేవ్వరు దిక్కు అనిమనము స్వామివారిని మనహ్ పూర్వక రోదనతొ (ఈవిషయము  రామక్రిష్ణపరమహంస పలుమార్లు చెప్పారు 'సామాన్యరాజదర్శనానికే మీరుఇంత వ్యాకులపడుతున్నారు మరి సకల జగత్ కు ఆధినెత ఆయిన భగవంతుని దర్శనానికి వ్యాకులపడాలి,రొదించాలి ప్రాణము త్రుణప్రాయం గాభావించాలి )   ధ్రఢచిత్తముతొ తలిస్తే తత్క్షణము ఆయిన ఆన్ని ఆచారాలు,ఆయిధాలు,రాజలాంఛనాలు చివరకు ఆమహలక్ష్మినికూడాకాదని నాకు నాభక్తుడేముఖ్యము ఆన్యులుకాదని వొస్తాడు. ఈవిషయాన్ని మనము 'సిరికించెప్పడూ పద్యంలొ గ్రహించవచ్చు .ఆప్పుడు ఆమహలక్ష్మి కూడా ఆశ్చర్యపొతుంది  ఎమిటి స్వామివారు ఇప్పటిదాక నాతొ కేళివిలాసాలతొ వున్నారు ఇంతలొ ఎమయినదని ఆమెకూడా స్త్రికి మాన సమ్రక్షణయిన చీరకూడా సరిగావున్నదాలెదాని చూడకుండా పతివెంట, విరుఇద్దరు కదలికతొ శంఖ,చక్ర,గధా,నందక,గరుడ ఇలా సకల పరివారము వైకుంఠము మొత్తము భక్తునివద్దకు భూమికి కదలివొస్తాయి. చూశార భగవత్కరుణ,భక్తమహిమ.

గజేంద్రునికి ఆన్నివున్నాయి  కాని కాల మహిమలొ ఆన్నిదూరం ఆయినాయి,కాని భగవత్కరుణతొ దైవదర్శనము, వైకుంఠమునే భువికిరప్పించినవాడు గజేంద్రుడు. చూసారా, నారాయణునిలీలామానుషం.

ఇదండి ఆస్వామివారికరుణతొ నాకు ఆర్థమయినది మీకుతెలిపినాను.

సర్వము ఆశ్రీరామచంద్రమూర్తిదయ.  

                                 
         
                        
         
                           
         

2 కామెంట్‌లు:

  1. చాలా చాలా బాగా వ్రాసారండి .. మీకు నాకన్నావయసులో l chinnaavaaru ఐవుంటారు ..మీకు నా ఆశిస్సులు ..

    రిప్లయితొలగించండి
  2. అమ్మా రుక్మిణిదేవి గారు, నమస్కారములు.ఇంత కన్నా భాగ్యమా? కొరిమరి నాకు ఆశీస్సులు అందచెస్తావుంటే.మరొక్కసారి మీకు నా పాదప్రణామాలు.

    రిప్లయితొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.