21, మే 2012, సోమవారం

దేవాలయ ప్రదక్షిణలలో ఉప్పు వినియోగము...?...?....?




హైందవ సాంప్రదాయము ప్రకారము మానవజన్మ పొందటానికి ముందు అనేకజన్మల తరువాత ఈ జన్మలభిస్తుందని. ఈ జన్మలోని కర్మలను బట్టి మరుజన్మ వుంటుందని.మరి ఇలా లభించిన ఈ జీవితములో లభించు సుఖః,దుఃఖాలకు మన సంచిత ప్రారబ్దమేనని మన  వారి విశ్వాసము.

 మనము గత జన్మలో ఎవరికన్నా ఎమన్నా కర్మలద్వారాకాని, క్రియలద్వారాకాని ద్రవ్యముద్వారాకాని మనము ఋణపడి వుంటే మనకు ఈజీవితములో కొన్ని కష్టాలు పడతామని విశ్వాసిస్తారు.మరి వీటి నివృత్తి ఎలా. సాధారణ మానవునికి గతజన్మ స్మృతి కలిగివుండదు.మరి దానికి తరుణొపాయమే ఈ ప్రదక్షిణలలో ఉప్పుని అలా ధ్వజస్థంభము వద్ద నివేదించమని సలహా ఇస్తారు.

భగవంతుడు సర్వ వ్యాపకుడని మీకు తెలిసినదే.అలాగే ఈ భూమండల మంతటిని నీరు ఆవరించివున్నదని.వాయువు లో నీరు ఆవిరి రూపములో కలిగి అంతటా వ్యాపించివున్నది.తద్వారా ఉప్పు అన్నిటా కలిగి వున్నదని.

         అలాగే మనము మనతాలుకు విశ్వాసాలను కూడా "నేను వాడి ఉప్పు తిన్నాను వాడికి ద్రొహము చేయలేను" అని వాడుకలో ధర్మపరాయణులయిన మన వారు పలుకుట మనము ఎరిగినదే.

కనుక సర్వ వ్యాపకుడైన భగవంతునికి మనము ఉప్పు సమర్పించి గతజన్మ తాలుకు ప్రారబ్దములొని దోషనివృత్తి చేయమని, ఋణ విముక్తుడిని చేయమని ఉప్పు సమర్పణ చేస్తున్నాము.
    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.