11, జులై 2012, బుధవారం

దేవాలయము - నాలుగు గోపురములు - వివరణ.

అధ్యాత్మిక మార్గంలో మానవుడు పరమాత్మస్వరూపుడైన భగవంతుని చేరటానికి రెండు రకాల పద్ధతులు అవి సాకార ఉపాసన, నిరాకార ఉపసాన. సాకార ఉపాసకులు భగవంతుని ఒక రూపముగా అర్చిస్తారు.నిత్య ఉపసానకు గృహములొ మందిరాలుగాను, సర్వ మానవాళి గురించి దేవాలయ నిర్మాణము జరిగినది. ఈ దేవాలయ నిర్మాణానికి అనేక రకాల పద్ధతులు. ఇలా శాస్త్ర ప్రకారముగా నిర్మించిన దేవాలయము మధ్యగా పరమాత్మ స్వరూపుడైన భగవంతుడు విరాజిల్లుతారు. ఈ కేంద్ర నిర్మాణానికి ప్రాకారమునకు నాలుగు దిక్కులలోను నాలుగు గోపురములు నిర్మిస్తారు.ఈ నాలుగు గొపురములు  ప్రజలు స్వామిని అర్చించటానికి అంతర్గమ,నిర్గమ మార్గాలుగా ఉపయోగిస్తారు.ఇది భౌతికపరముగా కనబడేది. మరి శాస్త్రం యోక్క మూల ఉద్దేశ్యం భక్తుడిని పరమాత్మకు చేరటానికి నాలుగు మార్గాలు వున్నాయని. 1)కర్మ 2)భక్తి 3) ఙ్ఞాన 4) వైరాగ్య లు ఈ నాలుగు మార్గాలుగా గుర్తింపు.వాటిని ప్రతిఫలిస్తూ నాలుగు గోపురముల నిర్మాణము.
     మానవుడు ఈ 4 మార్గాలలొ ఏ మార్గము ఎంచుకున్నా పరమాత్మను చేరెమార్గాన్ని ఎంచుకున్న వారు అవుతారు. దీక్షగా అందులో కృషి చేస్తె ఆ మార్గము యోక్క చివరి లక్ష్యము అయిన పరమాత్మను దర్శించి  మోక్షము పొందగలుగుతారు.అలా కాకుండా ఈ మార్గము కొన్ని రోజులు, ఆమార్గము కొన్ని రోజులు అని భావిస్తే ఇక్కడే చక్రభమణములో చిక్కుకోని పోతారు తప్ప పరమాత్మను పోందలేరు.

  1)కర్మ : కర్మ అనగా ఏమిటి? జన్మించిన ప్రతి ఒక్కరు జీవిక గురించి ఎదో ఒక వృత్తి, దేహ కార్య నిమిత్తము దైనిందిన క్రియలు చేయాలి.ఏ విధమయిన క్రియలు జరపకుండా ఒక్క క్షణమయినా ఉండలేడు. ఇది మనము చేసె కర్మ. మన చేత చేయించె కర్మ కూడా ఉన్నది అదే  కర్మసిద్ధాంతము.మానవుని  చర్యకు ప్రతిచర్యగా లభించు పాప,పుణ్యములను కర్మఫలముగా భావించవచ్చు.మరి ఈ విధముగా దైనిందిన క్రియలు,వృత్తిపర నిర్వాహణలో కర్మ ఫలితం వల్ల తప్పు ఒప్పులు క్షణక్షణము పరీశీలించుకొంటూ,బేరీజు వేసుకుంటూ జీవనము సాగించటము సాధ్యమా ! సాధ్యము కాదు! పోని కర్మలను మానటముకాని,నిరాకారించటముకాని,త్యాగము చేయటముకాని సాధ్యమా కాదు . మరి ఇలా కర్మలను పరంపరలుగా చేస్తూ వేళ్ళితే పాపపుణ్యాలు మానవునికి తెలిసేది ఎలా? అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు కర్మలను మీరు విధిగా భావించి చేయండి, పాప పుణ్యాలను నారయణునికి ఇవ్వండి.        
అనగా మీరు చేయు ప్రతి వృత్తి ధర్మ కర్తవ్యం,దేహ సంబంద కార్యాలు, దైనిందిన కార్యక్రమాలలొ అన్నింటా పరమాత్మ రూపముగాను,పరమాత్మ ప్రమేయముగాను,పరమాత్మ ఆఙ్ఞానుసారము గాను ఆయన కోసము,ఆయిన వలన చేస్తున్నాము అనే ఎరుకలో ఉండటము.ఆహారము జీవుడు నేను చేస్తున్నాను అనే ఉద్దేశ్యము కన్నా ఇది పరమాత్మ ప్రసాద రూపమని తలచి నారాయణ అర్పణము చేసి స్వీకరి౦చట౦.అలాగే దానధర్మాలలో నేను ఇస్తున్నాను అనే భావన కన్నా శ్రీరామార్పణము భగవతార్పణము గా తలచమని. కారణము తీసుకునే అతను కూడా దైవ రూపముగా భావన.ఇవి కర్మ సిద్ధంతాన్ని పరిపుష్టము చేస్తుంది.    
 అనగా ఇలా చేయు పనులలొ మానవునికి ఆక్రియలకు మధ్య వున్న అనుభంధం తగ్గి మనస్సు త్యాగపూరితముగా మారుతుంది. అది యోగముగా మారి పరమాత్మ సన్నిధికి తీసుకోని వెళ్ళుతుంది.దీనికి ఉదాహరణలుగా కుమ్మరి అయిన కురువత్తి నంబి కథ, ధర్మ వ్యాధుని కధ చెప్పుకోనవచ్చును.

2) భక్తి : భక్తి అంటే విభక్తి లేనిది. విభక్తి అనగా విభజించుట. విభజన లేనిది భక్తి.రెండిటిని కలపటము భక్తి అయితే వేటిని కలపాలి? మనిషి తన అంతరంగాన్ని భగవంతునిలో లయం చేయటమే భక్తి.అంటే మనిషి తన వ్యక్తిత్వాన్ని భగవంతునితో ఎకత్వము చేందటము భక్తిగా గుర్తింపు.జీవుడు+దేవుడు = భక్తి!.మనము సాధరణముగా ఆలయములో నమస్కారము చేస్తాము ఇది భక్తికి గుర్తు.కుడిచేయి దైవత్వానికి,ఎడమచేయి  మానవత్వానికి గుర్తు ఈ రెండు కలిపితే భక్తికి గుర్తు.మరి దేవుడుని ఎలా కలిపేది.నవజాత శిశువు తల్లిని ఎలా గుర్తుపడుతుంది?తల్లి తన బిడ్డ ఏదుపుని ఎంత పనిలో వున్న ఎలా గ్రహించ గలుగుతుంది.మొదటిది ప్రేమ అయితే,రెండవది శ్రద్ధ.  ప్రేమతో శ్రద్ధగా  భగవంతుని ఆరాధించటమే భక్తి.నారదభక్తి సూత్రాలలో ఇదే విషయాన్ని చెప్పారు "భక్తిర్హి,పరమప్రేమ రూపా ".మరి ప్రేమ అంటే ?సాధరాణముగా  ప్రేమ అంటే మనకు అనుభవమే మనకు నచ్చిన వారి గురించి అలొచించటము వారితో గడపటము వారి అవసరాలను చూడటము. మరి ఇది లౌకిక ప్రేమ. కాని భగవంతుని చూడవలసినది అంతరింగికప్రేమతో ,భగవంతుని సర్వకాల సర్వావస్థలయందు తన అంతరంగము నందు నిలుపుకోవటమే భక్తి. ప్రహ్లదుడుని  నృశింహుడు కరుణించి నీకు ఏమికావాలి అని అడిగాడు?"యా ప్రీతరవివేకానాం విషయేష్వనపాయినీ" అని ప్రహ్లదుడు అన్నారు. అనగా వివేకము లేనివారికి, ఙ్ఞాన శూన్యులకు విషయవాంఛలయందు అనగా డబ్బు,అస్థి లాంటి వ్యవహారలపై ఏలా అత్యంత ప్రీతి కలుగుతుందో అలా అటువంటి ఆసక్తే  నాకు నీ పాదములపై కలిగే విధముగా అనుగ్రహించు అని అడిగాడు.అందుకే తనను ఎన్ని బాధలకు గురిచేసినా అకుఠింత దీక్షతో తన భక్తి మార్గాన్ని విడవని వాడు ప్రహ్లాదుడు.
   ఇదే విషయాన్ని భగవద్గీత నందు "అనన్యేనైవ యోగేన భక్తిరవ్యభిచారిణి" అనన్యమైన యోగముతో ఎవరైతే నన్ను భక్తితో అరాధిస్తారొ వారి యోగ్క్షెమాలు నేనే వహిస్తా అని శ్రీకృష్ణుడు అన్నారు.ఈ భక్తి ఎలా ఉండాలన్నారు తైలధారలాగా వుండాలని.పైనుండి నీరు ధారగా పొస్తే తుంపరలుగా పడతాయి కాని నూనే,అముదము లాంటి తైలములను పొస్తే ఏకధారగా అవిచ్ఛినముగా పదుతుంది.ఇలా నిరంతర అలోచనా సరళే అనన్యభక్తి.ఈ నిరంత భగవంతుని అరాధించటము పరాభక్తిగా మారి సర్వ జీవులయందు, సర్వ రూపాలయందు భగవంతుని చూడగలుగుతాడు.ఈ భక్తి మరలా తొమ్మిది విధాలుగా గుర్తించారు.
 1)శ్రవణం- భగవంతుని గురించి వినటము ఉదా:పరిక్షిత్తు. 2)కీర్తనము - భగవంతుని గుణ గానాలు పాడటము ఉదా:శుకుడు 3) స్మరణము - భగవంతుని ఙ్ఞాపకాలు ఆయిన లీలా వైభవాలు అయిన విభూతి ఙ్ఞప్తికి తెచ్చుకోవటము. ఉదా: ప్రహ్లాదుడు.4)పాదసేవనము: సదా ఆయిన పాదములపై ధ్యాస వుంచటమే .5) అర్చన - అయినను పూజించటము.ఉదా: పృధువు.6)వందనము - హృదయపూర్వక నమస్కారము ఉదా: అక్రూరుడు.7)దాస్యము - సేవచేయటము. ఉదా: ఆంజనేయుడు. 8) సఖ్యము - స్నేహితునిగా అరాధించటము. ఉదా: అర్జునుడు,కుచేలుడు.9)ఆత్మనివేదనము - తననుతాను సమర్పణ చేయటము. ఉదా: బలి
.

3)ఙ్ఞానము: సహజముగా లౌకిక జీవనములో వ్యక్తి  జీవనము గడపటానికి సరిపొయిన విద్యను,లౌకిక సంబంధ వస్తువిషయాలపై అవగాహనను ఙ్ఞానముగా గుర్తింపు.కానీ అధ్యాత్మజీవనములో ఙ్ఞానము  అంటే స్వస్వరూప ఙ్ఞానమే ఙ్ఞానముగాగుర్తింపు.దేహములో వున్న ఆత్మను దర్శనానుభవమే ఙ్ఞానము గా గుర్తింపు.ఈ ఙ్ఞానము ఇలా కలుగుతుందో క్లుప్తముగా తెలుసుకుందాం.ఆత్మను ఇంద్రియాలవల్ల చూడలేము.మరీ ఎలా చూడాలి. మనస్సు,ఇంద్రియాలు  అన్ని కుడా బహిర్ముఖాన్ని మాత్రమే చూస్తాయి.వీటిని నియంత్రించి తనలోపలకు చూపే విధముగా అనగా అంతర్ముఖం గా దర్శించే విధముగా  సాధన చేస్తే ప్రపంచమును చూడటము మాని ప్రపంచమును చూస్తున్న ఆత్మను తనలో దర్శిస్తాడు.అప్పుడు మాత్రమే ఙ్ఞానము సిద్ధిస్తుంది.

4)వైరాగ్యము: ఈ మార్గము కొంచెము కష్టతరమయినది కాని పైన వున్న 3 మార్గాలలొ అంతర్లీనముగా కలసివుంటుంది. వైరాగ్యము అంటే ఎమిటి?ఈ లౌకీక జీవనములో వున్న వస్తువిషయసంగ్రహాలలొ మునిగి అవి లెక పొతే జీవనము ఎలా అన్న చింతనలో గడుపుతాడు.ఇవి అన్ని ఇక్కడవరకే పరమునకు పనికీరావు అన్న గుర్తు ఎరిగి వీటిని తృణికరించటము,నిరాకరించటము  లాంటి విరాగ లక్షణాలు.
 

 ఈ మార్గాలని అనుసరిస్తే లోపల వున్న భగవంతుని చూడగలుగుతారని తెలపటమే పూర్వుల అలోచన సారము.
                     

2 కామెంట్‌లు:

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.