22, జులై 2012, ఆదివారం

భారతదేశం లౌకికరాజ్యం అన్నమాట నిజమేనా?



ఈ శీర్షిక ఇలా పెట్టినందుకు చాల మందికి అభ్యంతరముగాను మరికొద్ది మందికి ఇబ్బందిగాను తోస్తుంది. కాని నేటి వార్తాపత్రికలలో ఈ క్రింది వార్త చదివిన తరువాత నాకు సందేహం వచ్చింది. అది కూడా తెలుపుతాను.


ముస్లిం ఉద్యోగులు ముందే వెళ్లొచ్చు..
రంజాన్ ప్రార్థనలకు అనుమతిస్తూ ఉత్తర్వులు

హైదరాబాద్, జూలై 21: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ప్రత్యేక ప్రార్థనల నిమిత్తం సాయంత్రం 4 గంటలకే ఆఫీసుల నుంచి వెళ్లేందుకు ఉత్తర్వులిచ్చిందని ఏపీ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సయ్యద్ షౌకత్ ఆలీ, మహమ్మద్ అబ్దుల్లా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.


ఈ పై వార్త నా సందేహం నకు కారణమైనది,
ముందుగా ముస్లిం సోదరులకు రమజాన్ మాస శుభాకాంక్షలు.వారికి పవిత్ర మాస౦ ప్రారంభం అయినది. వారి మత ఆచారం ప్రకారం ఈ మాస౦ లో దాదాపు ఆవకాశం వున్న ముస్లిం మత అవలంబీకులు ఉపవాస దీక్ష నిర్వహిస్తారని సర్వులకు తెలుసు. అది పవిత్రమైనది సంతోషకరమైనది.కారణ౦ వారి ధార్మిక ప్రవర్తనకు మనకు ఆనందమే.కాని వారికి మాత్రమే ఇటు వంటి ప్రత్యేక ప్రతిపత్తి ఈ మాసంలో కల్పిస్తున్నారు మంచిదే.

మరి హిందువులకు కార్తిక మాసం అంతే పవిత్రం అన్న సంగతికూడా లోక విదితమే. ఈ మాసంలో హిందువులకు ఉపవాస దీక్షలు,అభిషేకాలు,వ్రతాలు ఇలా ఎన్నో ఆచారవ్యవహారాలు ఉన్నాయి అన్నస౦గతి కూడా విదితమే. మరి ప్రభుత్వం ఆనాడు హిందువులకు అటువంటి ప్రత్యేక అవకాశం కల్పించ గలదా?

మరి ఇటువంటిదే క్రైస్తవులకు క్రిస్టమస్ మాసం ఉన్నప్పటికీ వారికి శుక్రవారం,ఆదివారం ప్రార్ధనలు మాత్రమే ఉన్నట్లు నాకు ఆవగాహన.మరి వారికి కూడా ఇవ్వగలరా?

అటువంటివి అందరికి కల్పించటం సాధ్యం కానప్పుడు వీరి ఒక్కరికే ఎలా ఇవ్వగలుగుతున్నారు?ఇదే బంతిలో వలపక్షం అన్న భావనలు తప్పు.

లౌకికరాజ్య భావనకు ఇది విరుద్ధం కాదా?

మెజారిటి వోట్లు సంపాదించిన వారు అధికారంలోకి వస్తారు. మరి ఈ సూత్రం మాత్రం అన్నిటా మాత్రం వర్తించదు.
వివక్ష వు౦డకుడదు.దీనికి కారణం మాత్రం వ్యక్తుల కుహనా లౌకిక వాదం, కొంతమంది స్వార్ధ బుద్ధి.
ఎవరైనా వారి వారి మతం తరుపున మాట్లాడటం తప్పా వారికి మతవాదులు అన్న ముద్ర ఎలా?

ఇలా ఎన్నో ప్రశ్నలు?

చెప్పండి భారతదేశం లౌకిక రాజ్యం అన్నది ఎంత వరకు సబబు.


4 కామెంట్‌లు:

  1. అదే గదా అసలు బాధ. ఆసంగతి రాజ్యంగ బద్ధ౦గా ప్రకటిస్తే సమస్య లేదు.

    రిప్లయితొలగించండి
  2. India is a secular Country by default which was possible with the indifference of majority community but not by choice of the people.

    రిప్లయితొలగించండి
  3. ఈదేశంలో అమ్దరూ సమానమే . కాకుంటే మైనార్టీలు కొద్దిగా ఎక్కువ సమానం

    రిప్లయితొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.