15, జూన్ 2012, శుక్రవారం

కృష్ణాతరంగ తారంగ నాదాలు




అమరావతి కధలు నానొ పరిశిలన పొస్ట్ రాసేటప్పుడు  అలా కృష్ణమ్మ మీద కూడా వ్రాయాలనిపించింది.ఇదిగో తల్లి ఈనాటికి కరుణించింది.
 జలము మానవజాతి మనుగడకు ఆధారము. జలము లేక పొతే జీవనమే లేదు అన్నదానికి అతిశయొక్తి కాదు.ఆర్యల కాలం   నుంచి నేటికాలం వరకు సమాజాలు,నాగరికత వెల్లి విరిసింది నదీ తీరప్రాంతాలలొనె.మన రాష్ట్రములో బౌద్ధము వ్యాపించిన, బౌద్ధస్మారకాలు వున్న ప్రదేశాలన్ని నదీతీరప్రాంతాలే కావటము గమనార్హము.నదుల గురించి తెలుసుకొవటమంటే మన గురించి మనము తెలుసుకొవటమే.


ఈ తల్లి జలవనరులతో సస్యమయిన పంటతొ పెరిగిన దేహముగా అభిమానము.25 సంవత్సరాలుగా విజయవాడలొ ఈ తల్లి వొడిలో పాపడిలా ఈ తల్లి జలము సేవనము వల్ల ఈ తల్లి అంటే చెప్పరాని బంధం.వరద వచ్చినప్పుడు ఆ వేగము, ఆసొయగము చూసి మోహము.ఇలా అన్ని భావాలు ముప్పిరికొంటాయి.  
విజయవాడలొని ప్రకాశం బ్యారేజి మీద నుంచోని పశ్చిమదిక్కుకు ఒక్కసారి అలా దృష్టిమరల్చామంటే అనంతజలరాశి, ఈ జలరాశిపై నుంచి వచ్చే పిల్లగాలులు.ఈ తల్లి అమృతధారతో కృష్ణా,గుంటూరు జిల్లా ప్రజల దాహాలు,క్షేత్రాల సస్యమలత్వాలు ఇలా యెన్నో గుర్తుకు వస్తాయి. 
కృష్ణా నది జన్మస్థానము మహారాష్ట్రలొని సతారాజిల్లాలొ గల మహాబలేశ్వర్ కొండలలొని జార్ అనే గ్రామము వద్ద జనించి తూర్పున వున్న బంగాళాఖాతములొ కృష్ణాజిల్లా హంసలదీవి వద్ద సాగరుడిని సంగమిస్తుంది.ఈ ప్రయాణము మొత్తము దాదాపు 1300 కిలొమీటర్ల దూరము. ఇంత మార్గము లో మహారాష్ట్రను,కర్నాటకను కూడా పలకరిస్తూ తన కృపను కరుణను వారికి కూడా ఇచ్చినది. కృష్ణానది భారతదేశపు 4వ పెద్దనదీ.
    ఈ మొత్తము కృష్ణా పరివాహక ప్రాంతము దాదాపు 2.5లక్షల కిలోమీటర్లగా వున్నది ఇందు 75000 చదరపు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ నందు కలదు.

ఈ పరివాహక ప్రాంతములో విభిన్నమతాలకు ఆదరణ లభించినది హైందవ,శైవ,వీరశైవ,జైన,బౌద్ధ మతాల వ్యాప్తి చెందటమే కాక అనేక పుణ్యక్షేత్రాలు,స్మారక కట్టడాలు వున్నాయి. కర్ణాటక నందు బసవేశ్వరుడు వీరశైవాన్ని ఈ నదీ ఆలంబనగానే స్థాపన ప్రచారము నిర్వర్తించారు.శ్రీశైల జ్యొతిర్లింగమునకు ఇతని రాకపొకలు నదీ మార్గము ద్వారానే.
మన రాష్ట్రములోకి వస్తే మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ వద్ద కృష్ణానది ప్రవేశిస్తుంది.మహబూబ్ నగర్ ,కర్నూల్,నల్గొండ,గుంటూరు,కృష్ణా జిల్లాల లో ఈ నదీ ప్రవహిస్తుంది.ప్రపంచ ప్రసిద్ధి పొందిన కోహినూరు వజ్రము ఈ నదీ పరివాహక ప్రాంతము నుంచే లభించింది.
ఈ నదీలో ఋతుపవనాల సమయములో జలము ఎక్కువగాను మిగతాసమయాలలొ సాధారణముగాను లభిస్తుంది.
శాతవాహనులు ఆంధ్రప్రాంతానికి ఈ నది ద్వారానే రాకపొకలు తమ రాజ్య విస్తరణ చేసేవారు.నదీగర్భములోతు దాదాపు 125 అడుగులవరకు వుంటుంది.వరద సమయాలలో కోత ఎక్కువగా వుండి దిగువ ప్రాంతాలలో మేట ఎక్కువగా వుంటుంది.అందుకే విజయవాడ తరువాత కృష్ణా పరివాహక ప్రాంతముగా వున్న కృష్ణా,గుంటూరు జిల్లాలలొ చాలా లంక గ్రామాలు వుండి సారవంతమయిన భూములు కలిగి పలు పంటలు పండి సకల సమృద్ధిగా వున్నాయి.   


కృష్ణానది కి ముఖ్యమయిన ఉపనది తుంగభద్రా. దీనికి ఇంకా వెన్నా,దిండి,పాలేరు లాంటివికాక ఇంకా 5 నదులు ఉపనదులుగా వున్నాయి.మూసినది ఆఖరి ఉపనదిగా గుర్తింపు పొందినది.ఇవికాక చాలా ఏర్లు,వాగులు అనేకం కలసి విజయవాడ వచ్చుసరికి ఓక అనంత జలరాశిగా దర్శనము.
మన రాష్ట్రములొని పుణ్యక్షేత్రాలు : అలంపురము,మంత్రాలయము,అహొబిలము,మహానంది,శ్రీశైలం,మట్టపల్లి,యాగంటి,సంగమేశ్వరము,కనకదుర్గమ్మ,మొవ్వ,శ్రీకాకుళపు ఆంధ్రమహవిష్ణు,వేదాద్రి,అమరావతి,నాగార్జున కొండ.మంగళగిరి. 
సాహిత్య పరముగా ఎన్నో కావ్యాలు,కథలు,గాధలు. నృత్యములొ పేరెన్నిక గన్న కూచిపూడి నృత్యము ఈ నదీ పరివాహక ప్రాంతములొనిదే.


చేనేతకు ప్రసిద్ధి చెందిన నారాయణపేట,గద్వాల,పొచంపల్లి,భట్టిప్రొలు మొదలగునవి ఎన్నొ.వరి,మిర్చి,ప్రత్తి,పసుపు,పొగాకు తో పాటు అనేక పండ్ల తోటలకు ఈ జలమే ఆధారము.శ్రీశైలము వద్ద అతిపెద్ద జలవనురుల అధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రము,నాగార్జున సాగర్ వద్ద బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ వున్నది. ఇది నవభారత నిర్మాత పండిట్ జవహర్ లాల్ నేహ్రు చేత ఆధునిక దేవాలయముగా గుర్తింపు పొందినది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.