28, జూన్ 2012, గురువారం

స్వర్గ వాసి నందమూరి తారకరాముని తో ఏవో కొన్ని మాటలు


ఈ రోజు పేపర్ చూసారా  దేశం పార్టి గురించి ఒక ఆర్టికల్ చదివారా! మీకు ఏమి అనిపించింది.
హమ్మయ్య బాబులోని కాంగ్రేస్ వాది చహర మెల్లగా ఆవిష్కరము అవుతుంది. నిన్నటి దాక రహస్య స్నేహాలు తో పార్టిని చంక నాకి౦చాడు.ఈ రోజు తన అంతే వాసుల తో లోకేష్ ను యువజన నాయకుడును చేయండి అని అనిపిస్తున్నాడు.
అసలు దేశం పార్టి వ్యవస్థాపకుడైన స్వర్గీయ శ్రీ నందమూరి వారి దృక్ పదానికి వ్యతిరేకం. వారు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే సమయములో ఈ వారసుల సరళిని కూడా ఎండ కట్టారు. అందుకే ఏదో ఒక్కసారో రెండు సార్లో తన  తరువాత బాలయ్య బాబు అన్నాడు కాని. తన సంతానం ను ప్రోత్సాహించలేదు.అర్హత లేక పొతే సున్నా, అది ఎవరైనా ఒక్కటే అనేది రామారావు గారి విధానం,సిద్ధాంతం. అది కడ దాక నమ్మాడు ఆచరించాడు అందుకే "ఏను తెలుగు వల్లభుండ" అని సగర్వముగ ప్రకటించుకున్న ఏకైక తెలుగు జాతి సింహం.అందుకే ప్రజలు గుండెల్లో గుడి కట్టి ఆరాధించారు. ఈ నాటికి ఆరాధిస్తున్నారు. మరి వీళ్ళు అయిన భాషలోనే "కుక్కమూతి పిందెలు".
అందుకే బాబును ప్రజలు నమ్మరు నమ్మరు నమ్మరు ఇది ముమ్మారు సత్యం.
విధానం మార్చమానండి ప్రజలకు దగ్గర కమ్మనండి.ఆరాధిస్తారు అధికారం ఇస్తారు.
బాబు అయినా కొద్దిగా నయం గ్రామీణ వాతావరణం లో పుట్టాడు కష్టాలు చూసాడు,విద్యార్ధి రాజకీయాలు చేసాడు. అనుభవం వున్నది.కాని అధికార దాహం,పుత్ర ప్రేమ ఇలాంటి అవలక్షణాలు వదులుకోడు ,లేడు.
కాబట్టి బాబు గతం గతః అవుతాడా లేక విజయ పతాక చూస్తాడా అన్ని వారి విధానాలపైనే దేశం పార్టీ భవిష్యత్ ఆధార పడింది

అన్నగారు! మీరు పై నుంచి చూస్తున్నారా!దేశం పార్టీ నాతోనే పోతుంది అన్నారు!సవరించండి! మా అల్లుడు గారితో అన్యాయం అయిపోయాను,ఇప్పుడు పార్టీ పోతుంది అని గర్జించండి! ఎలాగు మీ బాలయ్య, బావకు బానిస అయ్యాడు!ఇంకా మీ అభిమానులు మీరంటే ఉత్తేజం పొ౦దుతున్నారు వాళ్ళ మనస్సులో ఆత్మ దిపులై చైతన్యం వెలిగించండి.మీ పార్టీ కి మీరు,మీ విధానాలు తప్ప వేరు దిక్కు మొక్కు లేదని తెలపండి.సామాన్యుడే నా వెంట నేను వాడి వెంట అన్న మీ విధానం మరొక్కసారి రావాలంటే ఇది తప్ప వేరు శరణ్యం లేదు.
ఈ విషయాన్నీ గమనించిన వై.యస్.ఆర్ కూడా మిమ్ములను,మీ విదానాలను మెచ్చుకొని తనదైన పద్ధతిలో విజయం సాధించాడు. అతని కొడుకు  కు కూడా మీరు కావలసి వచ్చారు! పరాయి వాళ్ళకు పటికబెల్లం లా వున్నారు.అయిన వాళ్ళు మాత్రం విషం లా ప్రక్కన పెట్టారు.సన్నాసులు,దుర్మార్గులు.అందుకే అనుభవిస్తున్నారు.అయినా బుద్ధి రాలేదు.
అన్నగారు! మీతో ఓ మాట - పరామర్శ- మీరు పైన స్వర్గంలో బసవతారకం గారితోనే కాలక్షేపం చేయండి. మరలా అక్కడ మేనకలు,హరికధలు అంటూ అక్కడ కూడా ఆమెను ఇబ్బంది పెడుతున్నారా! లేక ఇంద్రుడు వాడి దుర్మార్గులు అని ఆవేశ పడుతున్నారా! మీలోని ఆవేశం మిమ్ములను వూరకనే కూర్చోవటం మీతరం కాదు!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.