21, జూన్ 2012, గురువారం

పూతన ఘట్టము ద్వారా వ్యాసులవారు ఏమి సూచించారు ?

వ్యాసులవారు భాగవతములో కృష్ణలీలుగా ఎన్నో దివ్య ఘట్టాలను వర్ణించారు.సాధారణ పాఠకులకు అవి లీలావైభవాలుగా కనిపించినా అధ్యాత్మిక తత్పరులకు అవి నిగూఢ అధ్యాత్మిక సుగంధరహస్యాలు వెదజల్లె పుష్పాలుగా అభివర్ణిస్తారు.అటువంటిదే పూతన కధ దీని అంతారార్ధము ఓక్కసారి పరిశీలించండి.

 నందుని ఇంట కృష్ణుడు బాలునిగా పెరుగుతున్నాడు. యశోద కన్నయ్యను చూసి సర్వము మరచి పొతుంది.ఆబాలుని ముగ్ధమనొహరత్వానికి పరవశించిపొతుంది.కృష్ణుడు గోకులములో ప్రవేశతదాదిగా అనేక శుభశకునాలు చూపుతున్నాయి. గోకులములోని అందరి ఇంట పాడి సమృద్ధిగా ఓకటికి పదిరేట్లుగా వున్నది. దూడలు సంతుష్టిగా త్రావినాకూడా ఆవులు ఇంకా పాలు నిరంతరధారలుగా స్రవిస్తున్నాయి.గోకులము మొత్తము కాలముకాని కాలమయినా వసంత శోభ వెల్లివిరుస్తుంది.కొయిలలు,రామచిలుకలు తమ ధ్వనులతో ఆశ్రమవాతావరణాన్ని తలపిస్తున్నాయి.క్రూరమృగాలు కూడా సాధుజంతువుల్లా ప్రవర్తన.ప్రజలు ఓక్కసారిగా ధర్మనిరతిలో మునిగిపొయారు.
గోకులములో ఈ విధముగా వుంటే మధురలొ కంసుడు ఇందుకు విరుద్ధముగా యోగమాయ ద్వారా దేవకి అష్టమగర్భసంజాతుడు సలక్షణముగా వున్నాడు మృత్యువై నీవద్దకు వస్తాడు అని తెలపటముతో క్షణక్షణము మృత్యుభయముతో కుచించుకుపొతున్నాడు.దీనితో ఎవరిని నమ్మక, చివరకు తన నీడను కూడా చూసి భయపడే స్థితికి చేరుకుని సర్వులకు నరకము చూపుతున్నాడు.  
 ఈ అష్టమ గర్భసంజాతుడు ఎవరో జాడ కనిపెట్టమని  మంత్రులకు చెప్పాడు. వారు వేగులను రాజ్యమంతా పంపగా సర్వము ఓకేలా వున్నా  నందగోకులములో మాత్రము అసాధారణ సిరి సంపదలు. పశు, పక్ష్య, మృగాలలొ,ప్రజలలో ఆనందము, మమేకత్వము గమనించారు.అదియునుగాక గోకులము యమునకు దగ్గర. ఇవి అన్ని గమనించిన వేగులు కంసునకు పూర్తీ వివరాలు తెలియచేసారు.  
కంసుడు తన మంత్రులతో సమిక్షించి. ఇది తనను సంహరించుటకు దైవమాయగా నిశ్చయపరచుకోని. బాలుని పరిమార్చుటకు పూతను పంపాడు.
పూతన ఓక రాక్ష స్త్రీ. మాయవి, కామరూపధారిణి.గొకులమునకు అమె ఓక ఆకర్షణీయమయిన మానవ కాంతగా మారి గోకులములోకి అడుగు పెట్టింది.ఆసమయములో గోకులములొ నృత్యగాన కేళి వినోదము జరుగుతుంది.తనుకూడా వారితో ఆడిపాడి. యశోదను సమీపించి బాలకృష్ణుని చూసి మొటికలు విరచి, బాలుని చూడగానే పాలిండ్లు చేపుతున్నాయి పాలుఇస్తాను అని శిశువుని తీసుకోని ముద్దు చేస్తున్నది.అమే మాయాప్రయోగముతో యశోద శిశువును అప్పగించి కొంత దవ్వుకు అలా వెడలినది.     
ఇదే అదునుగా పూతన తన పాలిండ్లకు విషముపూసి బాలునకు పాలు ఇవ్వ ప్రయత్నించినది.అయితే బాలకృష్ణుడు పాలు త్రగే నెపముతో అమే చూచుకములను తన నోటిలోనికి తీసుకోని పాలతోపాటు అమె పంచప్రాణాలను హరించాడు.దీనితో పూతన దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ తన నిజరూప ధారణతో మృతి చెందినది.  
అంత బాలకృష్ణుడు పూతన దేహముపై అమె పాలిండ్లతో ఆడుకొనుచున్నాడు.పూతన అరుపులు విన్న యశోద, పూతన మృతితో మాయతోలగి ఒక్క పరుగున వచ్చి తన కన్నయ్యను, తన వోడిలోనికి తీసుకోని లాలించసాగింది.
 కన్నయ్య కూడా అప్పటివరకు పూతన దేహముతో ఆడుకున్నా, యశొదవోడిలోకి రాగానే సాధారణ శిశువులా రోదించాడు.
ఇది భాగవత గాధ.

అంతరార్ధము: మనస్సు  జన్మతః ఎప్పుడు శిశువు లాంటిదే. శిశువుకు గనక ఎటువంటి రాగ ద్వేషాలు వుండవో మనస్సు కూడా అలాగే. కాని పూతన సంసార లంపటాన్ని, పూతన విషపాలిండ్లు మాయా,మోహాన్ని సూచిస్తాయి. 
వీటిలో చిక్కుకున్న జీవుడు విషయాసక్తుడై విషపాలుత్రాగితే మాయా మొహములో  సంసారచక్రబంధములో చిక్కుకుంటాడు.కానీ ఎలా వీటిని తప్పించుకోవాలి. కృష్ణుడు అందుకే మార్గాంతరము తెలిపాడు. శ్రద్ధా,భక్తిల  ద్వారా విషనివృత్తి. తద్వార మాయామోహ నివృత్తి కలుగుతాయని సూచిస్తాడు.అప్పుడు కాని మనస్సు జన్మతః వచ్చే శిశుభావము సిద్ధుంచుతుంది అనగా రాగద్వేష రహితముగా మారి  భగవద్దర్శనము కలుగుతుంది అని సూచిస్తాడు. అందుకే పూతన శరీరము పై శిశువులా ఆడుకుంటాడు.ఇది పూతన సంహారఘట్టములొని అంతరార్ధము.
ఇదే విషయాన్ని షిరిడిసాయి శ్రద్ధ,సబూరిల ద్వార మాత్రమే తనను దర్శించ సాధ్యపడుతుంది అని తెలిపినాడు.

  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.