13, జూన్ 2012, బుధవారం

యమధర్మరాజుని, వైకుంఠవాసుని సంకటస్థితికి గురిచేసినది ఎవరు ?


ఓకానోక సమయములో ఆరణ్యంలోని ఏనుగు మరణించినది.ఏనుగు ఆత్మ యమధర్మరాజు ఎదుట ప్రవేశ పెట్టబడినది. ఆత్మ మంచి చెడులు పరిశీలించిన యమధర్మరాజు " ఏమి నీకు అంత పెద్ద శరీరం లభించినది ఆ బలం తో నీవు స్వతంత్రముగా బ్రతకవచ్చు కాని నీవు  మానవునికి లోబడి అంత వూడిగము చేసినావు,బానిసగా బ్రతికినావు అని అడిగినాడు. స్వామీ! ఈ మనుషులు మహామాయావులు, స్వామి! చాలా పెద్దపెద్దవే ఇతనికి లొబడి పనిచేస్తున్నవి నేను మాములు ఆడవి జంతువును నేను ఏంత అని పలుకగా. యమధర్మరాజు మావద్దకు మానవులు వస్తున్నారుగదా ఆవిధముగాలేదు అని అన్నారు. అంత ఏనుగు స్వామి! మీవద్దకు వచ్చే వారు అంతా ఆత్మలు బ్రతికివున్నవారు కాదు అని ప్రత్యుత్తరము ఇచ్చింది.దీనితో యమధర్మరాజు అలొచనలో పడి తన దూతలను పిలచి ఓక బ్రతికి వున్నవాడిని భూలోకము నుండి యమలొకమునకు తీసుకొనిరమ్మని ఆఙ్ఞ ఇచ్చాడు.
      

అంత యమభటులు భూలొకానికి వచ్చి ఆరుబయట నిద్రపొతున్న ఓక వ్యక్తిని మంచంతో సహా లేవనెత్తి యమపురికి ప్రయాణమయినారు.ఆ వ్యక్తి ఆఊరి కరణం. చల్లటిగాలికి మెలుకువ వచ్చినది. పరిశీలించగా యమభటులు తన మంచము తీసుకొని ఆకాశమార్గాన వున్నారు  తను బుద్ధి కుశలతతొ లేకపొతే ఈ మంచముతో సహా క్రింద వుండవలసి వస్తుంది  అని భావించి వూరకనే  వున్నాడు. సాధరణముగా కరణాలు గ్రామకార్యలు అన్ని చూస్తావుంటారు, అందు వలన ఈ కరణం గారికి తన దిండు ప్రక్కనే కొన్ని కాగితాలు,ఒక కలం పెట్టుకొని నిద్రపొతుంటారు.దీనితో యమభటులను గమనించిన కరణం కాగితం పైన గబగబ ఎవో నాలుగు ముక్కలు వ్రాసి జేబులో పెట్టుకొని పడుకొన్నాడు.


దూతలు యమపురికి చేరుకొన్నారు. యమధర్మరాజు సభలో కొలువు తీరి వుండగా దూతలు ఈ కరణముని సభలో ప్రవేశపెట్టారు. ఆ సమయంలో కరణము తన జేబులోని ఉత్తరాన్ని యమభటుల ద్వారా యమధర్మరాజుకు అందజేసినాడు.అందులో ఇలావున్నది "ఈ పత్రం కలిగన వ్యక్తి నా తరుపున వచ్చిన నూతన గణాంకుడు మరియు వ్రాయసకాడు కావున ఇతనితో మీ పనులు చేయించగలరు - ఇట్లు, నారాయణుడు,వైకుంఠం" అని వ్రాసి వున్నది. ఇది చదివిన యమధర్మరాజు  కరణం ను మర్యాదగా ఆహ్వానించి ఒక ఆసనము, పని కల్పించినాడు.మరి నారాయణుని ఆఙ్ఞ.
   సభ ప్రారంభమయినది. దూతలు పాపులను ఓక్కొకరిగా ప్రవేశపెట్టుచున్నారు. మొదటి పాపి రాగానే కరణం ఇతని వివరములు ఎమిటి అని ప్రశ్న దూతలు అయ్యా వీడు ఒక దొంగ అని సమాధానాము. వెంఠనే కరణం ఈ దొంగని వైకుంఠమునకు పంపండి అని ఆఙ్ఞ ఇచ్చాడు. ఆత్రువాత ఓక స్త్రీ ఈమే ఎవరు? అయ్యా ఈమె ఒక వ్యభిచారి మరలా ఈమెను కూడా వైకుంఠమునకు పంపండి .ఇలా భూలొకములో సకల తప్పులు చేసిన వారిని ఈ కరణం వైకుంఠమునకు పంపటము ఒక ఉద్యమంలా పెట్టుకొని అదే పని చేస్తున్నాడు.

కొద్ది రొజులకు వైకుంఠం కిక్కిరిసి పొయింది, అక్కడ నారాయణుడు పరిశీలీంచగా వచ్చన వారందరు పాపులే.కాని వైకుంఠమునకు రాకాకు కారణము ఎమిటా అని చూడగా వీరిందరు యమధర్మరాజు పంపగా వచ్చిన వారు అని తేలింది.దీనితో ఇది ఏదొ యమలొకంలో తేడా అని అది కనుగొనే నిమిత్తము నారాయణుడు స్వయంగా యమలొకమునకు పయనము.

నారాయణుని చూసిన యమధర్మరాజు ఉచితరితన సత్కరించి రాకకు కారణమడిగినాడు.
అంత నారాయణుడు సకల పాపులను వైకుంఠమునకు పంపుటకు గల కారణము ఏమిటని ప్రశ్నించాడు. స్వామీ! ఇందులో నాది ఎమి తప్పు లేదు వీరందరిని తమ అఙ్ఞపై ఇక్కడికి వచ్చిన కరణము పంపుతున్నాడు, ఇది మేము కూడా స్వామీగారి ఆఙ్ఞగా భావించి మిన్నకున్నాము అని బదులిచ్చినాడు.

కరణం : తమరే స్వామి!
నారా  : మేము పంపలేదు గదా!
కర   :  నాచేతిలొని పనా స్వామి ఇది. నా వల్ల అయ్యేపనా స్వామి. తమ సంకల్పము లేనిదే ఇది జరుగుతుందా !
నరా  :  సరే! వీరందరిని ఇలా వైకుంఠమునకు ఎందుకు పంపావు.
కర   : స్వామి వైకుంఠమునకు పంపటము పాప కార్యమయితే భూలొకములో వున్న సాధు సంతులందరికి శిక్ష      విధించాలి.ఇది మంచి పని కాకపొతే విరందరిని త్రిప్పిపంపండి కాకపొతే భగవద్గీత నందు వున్న 12/6 శ్లొకం "నా ధామానికి చేరువాడు తిరిగిరాడు" మాత్రము సవరించటమో లేక ఉపసంహరించటమో చేయాలి.
నారా :  సరి! సరి ! వైకుంఠ ప్రవేశముతోనే పాపనివృత్తి కలిగినది, కాని వీరందరిని నీవు ఎందుకు పంపావు.
కర  : స్వామి! తమ దయ వలన అధికారము కలిగినది. అధికారాముతో సర్వులకు హితము చేకూర్చాలని అందరిని వైకుంఠమునకు పంపినాను.సర్వులకు మంచి చేయటము పాపకార్యమా స్వామి!
నారా :  యమధర్మరాజా! నీవతనికి అధికారము ఎల ఇచ్చావు?
యమ   :  స్వామీ అతను మీపసుపున పంపినట్లు తమరి చేవ్రాలు  స్పృష్టముగావున్నది గమనించండి అని పత్రం ప్రవేశ పెట్టాడు.
నారా :  ఇది ఏమి పని ఈ పత్రం నేను ఎప్పుడు ఇచ్చాను అని కరణమును అడిగినాడు.


కర : తమరు గీతలో నేను అందరి హృదయాల్లొ వున్నాను అని సెలవిచ్చినారు.నాకు నా హృదయము నుంచి ఇలా చేయమని ఆఙ్ఞ వచ్చింది. దాని తమ ఆఙ్ఞగా భావించి నిర్వర్తించినాను. ఒకవేళ ఇది తప్పు అయితే మరలా గీతను సవరించాలి.
నారా : ఇతను ఇక్కడకు ఎలా వచ్చాడు?
దీనితో యమధర్మరాజు తన దూతలను ప్రశ్నించగా, వారు అయ్యా తమరు ఓక బ్రతికివున్న మానవుని ప్రవేశపెట్టమని చెప్పారు. మేము తమ ముందుకు తేగా అతను తమకు ఎదో పత్రము ఇవ్వటము అది చదివి మీరు అతనికి ఆసనం,అధికారము ఇవ్వటము గమనించిన మేము ఇంక ఏమి మాటలాడగల సాహసం చేయగలము.
ఈ సన్నివేశాన్ని మొత్తము గమనిస్తున్న ఏనుగు ముందుకు వచ్చి స్వాములకు ప్రణామములు! నేను ఎలా లొంగిపాయావని ఆడిగినారు కాని ఈ సమయములో ఈ మానవునికి వశపడినది నారాయణుడు,యమధర్మరాజు.మానవుడు తలచుకుంటే అన్నిటిని లొబర్చుకొగలడు కాని తాను మాత్రము విప్పుకోలెని సంసార చిక్కు ముడులలో చిక్కుకుపొయాడు.
నారా : సరే అయిందేదో అయింది, నీవు భూలొకానికి తిరిగిపో
కర : తమరు గీతలో (8/16) నన్ను పొందాక పునర్జన్మలేదు అన్నారు. నేడు నేను తమరిని పొందానాలేదా అని స్వాములు తెలపాలి అని అన్నాడు. 
నారా : సరే! దీనిని ఇక్కడ ఆపి నాతో రా!
కర : స్వామి కేవలము నేను అయితే ఎలా ఏనుగు దయ వల్లనే నేను ఇక్కడకు వచ్చాను కాబట్టి దానితో కూడా రాగలను.

ఇలా అందరు వైకుంఠ దివ్య ధామానికి చేరారు.
--------------------------------------------------------------------------------------
చూసారా! ఇది కల్పిత కధ అయినా మానవుడు తలచుకుంటే ఆన్ని సాధించగలడు,అధికారముంటే సర్వులకు మంచి చేయాలని తెలుపుతుంది.              


             
          


    

1 కామెంట్‌:

  1. ఈ కరణంగారు కాస్త మంచివారు (పూర్వకాలంలో గ్రామకరణం గా బ్రాహ్మణులు చేసేవారులెండి). అదే మునసబు గారిని తీసుకువెళ్లి ఉంటే ఏమయ్యిఉండేది? తన కుటుంబంనుండో లేక తనకులంనుండో వచ్చినవాళ్లకు మాత్రమే వైకుంఠ ప్రాప్తి చేయించి ఉండేవాడు. మిగిలిన వారికి నరకప్రాప్తే. ప్రస్తుతం జరుగుతున్నది అదే.

    రిప్లయితొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.