15, ఏప్రిల్ 2012, ఆదివారం

శ్రీరామ రామ రామ రామేతి........


శ్రీవేదవ్యాసప్రణీతమైన శ్రీమహభారత అనుశాసనిక పర్వములొ కురుక్షేత్రములొని ఆంపశయ్యపైవున్న భీష్ముని ధర్మరాజు "కిమేకం దైవతంలొకే....అంటూ మనము ఎదైవాన్ని ఆశ్రయిస్తే  ఈజన్మ తరించగలదు అనే ప్రశ్నద్వార అడిగితే, దీనికి సమాధానముగ అంపశయ్యపైనవున్న భీష్ముడు ఆభగవానునిసమక్షములొ ఆయనగుణగణాలని,నామవైభవాన్ని కీర్తిస్తూ విష్ణుసహస్రనామన్ని  ధర్మరాజుకు భోధజరిగినదని మనందరము విష్ణుసహస్రనామన్నిఎంతొభక్తితొ పఠించుతాము.  
ఈవిష్ణుసహస్రనామములో కొన్ని పదాలు సామాన్యులకు పలుకుటకొద్దిగా కష్టము అదియునుగాక ఈసహస్రనామ పూర్వపిఠిక,ఉత్తరపిఠికతొ కలిపి షుమారుగా 160 శ్లొకాలు వుంటాయి.మనము ఈ పూర్తి పారాయణకు కొంత సమయము కేటాయించాలి.మరి సమయములేని,భాషరాని,నొరుతిరగని వారు తరింపచేసేదిఎలా? దీనికిసమాధానముగా విష్ణుసహస్ర నామ ఉత్తరపిఠికలొ ఫలశ్రుతిభాగములో  సహస్రనామము ఎవరకు ఎవిధముగా ఉపయోగపడుతుంది అనిచెపుతూ ఆర్జునుడు,భగవానుడు ఒక్కొక్క విధముగా తమ వ్యాఖ్య  చేరుస్తారు.ఆసమయములొ లొకమాత పార్వతి ఇంతపలుకలేని తనసామాన్య భక్తులకొసము "కేనోపాయేనలఘునా .....ప్రభొ "అని తన పతి పరమేశ్వరుని అడుగుతుంది. ఎంతయినా అమ్మకదండి మరితన బిడ్దలే తనకు ఎక్కువ  వాళ్ళకు ఎమితక్కువతుందోని ఆమేఆదుర్దా.మరి అమ్మ అడిగితే అయ్య వూరుకుంటాడా "శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే , సహస్రనామ తత్తుల్యము రామనామ వరాననే, శ్రీరామనమ వరానన ఓం నమ ఇతి" అని పలుకుతాడు.          
శ్రీరామ రామ రామ ఆంటు మనమనస్సుని శ్రీరామనామములొ సంగమింపచేసి శ్రీరామ రామ రామ అనిపలికితే చాలు మనకు పరమేశ్వరుడు సహస్రనామఫలితాన్ని ప్రసాదించాడు.చూశారా ధర్మరాజు ప్రశ్నద్వార మనకు భీష్ముని ద్వార సహస్రనామధార,శివునిద్వార ఈజన్మ తరింపచేయటానికి అవసరమయిన తారకమంత్ర బొధజరిగినది.ఈ విషయాన్ని పరమెశ్వరుడు పలుసార్లు  ఉదహారణలద్వారకూడా నిరుపించాడు. ఆయన కైలాసములొ సదా తారకమంత్రమయిన రామనామాన్ని ధ్యానిస్తువుంటాడని తెలుసుగదా. ఆలాగే ఆంజనేయుడు ఆయనస్వరూపమేనని మీకు ఇంకాబాగతెలుసు.మరి రాముడుకి ఆంజనేయుడుకి రామనామానికి వున్న సంబంధము జగద్విఖ్యాతం.ఆంజనేయుడయితే రామునికన్న రామనామము గొప్పదని పలుకుతాడు.కాబట్టి శ్రీరామనామాన్ని పఠించితరించండి.     
 సర్వము ఆశ్రీరామచంద్రుని కటాక్షము. 

1 కామెంట్‌:

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.