3, జులై 2012, మంగళవారం

NTR Vs Babu Vs YSR ప్రభుత్వ పధకాలు.- ప్రతి ఒక్కరు చదవ వలసిన కధనం.!

ప్రజల చేత ప్రజలకొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజల మనుగడకు, ప్రజాస౦క్షేమానికి ప్రతి ప్రభుత్వ౦ కొన్ని పధకాలను అమలు చేస్తు౦ది. ఈ పధకాల సార్వజనీనత,విశ్వసనీయత,పధకాలు చివరి దశ వరకు చేరే తీరులోనే ప్రభుత్వాల మనుగడ ఆధారపడి వున్నది అంటే ఆశ్చర్యం లేదు.వీటికి అదనంగా ప్రభుత్వ అధినేతల వ్యక్తిగత ఆలోచన సరళి,సమాజ౦ పట్ల వారి అవగాహన తో పాటు వారి చరిష్మా మరియు ప్రభుత్వ మనుగడ,ప్రజాసంక్షేమం ఆధారపడటం తో అన్ని వర్గాలకు వీటిపై ఆసక్తి.ఈ పధకాల అమలులో బ్యురోక్రసి మరియు కాంట్రాక్టర్స్ ప్రమేయం ఎక్కువైన కొద్ది వీటికి గ్రహణ౦ పట్టిస్తారు.అలా మన రాష్ట్రంలో ప్రజాసంక్షేమానికి పేరు పడ్డ మూడు ప్రభుత్వాల తీరు తెన్నులపై నాకు తోచిన కొన్ని మాటలు.
ప్రభుత్వపధకాల రూపకల్పన లో NTR,YSR ఇరువురిది ఒకే స్వభావం.ప్రజల అవసరాలను గమనించి కాని, ప్రజలలో వున్నప్పుడు ఉత్తేజం చెంది దీనికి అనుగుణంగా అప్పటికప్పుడు ఏదో ఒక పధకం ప్రకటించి ప్రజల హర్షం పొందేవారు.ఇటు వంటి పధకాలు ల్లో NTR దే అగ్రతాంబూలం.NTR,YSR ను పోలిస్తే NTR చాలా ఉత్తమం.
NTR స్వతహాగా ఆవేశపరుడు,భోళ మనిషి. తనను తాను దైవా౦శ వున్నవాడి గా భావిస్తారో,కృష్ణుని వేష ప్రభావం వలన తాను గజేంద్రమోక్షం లోని విష్ణువు అనుకోనే వారు ఏమో తెలియదు కాని కొన్ని పధకాలు అప్పటికప్పుడు ప్రకటించే వాడు.కాని అమలులో అధికారులు పడరాని పాట్లు పడే వారు.కాని NTR కున్న వ్యక్తిగత చరిష్మా వలన ఆపధకాలు అప్పటికే ప్రాచుర్యం పో౦దేవి.కాని అధికారులు సక్రమంగా నిధులు కేటాయించక,కేటాయించిన నిధులు సక్రమ వినియోగం చేయక పధకాలను ప్రక్క దారి పట్టించే వాళ్ళు.కారణ౦ ఈ పధకాల అమలులో వాళ్ళ పాత్ర తక్కువ ప్రజల ఆవసరాలు,ప్రజల లాభాలు ఎక్కువ దీని వలన వాళ్ళకు అ౦దవలసినది అ౦దక పధకాల ప్రక్కదారి.
ఏది ఏమైనా ప్రభుత్వాలకు కావలసినది ప్రచారం. అది NTR తో పుష్కలంగా జరిగేది.అయిన 'వారుణి వాహిని', 'న౦దమూరి తారకరామ సాగర తీర అరామ౦' లాంటి డాంబిక పేర్లు ఎన్నుకోనేవాడు.అచ్చ తెలుగు పేర్లతో హడావుడి చేసేవాడు.
కాని బాబు దీనికి పూర్తిగా రివర్స్. కాంగ్రస్ దళారి వ్యవస్థ కుదురులొ౦చి వచ్చిన వాడు బాబు.ఎంత మామను వెన్నుపోటు పొడిచి అధికారం,పార్టి కబళించిన తన సహజ దళారి తనాన్ని వదులుకోలేక పోయాడు.అందుకే NTR
హయంలో పారశ్రామిక వేత్తలు అ౦దరు బాబు వెంట పడటంతో బాబు హవా నడచినది.అందుకే బాబును ఆరోజుల్లో కొన్ని మీడియాలు percentage babu గా వ్యవహరించాయి.ఈ విషయం దగ్గుబాటి తన రచనల్లో తెలిపాడు.NTR తన ఆఖరి ప్రస౦గాల్లో ప్రస్తావించాడు.ఇది బాబు నైజం.అటువంటి బాబు పధకాలు ఎలాగు౦డేవి అలాగే వుండేవి.NTR ప్రభుత్వంలోని పధకాల లోటు పాట్లు గమనించిన బాబు NTR లా ప్రజల్లో నిర్ణయాలు కాకుండా ము౦దస్తుగా అధికారులతో చర్చించి,పార్టి వర్గాలను సంప్రదించి, పార్టి సిద్ధాంతాలకు అనుగుణంగా అంటూ ప్రకటించేవాడు.అన్నట్లు బాబు హాయంలో పార్టి సిద్ధాంతాలు అనేది పెద్ద జోక్. వ్యక్తుల ఆవసరాలను,వ్యక్తుల మనస్తత్వాలను తనకు అనుగుణంగా మార్పు చేస్తూ,స్వలాభాన్ని చూసుకుంటూ అవి పార్టి సిద్ధాంతాలుగా భ్రమింప చేసేవాడు.ఈ కళలో బాబు దిట్ట. అందుకే బాబు management నిపుణుడు అనే వాళ్ళు.
ఇలా పై వ్యవస్థలో తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా ground realities కు వ్యతిరేకంగా.సామాన్య ప్రజల అభిమానం
చూరగోనేవి కాదు.అందుకు పెద్ద ఉదాహరణలు బియ్యం పధకాలపై ధరలు,విద్యుత్ ధరలు,వ్యవసాయ రంగ ప్రోత్సాహం.సహకారరంగ వ్యవస్థను భ్రష్టు పట్టించిన తీరు.పాలసరఫరా వ్యవస్థలను నాశనం చేసి వాటి పునాదులపై సొంత పాల డైరి వ్యాపారం పెంపు.అసలు బాబు గ్రామీణ ప్రాంతం వాడు,విద్యార్ధి వ్యవస్థ నుంచి నాయకుడుగా ఎదిగి రాష్ట్ర అత్యున్నత పదవి అలంకరించిన ఈ రెండిటిని బాబు నమ్మలేదు. సరి కదా వ్యవసాయం దండుగ అన్నాడో లేదో తెలియదు కాని ప్రచారంలో మాత్రం వున్నది.అలాగే విద్యాసంస్థల్లో ఎన్నికలు నిషేది౦చాడు.పార్టిలో విద్యార్ధి విభాగం రద్దు చేసాడు.అలాగని బాబు అన్ని తప్పులు చేసాడని అనలేము.యువజనులు పెరుగుతున్నారని గణాంకాలు తెలుపుటతో అందుకు అనుగుణంగా సాంకేతిక విద్యను ప్రొత్సాహి౦చాదు.సాంకేతిక సంస్థలను ఆహ్వానించాడు.దీనితో అప్పటి వరకు యువజనులు ఉద్యోగం కోసం బయటకు వెళ్ళటం తగ్గి స్వరాష్ట్రంలోనే పొందగలిగారు. పెద్దజీతాలు లభించటంతో ప్రభుత్వ ఉద్యోగాలకన్న ఈ మార్గ౦ పట్టి సుఖపడ్డవాళ్ళు ఉన్నారు.ఈ కేటగిరిలో మధ్యతరగతి వాళ్ళు నగర వాతావరణం లో పెరిగిన వాళ్ళు లాభ పడ్డారు.అందుకే దేశం పార్టి ఆనాడు నగర వ్యవస్థలు చురుకుగా పనిచేసి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో స్వంత కార్యాలయాలు ఏర్పరుచుకునే స్థాయికి వెళ్లాయి.అదే సమయములో చేతి వృత్తులు కునారిల్లటం,రాష్ట్రంలో రెండొవ ప్రధాన వృత్తి అయిన చేనేత కాలపరంగా అనాదరణ పొ౦దితే ఇందుకు తగ్గ ప్రభత్వ ప్రోత్సాహం లభించక ప్రతి రోజు ఆత్మహత్యల లెక్క ఈనాడు పత్రిక లెక్కించే స్థాయి లో వుందంటే పరిస్థితి ఎంత దారుణంగా వున్నదో ఉహించ వచ్చు.కాని ఈ కసరత్తులు,హాడావుడులు లను ప్రజలకు అనుగుణ౦గా లేక పోవటంతో చాల పధకాల పట్ల ప్రజలకు నిరాసక్తి.ఈ విషయంలో బాబు అధికారుల మాట మన్నించాడు.బాబు నేను పని చేస్తున్నాను,మీరు కూడా కలసి పనిచేయండి,ప్రజలు ప్రభుత్వం భాగస్వామి గా వుంటే అభివృద్ధి సాధ్యం అనే పలుకుల నేపధ్యం తో జన్మభూమి పధకం ప్రవేశపెట్టాడు.ప్రారంభములో ఈ పధకం బానే వుండి చెరువులు,కాలువలు పూడిక తీయటానికి,తూడుకర్ర,గుర్రపుడెక్క,గట్లు సరి చేయటం ఇత్యాది పనులకు ప్రజలు ఉత్సాహ పడిన రెండు రోజులకే స్వంత పనుల ఆవసరరార్ధం పోయేవాళ్ళు.అసలు బాబు వర్గాలకు కావలసినది ఇదే.దీనితో బాబు తాలూకు కాంట్రాక్టర్ వ్యవస్థలు ప్రవేసించి సగం ఆపిన పనిని జన్మభూమి ముసుగులో అధిక ధరలకు చేసేవాళ్ళు.దీనితో గ్రామగ్రామన దేశం పార్టి నాయకులు కాంట్రాక్టర్స్ గా మార్పు చెంది కోట్లు సంపాదించారు.ఇవి అన్ని నాటి ప్రతి పక్షాలు ఎ౦డకడుతూనే వుండేవి.గ్రామాల్లో అణా,కాణి  ఆస్తి  లేని దేశం పార్టి వర్గాలు కొద్ది రోజుల్లో కోట్ల విలువ చేసే ఆస్థులు,కార్లులో తిరగటం చూసి కాంగ్రేస్ వర్గాలకు కళ్ళు కుట్టినవి.ఆవకాశం  కోసం ఓపికగా గోతికాడ నక్కాల్లా ఎదురు చూసారు.YSR రూపంలో వాళ్ళకు బంగారం లాంటి ఆవకాశం రావటంతో మీద పడి అందుకున్నారు.
YSR ఫ్యాక్షన్ రాజకీయాలు,రాబిన్ హుడ్ తత్వాలు, క్రైస్తవ సేవ భావాలు ఇలా అనేకం కలగాపులగం లా కనిపిస్తాడు.YSR తనను ఆశ్రయించిన,నమ్మిన వాడికి కడదాక ఏదో చేయాలనే తపన వున్న వ్యక్తి.ఈ ఒక్క సుగుణమే YSR అనే ఆరాధన భావమునకు కారణమయినది.YSR మొదట్లో దూకుడుగాను.అసమ్మతి వాదిగాను ముద్రపడిన వ్యక్తి వీటి వల్ల తాత్కాలిక లాభమే కాని తన అంతిమ లక్ష్యం అయిన ముఖ్యమంత్రి పదవికి దూరం చేస్తున్నాయని సమూలంగా మార్పు చెందాడు.దీనికి పెద్ద ఉదాహరణ శాసన సభలో నాకు కోపం నరం తెగిపోయిందని వ్యాఖ్య,తన నవ్వుతో బాబును ఉడికించటం.అలాగే YSR క్రైస్తవ మిషనరి సేవా భావాన్ని అనుసరి౦చేవాడో,అనుకరించే వాడో తెలియదు కాని ఈ రెండిటిలో ఒక్కటి చేసేవాడు.
ఇక ప్రభత్వ పధకాల వద్దకు వచ్చే సరికి YSR తన ముందు వున్న కాంగ్రేస్ పధకాల సరళిని కాదని,ఇందిరాగాంధీ,రాజీవ్ విధానాల ముసుగులో స్వంత నిర్ణయాలు,తెలుగు దేశం విధానాలు ఆచరించాడు.కారణం ఇవి కొంత ప్రాంతీయ లక్షణాలను కలిగి వుండటమె.మరలా దీనిలో NTR + బాబు ఇద్దరినీ కలిపి,తన ఆలోచనలతో తనదైన ఒక కొత్త ప౦ధా ప్రవేశ పెట్టాడు.
YSR కూడా పధకాలు ప్రజల్లో ప్రవేశ పెట్టటానికి ఇష్ట పడే వాడు.దాదాపు అందుకు అనుగుణంగా నిధుల కేటాయింపులు జరిగేవి.ఒక వేళ ప్రజల కోసమయిన ప్రజల భాగ స్వామ్యం లభించని ఆరోగ్యశ్రీ వంటి పధకాలకు నేరుగా కార్పరేట్ వర్గాలను ప్రవేశ పెట్టిప్రజలకు ఆలంబన,వ్యాపార వర్గాలకు ఆవకాశలతో దళారీ వ్యవస్థ పెంచాడు.
ఉచిత విద్యుత్ పధకం,బియ్యం పధకం సాధ్యసాధ్యాలను తాను అధికార పోరాటంలో వున్నప్పుడే సర్వే చేయించి,ఫలితాలు సరి చూసుకొని,ప్రజలకు ప్రకటించి,విజయం సాధించి న తరువాత అమలు చేసాడు.
YSR తన పాదయాత్రలో సామాన్య ప్రజలకు ఇంకను వ్యవసాయ రంగం ఆవసరం ఎంత వున్నది గ్రహించాడు.ఈ రంగానికి ప్రాధమిక అవసరాలయిన భూమి,నీరు,ఎరువులు,విత్తనాలపై ఆవగాహన వుండుటతో రాష్ట వ్యాప్తంగా పడావు గా వున్న భూమిని సాగులోకి తీసుకు' రావాలని విస్తృతంగా జల పధకాలు ప్రవేశ పెట్టాడు.దాదాపు ఈ పధకాలన్ని నెలకు ఒకటి చొప్పున ప్రవేశ పెట్టబడ్డాయి.ఈ పధకాల అమలు త్వరితంగా కావాలని విస్తృతంగా కాంట్రాక్టర్ వ్యవస్థలు ప్రవేశించి ప్రజాధనం దోచుకోబడినది.కాంగ్రేస్ స్కంధవారాలకు YSR అనే వాడు దేవుడైనాడు.ఇంతలో ప్రభుత్వ ఆదాయం పెరగటంతో ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఫించిన్ పధకాలు.అణగారిన వర్గాలకు ఇంకను సాంకేతిక విద్య,ఉన్నత విద్యలు భారమై దూరమవుతున్నాయని అనే కారణం ముసుగులో ఫీజు రీ ఎ౦బర్స్ పధకం ప్రవేశ పెట్టాడు.అసలు కారణం విపరీతంగా వున్న కాలేజిలు చేరే వాళ్ళు లేక నిర్వాహణ ఖర్చులు రాక ఈ మార్గం పట్టించాయి.
అత్త సొమ్ము అల్లుడి దానం లా ప్రజల సొమ్మును దాన౦ చేశారు,దోపిడీ చేశారు.
 గమనిస్తే బాబు మరియు YSR దోపిడీ చేయటంలో ఒకే తీరు కాక పొతే పద్ధతులు,వ్యక్తులు మార్పు అంతే.
అ౦తిమ౦గా మోసపోయేది,పోయింది,మునిగేది,మునిగింది ప్రజలే.
గొర్రెలు ఎప్పుడు కసాయి వాళ్ళనే నమ్ముతున్నాయి.


కొత్తా దేవుడండి కొంగ్రొత్త దేవుడండి
జగన్ గారు కొత్త దేవుడండి
దిక్కుయి మొక్కయి దోచేట౦దుకు
ఓదార్పు యాత్ర చేస్తాడండి
వస్తే గిస్తే మా భవిష్యత్ మొత్తం
దోచేనండి,మాకు సున్నా ఏమో మిగిలేనండి


పిల్లా దేవుడండి బాబు బుల్లి దేవుడండి
లోకేష్ బాబు వచ్చెన౦ట అండి
వస్తే గిస్తే ఇచ్చేనండి నగదు బదలి పధకాల 
పప్పు బెల్లాలు సిద్ధం అండి
కొత్త బలి పశువులం మెమేనండి!




కాబట్టి ప్రజలారా ఎవరు వచ్చినా సర్వే జనా "ఖానో" భవంతు, సర్వే జనా "ఖూని" బృవంతు.
ఓం ఇతి సుత్తి ముగి౦తు.

6 కామెంట్‌లు:

  1. బాగా సమీక్షించారు. 0-10 పాయింట్లలో వీరి ముగ్గురికి ఎవరెవరికి ఎన్ని మార్కులు వేస్తారు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. @SNKR, ధన్యవాదాలు. మీరు మరొక్కసారి కధనం చదివితే మీకు తెలుస్తుంది. నన్ను అడగరాదు.అయినా రేటింగ్ లు ప్రజలు ఇచ్చారు. మనం విశ్లేషణ చేయటం మాత్రమే. ఇక పాయింట్లు పట్టికలు మీడియా వర్గాలు హడావుడి.విజ్ఞులు మీరు చెప్పగలరని,చెప్పుతారని ఆసీస్తున్నాను.

      తొలగించండి
  2. Babu ni gurimchi -ve ga matladero, mimmalani chakirevulo emda gadataru, be careful.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాల మంచిది.ఉన్న మాట అంటే వులుకు ఎక్కువ. నేను తులనాత్మకంగా వ్రాసాను అని నేను భావిస్తున్నా. ఇక చాకిరేవులు,లేకిపనులు అంటే వాళ్ళ ఇష్టం.నాది నా భావ స్వాతంత్ర్యం.అలాగే వారిది. దూషణ భూషణలు లేకుండా చర్చ సాగించ వచ్చు.

      తొలగించండి
  3. miku anipinchindi miru rasharu ..chaki revu lobattalu utukkune variki miru bayapadalsina avasaramledu

    రిప్లయితొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.